breaking news
shadow banking
-
అప్పుల ఊబిలో అతిపెద్ద బ్యాంక్.. లక్షల కోట్లు..
ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు సైతం గత కొన్ని రోజులుగుఫా ఆర్ధిక అనిశ్చితుల కారణంగా పతనమవుతున్నాయి, దివాలా తీసే స్థితికి చేరుకుంటున్నాయి. ఈ జాబితాలో 'చైనాలోని అతిపెద్ద ప్రైవేట్ ఫైనాన్షియల్ బ్యాంక్ 'ఝంగ్ఝీ ఎంటర్ప్రైజ్ గ్రూప్' కూడా చేరింది. దివాలా తీయడానికి కారణాలు ఏంటి? నిర్వహణ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 139 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 11 లక్షల కోట్లు) నిర్వహణ కలిగిన 'ఝంగ్ఝీ ఎంటర్ప్రైజ్ గ్రూప్' సంస్థల్లో పలు నేరాలు జరిగినట్లు అనుమానిస్తున్నామని దర్యాప్తు అధికారులు వెల్లడిస్తూ.. పలు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సంస్థ మొత్తం సుమారు 12 అసెట్, వెల్త్ మేనేజ్ మెంట్ కంపెనీలను నిర్వహిస్తూ.. లోన్లు మాత్రమే కాకుండా, బ్రోకరేజ్ వంటి సేవలను అందిస్తూ అక్కడ అతి పెద్ద బ్యాంకులలో ఒకటిగా నిలిచింది. 2021లో ఝంగ్ఝీ ఎంటర్ప్రైజ్ 'షీ ఝికూన్' మరణించిన తరువాత.. మేనేజ్మెంట్లోని కీలక వ్యక్తులు కూడా సంస్థను వీడటం వల్ల దాని నిర్వహణలో లోపాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత సంస్థ అప్పుల ఊబిలో కోరుకున్నట్లు తెలిసింది. ఈ సంస్థ అప్పులు 64 బిలియన్ డాలర్స్ వరకు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. చైనాలో బ్యాంక్ తరహా ఆర్థిక సేవలందించే అతిపెద్ద షాడో బ్యాంకుల్లో ఒకటైన ఝంగ్ఝీ గ్రూప్ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టారనేది ప్రస్తుతానికి వెల్లడి కాలేదు. అయితే చైనాలో ఈ బ్యాంక్ పతనావస్థకు చేరుకోవడం వల్ల ఈ రంగం మీద ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రారంభంలో వేగంగా అభివృద్ధి చెందిన షాడో బ్యాంకింగ్ రంగం ఇప్పుడు పతనం కావడం జీర్ణించుకోలేని అంశం అనే చెప్పాలి. -
71 లక్షల కోట్ల డాలర్లకు షాడో బ్యాంకింగ్ వ్యవస్థ
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా షాడో బ్యాంకింగ్ వ్యవస్థ పరిమాణం గతేడాది 5 లక్షల కోట్ల డాలర్ల(ట్రిలియన్) మేర ఎగిసి 71 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో భారత్ సహా పలు దేశాల బ్యాంకులు ఆయా షాడో బ్యాంకింగ్ సంస్థలకి ఇచ్చిన నిధుల పరిమాణం కూడా పెరిగింది. స్విట్జర్లాండ్కి కేంద్రంగా పనిచేసే ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల బోర్డు ఎఫ్ఎస్బీ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి రాకుండా జరిగే బ్యాంకింగ్ లావాదేవీలు మొదలైన వాటిని షాడో బ్యాంకింగ్ వ్యవస్థగా పరిగణిస్తారు. ఈ కార్యకలాపాలు భారీ స్థాయిలో పెరిగిపోతుండటం.. ఆర్థిక స్థిరత్వానికి ముప్పు తెచ్చిపెట్టగలవని ఇటీవలి ఆర్థిక సంక్షోభం తెలియజెప్పడంతో ఇటువంటి వాటిపై ఆందోళనలు నెలకొన్నాయి. బ్యాంకులు స్వయంగా రుణాలివ్వడం వల్ల వచ్చే రిస్కులతో పాటు, ఇతరత్రా రుణాలు మంజూరుకు మధ్యవర్తిత్వ షాడో బ్యాంకింగ్ సంస్థలపై ఆధారపడటం వల్ల వచ్చే రిస్కులూ భారత్, ఇండోనేషియా, సౌదీలో భారీగా పెరిగాయని ఎఫ్ఎస్బీ పేర్కొంది.