breaking news
Princeton University
-
తెలివి కన్నా ఎంపిక ముఖ్యం
ప్రిన్స్టన్! ప్రతిష్ఠాత్మకమైన ప్రైవేట్ ఐవీ లీగ్ రిసెర్చ్ యూనివర్శిటీ! యూఎస్లోని న్యూజెర్సీలో ఉన్న 278 ఏళ్ల నాటి ఈ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయ 2010 సంవత్సరపు పట్టభద్రుల బ్యాచ్ని ఉద్దేశించి ఆ ఏడాది మే నెలలో అమెజాన్ సంస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉత్తేజ పూరితమైన ప్రసంగం చేశారు. పుట్టుకతో మనకున్న వరాలతోనా, లేక మనం ఎంచుకునే మార్గాలతోనా ఎలా ముందుకు సాగటం?... అనే ఆలోచనను తన ప్రసంగం ద్వారా – జీవితంలోకి ప్రవేశించ బోతున్న ఆ గ్రాడ్యుయేట్లలో – రేకెత్తించారు జెఫ్ బెజోస్. ఏనాటికీ పాత పడని ఆనాటి ఆయన ప్రసంగం... సంక్షిప్తంగా! చిన్నప్పుడు వేసవి సెలవులకు తాతయ్య, నానమ్మ దగ్గరకి టెక్సాస్ వెళ్లేవాడిని. వారికక్కడ పెద్ద కమతం ఉంది. గాలి మరలు బిగించడంలో, పశువులకు టీకాలు వేయటంలో, ఆ వ్యవసాయ క్షేత్రంలో ఇతర చిన్నా చితక పనులు చేయడంలో సాయపడేవాడిని. మా తాతయ్య, నానమ్మ ఒక సేవా కార్యక్రమాల కారవాన్ క్లబ్లో సభ్యులుగా ఉండేవారు. వారికో చైతన్య రథం లాంటిది ఉండేది. దానిలో అన్నపానాలకు, స్నానానికి, విశ్రమించేందుకు సదుపాయా లుండేవి. మా తాతయ్య కారుకి దాన్ని తగిలించేవాళ్లం. అందరూ కలసి దానిలో అమెరికా, కెనడాలలో పర్యటిస్తూ ఉండేవాళ్లం. సాధార ణంగా వేసవిలో నేను వారితో కలిసేవాడిని. తాతయ్య, నానమ్మ అంటే నాకు ప్రేమ. ఒక రకమైన ఆరాధన. వారితో కలసి తిరిగేందుకు ఆశగా ఎదురు చూస్తూండే వాడిని. ప్రతిదీ నాకు లెక్కే!నాకు పదేళ్లప్పుడు చేసిన ఒక ప్రయాణం బాగా గుర్తుంది. తాతయ్య కారు నడుపుతూంటే, నానమ్మ ఆయన పక్క సీట్లో కూర్చుంది. నేను వెనక సీట్లో దొర్లుతున్నా. ఈ ప్రయాణాల్లో ఆమె ఒకటే దమ్ము కొడుతూ ఉండేది. నాకు ఆ సిగరెట్ల వాసన గిట్టేది కాదు. అప్పట్లో నోటితో లెక్కలు కట్టేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ నేను వదులు కునేవాడిని కాను. పెట్రోల్ ఎన్ని కిలోమీటర్లకు సరిపోతుందో లెక్కవేయడం నుంచి సరుకులపై ఖర్చులను అంచనా వేయడం వరకు... పనికొచ్చేవీ, పనికిరానివీ అన్నీ లెక్కలు కడుతూండేవాడిని. ధూమపానం చేయగల హాని గురించి అంతకు ముందు నేనొక అడ్వర్టయిజ్మెంట్ చూశాను. ఇపుడు పూర్తి వివరాలు గుర్తు లేవు కానీ, ‘‘సిగరెట్ పొగ లోపలికి పీల్చినప్పుడల్లా మీ ఆయుర్దాయంలో కొన్ని నిమిషాలు హరించుకు పోతాయి’’ అని ఆ అడ్వర్టయిజ్మెంట్లో పేర్కొన్నట్లు మాత్రం గుర్తుంది. పొగ పీల్చి నప్పుడల్లా రెండు నిమిషాల ఆయుర్దాయం తగ్గిపోతుందని చెప్పారనుకుంటా. నానమ్మ కళ్లు చెమర్చాయి!నానమ్మ రోజుకు ఎన్ని సిగరెట్లు కాలుస్తుందో అంచనా వేశా. ప్రతి సిగరెట్టుకు ఎన్నిసార్లు పొగని లోపలికి పీలుస్తారో లెక్కగట్టా. నేను సహేతుకమైన అంచనాకే వచ్చానని అనిపించిన తర్వాత,ముందుకు వంగి నానమ్మ భుజాన్ని తట్టి చాలా గొప్పగా ‘‘ప్రతి రెండు నిమిషాలకి ఒకసారి పొగని పీల్చావనుకుంటే, నీ ఆయు ర్ధాయంలో తొమ్మిదేళ్లు తగ్గిపోయినట్లు లెక్క’’ అన్నాను. దానిపై, నానమ్మ స్పందన నాకు బాగా గుర్తుంది. నా తెలివితేటలకి, అంక గణిత సామర్థ్యానికి నన్ను అభినందిస్తారనుకున్నా. ‘‘జెఫ్ నీ బుర్ర అసామాన్యం. కొన్ని క్లిష్టమైన లెక్కలు వేశావు. ఏడాదిలో ఎన్ని నిమి షాలుంటాయో గణించి, కొన్ని భాగహారాలు చేసి భలే అంచనాకు వచ్చావు’’ అని తాతయ్య నా భుజం తడతారు అనుకున్నా. అలాంటి దేమీ జరగలేదు. మా నానమ్మ కళ్లు చెమర్చాయి. కన్నీటి చుక్కలు రాలుతున్నాయి. నానమ్మ ఏడుస్తూంటే, వెనక సీట్లో కూర్చున్న నాకు ఏం చేయాలో తెలియలేదు. అంతవరకు మౌనంగా డ్రైవ్ చేస్తున్న తాతయ్య, కారుని నెమ్మదిగా రోడ్డు పక్కగా ఆపి, దిగి, వెనక డోర్ తెరిచారు. నేనూ దిగి ఆయనతో అడుగులు వేయాలన్నట్లు ఆయన నుంచి ఓ చూపు. ‘‘జెఫ్! దయగా ఉండు!’’ కారు వెనుక తగిలించిన రథం పక్క నుంచున్న నా వంక ఓ క్షణం మౌనంగా చూసి తాతయ్య ‘‘జెఫ్! ఏదో ఒకరోజు, తెలివితేటలు చూప డంకన్నా, దయతో మసలడం చాలా కష్టమని గ్రహిస్తావు’’ అన్నారు! వరాలు ముఖ్యం కాదు!ఈరోజు నేను వరాలు–ఎంపికల మధ్యనున్న తేడా గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. తెలివి తేటలు మనిషికి ఒక వరం. దయను మాత్రం ఎంచుకోవలసిన విషయం. వరా లను తీసుకోవడం తేలిక. వాటిని ఎవరైనా ఇస్తారు. ఎంపికల విషయం వచ్చినప్పుడే కష్టమవుతుంది. మనం జాగ్రత్తగా లేకపోతే ఎవరైనా వరాలతో మనల్ని మభ్య పెట్ట వచ్చు. అలాంటి ప్రలోభాలకు లోనైతే, బహుశా, అది ఎంపికల విషయం వచ్చేసరికి మనకు విఘాతంగా పరిణమిస్తుంది. మీరంతా అనేక వరాలతో నిండిన బృందం. యుక్తితో, సామర్థ్యంతో కూడిన మెదడు మీ అందరికీ ఉండడం వాటిలో ఒకటి. అందులో నాకెలాంటి సందేహం లేదు. ఎందుకంటే, అడ్మిషన్ సంపాదించడానికే మిగిలిన వారితో మీరు పోటీపడి తీరాలి. మీలో తెలివితేటలున్నట్టు కనిపించ కపోతే అడ్మిషన్ల డీన్ మిమ్మల్ని లోపలకు అడుగుపెట్టనివ్వరు. ‘ఎంపిక’లోనే... మీ శక్తి! వింతలు విశేషాల గడ్డపై తిరుగాడే మీకు మీ శక్తి యుక్తులు బాగా ఉపయోగపడతాయి. మనుషులమైన మనం, మనల్నే ఆశ్చర్యపరచే పనులు చేస్తూంటాం. కాలుష్య రహిత ఎనర్జీ ఉత్పాదక మార్గాల లాంటి వాటిని కనుగొంటాం. కణాల గోడల లోపలకి ప్రవేశించి, మరమ్మతులు చేయగల మెషీన్లను పరమాణువుల లాంటి చిన్న వాటితో కూర్పు చేస్తాం. మానవాళి చేస్తున్న పరిశోధనల ఫలితంగా ఇటువంటి వార్తలు వెలువడటం ఆశించదగ్గదే కావచ్చు కానీ, ఈ నెలలో మనం నిజంగానే, ఒక అసాధారణమైన వార్తను విన్నాం. జీవన వనరులను, ఆలోచనలను సమ్మిళితం సాధించాం. రానున్న కాలంలో లైఫ్ని ఇలా సింథసైజ్ చేయడమే కాదు, కోరుకున్న ప్రత్యే కాంశాలతో దాన్ని ఇంజనీర్ చేయగలుగుతాం. మానవ మెదడును అర్థం చేసుకోగల స్థితిని కూడా మీరు చూడగలుగుతారని నాకు నమ్మకం ఉంది. ఇపుడు మనలో చాలా మంది భావిస్తున్నట్లుగానే, గతించిన కాలాలకు చెందిన జ్యూల్స్ వర్న్, మార్క్ ట్వైన్, గెలీలియో, న్యూటన్ వంటి ఉత్సుకత కలిగిన వ్యక్తులు సజీవంగా ఉండాలని కోరుకుని ఉంటారు. ఒక నాగరికతగా మనకు అనేక శక్తి యుక్తులు న్నాయి. ఇపుడు నా ముందు కూర్చున్న మీలో కూడా అనేక మందికి గొప్ప శక్తి సామర్థ్యాలుండవచ్చు. ఈ వరాలను మీరు ఎలా విని యోగించుకుంటారు? ఉన్నవాటిని చూసుకుని గర్వపడతారా లేక మీరు ఎంచుకున్న వాటిపట్ల గర్వపడతారా? సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు!అమెజాన్ ప్రారంభించాలనే ఆలోచన నాకు కొన్నేళ్ల క్రితం తట్టింది. వెబ్ వినియోగం ఏటా 2300 శాతం చొప్పున వృద్ధిచెందు తోందనే వాస్తవాన్ని గమనించాను. అంత వేగంగా మరోటి వృద్ధి చెందడాన్ని నేను కనలేదు. వినలేదు. లక్షలాది పుస్త కాలతో భౌతిక ప్రపంచంలో ఒక పుస్తక భాండా గారాన్ని నిర్వహించడం సాధ్యం కానిపని. అటు వంటిది అసంఖ్యాక పుస్తకా లతో ఒక ఆన్లైన్ బుక్ స్టోర్ను నిర్మించడమన్న ఆలోచనే నాలో ఎంతో ఉత్సుకత రేపింది. అప్పటికి నాకు 30 ఏళ్లు నిండాయి. పెళ్లయి ఏడాది అయింది. ఉద్యోగం వదిలేద్దా మనుకుంటున్నానని, ఈ కొత్త వ్యాపారం చేపడతానని నా భార్య మెకంజీకి చెప్పాను. అది ఫలించవచ్చు, ఫలించకపోవచ్చునని కూడా చెప్పేశా. ఎందుకంటే, చాలా భాగం అంకుర సంస్థల తీరు అలానే ఉంది. తర్వాత ఏమవుతుందో నాకూ తెలియదు. ఈ ప్రిన్స్టన్ విద్యాలయం నుంచే పట్టభద్రురా లైన మెకంజీ ఇప్పుడిక్కడ రెండవ వరుసలో కూర్చొనుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయాల్సిందిగా ఆమె నా వెన్ను తట్టింది. టైమ్ తీసుకుని ఆలోచించాలి!నూనూగు మీసాల బాలుడిగా ఉన్నప్పుడే సిమెంట్ నిండిన టైర్లతో ఆటోమేటిక్ గేట్ క్లోజర్ కనిపెట్టా. సోలార్ కుక్కర్ తయారు చేశా. అది గొప్పగా ఏమీ పనిచేయలేదనుకోండి. అల్యూమినియం ఫాయిల్ రూపొందించా. వంటగదిలో వాడే బేకింగ్ అలారమ్లు తయారు చేశా. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తది కనిపెట్టాలని నా అభి లాష. మెకంజీ దానికి అడ్డు చెప్పకుండా ప్రోత్సహిస్తూ వచ్చింది. అప్పటికి, న్యూయార్క్ నగరంలో ఒక ఫైనాన్షియల్ సంస్థలో కొందరు మెరికలతో కలసి, ఒక ప్రతిభావంతుడైన బాస్ కింద పనిచేస్తున్నా. ఆ బాస్ అంటే నాకు చాలా ఆరాధనా భావం. ఆయన వద్దకు వెళ్లి,ఇంటర్నెట్లో పుస్తకాలు అమ్మే కంపెనీని ప్రారంభించాలని అను కుంటున్నట్లు చెప్పా. ఇద్దరం మాట్లాడుకుంటూ సెంట్రల్ పార్క్లో చాలాసేపు నడిచాం. నా మాటలు శ్రద్ధగా ఆలకించిన ఆయన ‘‘అది గొప్ప ఐడియాగానే కనిపిస్తోంది. కానీ, గొప్ప ఉద్యోగం లేని ఎవరి కైనా అది మరింత గొప్ప ఐడియాగా భాసిస్తుందేమో చూడు’’ అన్నారు. ఆలోచించుకుని తుది నిర్ణయం తీసుకునేందుకు 48 గంటల గడువు నిచ్చారు. ఆయన మాటల్లోనూ వాస్తవం ఉందనిపించింది. కానీ, కష్టమని తోచినా, అడుగు ముందుకేయడానికే నిర్ణయించుకున్నా. ఏదైనా ప్రయత్నించి, విఫలమైతే బాధపడడం అన్నది నాకెప్పుడూ లేదు. అసలు, ప్రయత్నించి చూడకపోతేనే, అది నన్ను వెంటాడుతూ ఉంటుంది! ఎంతో ఆలోచించిన మీదట, అంత సురక్షితం కాని మార్గాన్నే ఎంచుకున్నా. కానీ, దానికి నేను గర్వపడుతూనే ఉంటా.మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి!రేపు మీరు నిజంగానే కొత్త జీవితానికి శ్రీకారం చుట్టబోతు న్నారు. మీ భవితవ్యాన్ని మీరే రాసుకో బోతున్నారు. మీకున్న ప్రతిభా సంపత్తులను మీరు ఎలా వినియోగించుకుంటారు? ఎటు వంటి మార్గాన్ని ఎంచుకుంటారు? స్తబ్ధుగా ఉంటూ ఎలా జరిగితే అలా జరుగుతుంది అనుకుంటారా? లేక దేనిమీద ప్రీతి ఉందో ఆ పనులు చేస్తారా? ఉన్నవాటిని పట్టుకుని వేలాడ తారా? లేక కొత్తదనం చూపేందుకు ప్రయత్ని స్తారా? సాఫీగా సాగిపోయే జీవితాన్ని ఎంచుకుంటారా? లేక సేవ, సాహసాలతో నిండినదాన్నా? మిమ్మల్ని విమర్శించినపుడు నీరసించిపోతారా? లేక మీరు నమ్మినదాన్ని అనుసరించి ముందుకు సాగుతారా? తప్పు చేస్తే ఊకదంపుడుతో సమర్థించుకుంటారా? లేక క్షమాపణ కోరతారా? ప్రేమలో పడినపుడు ఎవరన్నా నిరాకరించినా మీ హృదయాన్ని కాపాడుకుంటారా? లేక భావోద్రేకాలతో వ్యవహరిస్తారా? సురక్షితంగా వ్యవహరించడం మంచిదనుకుంటారా? లేక కొద్దిగా సాహసంతో వ్యవహరిస్తారా? కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు విరమించుకుంటారా? లేక విడువ కుండా శ్రమిస్తారా? మీరు నిరాశా వాదా? లేక నిర్మాతా? ఇతరులను పణంగా పెట్టి తెలివి తేటలు ప్రదర్శిస్తారా? లేక దయతో వ్యవహరిస్తారా?నేనొక జోస్యం చెప్పే సాహసం చేస్తా. 80 ఏళ్ల వయసులో మీరు ప్రశాంత జీవితం గడుపుతూ ఒకసారి సింహావలోకనం చేసుకున్న ప్పుడు, అర్థవంతమైన మీ ఎంపికలే మీ జీవిత సంగ్రహం అవుతా యని మరచిపోకండి. మన ఎంపికలే మనల్ని రూపుకట్టిస్తాయి.మీ జీవితాన్ని ఒక విజయవంతమైన గాథగా మీరే తీర్చిదిద్దుకోండి. థ్యాంక్యూ అండ్ గుడ్ లక్! -
అక్కడ ఏడాదికి 25,000 రోజులు
వాషింగ్టన్: భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగిరావడానికి 365 రోజులు పడుతుందని తెల్సిందే. అదే మాదిరి ఒక చిన్నపాటి మరుగుజ్జు గ్రహం లాంటి ఖగోళ వస్తువు మన సూర్యుని చుట్టూ అత్యంత నెమ్మదిగా తిరుగుతోంది. ఎంతగా అంటే ఒక చుట్టు చుట్టేయడానికి ఏకంగా 25,000 రోజుల సమయం తీసుకుంటోంది. సౌరమండలంలో కొత్తగా కనిపెట్టిన ఈ మరుగుజ్జు గ్రహానికి 2017 ఓఎఫ్201 అని పేరుపెట్టారు. అయితే దీనిని గ్రహం హోదా ఇవ్వాలా వద్దా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే దీనిని పూర్తిస్థాయిలో గ్రహ లక్షణాలు లేవని తేలింది. నెప్ట్యూన్ గ్రహం ఎంత దూరంలో అయితే సూర్యుడి చుట్టూ తిరుగుతోందో అంతకంటే కాస్తంత ఎక్కువ దూరంలో ఈ అంతరిక్ష పదార్థం మన సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఇది చాలా నెమ్మదిగా పరిభ్రమిస్తోంది. ఒకసారి సూర్యుడిని చుట్టిరావడానికి 25,000 రోజుల సమయం తీసుకుంటోంది. దీని వెడల్పు ఏకంగా 700 కిలోమీటర్లు. ‘‘ కోట్ల సంవత్సరాలుగా ఒకే కక్షలో పరిభ్రమిస్తోంది. ఆ లెక్కన చూస్తే బుల్లి గ్రహం హోదా పొందే అర్హత కాస్తంత దీనికి ఉంది’’ అని అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీలో ఖగోళ భౌతిక శాస్తవేత్త సిహావో చెంగ్ అన్నారు. మరుగుజ్జు గ్రహాల హోదా పొందిన ఐదింటిక కంటే ఈ కొత్త ఖగోళ వస్తువు కాస్తంత చిన్నగా ఉంది. గతంలో గ్రహంగా చెలామణి అయిన ఇటీవల మరుగుజ్జు గ్రహంగా స్థిరపడిపోయిన ప్లూటో వ్యాసం 2,377 కిలోమీటర్లుకాగా ఈ 2017 ఓఎఫ్201 వ్యాసం కేవలం 700 కిలోమీటర్లే! -
సంచలన ఆవిష్కరణ.. ఇక స్మార్ట్ఫోన్లో కెమెరా బంప్స్ కనపడవు!
ప్రస్తుత స్మార్ట్ టెక్నాలజీ యుగంలో స్మార్ట్ఫోన్ ఇల్లు లేదు అని చెప్పుకోవడంలో పెద్ద అతిశయోక్తి లేదు. అంతలా విస్తరించింది, ఈ స్మార్ట్ఫోన్ ప్రపంచం. అయితే, ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్ కొనే ముందు తప్పక చూసే ఫీచర్స్లలో కెమెరా అనేది చాలా ముఖ్యమైనది. ఈ మధ్య కొన్ని కంపెనీలు యూజర్లను ఆకట్టుకోవడం కోసం పెద్ద, పెద్ద కెమెరాల గల స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇవీ, పనితీరు పరంగా చూస్తే బాగానే ఉన్న, చూడాటానికి అంత బాగుండటం లేదు. దీనికి, ముఖ్య కారణం మన స్మార్ట్ఫోన్ కెమెరాల వెనుక ఉండే పెద్ద, పెద్ద కెమెరా బంప్స్. ఇలా కెమెరా బంప్స్ పెద్దగా ఉండటం వల్ల కొన్నిసార్లు స్మార్ట్ఫోన్ లుక్ కూడా దెబ్బతింటుంది. అయితే, ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ప్రిన్స్టన్, వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చారు. మన స్మార్ట్ఫోన్లు నానో కెమెరాలతో త్వరలో రానున్నాయి. మీరు నానో కెమెరా సైజ్ గురుంచి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది చూడాటానికి చిన్నగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రోబోటిక్స్ టెక్నాలజీ సహాయంతో నానో కెమెరాలను తయారు చేయవచ్చు అని పరిశోధకులు అన్నారు. ఈ అత్యంత చిన్న కెమెరాలో 1.6 మిలియన్ స్థూపాకార పోస్ట్లు ఉన్నాయి. ఇవి కాంతిని ప్రాసెస్ చేయడానికి సహాయపడతాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే?, ఈ నానో కెమెరా చిప్ను సంప్రదాయ కంప్యూటర్ చిప్స్ లాగా ఉత్పత్తి చేయవచ్చు. ఇవి అల్గోరిథంలపై ఆధారపడి పనిచేస్తాయి. నేచర్ కమ్యూనికేషన్స్లో వచ్చిన కథనం ప్రకారం.. నానో కెమెరాల కొత్త జెన్ ఔషధం, రోబోటిక్స్ లో ఉపయోగించే ప్రస్తుత నానో కెమెరా టెక్నాలజీతో సహాయంతో పనిచేస్తాయి. కొత్త నానో కెమెరాలతో చిత్రాలను సంప్రదాయ కెమెరాలతో సమానంగా పరిశోధకులు తీయగలిగారు. ఈ నానో కెమెరాలలో ఉపయోగించే కొత్త టెక్నాలజీని "మెటాసర్ఫేస్" అని పిలుస్తారు. దీనిలో సంప్రదాయ కెమెరా లోపల వక్రమైన కటకాలను నానో క్యామ్ ల ద్వారా ఉంచుతారు. ఇవీ, కేవలం అర మిల్లీమీటర్ వెడల్పుతో ఉంటాయి. పనితీరు పరంగా చూసిన ఇప్పుడు ఉన్న కెమెరాలతో సరిసమానంగా పనిచేస్తాయి అని వారు తెలిపారు. (చదవండి: ఆండ్రాయిడ్ 13 ఫీచర్లు లీక్, వారెవ్వా.. అదరగొట్టేస్తున్నాయ్!) -
కరోనా వ్యాప్తిపై వేసవి ప్రభావం తక్కువ
వాషింగ్టన్: ఉత్తరార్ధగోళంలోని అధిక వేసవి ఉష్ణోగ్రతలు కరోనా వైరస్ వ్యాప్తిని గణనీయంగా పరిమితం చేసే అవకాశం లేదని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం అధ్యయనం తెలిపింది. ఈ మేరకు సైన్స్ జర్నల్లో ఓ నివేదికను విడుదల చేసింది. గత కొన్ని నెలలుగా నిర్వహించిన అనేక అధ్యయనాలు వాతావరణం, కరోనా వైరస్ మధ్య సంబంధం ఉన్నట్లు తెలిపాయి. ఎక్కువ వేడిగా ఉన్న ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందడానికి తక్కువ అవకాశం ఉన్నట్లు ఈ అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఇవన్ని ప్రాథమిక దశలోనే ఉండటంతో వాతావరణం, కోవిడ్-19 మధ్య ఖచ్చితమైన సంబంధం గురించి పూర్తిగా తెలియడం లేదు.(కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు) ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ప్రిన్స్టన్ అధ్యయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీనిలో వాతావరణం, వైరస్ వ్యాప్తి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు. అయితే వైరస్ వ్యాప్తిపై వాతావరణం ప్రభావం చాలా పరిమితంగా ఉంటుంది అని ఈ అధ్యయనం తేల్చింది. అంతేకాక సమర్థవంతమైన నియంత్రణ చర్యలు లేకుండా కేవలం వాతావరణ పరిస్థితుల మీద నమ్మకం ఉంచడం క్షేమం కాదని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఎక్కువ తేమతో కూడిన వాతావరణంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని .. వేసవి వాతావరణం మహమ్మారి వ్యాప్తిని గణనీయంగా పరిమితం చేస్తుందని భావించవద్దని సూచించింది.(సెప్టెంబర్ నాటికి మూడుకోట్ల డోస్లు!) అంతేకాక మహమ్మారి ప్రారంభ దశలో ఎక్కువ వెచ్చని లేదా ఎక్కువ తేమతో కూడిన వాతావరణం వైరస్ వ్యాప్తిపై ఎలాంటి ప్రభావం చూపించలేదని తాము గర్తించినట్లు ప్రిన్స్టన్ ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూట్ (పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ అసోసియేట్) రాచెల్ బేకర్ అన్నారు. ఫ్లూ జాతికి చెందిన వైరస్ల వ్యాప్తిలో తేమ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ కోవిడ్ 19 వ్యాప్తిపై పరిమాణం వ్యాప్తిపై వాతావరణం చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా.. అధిక జనాభా కారణంగానే వైరస్ త్వరగా వ్యాపిస్తుందని బేకర్ అన్నారు.(‘డబ్ల్యూహెచ్ఓకి నిధులు పూర్తిగా నిలిపివేస్తాం’) బ్రెజిల్, ఈక్వెడార్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలోని అత్యధిక వేసవి ఉష్ణోగ్రతలు వైరస్ వ్యాప్తిపై చాలా తక్కువ ప్రభావం చూపాయని బేకర్ తెలిపారు. వాతావరణం వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తుందని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. బలమైన నియంత్రణ చర్యలు, వ్యాక్సిన్ లేకుండా కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడం సాధ్యపడదన్నారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి వివిధ వాతావరణ పరిస్థితల్లో దాని వ్యాప్తి ఎలా ఉందనే అంశంపై తాము ఈ పరిశోధనలు కొనసాగించినట్లు బేకర్ తెలిపారు. -
భారత ఉపఖండం వల్ల భూమిపై అనేక మార్పులు!
వాషింగ్టన్: భారత ఉపఖండం కారణంగా భూమిపై అనేక పెను మార్పులు చోటుచేసుకున్నాయన్న విషయం మీకు తెలుసా..? 5 కోట్ల ఏళ్ల క్రితం ఆసియా ఖండం, భారత ఉపఖండం విడివిడిగా ఉండేవని మీరు ఎప్పుడైనా చదివారా..? అప్పట్లో ఆసియా ఖండం, భారత ఉపఖండం మధ్యలో ఉండే టెథీస్ అనే పురాతన సముద్రం గురించి మీరు విన్నారా..? అయితే మీరు 5 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జరిగిన మార్పులు తెలుసుకోవాల్సిందే. సరిగ్గా 5 కోట్ల ఏళ్ల కిందట భారత ఉపఖండం ఆసియా ఖండాన్ని ఢీకొట్టి.. ప్రస్తుత ఆసియా ఖండంలా ఏర్పడింది. ఈ ఘటన ద్వారానే ఖండాల స్థితిగతులు, ప్రపంచ వాతావరణంతోపాటు ఇంకా మరెన్నో మార్పులు భూమిపై చోటుచేసుకున్న విషయాన్ని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. అయితే తాజాగా దీని కారణంగానే ప్రపంచ సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు పెరిగినట్లు కనుగొన్నారు. దీంతో భూమిపై జీవించడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి ఎమ్మా కాస్ట్ తెలిపారు. దీనికోసం 7 కోట్ల ఏళ్ల క్రితం నాటి అతిసూక్ష్మ సముద్రపు గవ్వలను ఉపయోగించి సముద్రాల్లోని నైట్రోజన్ను రికార్డు చేశారు. అప్పటి నైట్రోజన్ పరిస్థితులను పోల్చి చూశారు. అలాగే పురాతన సముద్రాల్లో ఉండే 15ఎన్ –14ఎన్ నైట్రోజన్ పరిస్థితులను పునర్ నిర్మించారు. అనంతరం అప్పటి ఆక్సిజన్ స్థాయిల్లో మార్పులను గమనించారు. దీన్ని బట్టి అప్పట్లో 15ఎన్–14ఎన్ నైట్రోజన్ స్థాయిలు అత్యధికంగా ఉండేవని, దీంతో సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉండేవని గుర్తించారు. ఈ పరిశోధన వివరాలను బట్టి భవిష్యత్తులో సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు భూమిపై ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఊహించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
వెంటాడే గూగుల్ నిఘా
శాన్ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మీపై నిఘా పెడుతోందా? మీరు వద్దన్నా సరే మీ రాకపోకలు, మేసేజ్లు అన్నింటిని రికార్డు చేస్తోందా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. తమ ప్రయాణ వివరాలు రికార్డు చేయవద్దని సెట్టింగ్స్ పెట్టినప్పటికీ గూగుల్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల సమాచార సేకరణను ఆపడంలేదు. అసోసియేటెడ్ ప్రెస్ జరిపిన పరిశోధనలో ఈ సంచలనాత్మక విషయం వెల్లడైంది. ఈ వివరాలను ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ పరిశోధకులకు పంపగా అనుమతి లేకుండా పౌరుల సమాచారాన్ని గూగుల్ సేకరిస్తోందని వారు ధ్రువీకరించారు. ‘గూగుల్ మ్యాప్స్’ వాడేటప్పుడు యూజర్ ఉన్న లొకేషన్ తెల్సుకునేందుకు అనుమతి ఇవ్వాలి. అలా చేస్తే ప్రజలు ఫోన్తో ఏ చోట్లకెళ్లారు? అక్కడ ఎంతసేపున్నారు? తదితర అంశాలను ఆటోమేటిక్గా రికార్డు చేస్తుంది. అయితే ఇది ఇష్టం లేని యూజర్ల కోసం ‘లొకేషన్ హిస్టరీ ఆప్షన్’ను ఆఫ్ చేసే సౌకర్యాన్ని గూగుల్ తెచ్చింది. దీన్నివాడితే యూజర్లు ఎక్కడున్నారో రికార్డు కాదని గూగుల్ చెప్పింది. తాజాగా పరిశోధకులు ఇది అబద్ధమని తేల్చారు. లొకేషన్ హిస్టరీ ఆప్షన్ ను నిలిపివేసినా కొన్ని గూగుల్యాప్స్ కస్టమర్లు ఎక్కడ, ఎంతసేపు ఉన్నారో రికార్డు చేస్తున్నాయని తేల్చారు. గూగుల్ మ్యాప్ యాప్ను ఒక క్షణం ఓపెన్ చేసినా స్క్రీన్ షాట్ ఆటోమేటిక్గా గూగుల్ తీసేసుకుంటోందని పరిశోధకులు తెలిపారు. ఆటోమేటిక్గా వాతావరణం గురించి చెప్పే యాప్స్ కూడా యూజర్లు ఎక్కడ ఉన్నారన్న సమాచారాన్ని గూగుల్కు పంపిస్తూనే ఉంటాయి. లొకేషన్కు సంబంధం లేని మరికొన్ని యాప్స్ అయితే కేవలం 30 సెం.మీ కచ్చితత్వంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల సమస్త సమాచారాన్ని గూగుల్కు అందజేస్తున్నాయి. 200 కోట్ల మందికి పైగా ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల సమాచారాన్ని గూగుల్ రికార్డు చేసిందన్నారు. వినియోగదారుల అనుమతి లేకుండా గూగుల్ వారి సమాచారాన్ని దొంగతనంగా సేకరించిందని ప్రిన్స్టన్ వర్సిటీకి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త జొనాథన్ మేయర్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు వేర్వేరు మార్గాల్లో తాము యూజర్ల సమాచారాన్ని సేకరిస్తామని గూగుల్ ప్రతినిధి చెప్పారు. యూజర్లు myactivity.google.com ద్వారా తమ సెర్చింగ్లు, ఇతర వివరాలను చూసుకోవచ్చు. -
వేయని రోడ్లకూ సొమ్ము
వాషింగ్టన్: భారత్లో వేయని రోడ్లను నిర్మించినట్లు బిల్లులు చూపించి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశారు. ఇందుకు స్థానిక రాజకీయ నేతలు, వారి బంధువులు, అవినీతి పరులు కుమ్మక్కై ప్రజాధనాన్ని దిగమింగేశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్వై)లో లొసుగుల ఆసరాగా స్థానిక ప్రజాపతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి భారీ అవినీతికి పాల్పడ్డారు. విస్తుగొలిపే ఈ అంశాలన్నీ అమెరికాలోని ప్రిన్స్టన్ వర్సిటీ, ఫ్రాన్స్లోని పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కు చెందిన పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యాయి. గ్రామీణ ప్రాంతాలను బాహ్య ప్రపంచానికి అనుసంధానిస్తూ చేపట్టే రహదారి నిర్మాణాల్లో భారీ అవినీతి జరుగుతోందని అధ్యయనంలో తేలింది. రాజకీయనేతల కనుసన్నల్లోనే మారుమూల ప్రాంతాలను అనుసంధానిస్తూ గ్రామీణ రహదారులను నిర్మించినట్లు పీఎంజీఎస్వై సమాచార జాబితాలో పేర్కొన్నారు. వాటికి కేంద్రం నిధులు అందజేసినట్లు రాసేశారు. కానీ, అందులో పేర్కొన్న రోడ్లలో కనీసం ఒక్కరోడ్డు వేయలేదు. ఇలాంటివి 500 రోడ్లు ఉన్నట్లుగా పరిశోధక బృందం గుర్తించింది. కేంద్రం అందించిన నిధులు మాత్రం రహదారి నిర్మాణం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు, పనులు కేటాయించిన స్థానిక రాజకీయనేతల ఖాతాల్లోకి వెళ్లిపోయాయని వెల్లడైంది. ఈ అవినీతి అంతటికీ స్థానిక ప్రజాప్రతినిధులే కారణమని పరిశోధకులు తేల్చారు. స్థానిక రాజకీయనేతలే ఈ అవినీతికి కారణమని నిర్ధారించేందుకు పరిశోధకుల బృందం శ్రమించాల్సి వచ్చింది. కాంట్రాక్టులను దక్కించుకున్న వారి ఇంటిపేర్లను స్థానిక ప్రజాప్రతినిధుల ఇంటిపేర్లతో సరిపోల్చాకే బృందం ఈ నిర్ణయానికొచ్చింది. రాజకీయనేతలు సిఫారసు చేసిన కాంట్రాక్టర్లకే రహదారి పనులు దక్కేలా చూసిన అధికారులు కూడా ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందినట్లు పరిశోధకులు గుర్తించారు. -
‘నాక్కూడా మేక్ ఇన్ ఇండియా ఇష్టం’
న్యూయార్క్ : మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తనకు కూడా ఇష్టమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ అన్నారు. అయితే, ఈ కార్యక్రమం ద్వారా ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలో వారినే మరుస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్గాంధీ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీనే ప్రవేశపెట్టాల్సి ఉండేదని, అంతకుముందే తమ పార్టీకి ఆ ఆలోచన ఉందని చెప్పారు. ’నాకు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అంటే చాలా ఇష్టం. కానీ, వారి దృష్టిని సారించాల్సిన వారిని పక్కన పెడుతున్నారు. నేనే ఆ పాలసీని అమలుచేస్తే కచ్చితంగా భిన్నంగా ఉంటుంది. పెద్ద వ్యాపారాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధాని మోదీ భావిస్తారు. మధ్యతరగతి, చిన్నతరహా కంపెనీలను లక్ష్యంగా పెట్టుకోవాలని నేను భావిస్తాను. ఎక్కువ ఉద్యోగాలు, ఉపాధి లభించేది ఈ రెండు రంగాల నుంచే’ అని రాహుల్ చెప్పారు. -
అగణిత శాస్త్రశీలుడు...
మంజుల్ భార్గవ్... ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో గణిత విభాగం ప్రొఫెసర్... అత్యుత్తమ ‘ఫీల్డ్స్ మెడల్’ అందుకున్న మొట్టమొదటి భారతీయ గ ణిత శాస్త్రవేత్త. ‘నంబర్ థియరీ’ ఆవిష్కరణ వెనుక భారతీయ సంప్రదాయ గణితశాస్త్రవేత్తల శ్రమ ఉందనే సంప్రదాయవాది... గణిత శాస్త్రవేత్తలైన హేమచంద్రుడు, బ్రహ్మగుప్తులకు ఏకలవ్య శిష్యుడు... సంస్కృత పద్యకావ్యాలలో ఉండే లయ, గణిత శాస్త్ర సూత్రాల నుంచి లెక్కలను సులభంగా అర్థం చేసుకోవచ్చని చెప్పిన మంజుల్ భార్గవ్ గురించి... కెనడాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉన్న మంజుల్ భార్గవ్ సంస్కృతభాషలో విరచితమైన గణిత శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. రెండు వందల ఏళ్లుగా ఎవరికీ అంతుచిక్కకుండా ఉన్న ఒక నంబర్ థియరీ పజిల్ను పరిష్కరించారు. ఏడో శతాబ్దపు గణిత శాస్త్రజ్ఞుడు బ్రహ్మగుప్తుడు రాసిన సిద్ధాంతాలపై పట్టు సంపాదించారు మంజుల్. వాటిని సూత్రీకరిస్తూనే నంబర్ థియరీ పజిల్ పరిష్కరించారు. ఆయన కృషికి గుర్తింపుగా ఆయనను ఫీల్డ్స్మెడల్ అవార్డు వరించింది. గణితశాస్త్రంలో ఇచ్చే ఈ పురస్కారం, ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్తో సమానం. కెనడా దేశ పౌరసత్వం ఉన్నప్పటికీ, ఆయన భారతీయుడు. చిన్న నాటి నుంచి సంప్రదాయమంటే ఇష్టపడే మంజుల్ భార్గవ్ తల్లి గణితశాస్త్రవేత్త. ఆవిడకు సంగీతం, భాషా శాస్త్రాలలో ప్రవేశం ఉంది. అందువల్ల భార్గవ్కు సాహిత్యం, ముఖ్యంగా సంస్కృత కావ్యాలు చదివే అవకాశం వచ్చిందనీ, సంగీతం మీద అభిరుచి పెరిగిందనీ అంటారు. ‘‘నాకు తబలా అంటే చాలా చాలా ఇష్టం. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలలో ఉండే లయను ఇష్టపడతాను. నా మొదటి సంగీత గురువు మా అమ్మ. ఆవిడ సంగీతం పాడతారు, తబలా వాయిస్తారు’’ అని చెప్పే భార్గవ్కు మూడు సంవత్సరాల వయసప్పుడు తల్లి, తబలాలోని బేసిక్ సౌండ్ ఎలా వాయించాలో నేర్పారు. ఎంత ప్రయత్నించినా భార్గవ్ నోటి నుంచి చిన్న శబ్దం కూడా బయటకు రాలేదు. భార్గవ్తో పాటు అతనిలో తబలా నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా పెరగడంతో... జైపూర్లోని పండిట్ ప్రేమ్ ప్రకాశ్ దగ్గర తబలా విద్య కొంత నేర్చుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ దగ్గర మెలకువలు నేర్చుకున్నారు. మంజుల్ భార్గవ్ తాతగారు పరోక్షంగా భార్గవ్కు గురువు. ఆయన సంస్కృత పండితుడు, చరిత్ర కారుడు. ఆయన బాల్యం నుంచే భార్గవ్కు ప్రాచీనన గణితశాస్త్రం నేర్పారు. నాటి గణితకారులంతా వారిని వారు కవులుగా చెప్పుకున్నారే కాని, గణిత శాస్త్రవేత్తలుగా చెప్పుకోలేదనీ, భాషావేత్తలయిన పాణిని, పింగళ, హేమచంద్ర, నారాయణ... వీరు కవిత్వం చదివి, అద్భుతమైన గణిత సూత్రాలను ఆవిష్కరించిన విషయాన్ని తాతగారు తనకు చెప్పేవారని భార్గవ్ అంటారు. ఆయన చెప్పిన ఎన్నో కథలు భార్గవ్లో కొత్త ఆలోచనలకు పునాదులు వేసింది. గణితం లయాత్మకమని భార్గవ్ చెబుతారు. సంస్కృత భాషలో లయను గురులఘువులు సూచిస్తాయి. గురువును రెండు మాత్రల కాలంలో, లఘువును ఒక మాత్ర కాలంలో పలుకుతాం. ఎన్ని గురు లఘువులు కలిస్తే ఎనిమిది లయలు ఏర్పడతాయని ఎవరినైనా అడిగితే, కొందరు నాలుగు గురువులు కలిస్తే అనవచ్చు. మరికొందరు మూడు లఘువులు, రెండు గురువులు, ఒక లఘువు కలిస్తే వస్తుందనవచ్చు. క్రీ.పూ. 500 - 200 కాలంలో పింగళుడు తన చండశాస్త్రంలో దీనిని ఎంతో చక్కగా వివరించారని భార్గవ్ అంటారు. ‘డైజీ’ పూలను తన గురువుగా భావిస్తారు. ఈ పువ్వుకి 34 రెక్కలు ఉంటాయి. అంటే ఎనిమిది లయలన్నమాట. ఇటువంటి ఎన్నో అంశాలను భార్గవ్ సంస్కృత సాహిత్యం చదువుతూ తెలుసుకోవడం ప్రారంభంచారు. అలా సంస్కృత గణిత సాహిత్యాన్ని భార్గవ్ తన వశం చేసుకోగలిగారు. ఇంతటి అత్యున్నత పురస్కారాన్ని చేజిక్కించుకోగలిగారు. - డా. వైజయంతి నోబెల్ బహుమతి గణితశాస్త్ర విభాగానికి ఇవ్వరు. అందువల్ల గణితంలో అత్యున్నత గౌరవంగా ‘ఫీల్డ్స్ మెడల్’ ను బహూకరిస్తారు. సాధారణంగా ఈ బహుమతిని అమెరికా, రష్యా, ఫ్రెంచి, ఇంగ్లండ్ దేశస్థులు గెలుచుకుంటారు. ఇంతవరకు ఈ నాలుగు దేశాలకు 38 మెడల్స్ వచ్చాయి. ఈ బహుమతిగా 15 వేల డాలర్లు ఇస్తారు. ఈ మొత్తం నోబెల్లో సరిగ్గా పదో వంతు. శ్రీనివాస రామానుజన్ అధ్యయనం చేసిన అంశంలో మంజుల్ ప్రతిభ చూపడం విశేషం. మంజుల్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో ‘గాస్’ శాస్త్రవేత్త చూపిన పరిష్కారాన్ని మరింత సరళం చేశారు. నాలుగేళ్లకోసారి భారతదేశానికి వచ్చినప్పుడు తాతయ్య, అమ్మమ్మలతో ఆరునెలలు గడిపేవారు. ఆ సమయంలో సంస్కృతం, తబలా నేర్చుకునేవారు. తబలా వాదనలోనూ, సంస్కృత శ్లోక పఠనంలోనూ ఉండే లయ పూర్తిగా గణితాత్మకమే అంటారు మంజుల్. అమెరికాలో పెరిగినా, ఇంట్లో మాత్రం భారతీయ వాతా వరణం, భారతీయ భోజనం. నా చిన్నతనంలో మార్టిన్ గార్డెనర్ రాసిన ‘మేథమేటిక్స్ మ్యాజిక్ అండ్ మిస్టరీ’ పుస్తకం చదివి ఆ ఫన్ను ఎంజాయ్ చేశాను. గురువులకు, లెక్కలంటే భయపడే విద్యార్థులకు లెక్కలలో ఆసక్తి కలగడానికి వీలుగా మూడు సూచనలిచ్చాను... లె క్కలను శాస్త్రీయ పద్ధతిలో కాకుండా రకరకాల కళల ద్వారా తెలియచెప్పాలి. అంటే పజిల్, బొమ్మలు, మ్యాజిక్, కవిత్వం, సంగీతం... వీటన్నిటినీ లెక్కల తరగతి గదిలోకి తీసుకురావాలి. విద్యార్థులకు లెక్కలు నేర్పే విధానం యాంత్రికంగా ఉండకూడదు. వాళ్లకి వాళ్లుగా ఆలోచించేలా ఉండాలి. లెక్కలంటేనే ఉత్సాహంగా సృజనాత్మకంగా పరిష్కరించాలి. అందుకోసం విద్యార్థులంతా కలిసి కొత్త కొత్త వాటిని కనుక్కోవాలి, కలిసి పని చేయాలి. ఈ మూడు సూత్రాలను అనుసరించి గురువులు లెక్కలు నేర్పితే, గురువులకే కాదు విద్యార్థులకు కూడా లెక్కలంటే భయం పోతుంది. చదువును ఆడుతూపాడుతూ నేర్చుకుంటే, కొత్తకొత్త ఆవిష్కరణలకు నాంది ఏర్పడుతుంది. అంతేకాని చదువును చూడకూడదు. - మంజుల్ భార్గవ్ -
అమెరికాలో టాప్-20 కాలేజీలివే
-
ప్రిన్స్టన్ డీన్గా భారతీయుడు
వాషింగ్టన్: అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది. ప్రొఫెసర్ సంజీవ్ కులకర్ణిని ప్రతిష్టాత్మక ప్రిన్స్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్కు డీన్గా నియమించారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో ప్రొఫెసర్, కెల్లర్ సెంటర్ డెరైక్టర్గా ఉన్న కులకర్ణి మార్చి 31న కొత్త బాధ్యతలు చేపడతారని బుధవారం యూనివర్సిటీ ప్రకటించింది. న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న ఈ వర్సిటీకి 2002 నుంచి విలియం రస్సెల్ డీన్గా ఉంటున్నారు. ‘సంజీవ్ కులకర్ణి ప్రిన్స్టన్ గ్రాడ్యుయేట్ స్కూల్కు అద్భుతమైన డీన్గా వ్యవహరిస్తారు’ అని ప్రిన్స్టన్ ప్రెసిడెంట్ క్రిస్టఫర్ ఐస్బ్రూగెర్ కొనియాడారు. ప్రిన్స్టన్లో 1991లో ఫ్యాకల్టీగా చేరిన కులకర్ణి మాట్లాడుతూ, తనను డీన్గా నియమించినందుకు సంతోషం వ్యక్తంచేశారు. యూనివర్సిటీతో 20 ఏళ్లకుపైగా అనుబంధముందని, ప్రిన్స్టన్కు మరిన్ని సేవలు చేసేందుకు మంచి అవకాశం లభించిందని చెప్పారు.