breaking news
Rs 40
-
ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంతపని చేశారు?
చెన్నై: మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తామని పిలిచి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఝలక్ ఇచ్చారు. ఆ ఫోన్ వ్యక్తిని పిలిపించి ఫోన్ లాక్కొని పారిపోయారు. చివరకు పోలీసులు వారిని వెంబడించి అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం రంజిత్ కుమార్ అనే వ్యక్తి రూ.40 వేలు విలువ చేసే తన స్యామ్సంగ్ ఎస్7 ఎడ్జ్ ఫోన్ను ఆన్లైన్ పోర్టల్లో అమ్మకానికి పెట్టాడు. అయితే, మనోజ్(అలియాస్ ప్రెడెరిక్), మోతిస్వరణ్ అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఆ ఫోన్ను కొంటామని చెప్పారు. రంజిత్ను మాధవరం అనే ప్రాంతంలోని ఓ పార్క్ వద్దకు రమ్మని కోరారు. అతడు అక్కడికి వచ్చి వారికోసం ఎదురుచూస్తుండగా దగ్గరకు వచ్చి ఫోన్ వివరాలు అడుగుతున్నట్లుగా నటించి అనూహ్యంగా ఫోన్ లాక్కోని బైక్ పరారయ్యారు. దీంతో అవాక్కయిన రంజిత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని చివరకు అరెస్టు చేశారు. -
వాట్సాప్ ద్వారా పాత నోట్లు మార్చి..
కోల్కతా: ఒక దిక్కు పాత నోట్ల రద్దు.. రోజులు గడిస్తేగానీ చేతిలోకి కొత్త డబ్బులు రావు.. కానీ అప్పటికే టైమ్ తరుముకొస్తోంది.. ఆసుపత్రిలో డబ్బుకట్టి డిశ్చార్జి కాకుంటే బిల్లు రెట్టింపు అవుంతుంది. ఏం చెయ్యాలి? ఎవర్ని కలవాలి? రోగి బంధువులంతా వెళ్లి డాక్టర్ల కాళ్లావేళ్లా పడ్డారు. పాత నోట్లు తీసుకోమని బతిమాలారు. కనీసం చెక్కైనా స్వీకరించమన్నారు. కానీ వాళ్ల బాధను డాక్టర్లుగానీ, ఆస్పత్రి సిబ్బందిగానీ పట్టించుకోలేదు. చివరికి ఆ కుటుంబం వాట్సాప్ ద్వారా హాస్పిటల్ బిల్లుకు సరిపడా చెల్లుబాటయ్యే డబ్బును సేకరించింది.. కోల్ కతాకు చెందిన సుకాంత చావ్లే(35) డెండీ జ్వరంతో అలీపూర్ లోని బీజీ పొద్దార్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. బుధవారం రాత్రి సుకాంత డిశ్చార్జి కావాల్సిఉంది. అప్పటికే బిల్లు మొత్తం రూ.40 వేలను కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉంచుకున్నారు. కానీ హాస్పిటల్ వాళ్లు పెద్ద నోట్లు తీసుకోబోమన్నారు. కాళ్లావేళ్లా పడ్డా, చెక్కు రాసిచ్చినా ఒప్పుకోలేదు. చెల్లుబాటయ్యే డబ్బులే ఇవ్వాలని, లేకుంటే రెట్టింపు డబ్బు చెల్లించాల్సిఉంటుందని రోగి కుటుంబాన్ని భయపెట్టారు. ఈ అయోమయంలోనే చావ్లే సోదరుడు.. తెలినవాళ్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టాడు.. ‘ప్లీజ్ మీ దగ్గర చిల్లర డబ్బులుంటే ఇవ్వండి..’ అని. నిమిషాల్లోనే ఈ మేసేజ్ కోల్ కతా అంతటా షేర్ అయింది. తెలిసినవాళ్లు, పరిచయం లేనివాళ్లు ఉదారంగా స్పందించారు. చావ్లే సోదరుడి వద్ద ఉన్న పెద్ద నోట్లను తీసుకుని తమ దగ్గరున్న చిల్లర నాణేలను ఇచ్చేశారు. కొందరైతే పిల్లల కిడ్డీ బ్యాంక్ డబ్బులనూ తీసుకొచ్చిఇచ్చారు. గురువారం ఉదయానికే ఆసుపత్రి వద్దకు చేరుకున్న చావ్లే కుటుంబీకులు.. ఆస్పత్రి ఆవరణలోనే చిల్లర నాణేలను లెక్కించారు. మొత్తం రూ.40 వేల చిల్లరను ఆసుపత్రికి చెల్లించే ప్రయత్నం చేశారు. కానీ.. ఆస్పత్రి ఉద్యోగులు నాణేలను తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో వాగ్వాదం మొదలైంది. బీపీ పొద్దార్ ఆస్పత్రి తీరుపై రోగి బంధువులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి వర్గాలను హెచ్చరించి, డబ్బు తీసుకునేందుకు ఒప్పించారు. అప్పుడు చూడాలి ఆస్పత్రి యాజమాన్యం బాధ.. రూ.40 వేల నాణేలను లెక్కించడానికే నలుగురు ఉద్యోగులను నియమించింది. కనీసం నాలుగు గంటలు పట్టిందా నాణేలను లెక్కబెట్టడానికి. చివరికి.. ఆస్పత్రి యాజమాన్యాన్ని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి సుకాంత చావ్లేను తీసుకొని ఇంటికి వెళ్లిపోయారంతా! ఎలాంటి కష్టమైనా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటే ఏదో ఒక పరిష్కారం దొరక్కపోదు. ఏంటారు? -
టమాటా.. ఢమాల్
రైతన్న దిగులు కిలో రూ.5కు పడిపోయిన ధర రోడ్డుపాలైన దిగుబడులు నర్సాపూర్: టమాటా ధరలు విపరీతంగా పడిపోవడంతో దిగుబడులు నేలపాలవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో రూ.40 వరకు ఉండగా రెండు రోజుల్లోనే రూ.5కు పడిపోయింది. టమాటాలను మార్కెట్కు తీసుకెళ్లినా కొనేవారు లేకపోవడంతో రైతులు ఆవేదనకు గురవుతూ రోడ్డు పక్కన పారబోస్తున్నారు. పంట పండిస్తే రవాణా చార్జీలు సైతం రావడంలేదని వారు చెబుతున్నారు. నర్సాపూర్ – హైదరాబాద్ మార్గంలోని రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర టమాటలు పారబోశారు. అవి కోతులకు ఆహారంగా మారాయి. హోల్సేల్ కూరగాయల మార్కెట్లో ధర లేకపోయినా శుక్రవారం నర్సాపూర్ సంతలో మాత్రం కిలో టమాటాలను ఐదు నుంచి ఏడు రూపాయలకు అమ్మడం గమనార్హం.