-
‘కచ్చా బాదం’ మరువక ముందే ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న మరో సాంగ్
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన కూడా సెకన్ల వ్యవధిలో ప్రపంచం నలుమూలలా విస్తరిస్తోంది. తమ టాలెంట్తో కొందరు రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతున్నారు. పాటలు, డ్యాన్స్, రీల్స్ ఇంటర్నెట్లో వైరల్ అవ్వడంతో పాపులారిటీ తెచ్చుకుంటారు. కొన్నిరోజుల వరకు వీరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. బచ్పన్కా ప్యార్ బుడ్డోడు, కచ్చా బాదమ్ అంకుల్ వీరంతా అలా ఫేమస్ అయిన వారే... తాజాగా కచ్చా బాదమ్ పాట మరవక ముందే మరో పాట నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై బండి మీద ద్రాక్ష పండ్లను అమ్ముతున్న వ్యక్తి పాడిన పాట ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇందులో ఓ వృద్ధుడు బండి మీద జామపండ్లు, ద్రాక్షను అమ్ముతూ పాట పాడుతూ కనిపిస్తున్నాడు. చేతిలో టీ కప్పు పట్టుకుని, 15 రూపాయల కే 12 అంగూర్లు తీసుకోండి అంటూ ఓ పాటను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 2.5మిలియన్ల మంది వీక్షించారు. 109వేల లైక్స్ వచ్చాయి. కావాలంటే దీన్ని మీరూ చూసేయండి. చదవండి: సీఆర్పీఎఫ్ బంకర్పై మహిళ బాంబు దాడి.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by ★彡[ꜱᴀʟɪᴍ ɪɴᴀʏᴀᴛ]彡★ (@saaliminayat) -
‘ద్రాక్ష’కు పూర్వ వైభవమే లక్ష్యం
గజ్వేల్: రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఉద్యానవనశాఖ సిద్ధమవుతోంది. ఒకప్పుడు ద్రాక్షకు హబ్గా ఉన్న ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలతోపాటు సాగుకు అనుకూలంగా ఉన్న మహబూబ్నగర్, నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో రైతులను ప్రోత్సహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో సిద్దిపేట జిల్లా ములుగు కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యానవర్సిటీ కీలకంగా వ్యవహరించనుంది. రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాలలో శనివారం నిర్వహించిన సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో 50వేల ఎకరాల్లో సాగు.. రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు ఒకప్పుడు ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలే ఆధారం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనూ కొంత సాగయ్యేది. ఏటా 50వేల ఎకరాలకుపైగా తోటల్లో పండేది. ద్రాక్ష గజ్వేల్ సాగులో సింహభాగాన్ని ఆక్రమించేది. సీడ్లెస్ థామ్సన్, తాజ్గణేష్ రకాలను ప్రధానంగా సాగుచేసేవారు. విదేశాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అయ్యేది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ద్రాక్ష రైతులు కోట్లలో నష్టపోయారు. దీంతో అక్కడ సాగు కనుమరుగైంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్పల్లిలో రవీందర్రెడ్డి అనే రైతు, విశ్వనాథపల్లిలో ధర్మారెడ్డితోపాటు జిల్లాలోని మరో 10మంది రైతులు కలిసి 88ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ద్రాక్ష దిగుమతి అవుతోంది. సాగు పెంపునకు ఏం చేద్ధాం? రాజేంద్రనగర్లోని ఉద్యానవన కళాశాలలో జరిగిన మేధోమథన సదస్సులో వర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ నీరజాప్రభాకర్, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి, వైఎస్సార్హెచ్యూ మాజీ చాన్స్లర్ డాక్టర్ శిఖామణి, జాతీయ ద్రాక్ష పరిశోధనా సంస్థ డైరెక్టర్ సోమ్కుమార్ పాల్గొన్నారు. ఏటా వెయ్యి ఎకరాల్లో ద్రాక్ష సాగు, అధిక దిగుబడి రకాలు, కొత్త వంగడాలపై రైతులకు అవగాహన తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పుణేలోని జాతీయ ద్రాక్ష పరిశోధనా సంస్థ సహకారంతో లాభసాటి రకాల వృద్ధి, సాగు విస్తీర్ణం పెంపు లక్ష్యంగా ప్రణాళిక చేశారు. ఇది కొద్ది రోజుల్లోనే కార్యరూపం దాల్చనుందని ములుగు వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్ ‘సాక్షి’కి చెప్పారు. -
లాభాల గుత్తులు
కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలోని ఓ ద్రాక్ష తోట కనువిందు చేస్తోంది. రైతు ఆదినారాయణ సాగు చేసిన తోటను చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. గుత్తులు గుత్తులుగా ఉన్న ఈ ద్రాక్ష .. సీడ్లెస్ కావడంతో లేటు చేయకుండా తినాలనిపిస్తుంది. ఒక్కో చెట్టుకు ఎన్ని గుత్తులో... ఒక్కో గుత్తికి ఎన్ని కాయల్లో అనేలా తోటంతా విరగ్గాసింది. - మహబూబ్బాషా, అనంతపురం
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement