-
ఆయిల్ పామ్ సాగుతో అందివచ్చే లాభాలు
-
అధిక దిగుబడికి..ఎత్తుమడుల పద్ధతి
-
మీకిది సబబేనా సారూ!
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ఫెడ్– సర్కారుకు మధ్య వివాదం తలెత్తింది. ఆయిల్పాం నోటిఫై ఏరియాను ప్రైవేటుకు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్కారుకే ఆయిల్ఫెడ్ లేఖ రాయడం సంచలనం రేపుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే సహకార సంస్థ... ప్రభుత్వ నిర్ణయాన్నే సవాల్ చేయడం గమనార్హం. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆయిల్ఫెడ్ చేతిలోనే ఉన్న ఆయిల్పాం సాగు, కొత్త ఏరియాల్లో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడంతో వివాదం మొదలైంది. రాష్ట్రంలో కొత్తగా 25 జిల్లాల్లో 8,24,162 ఎకరాలు ఆయిల్పాం సాగుకు అనువైన ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అందులో దాదాపు 8 లక్షల ఎకరాలను 13 ప్రైవేటు కంపెనీల పరిధిలోకి తీసుకురావడం, ఆయిల్ఫెడ్కు కేవలం 24,500 ఎకరాలు (2.97 శాతం) కేటాయిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్థన్రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీచేయడం... ఆయిల్ఫెడ్ అధికారులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీనిపై ఆయిల్ఫెడ్ నేరుగా ప్రభుత్వానికే లేఖాస్త్రం సంధించడం కలకలం రేపుతోంది. ఆయిల్ఫెడ్ అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 3.07 లక్షల ఎకరాలకు దరఖాస్తు చేస్తే ‘కేంద్రం 25 జిల్లాల్లో 8.24 లక్షల ఎకరాలను నోటిఫై చేసింది. అందులో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో 99,985 ఎకరాలు, గద్వాల, మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూలు, వనపర్తి జిల్లాల్లో 50 వేల ఎకరాలు, మంచిర్యాల, కొమురంభీం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో 1.57 లక్షల ఎకరాలు మాకు కేటాయించాలని కోరాం. మొత్తంగా 12 జిల్లాల్లో 3.07 లక్షల ఎకరాలు కోరుతూ ఉద్యానశాఖకు దరఖాస్తు చేశాం. కానీ ప్రభుత్వం 22 జిల్లాల్లోని 7,99,662 ఎకరాలను 13 ప్రైవేట్ కంపెనీలకు కేటాయించింది. ఆయిల్ఫెడ్కు మాత్రం కేవలం 24,500 ఎకరాలే ఇచ్చింది’అని ఆయిల్ఫెడ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. అందులో గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కొత్తగా 20 వేల ఎకరాలు కేటాయించగా, ఇప్పటికే తమ పరిధిలోని కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 4,500 ఎకరాలు కేటాయించినట్లు పేర్కొంది. 1993 నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 41,232 ఎకరాలు ఆయిల్ఫెడ్ పరిధిలో ఉందని, అందుకోసం రెండు అధునాతన ఫ్యాక్టరీలను నెలకొల్పామని పేర్కొంది. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా, ఇప్పటికే తమ పరిధిలో ఉన్న ఆయిల్పాంను కూడా ప్రైవేటుకు కేటాయించడంపై విస్మయం వ్యక్తం చేసింది. కోట్లు ఖర్చుచేస్తే ప్రైవేటుకు ఇవ్వడమేంటి? ఈ ఏడాది జనవరిలో పూర్వ మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆయిల్పాం సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో పైలెట్ ప్రాజెక్టు కింద నర్సరీలు చేపేట్టేందుకు ఆయిల్ఫెడ్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2020–21లో గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలో, మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోనూ ఆయిల్పాం నర్సరీని ఆయిల్ఫెడ్ నెలకొల్పింది. ఈ రెండింటి పరిధిలో 7 వేల ఎకరాలు కేటాయించారు. అందుకోసం ఆయిల్ఫెడ్ రూ. 6 కోట్లు కూడా కేటాయించింది. ఇంతటి కృషిచేస్తే గద్వాల, నారాయణపేట జిల్లాలను మినహా మిగిలిన ఏరియాలను ఆయిల్ఫెడ్కు బదులు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం ఏమాత్రం సమంజసం కాదని లేఖలో ఆయిల్ఫెడ్ పేర్కొంది. 30 ఏళ్ల అనుభవం ఉన్న ఆయిల్ఫెడ్కు అన్యాయం జరిగిందని తెలిపింది. కాబట్టి ఇప్పటికైనా 15 శాతం ఆయిల్పాం నోటిఫై ఏరియాను తమకు కేటాయించాలని విన్నవించింది. నేను కూడా లేఖ రాస్తా: కంచర్ల రామకృష్ణారెడ్డి, ఛైర్మన్, ఆయిల్ఫెడ్ అనుకున్నంత ఏరియా ఆయిల్ఫెడ్కు రాలేదనేదే నా ఆవేదన. రైతులకు న్యాయం జరగాలంటే అన్ని ప్రాంతాల్లోనూ ఆయిల్ఫెడ్కు కొంతమేరకు ఆయిల్పాం సాగు పరిధిని పెంచాలి. ఈ విషయంపై ఇప్పటికే ఆయిల్ఫెడ్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖ రాసింది. నేను కూడా లేఖ రాస్తాను. అవసరమైతే సీఎంకు విన్నవిస్తాను. -
చౌడు భూమిలో ఎడారి పంట
♦ ఖర్జూరం సాగులో రాణిస్తున్న నల్లగొండ జిల్లా రైతు ♦ పంట చేతికొచ్చిన తొలి ఏడాదే ఎకరాకు రూ. 2 లక్షల ఆదాయం ముళ్ల చెట్లు పెరిగిన చౌడు భూమిలో ఎడారి పంటగా పేరు పొందిన ఖర్జూరను సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారు బండారి వెంకట నారాయణ. నల్లగొండ జిల్లా.. నల్లగొండ రూరల్ మండలం నర్సింగ్ బట్ల ఆయన స్వగ్రామం. 2011లో రెండెకరాల చౌడు భూమిని కొనుగోలు చేశారు. అందులో ఉన్న ముళ్ల చెట్లను తొలగించి సాగు యోగ్యంగా మార్చారు. చౌడు భూమిలో సాగు చేసేందుకు అనువైన పంటల కోసం అన్వేషించే క్రమంలో ఈ భూమిలో ఈత చెట్లు ఎక్కువగా ఉండటాన్ని గమనించి ఖర్జూరను సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని ఆయన భావించారు. మొక్క ధర రూ. 3 వేలు దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్న టిష్యూకల్చర్ ఖర్జూర మొక్కలను గుజరాత్ నర్సరీల్లో పెంచుతున్నారు. వెంకట నారాయణ గుజరాత్ వెళ్లి ఖర్జూర నర్సరీలను పరిశీలించారు. ఒక్కో ఖర్జూర మొక్క రూ. 3100 చొప్పున కొనుగోలు చేశారు. ఒక్కో మొక్కకు రవాణాకు రూ. 400 వరకు ఖర్చయింది. 2012 మార్చిలో రెండడుగుల గుంతలు తీసి మొక్కలు నాటుకున్నారు. చౌడు భూమి కావటంతో గుంతల్లో ఎర్రమట్టి పోశారు. పాదుల మధ్య 25 అడుగుల ఎడం ఉండేలా ఎకరాకు 60–70 మొక్కలు నాటుకున్నారు. బోరు నీటిని డ్రిప్పు ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. పరపరాగ సంపర్కం జరిగేందుకు ఎకరాకు 5 మగ ఖర్జూర చెట్లను నాటారు. వీటి నుంచి వచ్చే కాయలను సేకరించి పొడిగా చేస్తారు. ఈ పొడిని ఎకరంలోని ఆడ ఖర్జూర చెట్లకు వచ్చే గెలలపై చల్లుతారు. అయితే మగ చెట్లు 5 ఏళ్ల వయసులోనే గెలలు వేస్తాయి. దీంతో తొలి ఏడాది గుజరాత్ నుంచి పౌడర్ కొనుగోలు చేసి వాడారు. దీని ధర కిలో రూ. 10 వేలు. ఎకరాకు అరకిలో పౌడర్ సరిపోతుంది. ఖర్జూర చెట్ల నుంచి కల్లును సేకరించవచ్చు కానీ మొక్కల జీవిత కాలం తగ్గుతుంది. సాగు ఖర్చులు ఏడాదికి ఎకరాకు రూ. 10 వేలు ఏడాదికి ఐదు సార్లు ఎరువులు వేశారు. శిలీంద్రాలు, కుమ్మ పురుగు ఆశించకుండా పురుగు మందులు, తెగుళ్ల మందులు నెలకోసారి పిచికారీ చేశారు. వీటన్నింటికి ఏడాదికి ఎకరాకు రూ. 10 వేల వరకు ఖర్చయింది. చిలకలు, ఉడుతలు కాయలను తినకుండా గెలలకు ఉల్లి సంచులను కట్టారు. పంట చేతికొచ్చేవరకు ఎకరాకు రూ. 2.50 లక్షల ఖర్చయిందని నారాయణ తెలిపారు. 2016 మార్చిలో చెట్లకు పూత వచ్చింది. జూలైలో దిగుబడి వచ్చింది. తొలి ఏడాది 40 చెట్లకు మాత్రమే పంట వచ్చింది. చెట్టుకు 20 కిలోల చొప్పున దిగుబడి తీశారు. మార్కెట్లో ధర తక్కువగా లభిస్తుండటంతో కిలో రూ. 150 చొప్పున ఇంటివద్దనే విక్రయించారు. తొలి ఏడాది 14 క్వింటాళ్లకు రూ. 2 లక్షల ఆదాయం లభించింది. ఎండు ఖర్జూరంగా మార్చటానికి ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులో లేకపోవటం వల్ల కోసిన నాలుగు ఐదు రోజుల్లో పంటను అమ్ముకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడే విక్రయించారు. ఈ ఏడాది జూలైలో మళ్లీ పంట చేతికొస్తుంది. ఈసారి అన్ని చెట్ల నుంచి పంట రావటంతో పాటు దిగుబడి పెరుగుతుందని వెంకట నారాయణ తెలిపారు. 10 ఏళ్లు తిరిగేసరికి చెట్టుకు క్వింటాన్నర దిగుబడి వస్తుందన్నారు. – కుంభం వెంకటేశ్వర్లు గౌడ్, సాక్షి, నల్లగొండ రూరల్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement