breaking news
grape fruit
-
‘అనాబ్ – ఎ–షాహి’ ఎక్కడోయి ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ముచ్చట గొలిపే పచ్చని పందిళ్లు.. పంట బాగా వస్తే ఆకుల్ని మించి గుత్తులుగా వేలాడుతూ కన్పించే పండ్లు. ఏళ్ల క్రితం హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతాల్లో కనువిందు చేసిన ద్రాక్ష(Grape) తోటలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యాయి. ధనికుల పంటగా ప్రాచుర్యం పొందిన ద్రాక్ష పది హేనేళ్ల క్రితం మేడ్చల్, కీసర, శామీర్పేట్, మహేశ్వరం, మన్సాన్పల్లి, గట్టుపల్లి, బాసగూడతండా, రావిర్యాల, మంకాల్, కోళ్లపడకల్, ఆకాన్పల్లి, డబిల్గూడ, పెండ్యాల్, నాగారం (Nagaram) తదితర ప్రాంతాల్లో విరివిగా సాగయ్యేది. ఒక్కో గ్రామం పరిధిలో 350 నుంచి 400 ఎకరాల్లో ఈ తోటలు వేసే వారు.సీజన్లో శివారు ప్రాంతాల్లో వెలిసే తాత్కాలిక దుకాణాల్లో చవకగా లభించే పండ్లను నగరవాసులు ఆస్వాదించేవారు. జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల్ని నిలిపి మరీ కిలోల కొద్దీ కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. తదనంతర కాలంలో భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరత ఏర్పడటం, పెట్టుబడి ఖర్చులు రెట్టింపవడం, చీడపీడల బెడద ఎక్కవవడం, అంచనాలకు మించి నష్టాలు వస్తుండటంతో క్రమేణా ద్రాక్ష సాగు తగ్గిపోయింది.ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ ఐటీ, అనుబంధ కంపెనీలు నగరానికి క్యూకట్టడం, నగరం విస్తరిస్తూ శివారు ప్రాంతాలు రియల్ వెంచర్లుగా మారడం, భూముల ధరలకు రెక్కలు రావడం కూడా ద్రాక్ష తోటలు కన్పించకుండా పోయేందుకు కారణమయ్యింది. అప్పట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదివేల ఎకరాల్లో సాగైన ద్రాక్ష తోటలు..ప్రస్తుతం కేవలం 115 ఎకరాలకే పరిమితమైపోయాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.నవాబుల కాలంలో..స్వాతంత్య్రానికి ముందు నిజాం నవాబుల భవంతుల వెనుక భాగం (బ్యాక్యార్డ్)లో ద్రాక్ష సాగు చేసేవారు. అయితే చాలాచోట్ల ఒకటి రెండు చెట్లే కన్పించేవి. హైదరాబాద్లో తెల్ల ద్రాక్ష పంటకు ‘అనాబ్–ఎ–షాహి’గా నామకరణం చేశారు. టోలిచౌకిలో గద్దె రామకోటేశ్వరరావు తొలిసారిగా ద్రాక్ష పంటను సాగు చేసినట్లు చరిత్ర చెబుతోంది. సాధారణంగా సమశీతోష్ణ మండలంలో పండే పంటను హైదరాబాద్ పరిసరాల్లో పండించి ఆయన ఒకరకంగా చరిత్ర సృష్టించారు.దీంతో అప్పటి ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అప్పట్లో ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల వరకు దిగుబడి సాధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అప్పటివరకు ఉగాండా, కెన్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో స్థిరపడిన వారు అక్కడి అలజడుల కారణంగా హైదరాబాద్కు వలస వచ్చారు. పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసి ’అనబిషాయి’ సాగు చేశారు. ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన కొందరు కూడా ద్రాక్షను సాగు చేశారు. ఇలా పలువురు ధనవంతులు ఈ పంటపై దృష్టి సారించారు. దీంతో ఆ పంటకు ’రిచ్మెన్ క్రాప్ (ధనికుల పంట)’గా పేరొచ్చింది.‘అనాబ్–ఎ–షాహి’ అంటే ద్రాక్షలో రారాజు అని అర్థం. నిజాం కాలంలో దీనికి నామకరణం చేశారు. 2005 నుంచి తగ్గుముఖందిగుబడితో పాటు లాభాలు అధికంగా ఉండటంతో 1990 తర్వాత స్థానిక రైతులు కూడా ఈ పంట సాగు మొదలు పెట్టారు. 1991లో హైదరాబాద్ వేదికగా గ్రేప్స్ పంటపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం గమనార్హం. కాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ద్రాక్ష పంటకు రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకుని మహారాష్ట్రలో కూడా సాగు ప్రారంభించారు. 2005 వరకు ఇక్కడి వైభవం కొనసాగింది. ఆ తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పటి ఈ పంట భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. దీంతో ఒకప్పుడు నగర వాసులకు తీపిని పంచిన స్థానిక ద్రాక్ష.. ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం మహా రాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ద్రాక్ష దిగుమతి అవుతోంది. స్థానిక రైతులు పోటీలోనే లేని పరిస్థితి ఉంది. మెజార్టీ ఆదాయం సాగు ఖర్చుకేనేను గత 15 ఏళ్లుగా ద్రాక్ష పంటను సాగు చేస్తున్నా. ఒకసారి మొక్కను నాటితే 20 ఏళ్లపాటు దిగుమతి వస్తుంది. మొదట్లో ’థాంసన్’ వెరైటీని సాగు చేశా. తర్వాత ’మాణిక్ చమాన్’ వెరైటీని ఎంచుకున్నా. ఎకరాకు వెయ్యి మొక్కలు చొప్పున నాలుగు ఎకరాల్లో నాటా. మొక్కల ఎంపిక సహా సస్యరక్షణలో చిన్నచిన్న మెళుకువలు పాటించి నాటిన రెండేళ్లకే అనూహ్యంగా మంచి దిగుబడిని సాధించా. ప్రస్తుతం ఒక్కో చెట్టు నుంచి 20 కేజీల వరకు దిగుమతి వస్తోంది. ఎకరా పంటకు కనీసం నాలుగు నుంచి ఐదు లక్షల ఆదాయం వస్తుంది. అయితే కూలీ రేట్లు, ఎరువుల ధరలు పెరగడంతో మెజార్టీ ఆదాయం పంట సాగుకే ఖర్చవుతోంది. – కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, రైతు, తుక్కుగూడఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదుఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదు. భూములూ అందుబాటులో లేవు. దీంతో ద్రాక్ష సాగు తగ్గిపోయింది. కూలీల ఖర్చులు పెరగడం, దిగుబడి సమయంలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షం లాంటి వాటితో పంట నష్టపోవాల్సి వస్తోంది. మాలాంటి అనుభవం ఉన్న పాత రైతులే ద్రాక్షను సాగు చేయలేని పరిస్థితి ఉంది. ఇక కొత్తగా ఎవరైనా ప్రయత్నించినా భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. – చింతల వెంకట్రెడ్డి, ఒకప్పటి ద్రాక్ష రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత -
దేశంలో మద్యం రాజధాని ఏది?
భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. దేశంలోని ప్రతీ నగరానికి తనదైన కథ ఉంటుంది. కొన్ని నగరాలు అక్కడి ఆహారానికి ప్రసిద్ధి చెందగా, మరికొన్ని సాంస్కృతిక వారసత్వానికి పెట్టిందిపేరుగా నిలిచాయి. దేశంలోని ఏ నగరానికి వెళ్లినా అక్కడ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే మన దేశంలో ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే ఒక నగరం ఉందనే సంగతి మీకు తెలుసా? మహారాష్ట్రలోని నాసిక్ నగరాన్ని ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. అంటే భారతదేశ మద్యం రాజధాని. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మద్యంలో ఎక్కువ భాగం ఈ నగరంలోనే తయారవుతుంది. ఈ నగరంలో 52 వైన్ ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 18 వేల ఎకరాల్లో ద్రాక్షసాగు చేస్తున్నారు. దీనిలో అధిక భాగం వైన్ తయారీకి ఉపయుక్తమవుతుంది. నాసిక్లోని నేల రెడ్ లేటరైట్ రకానికి చెందినది. అంతే కాదు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉంది. ద్రాక్ష సాగుకు అవసరమైన నీటి పరిమాణం. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా, ఇక్కడ ద్రాక్ష విరగకాస్తుంది. ఒక నివేదిక ప్రకారం ఈ నగరంలో ప్రతి సంవత్సరం 20 టన్నులకు పైగా ద్రాక్ష ఉత్పత్తి జరుగుతుంది. ఇది కూడా చదవండి: ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ఏమిటి? ఎవరికి ప్రయోజనం? -
హృదయమున్న ద్రాక్ష!
ద్రాక్షపండు కేవలం రుచి విషయంలోనే కాదు... ఆరోగ్య ప్రయోజనాల విషయంలోనూ తనకు తానే సాటి. ద్రాక్షతో ఒనగూరే లాభాల్లో ఈ కింద పేర్కొన్నవి కొన్ని మాత్రమే.మనుషుల్లో యాంజియోటెన్సిన్ అనే ఒక రకం హార్మోన్కు రక్తనాళాలను సన్నబార్చే గుణం ఉంది. ద్రాక్షపండు ఆ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ విధంగా కూడా ద్రాక్ష గుండెజబ్బులను నివారిస్తుంది. ద్రాక్షలోని కేటెచిన్ అనే యాంటీ యాక్సిడెంట్ కూడా అనేక విధాల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. రక్తనాళాలను తెరచుకొని ఉండేలా చేసే నైట్రిక్ ఆక్సైడ్ను ద్రాక్షపండ్లు వెలువరిస్తాయి. తద్వారా అవి రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చూస్తాయి. ఇలా కూడా అవి గుండెజబ్బులను దరిచేరకుండా చేస్తాయి. అంటే ద్రాక్షపండు ఇలా అనేక మార్గాల్లో గుండెకు మేలు చేస్తుందన్నమాట. -
చార్మిరాకిల్
షెహర్ కీ షాన్ ద్రాక్ష పండ్ల గుత్తిని అందుకుని ఆకలితీరా ఆరగించేందుకు అనుమానపు చూపులతో భయంభయంగా గెంతుతున్న ఉడతలు... అవి ఆ పండ్లను మాయం చేసేలోపు కొన్నింటిని నోటగరుచుకునేందుకు కాచుక్కూర్చున్న పక్షులు. ఆధారాన్ని అల్లుకుని ఎగబాకిన లతలు.. వాటికి విరబూసిన పూలు.. నిండుగా విచ్చుకుని కనువిందు చేసే గులాబీలు.. గుదిగుచ్చి పేర్చిన పూలగుత్తులు... ఈ అందం ఎక్కడిదో కాదు... నగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చార్మినార్ది. చార్మినార్ అనగానే... అది హైదరాబాద్కు ల్యాండ్మార్క్, నాలుగు మినార్లు ప్రధానాకర్షణగా నిర్మించిన కట్టడంగానే చాలామందికి తెలుసు. కానీ ఆ నిర్మాణ కౌశలాన్ని ఓసారి పరిశీలిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. పర్షియన్ నిర్మాణ శైలితో రూపొందిన ఈ కట్టడం పై అంతస్తులో పనితీరు... దాని సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవేమో అనిపిస్తుంది. ప్రపంచ నలుమూలల్లో కనిపించే ప్రత్యేకతలన్నీ హైదరాబాద్లో కొలువుదీరాలని కలలుగన్న కుతుబ్షాహీలు ఈ కట్టడం విషయంలోనూ అదే పంథాను అనుసరించారు. పర్షియా నుంచి ఇంజినీరింగ్ నిపుణులను పిలిపించి దానికి ప్రణాళిక రూపొందించడమే కాకుండా... అది సాధారణ కట్టడంగా ఉండకూడదన్న ఉద్దేశంతో అడుగడుగునా సోయగాలద్దించారు. రెండో అంతస్తులో ప్రత్యేకంగా నిర్మించిన మసీదు గోడలపై నిజంగా గులాబీ కొమ్మలు వేలాడుతున్నాయా అనేంత సహజంగా తీర్చిదిద్దారు. మరికొన్ని కళాఖండాలను పరిశీలిస్తే... గోడలకు అతికించారా అన్న అనుభూతి కలుగుతుంది. ఒకే గోడకు రెండు డిజైన్లు ఉంటాయన్నమాట. చార్మినార్ అనగానే మనకు నాలుగు మినార్లే తెలుసు. కానీ రెండో అంతస్తు పైభాగానికి వెళ్తే చిన్నచిన్న మినార్లు మరిన్ని కనిపిస్తాయి. కింది నుంచి పై వరకు రకరకాల డిజైన్లతో వాటిని తీర్చిదిద్దారు. ఆ గోడలపై నాలుగు వైపులా లతలు, పూలు, వాటిపై సేదతీరే ఉడతలు, పక్షులు, పైభాగంలో వేళాడుతున్నట్టుగా తామర మొగ్గలు... ఇలా ఒకటేమిటి... ఒకదాన్ని మించింది మరొకటి. గతంలో ఓ కుటుంబం చార్మినార్ పైభాగం నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటంతో అక్కడికి సందర్శకులను అనుమతించటం లేదు. దీంతో ఈ సౌందర్యం చూసే అవకాశం లేకుండా పోయింది. అందుకే మీ కోసం ఈ ప్రయత్నం. ఫొటోలు: అమర్ గౌరీభట్ల నరసింహమూర్తి