breaking news
heba patel
-
ఐదేళ్ల తర్వాత సినిమాగా తెలుగు వెబ్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?
టాలీవుడ్ ప్రియులను అలరించిన ఆసక్తికర వెబ్ సిరీస్ మస్తీస్. లాక్ డౌన్ టైమ్లో వచ్చిన ఈ సిరీస్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2020లో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సిరీస్కు క్రిష్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సిరీస్ సూపర్ హిట్ కావడంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఓటీటీలో సూపర్ హిట్గా నిలిచిన ఈ వెబ్ సిరీస్ను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని జూలై 16న ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా.. ఈ వెబ్ సిరీస్లో నవదీప్, హెబ్బా పటేల్, బిందు మాధవి, చాందిని చౌదరి, అక్షర గౌడ, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఎన్టీఆర్తో కుమారి..?
కుమారి 21ఎఫ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హేబాపటేల్ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తొలి సినిమాలోనే బోల్డ్ యాక్టింగ్తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటి ప్రస్తుతం రాజ్ తరుణ్, నిఖిల్ సినిమాల్లో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఈసినిమాలు ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే మరో క్రేజ్ ఆఫర్ను పట్టేసింది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన ఆడిపాడే ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాలో నటిస్తున్నాడు. స్పెయిన్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్కు హేబాను సెలెక్ట్ చేశారట. నిర్మాతగా హేబాకు తొలి బ్రేక్ ఇచ్చిన సుకుమార్, దర్శకుడిగా ఈ అమ్మడికి స్టార్ హీరో సరసన ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ సినిమాలో కూడా హేబా పాత్ర కుమారి 21ఎఫ్ తరహాలోనే బోల్డ్గా ఉండనుందట. కెరీర్ స్టార్టింగ్లోనే స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటి ముందు ముందు స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందేమో చూడాలి. -
అదిరిపోయే ఆఫర్లు పట్టేస్తున్న కుమారి