-
26న విశాఖకు సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: సీఎం వైఎస్ జగన్ ఈ నెల 26న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలోని సాగర తీర పరిరక్షణ కోసం అమెరికా (న్యూయార్క్)కు చెందిన పార్లే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ముఖ్యమంత్రి సమక్షంలో పార్లే సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య బీచ్ పరిరక్షణపై ఎంవోయూ జరుగుతుందని కలెక్టర్ డా.మల్లికార్జున శనివారం మీడియాకు తెలిపారు. సాగర గర్భంలోనూ, తీరం వెంబడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని పార్లే సంస్థ సేకరించి.. వాటిని రీ సైకిల్ చేసేందుకు పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. దీనికి సంబంధించిన ఒప్పంద కార్యక్రమాన్ని ఈ నెల 26న ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మైక్రోసాఫ్ట్ సంస్థ.. ఆంధ్ర యూనివర్సిటీతో పాటు పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న 5 వేల మందికి ఉపాధి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందిస్తున్నట్లు తెలిపారు. -
మాంద్యానికి బిస్కెట్ మేలుకొలుపు
బిస్కెట్ చాలా చౌక వస్తువు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పార్లే జి బిస్కెట్ ధర యథాతథంగా ఉండటం కంపెనీ పాటించే వ్యాపార సూత్రం. దేశంలో ఒకపూట భోజనం చేయడానికి డబ్బులు లేని వారు కూడా ఒక కప్పు టీ, దాంతోపాటు రెండు బిస్కెట్లను తినడానికి పూనుకుంటారు. ప్రజల అభిరుచులు దెబ్బతీయని చోట ప్రభుత్వ విధానాలు దెబ్బతీస్తున్నాయి. బిస్కెట్లపై జీఎస్టీ విధింపు వల్ల ధరలు పెరిగాయి. బిస్కెట్ని కారుతో పోల్చి చూడలేం. ఎందుకంటే కారును ఒకసారి మాత్రమే కొనగలం. దాన్ని మళ్లీ మళ్లీ మార్చలేం. కానీ కేవలం ఐదు రూపాయల విలువైన బిస్కెట్ ప్యాకెట్ను కొనడానికి కూడా ప్రజలు వెనకాముందూ ఆలోచిస్తున్నారంటేనే ఆర్థిక సంక్షోభం తీవ్రమైందనే అర్థం. పారిశ్రామిక వేత్తల అభ్యర్థనలను ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు కానీ బిస్కెట్ల అమ్మకాల పతనం ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి. దాదాపు పదివేలమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్ చేసిన ప్రకటన ఆటోమొబైల్స్ రంగంలో పొంచి ఉన్న మాంద్యాన్ని తలపిస్తూ కలవరం కలగించింది. బిస్కెట్లకు డిమాండ్ పడిపోవడంతో పాటు ప్రభుత్వ విధానాలు కూడా సంక్షోభాన్ని మరింత పెంచి పోషించాయని సంస్థ పేర్కొంది. అతి తక్కువ ఖర్చు అయ్యే ఒక బిస్కెట్ పాకెట్ కొనడానికి కూడా ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారంటే దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం పొంచివున్నట్లే లెక్క. ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేయడం అంత కష్టమైన పనా అని ఎవరైనా అడగవచ్చు. కానీ ఇది నిజం. కానీ ఈ సంక్షోభం ఇంకా తీవ్రస్థాయిలో ఉందని వార్తలు వెల్లడిస్తున్నాయి. దేశంలో ప్రజల కొనుగోలు శక్తి ఎంతగా కుదించుకుపోయిందంటే, అతి తక్కువ ఖర్చు అయ్యే ఉత్పత్తులను కొనడానికి కూడా వారు సంసిద్ధంగా లేరు. భారత్ ఆర్థిక మాంద్యం వైపుగా పయనిస్తోందని దీనర్థం. అంతకు మించి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలోకూడా ఎవరికీ తెలీనట్లు కనిపిస్తోంది. బిస్కెట్ని కారుతో పోల్చి చూడలేం. ఎందుకంటే కారును ఒకసారి మాత్రమే కొనగలం. దాన్ని మళ్లీ మళ్లీ మార్చలేం. తిరిగి కొనలేం. కానీ బిస్కెట్లను మాత్రం వినియోగదారులు నిత్యం కొంటుంటారు. వారానికి పలుమార్లు కొంటుంటారు. ఒకేసారి లక్షల విలువైన వస్తువును కొనాలంటే ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ కేవలం 5 రూపాయల విలువైన బిస్కెట్ ప్యాకెట్ను కొనడానికి కూడా ప్రజలు వెనకాముందూ ఆలోచిస్తున్నారంటేనే ఆర్థిక సంక్షోభం తీవ్రమైందనే అర్థం. దేశంలో అతి మారుమూల ప్రాంతాల్లో కూడా పార్లే జి బిస్కెట్లు అందుబాటులో లేని ప్రాంతం అంటూ లేదని ఆ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకప్పుడు నాకు చెప్పి ఉన్నారు. ఆయన తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా హిమాలయాల్లోని అతి మారుమూల ప్రాంతాలను, సాధారణంగా ఎక్కడానికి వీల్లేని కొండ మార్గాల్లోని అతి చిన్న గుడిసెలను కూడా సందర్శించేవారు. అక్కడ సైతం ఆయనకు తమ కంపెనీ బిస్కెట్లు ఉన్న ఒక షాప్ అయినా కనిపించేది. అది తమ సంస్థ కున్న సమర్థమైన పంపిణీ యంత్రాంగం మాత్రమే కాదని, పార్లే జి బిస్కెట్లకు డిమాండ్ ఉన్నందునే దుకాణదార్లు తమకుతాముగా వాటిని కొనడానికి ప్రయత్నించేవారని ఆయన చెప్పారు. ఒక బిస్కెట్ అనేక అవసరాలను నెరవేరుస్తుందని ఆ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయం. ఉదయాన్నే వేడి టీ తాగుతూ బిస్కెట్ని తినడంతో రోజు మొదలవుతుంది. పిల్లల లంచ్ బాక్సుల్లో అది స్నాక్గా ఇమిడిపోతుంది. వేళకు భోజనం ఆరగించలేనప్పుడు ఆకలిని చంపుకోవడానికి బిస్కెట్ తిని సరిపెట్టుకుంటుంటారు. అలాగే శ్రమజీవికి బిస్కెట్ లోని తియ్యదనం ప్రాణం పోస్తుంటుంది. అన్నిటికంటే మించి బిస్కెట్ చాలా చౌక వస్తువు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పార్లే జి బిస్కెట్ ధర యథాతథంగా ఉండటం కంపెనీ పాటించే వ్యాపార సూత్రమని ఆయన చెప్పారు. కొన్ని రకాల బిస్కెట్ల ధరలు కాస్త పెరుగుతున్నప్పటికీ ప్రారంభ స్థాయిలో సగటు బిస్కెట్ ధరలు పెరగకుండా కంపెనీ జాగ్రత్తపడేది. పాకెట్ సైజులను మార్చడం, ఇతర పద్ధతులను అవలంబించడం ద్వారా ధర మాత్రం పెరగకుండా చూసుకునేవారు. పన్నులు ఏవైనా ఉంటే వాటిని చివరగా బిస్కెట్ పాకెట్ ధరకు జోడించేవారు. మరిన్ని డబ్బులు వెచ్చించి కొనడానికి శక్తిలేని కొనుగోలు దారుకు బిస్కెట్ అతి సరసమైన ధరకే లభిస్తూ ఉంటుంది. ప్రతి దినం నిత్యావసర వస్తువులన్నింటి ధరలు పెరుగుతున్నా బిస్కెట్ ధర మాత్రం స్థిరంగా నిలిచి ఉంటుంది. కంపెనీ అప్పీల్కి అది అదనపు జోడింపుగా ఉండేది. ఒక వస్తువుకు బ్రాండ్ని సృష్టించే అంశాలు చాలా ఉంటాయి. వాటిలో నాణ్యత ఒకటయితే, విశ్వసనీయత మరొకటి. ఇప్పుడు దాని పట్ల వ్యామోహం కూడా ఒక బ్రాండ్ స్థాయికి చేరుకోవడం విశేషం. మార్కెట్లో ట్రెండ్లకు అనుగుణంగా మార్పులు చేస్తున్న కంపెనీ తమ ఉత్పత్తిని వినియోగదారులు గుర్తుపెట్టుకోవడానికి గానూ పార్లే జి బిస్కెట్ పట్ల వారికి గతంనుంచి కొనసాగుతున్న వ్యామోహంపైనే ప్రధానంగా ఆధారపడుతోంది. అయితే మార్కెట్లో పోటీ కారణంగా అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ పార్లే జి కంపెనీ మాత్రం సంవత్సరాలుగా తన ఆధిపత్య స్థానాన్ని పదిలపర్చుకోవడమే కాకుండా విస్తరించుకుంటూ వచ్చేది. ప్రజల అభిరుచులు దాని స్థానాన్ని దెబ్బతీయని చోట ప్రభుత్వ విధానాలు ఇప్పుడు దెబ్బతీస్తున్నాయి. బిస్కెట్లపై జీఎస్టీ విధింపు వల్ల ధరలు పెరిగాయి. పైగా పెరుగుతున్న నిరుద్యోగం, ఉద్యోగాలు కోల్పోవడం, భవిష్యత్తు నిరాశాజనకంగా కనిపించడం వంటి కారణాలతో ఒక చిన్న బిస్కెట్ పాకెట్ను కొనడం కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్నదిగా వినియోగదార్లకు భారమవుతూ వస్తోంది. దేశంలో ఒకపూట భోజనం చేయడానికి డబ్బులు లేని వారు కూడా ఒక కప్పు టీ, దాంతోపాటు ఒకటి లేక రెండు బిస్కెట్లను తినడానికి పూనుకుంటారు. రోజు కూలీకి లేక కాంట్రాక్ట్ లేబర్కి ప్రతి రూపాయి లెక్కే మరి. ఈరోజు వారికి పని దొరక్కపోవచ్చు, రేపు కూలీ ఉండకపోవచ్చు. నెలవారీగా వేతనాలు పుచ్చుకునే ఉద్యోగులకు కూడా మరికొన్ని నెలలు తమ ఉద్యోగం ఉంటుందనే గ్యారంటీ లేదు. ఆటో మొబైల్ రంగాలకు మీడియా విపరీత ప్రాధాన్యం ఇచ్చి కథనాలు రాస్తూండవచ్చు కానీ, చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీలన్నీ మీడియా కంటికి కనిపించకుండానే అనేక మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తుండటం పరిపాటిగా మారింది. ఉదాహరణకు, జెట్ ఎయిర్వేస్ సంస్థ కుప్పకూలిపోయినప్పుడు వేలాదిమంది అత్యంత నిపుణులైన, కఠినశ్రమకు ఓర్చుకోగల వృత్తి జీవులు రాత్రికి రాత్రే నిరుద్యోగులుగా మారిపోయారు. ఇంటి అద్దె, స్కూల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే వారు సెలవుల్లో ఎక్కడికైనా విహారానికి వెళ్లాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. ఇదే పరిస్థితి నిర్మాణరంగంలో ఉన్న కార్మికులకు కూడా వర్తిస్తుంది. భవన నిర్మాణ పనులు లేని పరిస్థితుల్లో ఒక పాకెట్ బిస్కెట్ కొనడానికి కూడా వీరికి గగనమవుతూ ఉంటుంది. తమ వ్యాపారం సజావుగా సాగించేందుకు ఏదైనా ఉపశమన చర్యలు కల్పించాలని పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతుంటాయి. కాస్త కష్టం తగలగానే వ్యాపారసంస్థలు కేవలం చాపల్యం తోనే అలా వాదిస్తుంటాయని, పరిశ్రమవర్గాలు చీటికీమాటికీ ప్రభుత్వ సహాయాన్ని కోరకూడదని స్వేచ్ఛా మార్కెట్ ఆర్థికవేత్తలు వాదిస్తున్నప్పటికీ పరిశ్రమ డిమాండును అర్థం చేసుకోవలసిందే. వ్యాపారంలో మీకు మీరుగా ఎదగాల్సిందే తప్ప ప్రతిదానికి నాన్నా, నాన్నా అంటూ అడిగే చిన్నపిల్లల్లా వ్యవహరించ కూడదని ప్రభుత్వ ఆర్థిక సలహాదార్లు వ్యాపారస్తులకు చెబుతుంటారు. కానీ వాస్తవమేమిటంటే, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత నిరాశాపూరితమైన పరిస్థితిని ప్రభుత్వం తప్పక పట్టించుకోవలిసి ఉంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు తమకు ఎదురవుతున్న సంక్షోభాన్ని ఉద్యోగుల తొలగింపు, లేక వారి సంఖ్య తగ్గింపువంటి చర్యలద్వారా అధిగమించవచ్చు. కానీ బడుగుజీవులకు మాత్రం ఎలాంటి రక్షణ కవచమూ లేదు. ఒకదశలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వంటి పథకాలు బాగా అమలైన రోజుల్లో దేశంలోని నిరుద్యోగులందరికీ ఎంతో కొంత ఆదాయం లభించేది. వారికి పని, వేతనం దొరికి కాస్త గౌరవ లభించేది కూడా. పట్టణాల్లోకి వలసపోయిన వారు కూడా ఈ జాతీయ ఉపాధి పథకం పట్ల ఆకర్షితులై తమతమ గ్రామాలకు వెళ్లిపోవడంతో పారిశ్రామిక, కాంట్రాక్టు వేతనాలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఇది పూర్తిగా తల్లకిందులైంది. రానున్న కొద్ది సంవత్సరాల్లో 5 లక్షల కోట్ల డాలర్ల విలువకు ఆర్థిక వ్యవస్థను తీసుకుపోవడం అనేది ప్రభుత్వం నుంచి అందమైన ప్రకటనగా మిగిలిపోవచ్చు కానీ దేశం అంతర్జాతీయ శక్తిగా వెలిగేందుకు మదుపులను ఎలా అందిస్తుందనేది పరిశ్రమవర్గాలకు అంతుబట్టడం లేదు. ఇక వేతనజీవికి తన నెలవారీ ఈఎంఐలు ఎలా చెల్లించాలన్నిది భారంగా మిగులుతోంది. ఇక రోజు కూలీకి కనీసం కుటుంబానికి బిస్కెట్ ప్యాకెట్ కొనడానికైనా పని దొరుకుతుందా అనేది వేదనగా మిగిలింది. మాంద్య పరిస్థితుల్లో ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ ప్రారంభాన్ని కనిపెట్టే ‘అండర్వేర్ ఇండెక్స్’ గురించి ఆర్థికవేత్తలు మాట్లాడుతుంటారు కానీ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని సూచించే ‘బిస్కెట్ ఇండెక్స్’ రంగంలోకి వచ్చింది. పారిశ్రామిక వేత్తల అభ్యర్థనలను ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు కానీ బిస్కెట్ల అమ్మకాల పతనం గురించి వార్తలు ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి. సిద్ధార్థ్ భాటియా (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, ద వైర్ సౌజన్యంతో) -
పార్లేలో 10 వేల ఉద్యోగాలకు ఎసరు
ముంబై: అమ్మకాలు పడిపోతుండటంతో వివిధ రంగాల సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే కూడా ఈ జాబితాలో చేరనుంది. స్థూల ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడంతో వచ్చే ఏడాది కాలంలో సుమారు 10,000 మంది దాకా ఉద్యోగులను తొలగించాల్సి రావొచ్చని పార్లే ప్రోడక్ట్స్ విభాగం హెడ్ మయాంక్ షా తెలిపారు. సామాన్యుల కోసం ఉద్దేశించిన చౌక ఉత్పత్తులపై కూడా అధిక స్థాయిలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధింపు, డిమాండ్ మందగమనం వంటి అంశాలు ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. పార్లేకు సొంతంగా 10 తయారీ యూనిట్లు ఉండగా, థర్డ్ పార్టీ తయారీ సంస్థలు 125 దాకా ఉన్నాయి. బిస్కెట్ తయారీతో పాటు ఇతర వ్యాపార విభాగాల్లో పార్లేలో ప్రస్తుతం లక్ష మంది పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ‘ఇప్పటికైతే ఉద్యోగులెవరినీ తొలగించలేదు. కానీ పరిస్థితులు మెరుగుపడకపోతే ఈ చర్యలు తీసుకోవాల్సి రావొచ్చు’ అని మయాంక్ షా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ విక్రయ పరిమాణం ఉండే చౌక ఉత్పత్తుల అమ్మకాలు 7–8 శాతం పడిపోగా, తక్కువ విక్రయ పరిమాణం.. అధిక ధర ఉండే ఉత్పత్తుల అమ్మకాలు 8–9 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. మొత్తం మీద బిస్కెట్ల విభాగం అమ్మకాల వృద్ధి గతంలో రెండంకెల స్థాయిలో ఉండేదని.. ప్రస్తుతం 2.5 శాతానికి పడిపోయిందని షా పేర్కొన్నారు. చౌక ఉత్పత్తుల విభాగం మొత్తం బిస్కెట్ల వ్యాపారంలో నాలుగో వంతే ఉన్నప్పటికీ.. అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయాల్సినందున ఇందులో ఎక్కువ మంది సిబ్బంది ఉంటారని షా చెప్పారు. గతంలో కేజీకి రూ. 100 లోపు ధర ఉండే బిస్కెట్లకు ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపు ఉండేదని ఆయన తెలిపారు. అయితే, 2017లో బిస్కెట్లను కూడా 18 శాతం జీఎస్టీ శ్లాబులో చేర్చినప్పట్నుంచీ పరిశ్రమకు సమస్యలు ప్రారంభమయ్యాయని షా చెప్పారు. అధిక జీఎస్టీ కారణంగా చౌక ఉత్పత్తుల రేట్లను కూడా తాము పెంచాల్సి వచ్చిందని, దీంతో డిమాండ్ పడిపోయిందని ఆయన తెలిపారు. జీఎస్టీపరమైన సమస్యలు సరిదిద్దాలంటూ పరిశ్రమ కోరుతున్నప్పటికీ .. ఇప్పటి వరకూ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. అయితే, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
పార్లే జీ బిస్కట్ల ఫ్యాక్టరీ మూసివేత
ముంబై: ముంబైలోని ప్రముఖ బిస్కట్ల తయారీసంస్థ పార్లే ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఓ ఫ్యాక్టరీ మూతపడింది. అది కూడా అక్కడిది, ఇక్కడిది కాదు.. పార్లే పేరుమీదే ముంబైలో ఉన్న ప్రముఖ జంక్షన్ విల్లెపార్లె ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ. ఇది 87 సంవత్సరాల నాటిది. విశేష ఆదరణ పొందిన ఈ ఫ్యాక్టరీ గేట్లు మూతపడ్డాయి. తక్కువ ఉత్పాదకత కారణంగా ఫ్యాక్టరీని మూసివేసిందని మిడ్-డే నివేదించింది. గత కొన్నేళ్లుగా ఉత్పత్తిని నిలిపివేసిన సంస్థ యజమానులు చివరకు దాని తలుపులు మూసేశారు. అయితే ఈ ఒక్క ఫ్యాక్టరీ మూసివేతతో పార్లే బిస్కట్ల ఉత్పత్తి మొత్తం ఆగిపోదు. ఈ సంస్థకు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో ఇంకా చాలా ఫ్యాక్టరీలున్నాయి. వాటి నుంచి పార్లే జీ బిస్కట్లు వస్తాయి. కేవలం ముంబై విలె పార్లె ప్రాంతంలో ఉన్న అత్యంత పాత ఫ్యాక్టరీ ఒక్కదాన్ని మాత్రమే పార్లే సంస్థ మూసేసింది. కానీ ఈ వార్తతో ట్విట్టర్ సందేశాలు వెల్లువెత్తాయి. ముంబై లోకల్ రైల్లో ప్రయాణించే సమయంలో విలే పార్లే ప్రాంతంలే వచ్చే అద్భుతమైన అరోమా పరిమళాలు ఇక లేనట్టేనా... పార్లే ఫ్యాక్టరీ లేని విల్లే పార్లే లేదు.. మూసివేసింది ఫ్యాక్టరీనే కానీ.. ఉత్పత్తుల్ని కాదంటూ భిన్న స్పందనలొచ్చాయి. కాగా 1929లో విలే పార్లేలో ఈ ఐకానిక్ పార్లే కంపెనీ తన ఉత్పత్తులను ప్రారంభించింది. శక్తినిచ్చే ప్రత్యేక గ్లూకోజ్ బిస్కట్లతో అప్రతిహతంగా దూసుకుపోయింది. పిల్లలు, పెద్దలు, అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. క్రికెట్ రారాజు సునీల్ గవాస్కర్ ఇటీవల 67వ వసంతంలోకి అడుగుపెట్టిన తరుణంలో పార్లే జీ గ్లూకోజ్ బిస్కెట్స్ అంటే గవాస్కర్ కు అత్యంత ఇష్టమని ఆయన సోదరి నూతన్ గవాస్కర్ చెప్పడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. పార్లే గ్లూకోజ్ బిస్కట్స్, కుకీస్ అంటే ఒకపుడు భారతదేశంలో అంతటి క్రేజ్ ఉండేది. #Mumbai’s Vile Parle factory, which gave us ‘iconic’ #ParleG bicsuits, shuts down pic.twitter.com/aE56UMJz7U — Amam Shah (@amamsshah) July 30, 2016 Vile Parle is just vile without Parle. #ParleG — Mild Sunshine (@RichPurelyRich) July 28, 2016
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement