breaking news
over load problem
-
Anand Mahindra: ఇంజనీర్లు.. కాస్త మన అవసరాలు గుర్తించండయ్యా!
కార్పొరేట్ ప్రపంచంలో క్షణం తీరిక లేకుండా ఉన్నా.. దేశంలో క్షేత్రస్థాయిలో జరిగే అంశాలపై దృష్టి పెట్టే ఇండస్ట్రియలిస్టులో ఆనంద్ మహీంద్రా ఒకరు. సోషల్ మీడియాలో అంశాలను గమనిస్తూ.. సీరియస్ అంశాలపై రెగ్యులర్గా స్పందిస్తుంటారు. తాజాగా తన కంపెనీపైనే ఆయన సెటైర్ వేశారు. అదే సమయంలో ఓ సీరియస్ అంశాన్ని ట్విట్టర్ వేదికగా లేవనెత్తారు. ఆనంద్ మహీంద్రా తాజాగా షేర్ చేసిన వీడియోలో ఓవర్ లోడ్తో ఉన్న ఓ వాహానం దాదాపుగా అదుపు తప్పి పోతుంది. ముందు టైర్లు గాలిలో లేవగా అక్కడున్న ఇద్దరు ప్రమాదపుటంచుల వరకు వెళ్లారు. చివరకు ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. ఈ వీడియోను చూస్తే వ్యవసాయ ఉత్పత్తులు ఓవర్ లోడ్ చేయడం వల్ల ట్రక్కుకి ఆ పరిస్థితి తలెత్తిందనే విషయం అర్థం అవుతుంది. కానీ ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను మరో కోణంలో చూశారు. The Auto Industry uses “Quality Function Deployment” (QFD) a structured approach to defining customer needs & translating them into specs of products to meet those needs. I don’t believe our engineers took these ‘needs’ into account when designing this Mahindra Supro Truck! 🙄 pic.twitter.com/CHGHj0Xwtz — anand mahindra (@anandmahindra) February 4, 2022 మన దేశీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాహనాలను డిజైన్ చేయాలంటూ ఇంజనీర్లకు సలహా ఇచ్చారు. మన దగ్గర ఎక్కువ వినియోగం/ డిమాండ్లో ఉండే వాహనాలు అన్నీ ఓవర్లోడ్తో వెళ్తుంటాయి. ముఖ్యంగా రూరల్ ఇండియాలో ఈ తరహా దృష్యాలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. ఈ ఓవర్లోడ్ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని సేఫ్టీగా వాహనాలను తయారు చేయాలంటూ ఇంజనీర్లకు సూచించారు. వాహనం డిజైన్లో కీలక అంశాలతో ఆదాయం తక్కువగా ఉండే రూరల్ ఇండియా అగ్రికల్చర్ సెక్టార్ని దానిపై ఆధారపడే వాళ్ల అవసరాలు కూడా కీలకమన్నట్టుగా ఆనంద్ స్పందించారు. తన కంపెనీ వాహనం అదుపు తప్పడం, కొందరు ప్రమాదంలో పడటం వంటి అంశాలను కప్పిపుచ్చకుండా.. గ్రామీణ భారతీయుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయాలంటూ ఆనంద్ మహీంద్రా సూచించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు వాహనం డిజైన్లో తప్పేమీ లేదని.. అంత ఓవర్ లోడ్ వేస్తే ఎలాగంటూ కామెంట్లు చేశారు. కాగా ఇండియన్ జుగాడ్కి సంబంధించి పలు వీడియోలు కూడా కొందరు పోస్ట్ చేశారు. చదవండి: Anand Mahindra : అగ్రికల్చర్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. ఇకపై వాటికి చెక్ -
అన్నదాతకు ఓవర్లోడ్
వీరంతా హుస్నాబాద్ మండలం ధర్మారం పంచాయతీ పరిధి ర్యాగటోనిపల్లి రైతులు. ఎస్ఎస్1 కింద 45 బావులు ఉండగా.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ మాత్రం 100 కేవీ. ఇప్పటికే మూడుసార్లు ఓవర్లోడ్తో కాలిపోయింది. అదనపు ట్రాన్స్ఫార్మర్కోసం రైతులు 22 రోజుల క్రితం రూ.62 వేల డీడీ తీసి స్థానిక అధికారులకు ఇచ్చారు. వారు ఎస్ఈకి ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలు పంపామని డీఈఈ చెప్పడంతో రైతులు ఎస్ఈ దగ్గరికి ఇప్పటికి మూడుసార్లు వెళ్లినా అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం అంటూ తిప్పుకుంటూ నేటికీ వారి ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు. దీంతో వారి పంటలు ఎండిపోతున్నారుు. హుస్నాబాద్, న్యూస్లైన్ : మెట్టప్రాంతమైన హుస్నాబాద్ను ఓవర్లోడ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నెల రోజులుగా రెండువందలకుపైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయూరుు. ఫలితం.. వేసిన పంటలు చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చేను పండించేందుకు సరిపడా నీళ్లున్నా... ఓవర్లోడ్ను తీర్చేందుకు అదనపు ట్రాన్స్ఫార్మర్లను బిగించే విషయంలో ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోతున్నాయి. రబీ సీజన్లో పంటలసాగు ఉధృతంగా సాగుతున్న తరుణంలో విద్యుత్ కష్టాలు రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి. 100 కేవీ ట్రాన్స్ఫార్మర్తో 5 హెచ్పీ మోటార్లు 20 నడుస్తారుు. ఒక్కో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్పై 40 నుంచి 50 వరకు విద్యుత్ మోటార్ల కనెక్షన్లు ఉండడంతో ఓవర్లోడ్ సమస్య తలెత్తుతోంది. దీంతో తరుచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటిస్థానంలో మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరగడం.. ఒకవేళ ఏర్పాటు చేసినా వెనువెంటనే కాలిపోతుండటంతో పొలాలకు నీరు అందించలేని పరిస్థితి నెలకొంది. హుస్నాబాద్, అంతకపేట, అక్కన్నపేట, జనగామ, మీర్జాపూర్, పందిల్ల, కేశ్వాపూర్, మహ్మదాపూర్ తదితర గ్రామాల్లో ఓవర్లోడ్ సమస్య వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు వంతులవారీగా విద్యుత్మోటార్లను ఉపయోగించుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. 150కి పైగా ప్రతిపాదనలు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయంటూ రైతులు అదనపు ట్రాన్స్ఫార్మర్లకోసం డీడీలు చెల్లిస్తున్నా మంజూరులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఒక్క హుస్నాబాద్ మండలంలో అదనపు ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 130, డివిజన్ పరిధిలో 150కిపైగా ప్రతిపాదనలు వె ళ్లారుు. మంజూరు మాత్రం 20 ఇచ్చారు. మిగతా వాటికోసం రైతులు ఎస్ఈ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అడిగేది 100, 60కేవీ.. ఇచ్చేది 25కేవీలు ఓవర్లోడ్ సమస్య అధిగమించేందుకు 100, 60 కేవీ ట్రాన్స్ఫార్మర్లు బిగించాల్సి ఉండగా.. ట్రాన్స్కో అధికారులు మాత్రం 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు ఇస్తున్నారు. వీటితో విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ప్రత్యేకంగా లైన్ల నిర్మాణం చేపట్టాల్సి వస్తుందని, పనుల జాప్యంతో పంటలు చేతికి వచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్కో ఉన్నతాధికారులు మాత్రం 25, 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఇస్తామని చెబుతున్నారు. ఓవర్లోడ్ తగ్గించేందుకు 100, 60 కేవీ ట్రాన్స్ఫార్మర్లను కేటాయించని పక్షంలో రబీ పంటలు చేతికి అందకుండా పోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తప్పిదమే అసలు కారణం వ్యవసాయానికి విద్యుత్ అందించేందుకు మూడేళ్ల క్రితం 25, 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లను అమర్చాలని ఉన్నతాధికారులు ఆదేశించినా హుస్నాబాద్ మండల అధికారులు అనుసరించిన నిర్లక్ష్యమే రైతులకు శాపంగా మారింది. మూడు బావులకు 16 కేవీ, ఐదు బావులకు 25 కేవీ చొప్పున విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మిగతా మండలాల్లో బిగించినా ఇక్కడ మాత్రం పట్టించుకోలేదు. దీంతో హుస్నాబాద్ మండలంలో రైతులు ఓవర్లోడ్ సమస్య ఎదుర్కోవాల్సి వ స్తోంది.