breaking news
prakasam collectorate
-
ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ సీపీ నిరసన
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార టీడీపీ అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒంగోలులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఒంగోలు ఎంపీ వై వి సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షడు ఎం. అశోక్రెడ్డితోపాటు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
ఫైలిన్ తుపాన్ నేపథ్యంలో జిల్లాలో అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయ కుమార్ గురువారం ఉదయం వెల్లడించారు. తీర ప్రాంతంలోని 11 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే ప్రత్యేక అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. తమ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. తుపాన్ వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఏదురైన వెంటనే 08592 281400కు ఫోన్ చేయాలని ఆయన జిల్లా వాసులకు విజ్ఞప్తి చేశారు.