breaking news
kurupam agency area
-
NHRC: కురుపాం ఘటన.. ఏపీ ప్రభుత్వ అలసత్వంపై ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: కురుపాం గిరిజన విద్యార్థుల అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అడుగు వేసింది. సోమవారం ఆ పార్టీ ప్రతినిధుల బృందం జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసింది. చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వ అలసత్వంపై ఫిర్యాదు చేసింది. ఏపీ కురుపాం గిరిజన హాస్టల్స్లో భారీ సంఖ్యలో విద్యార్థులు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడడం తెలిసిందే. అయితే వాళ్లకు సకాలంలో చికిత్స అందకపోవడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహంతో ఉంది. అపరిశుభ్రమైన వాతావరణం, కలుషిత నీరు, మంచి భోజనం అందించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ ఎన్హెచ్ఆర్సీకి ఫిరయాదు చేసింది. పెద్ద సంఖ్యలో పిల్లలు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడిన వైనాన్ని హక్కుల సంఘానికి వివరించింది.గిరిజన హాస్టల్స్ లో చంద్రబాబు సర్కార్ బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడడం, ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం వహించడంపై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గిరిజన విద్యార్థుల హక్కులను కాపాడాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కోరింది. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపింది. వైఎస్సార్సీపీ బృందంలో ఎంపీలు గురుమూర్తి, తనుజారాణి, మాజీ డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, రాజన్న దొర తదితరులు ఉన్నారు. -
మళ్లీ వచ్చావా.. జర ఆగు.. నీకు రెండు పంచ్లిస్తా!
ఎక్కడైనా ఎవరైనా కొట్లాటకు దిగితే కోడి పుంజుల్లా ఢీకొంటున్నారనో, పొట్టేళ్ల తరహాలో తలపడుతున్నారనో అనడం సర్వసాధారణం. ఇవి తలపడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టే మనుషుల కొట్లాటను వీటితో పోల్చుతూ ఉంటారు. పొట్టేళ్ల పందాలు ఏదైనా పండుగ వచ్చిన సందర్భంలోనే ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. పొట్టేళ్ల కొట్లాట అంటే జనానికి కూడా మహా సరదాగా ఉంటుంది. మరి పండుగలప్పుడే కాకుండా ఎక్కడైనా పొట్టేళ్లు తలపడటం మన కంటపడితే కాసేపి ఆగి చూసి ముచ్చటపడిపోతూ ఉంటాం. ఇలా విజయనగరం జిల్లా, కురుపాం ఏజెన్సీ లో రెండు పొట్టేళ్లు కొట్లాడుకోవడం కెమెరాకు చిక్కడమే కాదు.. వైరల్గా కూడా మారింది. ముందు ఒక పొట్టేళు.. మరొక పొట్టేళు డొంకల్లోకి తోసేస్తే, ఆ తర్వాత ఆ పొట్టేళు కూడా సమరానికి సై అంటుంది. ఈసారి తానేంటో చూపెడతా అనే విధంగా పైకి ఎగిరి మరీ తలతో రెండు పంచ్లు ఇస్తుంది. -
ఏజెన్సీలో ఏనుగుల బీభత్సం
కురుపాం: విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కురుపాం మండలం తిత్తిరి పంచాయతీ పరిధిలోని ఎగువగుండాం, దిగువగుండాం, గిరిశిఖర గ్రామాల్లో నాలుగు ఏనుగులు సంచరిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీ నుంచి ఏనుగులు ఇక్కడకు వచ్చినట్లు గిరిజనులు చెప్పుతున్నారు. వీటి దాడిలో ఇళ్లు, చర్చి పూర్తిగా ధ్వంసమయ్యాయి. కురుపాం అటవీ రేంజి అధికారి మురళీ కృష్ణ మంగళవారం ఉదయం ఇక్కడకు వచ్చి గిరిజనులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.


