breaking news
Malaysia Airlines MH17
-
విమాన కూల్చివేత కేసు.. ఎనిమిదేళ్లకు న్యాయం
ఆమ్స్టర్డ్యామ్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 298 మంది మృతికి కారణమైన నిందితులకు ఆలస్యంగా అయినా కఠిన శిక్ష పడింది. ఎంహెచ్17 మలేసియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఘటనలో నెదర్లాండ్స్ కోర్టు ఇద్దరు రష్యన్లు, ఒక ఉక్రెయిన్ వేర్పాటువాదికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2014 జూలై 17న నెదర్లాండ్స్లోని అమ్స్టర్డ్యామ్ నుంచి మలేసియాలోని కౌలాలంపూర్కు బయలుదేరిన బోయింగ్ 777 విమానాన్ని రష్యా అనుకూల ఉక్రెయిన్ వేర్పాటువాదులు బక్ మిస్సైల్ ప్రయోగించి, కూల్చేశారు. విమానం ఉక్రెయిన్ భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 298 మంది మరణించారు. ఈ కేసుకు సంబంధించి మరో వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది డచ్ కోర్టు. కోర్టు తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రష్యా పాత్ర ఉందనే విషయం స్పష్టమైందని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. నెదర్లాండ్స్కు చెందిన 196 మంది, 43 మంది మలేసియన్ వాసులు, 38 మంది ఆస్ట్రేలియాకు చెందిన వాళ్లు.. ఇలా మొత్తం పది దేశాలకు చెందిన ప్రయాణికులు ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. అయితే రష్యా మాత్రం అది ఉక్రెయిన్ వేర్పాటువాదుల పని అయ్యిండొచ్చని, అందులో మాస్కో ప్రమేయం ఏం లేదని పాత పాటే పాడుతోంది. -
మృతుల్లో అత్యధికులు డచ్ పౌరులే
మలేషియా విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన ప్రయాణికుల్లో అత్యధికులు డచ్ దేశానికి చెందిన వారేనని ఉన్నతాధికారి స్సష్టం చేశారు. విమానంలో మొత్తం 298 మంది ప్రయాణికులు మరణించగా.... వారిలో 154 మంది డచ్ పౌరులని వెల్లడించారు. మృతుల వివరాలను ఉన్నతాధికారి ఇక్కడ వెల్లడించారు. మృతుల్లో 27 మంది ఆస్ట్రేలియా, 23 మంది మలేషియా,11 మంది ఇండోనేషియా, 6 బ్రిటన్, 4 జర్మనీ, 4 బెల్జియం, 3 పిలిప్పీన్స్, ఒకరు కెనడా పౌరులుగా గుర్తించినట్లు తెలిపారు. అయితే మరో 47 మంది మృతులు ఏ దేశానికి చెందిన వారు అనే విషయాన్ని గుర్తించవలసి ఉందని పేర్కొన్నారు. నెదర్లాండ్స్లోని మలేషియా రాయబారి ఎఫ్ మహ్మద్ మాట్లాడుతూ... విమాన ప్రమాదం వార్త విన్న వెంటనే తీవ్ర ఆందోళనకు గురైయానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముఖ్యంగా ప్రమాద ఘటనలో డచ్ పౌరులు అత్యధికులు మరణించారని వారికి ఇతర దేశాల జాతీయల మృతికి ఆమె సంతాపాన్ని ప్రకటించారు. మృతుల సమాచారం అందించేందుకు రాయబార కార్యాలయం 24 గంటలు తెరిచే ఉంటుందని తెలిపారు. దేశ చరిత్రలో ఇది అతి పెద్ద విపత్తు అని డచ్ దేశ ప్రధాన మంత్రి మార్క్ రుట్టీ వెల్లడించారు. ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమాన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను ఉన్నతాధికారి శుక్రవారం విడుదల చేశారు.