breaking news
scotland yard police
-
మాల్యా బేజార్
-
అరెస్ట్కు దారితీసిన మాల్యా 12 ఏళ్ల ప్రయాణం
-
విజయ్ మాల్యా అరెస్ట్
-
విజయ్ మాల్యా అరెస్ట్
► లండన్లో అదుపులోకి తీసుకున్న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ► అరెస్టయిన మూడు గంటల్లోపే బెయిల్పై బయటకు.. ► మాల్యాపై నేరస్తుల అప్పగింత ప్రక్రియలో తొలి అడుగు ► మాల్యాను రప్పించడం అంత సులువేం కాదు: నిపుణులు ► దోచుకున్న సొమ్మును ఇవ్వాల్సిందేనంటూ ప్రధాని మోదీ ట్వీట్ వేలకోట్లు ఎగవేసి, బ్రిటన్లో విలాస జీవితం అనుభవిస్తున్న కింగ్ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాను భారత్ రప్పించే ప్రక్రియలో ఎట్టకేలకు తొలి అడుగు పడింది. అతన్ని అప్పగించాలన్న భారత్ ఒత్తిడి మేరకు లండన్లో మాల్యాను అరెస్టు చేశారు. నేరస్తుల అప్పగింతలో విచారణలో భాగంగా స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మంగళవారం ఉదయం మాల్యాను అదుపులోకి తీసుకుని.. అనంతరం సెంట్రల్ లండన్ పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఒకవైపు వార్తాచానళ్లలో మాల్యా అరెస్టు వార్తలు ప్రసారం అవుతుండగానే.. వెస్ట్మినిస్టర్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఒకప్పుడు రాజభోగాలు, విలాసాల్లో మునిగితేలిన ఈ రుణ ఎగవేతదారుడు కేవలం మూడు గంటల్లోనే బెయిల్పై బయటికి వచ్చారు. వెంటనే ట్వీటర్లో స్పందిస్తూ ‘ఎప్పటిలానే భారతీయ మీడియా హడావుడి చేసింది. అనుకున్న ప్రకారమే నేరస్తుల అప్పగింతపై విచారణను కోర్టు ప్రారంభించింది’అని ట్వీట్ చేశారు. మే 17న మాల్యా మళ్లీ లండన్ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. నేరస్తుల అప్పగింతపై భారత్ అందచేసిన ఆధారాల్ని పరిశీలించాక కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఈ కేసులో న్యాయ పోరాటం కొనసాగిస్తానని మాల్యా స్పష్టం చేశారు. కాగా విజయ్ మాల్యాను భారత్కు తీసుకురావడం అంత సులువేం కాదని విదేశాంగ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు మాల్యాను అరెస్టు చేశామని సీబీఐ అధికారులకు లండన్ పోలీసులు సమాచారం అందించారు. అనంతరం స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు స్పందిస్తూ.. ‘మెట్రోపాలిటన్ పోలీసు విభాగానికి చెందిన నేరస్తుల అప్పగింత విభాగం మాల్యాను అరెస్టు చేసింది. మోసం ఆరోపణలకు సంబంధించి భారతీయ అధికారుల తరఫున విజయ్ మాల్యాను అరెస్టు చేశాం’ అని చెప్పారు. సెంట్రల్ లండన్ పోలీసు స్టేషన్కు మాల్యాను తీసుకెళ్లాకే అరెస్టు చేశామని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. అనంతరం లండన్లోని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో కనిపించిన మాల్యా... వెంటనే బెయిల్ దొరకడంతో న్యాయవాదుల బృందంతో కోర్టు నుంచి బయటకు వచ్చారు. ‘ఇది కేవలం స్వచ్ఛందంగా చోటుచేసుకున్న పరిణామం. కొద్ది నిమిషాల్లోనే మాల్యా బయటకొచ్చారు’అని ఆయన తరఫు న్యాయవాది ఒకరు పేర్కొన్నారు. మరోవైపు త్వరలో బ్రిటన్ పర్యటన సందర్భంగా మాల్యా అప్పగింతపై చర్చించవచ్చని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన నేపథ్యంలో ఈ అరెస్టు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత నెల్లో భారత్ విజ్ఞప్తిని ధ్రువీకరించిన బ్రిటన్ భారత్, బ్రిటన్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు మాల్యాను అప్పగించాలంటూ ఫిబ్రవరి 8న అధికారికంగా భారత్ విజ్ఞప్తి చేసింది. మాల్యాపై చట్టప్రకారం కేసులు ఉన్నాయని, తమ విజ్ఞప్తిని అంగీకరిస్తే.. భారత ఆందోళన పట్ల బ్రిటన్ సానుకూల ప్రతిస్పందనగా భావిస్తామని అందులో పేర్కొంది. గత నెల్లో బ్రిటన్ ప్రభుత్వం భారత విజ్ఞప్తిని ధ్రువీకరించడంతో పాటు తదుపరి చర్యలు చేపట్టాలంటూ దానిని జిల్లా జడ్డికి పంపారు. దాంతో మాల్యా అరెస్టుకు కోర్టు వారెంట్ జారీచేవడంతో బ్రిటన్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మాల్యాను రప్పించడం సుధీర్ఘ ప్రక్రియే.. మాల్యాను భారత్ రప్పించడం అంత సులువైన ప్రక్రియ కాదని, సుధీర్ఘ సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. భారత్, బ్రిటన్ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉన్నా అది టైప్–బీ కేటగిరి కిందకు వస్తుంది. టైప్–ఏలో అమెరికా, పలు యూరప్ దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు ఉన్నాయి. ఈ దేశాలతో నేరస్తుల అప్పంగిత ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది. టైప్–2 దేశాలతో మాత్రం నేరస్తుల అప్పగింతపై బ్రిటన్ ఆచీతూచి వ్యవహరించడంతో పాటు జాప్యం చేస్తోంది. బ్రిటన్లో తలదాచుకుంటున్న అనేకమంది నేరస్తుల్ని అప్పగించాలన్న భారత్ విజ్ఞప్తుల్ని పలుమార్లు ఆ దేశం తోసిపుచ్చింది. గత ఐదేళ్లలో గుజరాత్ అల్లర్ల నిందితుడు సమీర్భాయ్ పటేల్ను మాత్రమే అప్పగించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఇటీవల చెప్పారు. ఇప్పుడు మాల్యాను అప్పగిస్తే మిగతా నేరస్తుల్ని కూడా అప్పగించాల్సి రావచ్చన్న ఆందోళన నేపథ్యంలో మాల్యా విషయంలో బ్రిటన్ జాప్యం చేయవచ్చని భావిస్తున్నారు. అంతిమ నిర్ణయం బ్రిటన్ సుప్రీంకోర్టుదే కేటగిరి–బి దేశాలకు నేరస్తుల అప్పగించాలంటే సుధీర్ఘ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ముందుగా నేరస్తుల అప్పగింతపై బ్రిటన్ విదేశాంగ శాఖకు అధికారికంగా విజ్ఞప్తి చేయాలి. ఈ అభ్యర్థనను అంగీకరించాలో.. వద్దో? విదేశాంగ శాఖ నిర్ణయిస్తుంది. అనంతరం ఈ అంశాన్ని జిల్లా కోర్టుకు సిఫార్సు చేస్తారు. నేరస్తుడిగా పేర్కొన్న వ్యక్తిపై అరెస్టు వారంట్ జారీ చేయాలా? వద్దా? అనేది జిల్లా జడ్డి నిర్ణయిస్తారు. వారెంట్ జారీ చేస్తే... అతన్ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తారు. మొదట ప్రాధమిక విచారణ, అనంతరం నేరస్తుల అప్పగింతపై విచారణ నిర్వహిస్తారు. అనంతరం నేరస్తుడ్ని అప్పగించాలా? వద్దా? అన్న అంశాన్ని విదేశాంగ శాఖ నిర్ణయిస్తుంది. నేరస్తుల్ని అప్పగించమని కోరుతున్న దేశాలు క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్)కు మరోసారి విజ్ఞప్తిని సమర్పించాలని బ్రిటన్ విదేశాంగ శాఖ సూచిస్తుంది. అనంతరం అప్పగింత ప్రక్రియ మొదలవుతుంది. అయితే తీర్పుపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీలుకు వెళ్లవచ్చు. బ్రిటన్ సుప్రీంకోర్టు నిర్ణయమే అంతిమం. సాధ్యాసాధ్యాల్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: కేంద్ర ప్రభుత్వం అరెస్టుపైకేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ మాట్లాడుతూ.. మాల్యాను భారత్కు రప్పించడం, న్యాయ విచారణ ప్రారంభించడంపై సాధ్యాసాధ్యాల్ని అంచనావేస్తున్నామని చెప్పారు. ఆర్థిక నేరాలకు పాల్పడినవారు ఎవరైనా సరే చట్టం ముందుకు నిలబెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బ్రిటన్ నుంచి ఇతర నేరస్తుల్ని రప్పించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు మాల్యా అప్పగింతపై బ్రిటన్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. న్యాయపరంగా అన్ని ప్రక్రియలు కొనసాగుతాయని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే అన్నారు. మాల్యా అరెస్టు దర్యాప్తు సంస్థలు సాధించిన విజయంగా సీబీఐ మాజీ డైరక్టర్ అనిల్ సిన్హా అభివర్ణించారు. మాల్యాను భారత్కు తీసుకొచ్చే ప్రక్రియ విజయవంతం అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఆర్థిక నేరగాళ్లపై మోదీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే విషయాన్ని ఈ అరెస్టు రుజువు చేసిందని బీజేపీ పేర్కొంది. అలాంటి వారితో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనేందుకు ఇదే నిదర్శమని బీజేపీ ప్రతినిధి నలిన్ కోహ్లీ అన్నారు. మాల్యా అరెస్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పుదారి పట్టిస్తున్నారని, మాల్యాను కస్టడీలోకి తీసుకుని ఎప్పటిలోగా రుణాలు రాబడతారో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మాల్యాను బహిష్కరించమని కోరకుండా, అప్పగింతకు మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టుబడుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. మాల్యాను అదుపులోకి తీసుకుని వెంటనే విడుదల చేశారని, ఇది ఏరకమైన నేరస్తుల అప్పగింత ప్రక్రియని ఆయన ప్రశ్నించారు. దోచుకున్న సొమ్మును ఇవ్వాల్సిందే: ప్రధాని న్యూఢిల్లీ: ‘పేదలు, మధ్య తరగతి ప్రజల్ని దోచుకుని సంపాదించిన సొమ్మును ఆ వ్యక్తులు తిరిగి ఇవ్వాల్సిందే. దేశంలో అవినీ తికి చోటులేదు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మాల్యా అరెస్టు నేపథ్యంలో ఈ ట్వీ ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. కష్టించి సంపాదించిన ధనాన్నే కాకుండా గౌరవాన్ని కూడా అవినీతి దోచుకుంటుందన్న ట్వీట్కు స్పందిస్తూ ప్రధాని రీట్వీట్ చేశారు. -
అరెస్ట్కు దారితీసిన మాల్యా 12 ఏళ్ల ప్రయాణం
యూబీ గ్రూప్ మాజీ అధిపతి విజయ్ మాల్యా లండన్లో అరెస్ట్కు దారితీసిన ఆయన పన్నెండేళ్ల వ్యాపార, బ్యాంక్ లావాదేవీలు, నేరాభియోగాలపై చట్టాలు అమలుచేసే ప్రభుత్వ సంస్థల చర్యలు క్లుప్తంగా... 2005: యునైటెడ్ బ్రూవరీస్(హోల్డింగ్స్)లి. చైర్మన్ హోదాలో మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్(కేఎఫ్యే) ఏర్పాటు చేసి ప్రపంచస్థాయి విమానయాన సంస్థగా ఇది ఎదుగుతుందనే భారీ ప్రచారం. 2006: విమానాల కొనుగోలుకు ఐడీబీఐ బ్యాంక్కు రుణం కోసం కింగ్ఫిషర్ దరఖాస్తు చేయగా, యూబీ గ్రూపుతో పాత అనుభవాల దృష్ట్యా అందుకు ‘నో’చెప్పిన ప్రభుత్వరంగ బ్యాంకు. ఇతర బ్యాంకులతో మాట్లాడి రుణాలు సాధించడంలో మాల్యా విజయం. 2007: దాదాపు దివాలాతీసిన ఎయిర్ డక్కన్లో వాటా తీసుకోవడానికి కింగ్ఫిషర్ నిర్ణయం. 2008: ఎయిర్డక్కన్లో 26 శాతం వాటా కొనుగోలుకు యునైటెడ్ బ్రూవరీస్ రూ.550 కోట్లు చెల్లించింది. మార్చినాటికి ఈ అప్పులు రూ. 934 కోట్లకు పెరగగా, సెప్టెంబర్లో బెంగళూరు–లండన్ సర్వీసుతో, కింగ్ఫిషర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించింది. 2009: ఫలితంగా కింగ్ఫిషర్ రుణాలు రూ.5,665 కోట్లకు పెరిగి, వేగంగా ఏడువేల కోట్లకు చేరాయి. మొదట అప్పివ్వడానికి నిరాకరించిన ఐడీబీఐ బ్యాంక్ ఈ ఎయిర్లైన్స్కు రూ.900 కోట్లరుణం ఇవ్వాలని నిర్ణయిస్తుంది. 2010: రుణాలు 9 నెలల్లో తిరిగి చెల్లించాలని అన్ని బ్యాంకులూ కింగ్ఫిషర్కు గడువు విధించాయి. అప్పటికి రాజ్యసభ సభ్యుడు కూడా అయిన మాల్యా రుణాలు చెల్లించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, భారీ ఖర్చుతో కూడిన జీవనశైలిని కొనసాగించారు. 2011–12: కింగ్ఫిషర్లో తన వేతనం కింద ఏటా రూ.36 కోట్ల చొప్పున భారీ మొత్తాన్ని మాల్యా తీసుకుంటూనే ఉన్నారు. విమానాలు నడిపే లైసెన్స్ను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దుచేయడంతో, సిబ్బందికి జీతాలు చెల్లించలేని స్థితికి కింగ్ఫిషర్ ఎదుర్కొంది. 2016 మార్చి నాటికి మూడు వేలమంది సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాలు రూ.3000 కోట్లకు దాటిపోయాయి. ఎస్బీఐ, ఐడీబీఐ వంటి బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల మొత్తం వంద కోట్ల డాలర్లకు మించిపోయింది. 2013: ఈ ఎయిర్లైన్స్కు ఇచ్చిన రూ.6,493 కోట్ల రుణాలను తిరిగి చెల్లించాలంటూ స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అప్పులిచ్చిన బ్యాంకుల కన్సార్షియం యునైటెడ్ బ్యూవరీస్(హో)లిమిటెడ్ను కోరగా, అత్యధిక భాగం రుణాన్ని త్వరలో చెల్లిస్తానని మాల్యా హామీ ఇచ్చారు. 2014: ఎయిర్లైన్స్ కోసం భారీగా అప్పుచేసి, బాకీ కట్టని మాల్యాను ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’గా మొదట యునైటెడ్బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించగా, ఎస్బీఐ, పంజాబ్నేషనల్ బ్యాంక్ కూడా అదే ముద్ర ఆయనకు వేశాయి. 2016: యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు మాల్యాను రాజీనామా చేయాలని ఫిబ్రవరిలో కోరుతుంది. మాల్యాను దేశం నుంచి పారిపోకుండా ఆపాలని సుప్రీంకోర్టును కింగ్ఫిషర్కు రుణాలిచ్చిన బ్యాంకులు కోరతాయి. అప్పటికే మాల్యా ఇండియా వదలి లండన్కు పారిపోయిన విషయం వెల్లడయింది.అనేక పెండింగ్ కేసులకు సంబంధించి హాజరుకాలేదనే కారణంపై స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు మాల్యాకు నాన్బెయిలబుల్ వారంట్ జారీచేస్తుంది. 2002 ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టంకింద మరో నాన్బెయిలబుల్ వారంట్ జారీ చేయాలని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. అప్పటికే మాల్యా విదేశాలకు 59 కోట్ల డాలర్లు రహస్యంగా తరలించారని వార్తలొచ్చాయి. 2017: నిష్పాక్షిక విచారణ జరపకుండానే తనను నరేంద్ర మోదీ ప్రభుత్వం తనను దోషిగా నిరూపించాలనే పట్టుదలతో ఉందని మాల్యా మార్చి నెలలో ఆరోపిస్తారు. విజయ్ మాల్యాను పంపిచాలని కోరుతూ ఇండియా చేసిన అభ్యర్థనను బ్రిటన్ సర్కారు ఓ ఇంగ్లండ్ కోర్టుకు అందజేస్తుంది. ఏప్రిల్లో గోవాలోని మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ విల్లాను వేలం వేసిన కొన్ని రోజులకే లండల్లో మాల్యా అరెస్ట్–విడుదలతో కింగ్ఫిషర్ వ్యవహారం కీలక దశకు చేరినట్టయింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
విజయ్ మాల్యా అరెస్టు
-
విజయ్ మాల్యా అరెస్టు
స్వదేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలు ఎగవేసి లండన్ వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను లండన్లో పోలీసులు అరెస్టు చేశారు. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఆయనను అక్కడ అరెస్టు చేశారు. గత కొంత కాలంగా లండన్లోనే ఉంటున్న మాల్యాపై స్వదేశంలో పలు కేసులు ఉన్నాయి. ప్రధానంగా 9వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో మాల్యా నిందితుడు. త్వరలోనే ఆయనను యూకే కోర్టులో ప్రవేశపెడతారు. ఆ తర్వాత నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద లండన్ నుంచి మాల్యాను భారతదేశానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. స్టేట్బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియంకు మొత్తం రూ. 9వేల కోట్లకు పైగా రుణాలు చెల్లించకుండా ఎగవేసిన లిక్కర్ కింగ్ మాల్యా.. గత సంవత్సరం మార్చి 2వ తేదీన రాత్రికి రాత్రి లండన్ పారిపోయారు. మొత్తం 17 బ్యాంకులకు ఆయన రుణాలు ఎగవేసినట్లు చెబుతున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత, యూబీ గ్రూప్ చైర్మన్ అయిన విజయ్ మాల్యా గతంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. భారత హై కమిషన్ ఒక పిటిషన్ దాఖలు చేయడంతో లండన్ కోర్టు విచారణ జరిపి, వారంటు ఇచ్చిన తర్వాత స్కాట్లాండ్ యార్డు పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. -
లండన్లో పాక్ నేత అల్తాఫ్ హుస్సేన్ అరెస్ట్
లండన్: పాకిస్థాన్కు చెందిన ప్రఖ్యాత రాజ కీయ నాయకుడు అల్తాఫ్ హుస్సేన్ను అక్రమ ద్రవ్య చెలామణి ఆరోపణలపై మంగళవారం లండన్లో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హుస్సేన్ పాక్లోని ముత్తహిద ఖ్వామీ మూవ్మెంట్(ఎంక్యూఎం) పార్టీ అధినేత. పాక్లో అతిపెద్దదైన కరాచీ నగరంపై ఆయనకు, ఎంక్యూఎంకు గట్టి పట్టుంది. అల్తాఫ్ అరెస్ట్ వార్త వ్యాపించడంతో కరాచీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెట్రోల్ బంక్లు, బ్యాంకులు, దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. లండన్లోని ఒక గృహ సముదాయంలో 60 ఏళ్ల వ్యక్తిని మనీ లాండరింగ్ చేస్తున్నాడన్న సమాచారంతో అరెస్ట్ చేశారు. -
బ్రిటన్ యువరాణి డయానాది హత్యా?
లండన్: బ్రిటన్ యువరాణి డయానా కారు ప్రమాదంలో మరణించలేదా? ఆమెను పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారా? అందులో ఆ దేశ మిలటరీ పాత్ర కూడా ఉందా? ఈ అనుమానాలకు అవకాశమిస్తున్న ఒక సమాచారంపై బ్రిటన్కు చెందిన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 1997 ఆగస్టు 31న డయానా, ఆమె ప్రియుడు అల్ఫాయెద్తో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదానికి గురై మరణించిన విషయం తెలిసిందే. అది ప్రమాదం కాదని, ఆమెను హత్య చేశారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. వాటిపై రెండు సార్లు విచారణ జరిపిన ప్రభుత్వం.. అది ప్రమాదమేనని తేల్చింది. కానీ, ఈ సారి మాత్రం అప్పట్లో సైన్యంలో పనిచేసిన ఓ అధికారి.. ‘డయానాను హత్యచేసేందుకు మా యూనిట్ ఏర్పాట్లు చేసింది. అందువల్లే దానిని దాచాల్సి వచ్చింది’ అని తన భార్యతో పేర్కొన్నట్లుగా తెలిసింది. ఈ వివరాలను పేర్కొంటూ ఆ సైనికుడి అత్త, మామ కమాండింగ్ అధికారికి లేఖ రాశారు. ఈ సమాచారంలో విశ్వసనీయతను పరిశీలిస్తున్నామని స్కాట్లాండ్ యార్డ్ సీనియర్ పోలీసు అధికారి బెర్నార్డ్ హోగన్ చెప్పారు.