breaking news
janadhan accounts
-
జన్ధన్ ఖాతాలకు ఓవర్ డ్రాఫ్టు!
న్యూఢిల్లీ: జన్ధన్ ఖాతాదారులతోపాటు ఇతరులకు ఆర్థిక లబ్ధి కల్పించడం ద్వారా ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటును విస్తృతం చేసే పలు పథకాలను స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి మోదీ ప్రకటించనున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన(పీఎండీజేవై) కింద జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాలున్న వారికి రూ.10వేల వరకు ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించనుంది. రూపే కార్డు దారులకు ఉచిత ప్రమాద బీమా మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న రూ.లక్ష నుంచి మరింత పెంచనుంది. సూక్ష్మ బీమా పథకాన్ని కూడా తీసుకురానున్నారు. వీటితోపాటు అసంఘటిత రంగ కార్మికులకు మాత్రమే ఉద్దేశించిన అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) పింఛను మొత్తాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచనున్నట్లు కూడా ప్రకటించవచ్చునని సమాచారం. ప్రభుత్వం 2014లో ప్రకటించిన పీఎండీజేవై కింద 32.25 కోట్ల ఖాతాలు ప్రారంభం కాగా రూ.80,674.25 కోట్లు జమ అయ్యాయి. -
‘జన్ధన్’లో డిపాజిట్లు నామమాత్రమే
రాష్ట్రంలోని 83 లక్షల ఖాతాల్లో ఇప్పటివరకు జమ అయింది రూ.1,568 కోట్లే సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీ మొత్తంలో నల్లధనం జన్ధన్ ఖాతాల్లోకి మళ్లిందన్న వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనప్పటికీ వాస్తవానికి ఈ ఖాతాల్లో జమ అయిన మొత్తం నగదు నామమాత్రమేనని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 14 వరకు జన్«ధన్ ఖాతాల్లో జమ అయిన డిపాజిట్లు రూ. 74,123.13 కోట్లు అని ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక వెబ్సైట్ వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో 83.78 లక్షల జన్ధన్ ఖాతాలుండగా వాటిలో ఇప్పటివరకు జమ అయిన మొత్తం రూ.1,568.03 కోట్లుగానే నమోదైంది. పైగా మొత్తం ఖాతాల్లో నాలుగో వంతుకుపైగా ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా నిల్వలేదు. 23.40 లక్షల ఖాతాలు జీరో బ్యాలెన్స్లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటిని పక్కన పెడితే సగటున ఒక్కో జన్ధన్ ఖాతాలో ఉన్నది రూ.2,597.32 మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 8 మర్నాటి నుంచి ఇప్పటివరకు జమ అయిన డిపాజిట్లతో పోలిస్తే ఇది నామమాత్రమేనని స్పష్టమవుతోంది. ఆర్బీఐ అధికారులు రాష్ట్ర ఆర్థిక శాఖకు ఇచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణలోని అన్ని బ్యాంకుల్లో శనివారం వరకు జమ అయిన మొత్తం రూ.57,479 కోట్లు. దీంతో పోలిస్తే జన్ధన్ ఖాతాల్లో ఉన్న డబ్బు కేవలం 2.72 శాతం మాత్రమే. కాగా, ఏపీలో రూ.1,654.12 కోట్లు జన్ధన్ ఖాతాల్లో జమ అయ్యాయి. జన్ధన్ ఖాతాల్లోకి వచ్చిన నగదు నామమాత్రంగా ఉండటంతో బడా బాబులు మరిన్ని అడ్డదారుల్లో నల్లధనాన్ని మార్చుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.