-
నేడు జన్ సదరన్ ప్రత్యేక రైళ్లు
సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ సందర్భంగా రైళ్లలో రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే శనివారం పలు మార్గాల్లో జన్ సదరన్ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లలో రిజర్వేషన్లు ఉండవు. కేవలం 16 సెకండ్ క్లాస్ బోగీలు, రెండు లగేజ్, బ్రేక్ వ్యాన్లు మాత్రమే ఉంటాయి. ప్రత్యేక చార్జీలు వసూలు చేయరు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు సాధారణ టికెట్ రూ.130, విజయవాడ నుంచి హైదరాబాద్కు రూ.135, తిరుపతి నుంచి కాకినాడకు రూ.175, విజయవాడ నుంచి విజయనగరానికి రూ.145 చార్జీగా వసూలు చేస్తారు. సికింద్రాబాద్–విజయవాడ (07192) ప్రత్యేక రైలు 12న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరుతుంది. సికింద్రాబాద్–విజయవాడ (07194) ప్రత్యేకరైలు 12న రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరుతుంది. విజయవాడ–హైదరాబాద్ (07193) ప్రత్యేక రైలు 12న రాత్రి 8.30 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. తిరుపతి–కాకినాడ (07190) ప్రత్యేక రైలు 12న రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. విజయవాడ–విజయనగరం (07184) ప్రత్యేక రైలు 12న రాత్రి 10.10 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. విజయవాడ–సికింద్రాబాద్ (07195), విజయనగరం–విజయవాడ (07185) ప్రత్యేకరైళ్లు 12వ తేదీ నడుస్తాయి. -
పల్లెకు పోదాం.. చలో
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో వందకు పైగా అదనపు రైళ్లను దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదనపు రైళ్లు ఏర్పాటు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచనల మేరకు 54 జనసాధారణ రైళ్లను అధికారులు పెంచారు. సికింద్రాబాద్–విజయవాడ, సికింద్రాబాద్–తిరుపతి, తిరుపతి–కాకినాడ, విజయవాడ–విజయనగరం, విజయవాడ–హైదరాబాద్, తదితర మార్గాల్లో జనసాధారణ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్–విజయవాడ (07192/07193) స్పెషల్ ట్రైన్ ఈ నెల 11, 12, 13, 15, 16, 17, 18, 19, 20 తేదీల్లో మధ్యాహ్నం 12 కు బయలుదేరి అదేరోజు సాయంత్రం 7.30 కి విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు రాత్రి 8. 25 కు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2.20 కి సికింద్రాబాద్కు, ఉదయం 3 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది. సికింద్రాబాద్–విజయవాడ (07194/07195) మరో జనసాధారణ రైలు కూడా ఈ నెల 11 నుంచి 19వ తేదీ వరకు (14న మినహా) ప్రతిరోజు రాత్రి 11.30 గంటలకి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 కి విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 12 నుంచి 20 వరకు ప్రతిరోజు ఉదయం 8.35కు విజయవాడ నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–తిరుపతి (07188/07189) స్పెషల్ ట్రైన్ ఈ నెల 11న సాయంత్రం 7.30 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5.20 కి తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుపతి–కాకినాడ (07190/07191) స్పెషల్ ట్రైన్ ఈ నెల 12న రాత్రి 9.50 కి తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.55 కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 13న సాయంత్రం 6.45 కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.45 కు తిరుపతికి చేరుకుంటుంది. విజయవాడ–విజయనగరం (07184/07185) స్పెషల్ ట్రైన్ 11న నుంచి 13వ తేదీ వరకు మూడ్రోజుల పాటు రాత్రి 9.10 కి విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.20 కి విజయనగరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 11 నుంచి 14 వరకు 4 రోజుల పాటు ఉదయం 7.45 కు విజయనగరం నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 4.30 కు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ–విజయనగరం (07186/07187) మరో జనసాధారణ రైలు ఈ నెల 17, 18, 19, 20 తేదీల్లో మధ్యాహ్నం 12.30 కి విజయవాడ నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 9.30కు విజయనగరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే తేదీల్లో రాత్రి 10.55 కు విజయనగరం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45 కు విజయవాడ చేరుకుంటుంది. -
కాకినాడకు జనసాధారణ్ రైళ్లు
హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గురువారం నుంచి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక జనసాధారణ్ రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్-కాకినాడ (07086/07089) ఈ నెల 12వ తేదీ రాత్రి 11.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.40 కి కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17వ తేదీ సాయంత్రం 4.30 కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మరో ట్రైన్ కాకినాడ -సికింద్రాబాద్ (07201) 17వ తేదీ రాత్రి 10.30 కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. మరో ట్రైన్ కాకినాడ-సికింద్రాబాద్ (02775) 18వ తేదీ సాయంత్రం 6.30 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.40 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement