breaking news
kalva bhuvana
-
భారత టెన్నిస్ జట్టులో భువన కాల్వ
సాక్షి, హైదరాబాద్: దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల టెన్నిస్ జట్టులో తెలంగాణ క్రీడాకారిణి భువన కాల్వ చోటు దక్కించుకుంది. నేపాల్ వేదికగా డిసెంబర్ 1 నుంచి 10 వరకు దక్షిణాసియా క్రీడలు జరుగనున్నాయి. ఇందులో భారత్తో పాటు మరో ఏడు దేశాలు పాల్గొననున్నాయి. గత కొంతకాలంగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీల్లో నిలకడగా రాణిస్తోన్న భువన ఈ క్రీడల్లోనూ రాణించాలని పట్టుదలగా ఉంది. -
భువన, సౌజన్య ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు కాల్వ భువన, సౌజన్య భవిశెట్టి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడంలో విఫలమయ్యారు. ఆదివారం జరిగిన సింగిల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో ఈ ఇద్దరూ ఓడిపోయారు. యాదృచ్ఛికంగా ఈ ఇద్దరూ మ్యాచ్ మధ్యలోనే వైదొలగడం గమనార్హం. ఆసియా జూనియర్ చాంపియన్ స్నేహదేవి రెడ్డి (భారత్)తో జరిగిన మ్యాచ్లో భువన స్కోరు 0-6, 3-3తో ఉన్న దశలో... కామోన్వన్ బుయామ్ (థాయ్లాండ్)తో జరిగిన మ్యాచ్లో సౌజన్య స్కోరు 5-7, 2-3తో ఉన్న దశలో వైదొలిగారు. భారత్ నుంచి షర్మదా బాలూ, స్నేహదేవి రెడ్డి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు.