breaking news
Park zone
-
పార్కులో కూర్చుంటే జరిమానా
సాక్షి, కృష్ణరాజపురం: మా సేవలు ఊరికే రావు. ప్రజలకు భద్రత కల్పించాలంటే.. చాలా ఖర్చవుతుంది అన్నట్టుగా ఉంది కొందరు ఖాకీల వ్యవహారశైలి. వారి వల్ల నిజాయతీగా పనిచేసేవారిని కూడా అనుమానంతో చూసే పరిస్థితి నెలకొంది. ఐటీ సిటీలో సంపిగెహళ్లి, ఆడుగోడి పోలీసులు ప్రజల నుంచి డబ్బు తీసుకోవడం రచ్చ కావడం మరిచిపోకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. ఉద్యానవనంలో కూర్చుని ఉన్న స్నేహితులను ఓ కానిస్టేబుల్ బెదిరించి వారి వద్ద నుంచి రూ. 1000 వసూలు చేశాడు. ఫొటోలు తీసి, డబ్బు ఇవ్వాలని.. వివరాలు.. జనవరి 29వ తేదీన నగరంలోని వైట్ఫీల్డ్ వద్ద కుందళహళ్లిలో ఉన్న ఉద్యానవనంలో ఆర్ష లతీఫ్ అనే యువతి, స్నేహితునితో కూర్చుని ఉంది. కులాసాగా మాట్లాడుకుంటూ ఉండగా ఒక కానిస్టేబుల్ వచ్చి వారిని తన మొబైల్తో ఫొటోలు తీయసాగాడు. ఇక్కడ పార్కులో ఏం చేస్తున్నారు?, ఇక్కడ ఉండడానికి అనుమతి లేదు అని వారిని గదమాయించాడు. తాము ఏమీ చేయడం లేదని, ఊరికే కూర్చుని ఉన్నామని చెప్పారు. పార్క్లో కూర్చోడానికి కూడా పర్మిషన్ కావాలా? అని యువతీ యువకుడు అడిగారు. దాంతో కానిస్టేబుల్.. ఏమిటీ రూల్స్ మాట్లాడుతున్నారు? రండి స్టేషన్కు వెళదాము, అక్కడ అన్నీ బయటకి వస్తాయని బెదిరించారు. ఇక్కడే అయితే రూ. వెయ్యి జరిమానా కట్టి వెళ్లిపోండి. స్టేషన్కు వస్తే మీకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించి, వారి వద్ద నుంచి రూ . వెయ్యి ఫోన్ పే ద్వారా వేయించుకున్నాడు. తరువాత తమ బాధాకర అనుభవం ఇదీ యువతి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ బాగోతంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు పోలీస్పై చర్యలు తీసుకోవాలని కోరారు. (చదవండి: వధువు కావాలా.. నాయనా?) -
ఉద్యాన జోన్గా ...
సాక్షి, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ ప్రజల అవసరాలను తీర్చేందుకు కొత్త ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను ఉద్యాన జోన్గా వృద్ధి చేయాలని భావిస్తోంది. నగరజీవికి కావాల్సిన కూరగాయలు, పండ్లు, పాలు, పూలతోపాటు ఇతరాలను జిల్లా నుంచే సమకూర్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళిక సైతం తయారవుతోంది. మహానగరం చుట్టూ 60 కిలోమీటర్ల మేర ఉద్యాన, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలని గతవారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశం లో నిర్ణయించారు. దీంతో నగరవాసుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు పెంచేందు కు ఉద్యాన, పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తుండడంతో ఉద్యాన రైతులకు త్వరలో మంచిరోజులు రానున్నాయి. ఆశయం పాతదైనా.. ఆచరణ కొత్తగా.. వాస్తవానికి జిల్లాలో వేలాది ఎకరాల్లో పరిశ్రమలు పెట్టడంతో వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. దీంతో ప్రత్యేక అగ్రికల్చర్ జోన్ ఏర్పాటుచేసి రైతులకు ఉపాధి కల్పించాలని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఈ మహత్తర ఆశయం అటకెక్కింది. తాజాగా కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం.. హైదరాబాద్ అవసరాల దృష్ట్యా మళ్లీ ఈ ఆశయం తెరపైకొచ్చింది. ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో.. తాజాగా ఉద్యాన జోన్ ఏర్పాటుకు యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘పొరుగు’ ఉత్పత్తుల దిగుమతిని తగ్గించేందుకు.. హైదరాబాద్ మహానగరానికి అవసరమైన కూరగాయలు, పండ్లు, పూలతోపాటు పాల ఉత్పత్తులన్నీ ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్నుల భారంతో వినియోగదారులు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది. తాజాగా వీటిని చవకగా అందించేందుకు ప్రస్తుత సర్కారు చర్యలు చేపట్టింది. స్థానిక ఉత్పత్తులపై పెద్దగా పన్ను భారం ఉండకపోవడంతోపాటు ఇక్కడి రైతులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఈ జోన్ ఉపకరిస్తుందని భావిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 12వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులేవీ లేకపోవడంతో రైతులు ఎక్కువగా మెట్ట పంటలు, ఉద్యాన పంటల్నే సాగుచేస్తున్నారు. ఈ పంటలకు జిల్లా పరిధిలోని నేలలు అనువైనవి కూడా. భారీ రాయితీలతో ఏర్పాటుచేసే ఈ జోన్ కింద జిల్లాలో కనిష్టంగా 50వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని గత వారం జరిగిన సమావేశంలో ఉద్యాన శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్రెడ్డి గతవారం చేవెళ్ల మండలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటల తీరును పరిశీలించి వెళ్లారు.