breaking news
Jack Edwards
-
ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. 20 ఏళ్ల యువ సంచలనానికి ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఈ నెలఖారులో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో ఆసీస్ ఆతిథ్య పాక్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు.అయితే స్టార్ ప్లేయర్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, గ్లెన్ మాక్స్వెల్లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. వీరితో పాటు టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్ కూడా పాక్స్తాన్కు వెళ్లడం లేదు. వీరంతా నేరుగా శ్రీలంకలో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్లో చేరనున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు హాజిల్వుడ్, డేవిడ్ గాయపడిన సంగతి తెలిసిందే.హాజిల్వుడ్ గాయం కారణంగా యాషెస్ సిరీస్ నుంచి తప్పుకోగా.. డేవిడ్ తొడ కండరాల గాయంతో బిగ్ బాష్ లీగ్ మధ్యలో వైదొలగాడు. అయితే వీరిద్దరూ వరల్డ్కప్ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి.జట్టులోకి యువ ఆటగాళ్లు..ఇక బిగ్ బాష్ లీగ్లో అదరగొట్టిన పేసర్ మహ్లి బియర్డ్మాన్, ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్కు తొలిసారి ఆసీస్ టీ20 జట్టులో చోటు దక్కింది. 20 ఏళ్ల బియర్డ్మాన్ పెర్త్ స్కార్చర్స్ తరఫున అద్భుతంగా రాణించి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అదేవిధంగా జాక్ ఎడ్వర్డ్స్ అటు బంతితోనూ ఇటు బ్యాట్తోనూ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో వీరిద్దరికి జాతీయ సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఐపీఎల్-2026 వేలంలో ఎడ్వర్డ్స్ను రూ.3 కోట్ల భారీ ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇక పాక్-ఆసీస్ టీ20 సిరీస్ జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని మూడు టి20 మ్యాచ్లు లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో జరగనున్నాయి.పాక్తో టీ20లకు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, మహ్లి బియర్డ్మాన్, కూపర్ కానోలీ, బెన్ ద్వార్షుయిస్, జాక్ ఎడ్వర్డ్స్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), మాథ్యూ కునెమన్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాచదవండి: న్యూజిలాండ్తో సిరీస్ ఓటమి.. శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం -
భారత్తో మూడో వన్డే.. ఆసీస్ అన్క్యాప్డ్ ప్లేయర్కు చోటు.. ఎవరీ ఆల్రౌండర్?
స్వదేశంలో ఆస్ట్రేలియా సత్తా చాటింది. టీమిండియాతో మూడు వన్డేల సిరీస్ను 2-0 (IND vs AUS 2025 ODIs)తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా శనివారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టులో కీలక మార్పులు చేసింది. ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ (Jack Edwards)కు జట్టులో చోటిచ్చింది. దేశీ క్రికెట్లో అదరగొడుతూ సూపర్ ఫామ్లో ఉన్న ఈ న్యూ సౌత్వేల్స్ ఆటగాడిని తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. మార్నస్ లబుషేన్ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకుంది. మరోవైపు.. నామమాత్రపు ఆఖరి వన్డేలో మ్యాట్ కుహ్నెమన్కు కూడా ఆసీస్ యాజమాన్యం జట్టులో స్థానం కల్పించింది.ఇంతకీ ఎవరీ జాక్ ఎడ్వర్డ్స్?అండర్-19 వరల్డ్కప్-2018లో బ్యాట్, బంతితో మెరిసిన జాక్ ఎడ్వర్డ్స్ ఆస్ట్రేలియా రన్నరప్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ 216 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు పడగొట్టాడు.ఆసీస్ వన్డే కప్ చరిత్రలోనే..ఈ క్రమంలో ఫామ్ను కొనసాగిస్తూ ఎడ్వర్డ్స్ ఆస్ట్రేలియా డొమెస్టిక్ వన్డే టోర్నీలోనూ సత్తా చాటాడు. ఆసీస్ వన్డే కప్ చరిత్రలో అత్యంత పిన్న వయసు (18 ఏళ్లు)లో సెంచరీ చేసిన క్రికెటర్గా ఈ కుడిచేతి వాటం బ్యాటర్ రికార్డు సాధించాడు.ఏడేళ్ల క్రితం క్వీన్స్లాండ్పై ఈ న్యూ సౌత్వేల్స్ బ్యాటర్ 112 బంతుల్లోనే 116 పరుగులు సాధించాడు. అప్పటికి ఎడ్వర్డ్స్ వయసు 18 ఏళ్ల 165 రోజులు మాత్రమే కావడం గమనార్హం.ఇండియా- ఎ జట్టుతో వన్డేలలో అదరగొట్టిఇక ఇటీవల ఇండియా- ఎ జట్టుతో అనధికారిక వన్డే సిరీస్లోనూ ఎడ్వర్డ్స్ అదరగొట్టాడు. తొలి వన్డే మిస్సయినప్పటికీ.. రెండో వన్డేలో మాత్రం అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ల వికెట్లు కూల్చాడు. ఓవరాల్గా 4/56 గణాంకాలతో అదరగొట్టాడు.అంతేకాదు.. 75 బంతుల్లోనే 89 పరుగులతో ఆకట్టుకున్నాడు. అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా బౌలింగ్లోనూ చితక్కొట్టి తనను తాను నిరూపించుకున్నాడు.కాగా ఎడ్వర్డ్స్ అన్న మిక్కీ ఎడ్వర్డ్స్ కూడా క్రికెటరే. ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మాట్లలోనూ దేశీ క్రికెట్ ఆడాడు. ఇక 2018లో బిగ్ బాష్ లీగ్లో అడుగుపెట్టిన జాక్ ఎడ్వర్డ్స్ నాటి నుంచి పొట్టి ఫార్మాట్లో తన ప్రభంజనం కొనసాగిస్తూనే ఉన్నాడు.సిడ్నీ సిక్సర్స్ 2019-20, 2020-21 సీజన్లలో టైటిల్ గెలవడంలో జాక్ తన వంతు పాత్ర పోషించాడు. ఇక వాషింగ్టన్ ఫ్రీడమ్ తరఫున గత రెండు ఎడిషన్లలోనూ అదరగొట్టాడు. ఇప్పటి వరకు 63 టీ20 మ్యాచ్లలో 25 ఏళ్ల జాక్ ఎడ్వర్డ్స్ 700 పరుగులు చేయడంతో పాటు 33 వికెట్లు కూల్చడం విశేషం.భారత్తో మూడో వన్డేకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, జాక్ ఎడ్వర్డ్స్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ కుహ్నెమన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మ్యాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా.చదవండి:


