breaking news
Offensive behavior
-
మహిళల బాత్రూమ్లో యువకులు
►అసభ్యకరంగా ప్రవర్తించారంటూ దేహశుద్ధి చేసిన మహిళలు ►అర్థరాత్రి ఘటనపై కేసు నమోదు విశాఖపట్నం : నగరం నడిబొడ్డున ఉన్న చిత్రాలయ మల్టీప్లెక్స్లో సెకండ్ షో సినిమాకు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. అత్యధిక భద్రత ఉండే హై క్లాస్ మల్టీప్లెక్స్లో ఆడవాళ్ల బాత్ రూమ్లో కొందరు మధ్యప్రదేశ్ యువకులు దూరడం తీవ్ర దుమారం రేపుతోంది. కొందరు మహిళలు కూడా ఆ కుటుంబంతో పాటు బాధితులైనప్పటికీ పరువు కోసం ఆలోచించి వారెవరూ ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ సంఘటన ప్రాంతానికి వెళ్లిన పోలీసులు ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితులపై గురువారం కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ఓ జంట నగరంలో దుస్తుల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ అర్థరాత్రి సెకండ్ షో సినిమా చూసేందుకు చిత్రాలయ మల్టీప్లెక్స్కు వెళ్లారు. సినిమా పూర్తయిన తర్వాత ఆ జంటలోని మహిళ బాత్రూమ్కు వెళ్లింది. అయితే అప్పటికే లేడీస్ బాత్రూమ్లో ముగ్గురు యువకులు ఉన్నారు. వారిని గమనించిన యువతి భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగెత్తుకుని వచ్చేసింది. ఆమెతో పాటే బాత్రూమ్లోకి వెళ్లిన మరికొంతమంది మహిళలు కూడా పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరుగు తీశారు. విషయం తెలుసుకున్న మిగతావారు ఆ యువకులను పట్టుకున్నారు. ఆడవాళ్ల బాత్రూమ్లోకి వెళ్లిన ముగ్గురు యువకులతో పాటు, బాత్రూమ్ బయట ఉన్న వారి సంబంధీకులు మరో ముగ్గురికి దేహశుద్ధి చేశారు. ముగ్గురిపై కేసు : పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల నుంచి ప్రాథమిక సమాచారం తీసుకున్నారు. అయితే స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగితే పరువు పోతుందని మహిళలు అనడంతో వారిచ్చిన వివరాల మేరకు మహరాణిపేట పోలీస్ స్టేషన్ సీఐ వెంకట నారాయణ కేసు నమోదు చేశారు. నిందితులు మధ్యప్రదేశ్కు చెందిన అబ్దుల్లా, దినేష్, మహ్మద్ అన్వర్లుగా గుర్తించామని, వారు నగర వీధుల్లో దుస్తులు విక్రయిస్తుంటారని సీఐ తెలిపారు. కాగా మహిళల బాత్రూమ్లో దూరి వారిని అసభ్యకరంగా సెల్ఫోన్లో చిత్రీకరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాటిని సీఐ కొట్టిపడేస్తున్నారు. అలాంటివేమీ జరగలేదని, ఆ యువకులు తెలియక లేడీస్ బాత్రూమ్కి వెళ్లారని ఆయన అంటున్నారు. -
కీచక గురువుకు దేహశుద్ధి
గదిలో బంధించిన విద్యార్థినుల తల్లిదండ్రులు కోటవురట్ల: తల్లిలా ప్రేమను పంచుతూ...తండ్రిలా విద్యాబుద్ధులు నేర్పుతూ కంటికిరెప్పలా కాపాడవలసిన టీచర్లే కాటేయడానికి ప్రయత్నిస్తుండడంతో పిల్లలు తల్లడిల్లిపోతున్నారు. ఇటీవల నక్కపల్లి మండలంలో జరిగిన దుశ్చర్యను మరవకముందే పాములవాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయుడు బరితెగించాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు అతనికి బుధవారం దేహ శుద్ధి చేశారు. పాములవాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గాదె గణేష్కు చాలా రోజు లుగా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడు. పిల్లల శరీరంపై చేతులు వేస్తూ పాఠాలు చెబుతున్నాడు. రెండు రోజుల క్రితం పి.కె.పల్లికి చెందిన 9వ తరగతి విద్యార్థి శరీరారాన్ని తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయుని ప్రవర్తన గురించి ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆగ్రహంతో రగిలిపోయిన వారు పాఠశాలకు చేరుకుని దేహశుద్ధి చేశారు. గ్రామస్తులకు కూడా ఈ విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో చేరుకుని ఉపాధ్యాయుడిని చుట్టుముట్టారు. కొట్టుకుంటూ తీసుకెళ్లి గదిలో బంధించారు. తమ పట్ల కూడా అలాగే ప్రవర్తించాడని ఈ సందర్భంగా ఎనిమిది మంది విద్యార్థిలను తల్లిదండ్రులకు చెప్పారు. ఉపాధ్యాయుని ప్రవర్తనకు భయపడిన కొంతమంది విద్యార్థినులు పాఠశాలకు వెళ్లడానికి ససేమిరా అంటున్నారు. ఆరేళ్లుగా విధులు :ఉపాధ్యాయుడు గణేష్ మండలంలోని బి.కె.పల్లిలో నివా సం ఉంటున్నాడు. ఇతనికి వివాహమైం ది. భార్యా పిల్లలున్నారు. పాములవాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయుడిగా ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఉదంతంతో తోటి ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. తమకేమీ తెలియదంటూ వారు మిన్నుకుంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు కాలేదు. విచారణ చేస్తాను : ఈ సంఘటనపై ప్రదానోపాధ్యాయురాలు జ్యోతిని వివరణ కోరగా తాను అనకాపల్లిలోని ఓ సమావేశానికి వెళ్ళానని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.