breaking news
obstruction
-
పాడి రైతుకు సంపూర్ణ రక్షణ
సాక్షి, అమరావతి: పాల సేకరణ, విక్రయాల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023 అమలుకు రంగం సిద్ధమైంది. చట్టం అమలుకు అవసరమైన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపకల్పన చేసింది. నియమ, నిబంధనలతో ఇటీవలే అధికారిక గెజిట్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రతిరోజు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. స్థానికంగా 1.42 కోట్ల లీటర్ల పాలు వినియోగమవుతుండగా, ఆర్గనైజ్డ్ డెయిరీలు 21.6 లక్షల లీటర్లు, ప్రైవేటు డెయిరీలు 47.6 లక్షల లీటర్లు సేకరిస్తున్నాయి. మిగిలిన పాలు వివిధ రూపాల్లో మార్కెట్కి వస్తుంటాయి. పాల సేకరణలో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తూనికలు–కొలతల చట్టం ప్రకారం తనిఖీ చేసే అధికారాలను స్థానిక పశు వైద్యులకు అప్పగించారు. అయితే మోసాలకు పాల్పడినట్టు నిర్ధారణ జరిగినప్పుడు మిల్క్ ఎనలైజర్స్, ఇతర పరికరాలను సీజ్ చేయడం, బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తేవి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ దేశంలోనే తొలిసారి పటిష్టమైన పాలసేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చట్టం అమలు బాధ్యత వీరిదే.. చట్టం అమలు, పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో మిల్క్ కమిషనర్గా, కార్యనిర్వాహక అధికారిగా పశుసంవర్ధక శాఖ సంచాలకులు వ్యవహరించనుండగా, జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ ఆఫీసర్స్గా జిల్లా పశుసంవర్ధక శాఖాధికారులు, మిల్క్ ఇన్స్పెక్టర్లుగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, ఏవీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్లు వ్యవహరించనున్నారు. వీరు చట్టప్రకారం మిల్క్ ఎనలైజర్స్తో పాటు పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు పనిచేసేలా పర్యవేక్షిస్తారు. పాలనాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ, నాణ్యత ప్రమాణాల యాక్టు 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారు. పాలల్లో ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి నిర్దేశించిన రేటు చార్ట్ ప్రకారం పాడి రైతుకు మద్దతు ధర దక్కేలా పర్యవేక్షిస్తారు. ఇందుకోసం సాఫ్ట్వేర్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. చట్టం అమలుపై రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్స్కు ఇటీవలే శిక్షణ కూడా పూర్తి చేశారు. వీరి ద్వారా మండల స్థాయిలో మిల్క్ ఇన్స్పెక్టర్లుగా వ్యవహరించనున్న అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. మిల్క్ ఎనలైజర్స్కు లైసెన్సింగ్ తప్పనిసరి మిల్క్ ఎనలైజర్స్ కలిగి ఉన్న వారు రూ.1,000 చెల్లించి సంబంధిత ఆథరైజ్డ్ అధికారి నుంచి లైసెన్సు పొందాలి. ఆ తర్వాత ఏటా లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. అదే తయారీ దారులు, డీలర్లు ప్రతీ 2 ఏళ్లకోసారి రూ. 2 లక్షలు చెల్లించి మిల్క్ కమిషనర్ ద్వారా లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లైసెన్స్ పొందిన తర్వాత మిల్క్ ఎనలైజర్స్ను 30 రోజులలోపు వారి పరిధిలోని మిల్క్ ఇన్స్పెక్టర్ వద్ద రూ. 500 చెల్లించి కనీసం ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేలా వెరిఫికేషన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. మిల్క్ ఎనలైజర్ లైసెన్స్, వెరిఫికేషన్ సర్టిఫికెట్ను పాలసేకరణ కేంద్రంలో ప్రదర్శించాలి. రికార్డులు, రిజిష్టర్లు విధిగా నిర్వహించాలి. క్రమం తప్పకుండా తనిఖీలు.. చట్టం ప్రకారం మిల్క్ ఇన్స్పెక్టర్లు.. పాల సేకరణ కేంద్రాలు, డెయిరీల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తారు. తేడా ఉన్నట్టుగా గుర్తిస్తే జరిమానా, లైసెన్సు రద్దు, కేసుల నమోదు వంటి చర్యలు తీసుకుంటారు. కల్తీ జరిగినట్టు గుర్తిస్తే తగిన చర్యల కోసం ఆహార భద్రత అధికారికి సమాచారమిస్తారు. మిల్క్ యూనియన్, డెయిరీ నిర్ధారించిన రేట్ చార్జి ప్రకారం పాలుపోసే వారికి పాలసేకరణ ధర చెల్లిస్తున్నదీ లేనిదీ కూడా పరిశీలిస్తారు. జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ అధికారిగా వ్యవహరించే అధికారులు ఈ మిల్క్ ఇన్స్పెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. మోసాలు, కల్తీలు జరిగినట్టుగా గుర్తిస్తే సంబంధిత రికార్డులు సహా ఆయా యూనిట్లను సీజ్ చేస్తారు. శిక్షార్హమైన నేరాలకు చట్టం ప్రకారం జరిమానాలు, కారాగార శిక్షలు విధిస్తారు. -
రూ.10 వేలు ఇస్తేనే చితి దిగుతా! చివరికి
జగిత్యాల : వ్యక్తి చనిపోయిన బాధలో కుటుంబం ఉంటే.. కాటికాపరులు డబ్బుల కోసం వేధించిన సంఘటన జగిత్యాల మండలం లక్ష్మీపూర్లో చోటుచేసుకుంది.దీంతో గ్రామస్తులే చొరవ తీసుకుని, అంత్యక్రియలను ముగించిన వైనం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మిట్టపెల్లి బాపురెడ్డి ఆదివారం చనిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లగా.. కాటికాపరులు వచ్చి చితిపై కూర్చుని అంతిమ సంస్కారాలను అడ్డుకున్నారు. రూ.10 వేలు ఇస్తేనే చితి మీది నుంచి దిగుతామని భీష్మిం చారు. గ్రామస్తులు మాట్లాడి రూ.వెయ్యి వరకు ఇస్తామని చెప్పినా ఒప్పుకోలేదు. దీంతో గ్రామస్తులందకూ కలిసి చితిపై ఉన్న కాటి కాపరులను పక్కకు తోసి అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చింది. -
వైరల్: అరె ఏందిది వికెట్లకు అడ్డుగా నిలబడ్డాడు.. ఏమైందంటే!
సిడ్నీ: మార్ష్ కప్ టోర్నీలో భాగంగా విక్టోరియా ఓపెనర్ సామ్ హార్పర్ ప్రవర్తించిన తీరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. సౌత్ ఆస్ట్రేలియా- విక్టోరియా మధ్య జరిగిన ఆసీస్ దేశవాళీ వన్డే మ్యాచ్లో డేనియల్ వారల్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో సామ్ పరుగు తీసేందుకు యత్నించాడు. అయితే, అంతలోనే బంతి డేనియల్ చేతికి చిక్కడంతో నేరుగా వికెట్లకు గిరాటేసేందుకు ప్రయత్నించాడు. కానీ, అవుట్ కావడం ఇష్టంలేని సామ్, వికెట్లకు అడ్డంగా నిలబడి ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నాడు. దీంతో, డేనియల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇక ఈ ఘటనపై సౌత్ ఆస్ట్రేలియా కెప్టెన్ ట్రవిస్ హెడ్ సైతం సామ్ తీరుకు షాకయ్యాడు. వెంటనే ఆన్- ఫీల్డ్ ఎంపైర్ల దగ్గరకు వెళ్లి చర్చించాడు. ఆ తర్వాత విషయం థర్డ్ అంపైర్ దగ్గరకు చేరగా, ఐసీసీ నిబంధనల ప్రకారం సామ్ను అవుట్గా ప్రకటించాడు. క్రీజు బయట ఉన్నందుకు అతడు పెవిలియన్కు చేరకతప్పలేదు. కాగా కామెంట్రీ బాక్స్లో ఉన్న ఆసీస్ మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘డేనియల్ వందకు వంద శాతం కరెక్ట్గానే త్రో చేశాడు. ఆ బంతి కచ్చితంగా మిడిల్ లెగ్ స్టంప్ను తాకి ఉండేది. నిజానికి సామ్ క్రీజు బయట ఉన్నాడు. స్టంప్స్ను తాకకుండా బంతిని అడ్డుకుని నిబంధనలు ఉల్లంఘించాడు. అబ్స్ట్రక్షన్కు ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్’’ అని వ్యాఖ్యానించాడు. డేనియల్ అప్పీలు చేసి మంచి పనిచేశాడని ప్రశంసించాడు. కాగా ఇటీవల దక్షిణాఫ్రికా- పాక్ జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో ప్రొటీస్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న పాక్ బ్యాట్స్మెన్ ఫకర్ జమాన్(193; 155 బంతుల్లో 18x4, 10x6) రనౌట్కు కారణమయ్యాడంటూ విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. చదవండి: ఫకర్ జమాన్ రనౌట్ వివాదంపై ఎంసీసీ క్లారిటీ ఐపీఎల్ కోసం మరీ ఇలా చేస్తారా; నువ్వైతే ఆడొచ్చు కానీ?! Ummm.... What? 🤨 Sam Harper is out for obstruction after moving into the path of a ball 🤷♂️ #sheffieldshield pic.twitter.com/z5SnoxUjPR — Fox Cricket (@FoxCricket) April 8, 2021 -
ఇనుపతెరలు దిగుతున్నాయి!
రెండోమాట ‘మనిషికి కళ్లు ఎంత అవసరమో, ప్రభుత్వాల కళ్లు తెరిపించడానికి ప్రసార మాద్యమం అవసరం కూడా అంతే. మీడియా లేని ప్రభుత్వం కన్నా, ప్రభు త్వం లేని మీడియానే; దాని స్వేచ్ఛనే కోరుకుంటాను’. -థామస్ జఫర్సన్ (అమెరికా స్వాతంత్య్ర ప్రకటన, రాజ్యాంగ రచయితలలో ఒకరు. భారత ప్రథమ ప్రధాని నెహ్రూ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు.) ‘ఇండియా అన్న భావమే నేడు ప్రమాదంలో పడింది. స్వాతంత్య్ర సము పార్జన తరువాత ఇప్పుడు మనం అత్యంత ప్రమాదకర ఘడియలను ఎదు ర్కొంటున్నాం. మరోసారి అంటున్నాను, అదేమాట- దయచేసి నా మాట లని కత్తిరించకండి! నేను ఉగ్రవాదం గురించి మాట్లాడడం లేదు. భావ స్వేచ్ఛపైన ప్రభుత్వం ఇనుపతెర దించింది. ఈ వాతావరణంలో ఆలోచనా శక్తినే నియంత్రించదలిచింది. -నయనతారా సెహెగల్ (‘నెహ్రూస్ ఇండియా’ రచయిత్రి) బీజేపీ-సంఘ్ పరివార్ (ఎన్డీఏ) ప్రభుత్వం ఏరకమైన నిర్ణయాలతో, అప్రకటిత లక్ష్యాలతో ముందుకు సాగిపోతున్నదో, క్రమంగా మరో ఎమ ర్జెన్సీకి (ఆత్యయిక పరిస్థితి) దారి వెతుకుతున్నదో ఆ శిబిరానికే చెందిన అగ్ర నేత లాల్ కిషన్ అద్వానీ హెచ్చరించారు. దేశ ప్రజలను ముందస్తుగా హెచ్చ రిస్తూ మాజీ ఉపప్రధాని చేసిన ఈ ప్రకటన వెలువడిన కొలది మాసాల నుంచే అనూహ్యంగా కొన్ని ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. కేంద్రం ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు సయితం ఆ అనుమానాలను మరింత ధ్రువీకరించేటట్టు ఉన్నాయి. త్వరితగతిన జరిగిపోతున్న ఈ మార్పులు ప్రతి రంగంలోను కనిపిస్తున్నాయి. ఈ అంశంలో కాంగ్రెస్ మార్గంలోనే బీజేపీ ప్రయాణం కూడా సాగుతోంది. భిన్న సంస్కృతుల మేలుకలయికగా ఉన్న భారతీయ సమాజాన్ని చీలుబాట పట్టించే తీరులో పరివార్ సిద్ధాంతాలను ప్రవేశపెడుతున్నారు. విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు సహా పలు శాఖలలోనూ, ప్రణాళికా సంఘ విభాగాలలోనూ ఇలాంటి ‘మార్పులు’ తెచ్చిపెడుతున్నారు. పాఠ్య ప్రణాళికలు వేరు బాట పడుతున్నాయి. చరిత్రకు సమగ్ర దృక్కోణాన్నీ, శాంతి సౌమనస్యాలకు దోహదం చేసే సకల మత సారాన్నీ అందించడం కాకుండా, వివాదాస్పద విషయాలను జత చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. దేశ ఆర్థిక, సామాజిక దిశాగతికి సంబంధిం చిన ప్రగతిశీల సంస్కరణల వైపుగా కాకుండా విదేశీ గుత్త పెట్టుబడి వర్గాల మౌలిక ప్రయోజనాల రక్షణకు తలపెట్టిన విధానాలకే కాంగ్రెస్-యూపీఏ ప్రభుత్వం ఆనాడు పాటుపడింది. ఆ విధానాలనే మరింత పటిష్టం చేస్తూ బీజేపీ-ఎన్డీఏ ఈనాడు ముందుకు సాగుతున్నది. ఉరిశిక్ష మీద ఎవరిది రచ్చ? బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క ఉరిశిక్షల విషయంలోనే కాకుండా; ‘ప్రజా వేగులు’ (విజిల్ బ్లోయర్స్) బహిర్గతం చేసే అనేక అవకతవకల గురించీ, పెరిగిపోతున్న అధికార, అనధికార మంత్రుల, ప్రజాప్రతినిధుల అవినీతి, లంచగొండితనాల గురించి చేస్తున్న హెచ్చరికలను కూడా కంపరంగా భావి స్తోంది. అందుకే ప్రసార సాధనాల పీక నొక్కడానికి ప్రయత్నిస్తున్నది. ఉరిశిక్ష విధింపులోని సామంజస్యం గురించి సుప్రీంకోర్టు సహా కొన్ని కిందిస్థాయి న్యాయస్థానాలు కూడా ప్రశ్నిస్తున్న సమయమిది. మరణదండనను రద్దు చేస్తూ పార్లమెంట్ తీర్మానం తీసుకురావలసిన తరుణంలో, ఆ బాధ్యతను తాను తీసుకుని, దేశంలో ఒక రాష్ట్రం (త్రిపుర) తొలిసారి తీర్మానించడం విశే షమే. కానీ ఇదే వివాదం గురించిన వార్తలను, విశ్లేషణలను వెలువరించిన పత్రికలనూ, చానల్స్నూ నోటీసులతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్నది. నిజా నికి సమాచార హక్కు చట్టాన్ని క్రమంగా నీరు కార్చడానికే బీజేపీ పాలకులు సాహసిస్తున్నారు. కావలసిన సమాచారాన్ని సేకరించడానికి వెళ్లిన పత్రికా రచయితలు నిర్దేశించిన మీడియా గదికే పరిమితం కావాలనీ, సరాసరి ఏ సీనియర్ అధి కారినీ కలవడానికి వీలులేదనీ తాజాగా ఒక నిరంకుశ ఉత్తర్వును కేంద్ర హోం శాఖ జారీ (23-7-2015) చేసింది. ఆశించిన సమాచారాన్నీ, వివరణలనూ హోం శాఖ అడిషనల్ డెరైక్టర్ జనరల్ నుంచి మాత్రమే పొందాలని శాసిం చడం కూడా జరిగింది. కానీ కంటితుడుపు చర్యగా, అలాంటి తాఖీదు ఏదీ లేదని సర్ది చెప్పడానికి హోం శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ తరువాత నానాతంటాలు పడ్డారు. ఎవరు ఏ సంగతిని మభ్య పెట్టదలిచినా ‘కలుగులో ఎలుక’ పట్టుబడక తప్పదు. మూడు చానళ్లకు నోటీసులు 1993 నాటి ముంబై పేలుళ్ల సంఘటనలో అరెస్టయి 22 ఏళ్లు జైల్లో ఉన్న యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష అమలు చేయడం గురించి సమాచారాన్ని వెల్లడించడాన్ని ప్రభుత్వం సహించలేకపోయింది. అందుకే ఈ సమాచారాన్ని వెల్లడించిన లేదా ప్రచురించిన మూడు చానళ్లు- ఏబీపీ న్యూస్, ఎన్డీటీవీ, ఆజ్ తక్లకు షోకాజ్ నోటీసులు జారీ (8-8-2015) అయినాయి. ఇక్కడ మరు గునపడిన విషయం ఒకటి ఉంది- దేశ అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనా లలోనే ఉరిశిక్ష అమలు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. మారిన ధర్మాసనం తీర్పుతో చివరికి ఉరిశిక్ష ఖరారైంది. ఇదే తీరులో పలు వురు న్యాయమూర్తులు (రిటైర్డ్), న్యాయవాదులు, ప్రసిద్ధ పత్రికలు భిన్నా భిప్రాయాలనే వ్యక్తం చేశాయి. కేంద్రం జారీ చేసిన నోటీసులకు వ్యతిరేకంగా పలు పత్రికా సంస్థలు, ప్రెస్ క్లబ్లు, మిహ ళా పత్రికాధిపతులు భావ ప్రక టనా స్వేచ్ఛ హక్కును నిలబెట్టుకోవడానికి తమవంతు ప్రయత్నం చేశారు. చేస్తూనే ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే, ఏ విధానాల వల్ల తమ ఉనికికి భంగం వాటిల్లుతుందో వాటిని మార్చుకోవడానికే ప్రభుత్వాలు మొరాయి స్తున్న ఘడియలివి. నిజానికి అలాంటి వేళలోనే ఈ తరహా నిరంకుశ ఉత్త ర్వులు జారీ అవుతూ ఉంటాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్యమత సంస్థల మీద, మైనారిటీ సంస్థల మీద వేధింపులను ఆరంభిం చింది. ప్రస్తుతం ఎన్డీఏ పాలకులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు, అగ్ని పరీక్షలు వాటి ఫలితమే. గుజరాత్ మారణకాండతో సంబంధం కలిగినవారు ఒక్కొక్కరే తమపై ఉన్న కేసులనూ, శిక్షలనూ యథేచ్ఛగా రద్దు చేయిం చుకోవడం మరో ప్రహసనం. మనిషి కోసమే చట్టం ప్రజల మాట పాలకుల కోట కావచ్చునే కానీ, పాలకుల మాట పాలితుల పాలిట శిలాశాసనం కారాదు. ఇకపైనైనా ఈ సూత్రమే ప్రజాస్వామ్యానికీ, రాజకీయ పక్షాలకూ, ప్రభుత్వాలకూ ఆచరణలో రక్షణ కవచం కావాలి. రక్షక భట వర్గాల పని దేశాన్నీ, ప్రజలనూ రక్షించడమే. పాలకులనూ, ప్రభుత్వా లనూ రక్షించడం కాదు. అందుకే ప్రశ్న నుంచి పుట్టిన ప్రపంచం తిరిగి ప్రశ్ననే ఆశ్రయించాలి. ‘కేవలం చట్టం కోసమని మనిషి పుట్టలేదు. మనిషి కోసం, అతడి ఉనికి కోసం, రక్షణ కోసమే చట్టం ఉంది. ప్రజాస్వామ్యానికి పునాదీ, ఉనికీ మనిషే. ఇదే రాజ్యాంగ శక్తికి పునాది’ అంటాడు హెగెల్. ‘చట్టం ఉన్నది మనిషి రక్షణకే కాని, ప్రాణం తీయడానికి కాదు’ అంటాడు జస్టిస్ జోసఫ్. మన ఉపనిషత్తుల సారం మొత్తం ప్రశ్న అనే మాధ్యమంలోనే ఉంది. మొత్తం మనిషి మనుగడకు, సాధించదలచిన ప్రగతికి, ఆలోచనాశక్తిని పెంచేందుకూ అత్యవసరమైనవి- ప్రశ్న, సమాధానం. అవి విషయాన్ని నిగ్గు తేలుస్తాయి. నిరంతర అన్వేషణను కొనసాగించేది ప్రశ్న. కానీ ఇప్పుడు ప్రశ్నను సంధిం చిన వారి నోరు నొక్కడాన్ని పాలకులు ఆంక్షా శాసనంగా (గ్యాగ్ ఆర్డర్) వినియోగించదలుచుకున్నారు. మన ఉపనిషత్తులు బోధించిన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ప్రక్రియ మొత్తం చర్చ, లేదా సంవాదం రూపంలో నిగ్గుతేల్చిన తరువాతే జరిగిందని మరవ రాదు. తమ స్వార్థం కోసం పోలీసులు చేసిన అకృత్యాలను మరుగుపరుస్తూ, అమాయకులను మాత్రం కేసులలో ఇరికించి, వేధించడానికి తాజా ఉదాహ రణ- మారేడ్పల్లి దుర్ఘటన, దుర్మార్గం. ఏ దేశంలోనైనా ప్రాక్టీసు లేని ప్లీడర్లు కొందరు, న్యాయమూర్తులు కొందరు దేశాభిమానులుగా కీర్తి గడించడం సహజం. భావ స్వేచ్ఛను, స్వతంత్రమైన ఆలోచనా శక్తిని నిష్పాక్షికంగా, నిర్మొ హమాటంగా, స్వేచ్ఛగా సమస్యలను చర్చించడాన్ని వాత్సాయనుడు వంటి భారతీయ తత్వవేత్తలు నాడే అభిలషించి ప్రోత్సహించారు. నిరంతరం సత్యా న్వేషణ కోసం తపించిన వారిగా ప్రసిద్ధి గాంచిన వారే నచికేతాదులు. కానీ పాలకులకు ఈ ప్రశ్న అంటేనే వెగటు. ఇక ఉప ప్రశ్నల సంగతి చెప్పనక్కర లేదు. సమాచార హక్కు చట్టం కింద ఇప్పుడు మీరు కావలసిన సమాచారాన్ని రాబట్టలేరు. పౌరులకు తెలియకుండా అందుకు సంబంధించిన ఉత్తర్వులేవో చడీచప్పుడు లేకుండా జారీ అయినట్టు భావిస్తున్నారు. అద్వానీ భయం నిజ మయ్యేటట్టే ఉంది. బీజేపీలో కొందరు ఎంపీలు- వరుణ్గాంధీ వంటివారు- కూడా ‘దేశ ప్రజలు నిజాలు తెలుసుకోగోరుతున్నారు’ అంటూ గొంతు కల పడం రానున్న ఉప్పెనలకు ఒక సూచన. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు (వ్యాసకర్త మొబైల్: 9848318414)