-
ఉద్యోగుల 'కియా' మొర్రో
సాక్షి, పెనుకొండ(అనంతపురం) : ‘కియా’తో ఉద్యోగాలు లభిస్తాయని, తమ జీవితాలే మారిపోతాయని ఆశపడిన ‘అనంత’ ఆశలన్నీ ఆవిరవుతున్నాయి. జిల్లాలో కంపెనీ ఏర్పాటైనా...అక్కడ ఉద్యోగుల్లో మనవాళ్లు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినా.. కియా, దాని అనుబంధ సంస్థల్లో అమలు కావడంలేదు. పైగా ‘కియా’లో 80 శాతం మంది ఉద్యోగులు తమిళనాడు ప్రాంతానికి చెందిన వారే కావడంతో...తెలుగువాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనిగంటలు పెంచడం...వారాంతపు సెలవు ఇవ్వకుండా తెలుగువారికి నరకం చూపిస్తున్నారు. చివరకు వారే విసిగిపోయి ఉద్యోగాలు వదిలి పారిపోయేలా చేస్తున్నారు. ఆది నుంచీ వివక్షే! ‘కియా’ పరిశ్రమలో తెలుగువారిపై ఆది నుంచీ వివక్షే కొనసాగుతోంది. నైపుణ్యం పేరుతో వివక్ష చూపిస్తూ తమిళనాడు ప్రాంతానికి చెందిన వారికే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారు. ‘కియా’ అనుబంధ పరిశ్రమ ‘హుందాయ్’ గతంలో తమిళనాడులో ఉండటం, ఆ చనువుతో తమిళనాడు ప్రాంతం వారికే ఇక్కడి ‘కియా’లో ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల్లో అరకొరగా ఉన్న తెలుగు ఉద్యోగులపై వేధింపులకు దిగుతున్నారు. వేతనాలు, పనిగంటలు, తదితర అన్ని విషయాల్లోనూ చిన్నచూపు చూస్తున్నారు. భూ బాధిత కుటుంబాలకూ దక్కని ఉద్యోగాలు ‘కియా’ పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన రైతు కుటుంబాల పిల్లలు ఎందరో ఎంటెక్, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివినా కియాలో ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కనీసం అరకొరగా ఉన్న తెలుగువారికి సరైన గుర్తింపు లభించలేదు. ఈ విషయమై గతంలో పలుమార్లు ‘కియా’ పరిశ్రమ ఎదుటనే తెలుగువారు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. పరిశ్రమ కోసం భూములు సేకరించినప్పుడు స్థానికులకే వందశాతం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన అధికారులు, నాయకులు వాటిని సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. కనీసం భూబాధిత రైతుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించలేకపోతున్నారు. ‘సంగ్వూ’ ఎదుట ధర్నా తెలుగువారిపై చూపుతున్న వివక్షను నిరిస్తూ సోమవారం ఉదయం పెనుకొండ మండలం దుద్దేబండ సమీపంలోని కియా అనుబంధ కంపెనీ ‘సంగ్వూ’ హైటెక్ కంపెనీ ఎదురుగా తెలుగు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టడంతో వారంతా అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. -
అనాథలా ‘అటవీ శాఖ’
కనీస స్థాయిలో భర్తీ కాని పోస్టులు.. 25 శాతానికి పైగా ఖాళీలు దశాబ్దాలుగా ఇదే దుస్థితి.. సిబ్బంది కొరతతో ఇబ్బంది అడవులపై కొరవడుతున్న పర్యవేక్షణ.. ఏటా తగ్గిపోతోన్న అటవీ సంపద మెదక్: జిల్లాలో అటవీ శాఖ ఎవరూ లేని అనాథలా మారింది. కింది స్థాయి ఉద్యోగులు మొదలుకుని ఉన్నతాధికారుల వరకు కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో అటవీ సంపదకు రక్షణ కరువైంది. ఇదే అదనుగా అక్రమార్కుల గొడ్డలివేటుకు విలువైన సంపద బలవుతోంది. ఒకపక్క అడవులు బాగుంటేనే వర్షాలు పడతాయని.. కరువు, కాటకాలు దరిచేరవని చెబుతూ ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపడుతున్న ప్రభుత్వం.. మరోపక్క ఉన్న అడవులు అంతరించిపోతోన్నా పట్టించుకోవడం లేదని పర్యావరణవేత్తలు అంటున్నారు. జిల్లా అటవీశాఖలో దశాబ్దాలుగా 25 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఓవైపు స్మగ్లర్లు జంతువులను వేటాడుతుండగా మరోవైపు అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. సరిపడా సిబ్బంది ఉంటే ఇటువంటి పరిస్థితి తలెత్తదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అడవులకు రక్షణ ఎవరు? అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 2,40,697 ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. వీటిని నిత్యం కలప దొంగలు నరికేస్తున్నారు. వేటగాళ్లు జంతులను వేటాడుతున్నారు. జిల్లాలో టెరిటోరియల్, సోషల్ ఫారెస్ట్, వైల్డ్లైఫ్.. ఈ మూడు విభాగాల్లో అధికారిక లెక్కల ప్రకారం 238 మంది ఉద్యోగులు ఉండాలి. కానీ 178 మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ రేంజ్ ఒకటి, సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 5, బీట్ ఆఫీసర్లు 29, వాచర్ పోస్టులు 14, టెక్నికల్ అధికారి ఒకటి, జూనియర్ అసిస్టెంట్లు 4, డ్రైవర్లు 4, అటెండర్లు 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 25శాతం పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందికి పనిభారం పెరిగింది. క్షేత్రస్థాయి సిబ్బంది కరువు ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో అడవిని రక్షించాల్సిన బీట్ ఆఫీసర్ల పోస్టులు 29 ఖాళీగా ఉండటంతో అడవంతా అక్రమార్కుల పాలవుతోంది. భూభాగంతో పోల్చుకుంటే 33 శాతం అడవులు ఉండాలి. కానీ కేవలం 9.93 శాతం మాత్రమే అడవులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 46 మండలాలకు గాను 37 మండలాల్లో 2,40,697 ఎకరాల్లో అటవీ భూములున్నా అందులో అత్యధికంగా అడవులు అంతరించిపోయాయి. దీంతో జిల్లా కరువు, కాటకాలకు కేంద్రబిందువుగా మారింది. జల్లులతో సరి గడచిన రెండేళ్లలో తీవ్ర కరువుతో పల్లెలన్నీ కళతప్పాయి. ప్రజలంతా పొట్టచేతబట్టుకొని వలసబాట పట్టారు. ఈ సారైనా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటే చిరుజల్లులతోనే సరిపెడుతుంది. ఇప్పటికే రెండు నెలల పుణ్యకాలం గడిచిపోయింది. చెరువు, కుంటల్లోకి చుక్కనీరు రాలేదు. దీనికంతటి కారణం అడవులు లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. వనాలకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అటవీశాఖలోనే పోస్టులు భారీగా ఖాళీలు ఉండటంతో అక్రమార్కులు అడవిని కొల్లగొడుతున్నారు. జంతువుల వేట వేటగాళ్లు కొద్ది రోజుల క్రితం రాయిన్పల్లి అడవుల నుంచి నాలుగు జింకలను చంపి తరలిస్తుండగా అటవీ అధికారులు పట్టుకున్న విషయం విదితమే. గడచిన ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. సిబ్బంది కొరత వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి అటవీశాఖలో ఖాళీ పోస్టులు భర్తీచేసి వన సంపదతోపాటు అందులోని జంతువులను కాపాడాలని పర్యావరణ, జంతు ప్రేమికులు కోరుతున్నారు. పర్యాటకుల తాకిడి..పర్యవేక్షించని సిబ్బంది మెదక్ మండలం పోచారం అభయారణ్యంలో సుమారు 250 ఎకరాల్లో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రముంది. అందులో జింకలు, కొండగొర్రెలు, దుప్పులు, సాంబార్లు, నీల్గాయ్, నెమళ్లు, అడవి పందులతోపాటు అనేక రకాల పక్షులు, జంతువులు కళ్లముందే చెంగుచెంగున దూకుతూ పరుగులు పెడుతుంటాయి. పుల్కల్ మండలం అటడిలో మంజీర వైల్డ్లైఫ్ సెంచరీలో సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో మొసళ్ల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ఇవి రాజధానికి అతి సమీపంలో ఉండంతో ప్రతి వారంలో శని,ఆదివారాలు వీటిని తిలకించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చి తిలకిస్తుంటారు. సిబ్బంది కొరతతో ఈ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని జిల్లా అధికారి ఒకరు తెలిపారు. పోస్టుల భర్తీతో ఈ సమస్యలను అధిగమించవచ్చని పలువురు పేర్కొంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement