breaking news
Naxal heartland
-
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కలకలం
-
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కలకలం
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా మావోయిస్టులు కలకలం సృష్టించారు. మోదీ పర్యటనను నిరసిస్తూ మావోయిస్టులు సుకుమా జిల్లాలో సుమారు 500మంది గిరిజనులను కిడ్నాప్ చేశారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీరించటం లేదు. ఈ సంఘటన స్థానికంగా దుమారం రేపుతోంది. కాగా మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే దంతెవాడ జిల్లాలో మోదీ పర్యటించి రెండు కీలక ప్రాజెక్టులకు ప్రారంభించనున్నారు. ఆయన శనివారం అక్కడ మోదీ విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడనున్నారు. ఇప్పటికే మోదీ, రైల్వే శాఖమంత్రి సురేష్ ప్రభు దంతెవాడ చేరుకున్నారు. మరోవైపు మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాల్లో మోదీ పర్యటన
రాయ్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో చత్తీస్గఢ్ పర్యటనకు వెళ్లనున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే దంతెవాడ జిల్లాలో మోదీ పర్యటించి రెండు కీలక ప్రాజెక్టులకు ప్రారంభిస్తారు. చత్తీస్గఢ్ పర్యటనలో మోదీ విద్యా సంస్థలను సందర్శించి అక్కడి విద్యార్థులతో మాట్లాడనున్నారు. మోదీ ఇదే రోజు రాయ్పూర్కు వెళ్లి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మోదీ రాక సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.