-
ప్రొద్దుటూరులో రక్త దోపిడీ
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్లైన్ : ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు రోగులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. రోగులకు రక్తం ఎక్కించాల్సి పరిస్థితి వస్తే ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పెద్దమొత్తంలో డబ్బు చెల్లించే స్తోమత తమకు లేదని, ప్రభుత్వాసుపత్రికి వెళ్తామని రోగులు చెబుతున్నా అక్కడ ఉన్న రక్తం సురక్షితం కాదంటూ పలు నర్సింగ్హోంలకు చెందిన సిబ్బంది రోగులను మభ్యపెడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు రూ.2000-2500 చెల్లించి ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే రక్తం ఎక్కించుకుంటున్నారు. ప్రొద్దుటూరులో 350 పడకల జిల్లా ఆస్పత్రి ఉంది. దానికి అనుబంధంగా బ్లడ్బ్యాంక్ నడుస్తోంది. దాతలు, స్వచ్ఛంద సేవాసంస్థల సహకారంతో రక్తం సేకరిస్తూ నిల్వ చేస్తున్నారు. రోడ్డు ప్రమాద బాధితులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణిలకు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని రోగులకు బ్లడ్బ్యాంక్లో ఉన్న రక్తం ఇవ్వాలంటే రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు నుంచి లెటర్ తీసుకొని రావాలి. రోగులను భయపెడుతున్న యాజమాన్యాలు రోగులు ఇక్కడే రక్తం ఎక్కించుకోవాలని కొన్ని నర్సింగ్ హోం ల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్బ్యాంక్లో ఉండే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుందని డాక్టర్లు రోగులకు చెప్పడంతో వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే రక్తం ఎక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. డాక్టర్ లెటర్ ఆధారంగా బ్లడ్బ్యాంక్ నుంచి రక్తం తీసుకొని రావాలంటే కేవలం రూ.850 మాత్రమే ఖర్చు అవుతుంది. అయితే నర్సింగ్హోంలలో మాత్రం రక్తపరీక్షల కోసమని రూ.2000-2500 దాకా వసూలు చేస్తున్నట్లు రోగుల బంధువు లు అంటున్నారు. ఎవరైనా రక్తమివ్వాలంటే ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్లకు వచ్చి రక్తం ఇవ్వాలి. రక్తం నిల్వ చేసే బ్యాగులను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. వీటిని బయట మార్కెట్లో ఎక్కడా విక్రయించరాదు. అయితే ప్రొద్దుటూరులో మాత్రం పలు హోల్సేల్ దుకాణాలలో, మందుల షాపుల్లో విచ్చల విడిగా విక్రయిస్తున్నారు. అధికారులకు తెలిసి కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రక్త పరీక్షల్లోనూ చాలా వ్యత్యాసం సాధారణంగా రక్తం ఇచ్చే వ్యక్తికి జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్బ్యాంక్లో హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, హెపటైటీస్ సీ, వీడీఆర్ఎల్, మలేరియా లాంటి ఐదు రకాల పరీక్షలను నిర్వహిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం కేవలం హెచ్ఐవీ, హెపటైటిస్ బీ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తారు. రక్తం సేకరించడం నేరం జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్బ్యాంక్లో నిల్వ ఉన్న రక్తం చాలా సురక్షితమైంది. ఒకసారి దాత నుంచి రక్తం సేకరించాక అది 45 రోజుల వరకూ సురక్షితంగా ఉంటుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రక్తం సేకరించడం నేరం. రక్తం నిల్వ చేసే బ్యాగులను బయట విక్రయించరాదు. - డాక్టర్ విజయనిర్మల, బ్లడ్బ్యాంక్ వైద్యురాలు -
సంసారంలో సారా చిచ్చు
అమరచింత, న్యూస్లైన్: మద్యం మహమ్మారి ఆ కుటుంబంలో చిచ్చురేపింది. నిత్యం తాగొచ్చి గొడవపడే భర్త వేధింపులకు తాళలేక ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను విషమిచ్చింది. అపస్మారకస్థితికి చేరుకున్న ఆ ముగ్గురు మృతువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడిచారు. దసరా పండుగ రోజున ఈ విషాదకర సంఘటన సోమవారం ఆత్మకూర్ మండలం కొంకనివానిపల్లి గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల ఆంజనేయలు, సుజాత (28)లకు శివ(7), శిరీష(5)అనే ఇద్దరు సంతానం. భార్యాభర్తలు వ్యవసాయం చేస్తూ తమ పిల్లలను స్థానిక ప్రైవేట్ స్కూల్ లో చదివిస్తూ ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఇంతలో మద్యం రక్కసి వారి సంసారంలో మంటపెట్టింది. తాగుడుకు బానిసగా మారిన ఆంజనేయులు భార్యతో నిత్యం గొడవపడేవాడు. దీనికి తోడు తమ దాయాదులతో కలిసి తన మద్యం సేవించడాన్ని సుజాత జీర్ణించుకోలేకపోయింది. తమ కుటుంబాన్ని చిన్నచూపు చూస్తూ అవమానించే వారితో ఎలా కలిసుంటావని భర్తను పలుమార్లు హెచ్చరించింది. అయినా ఆంజనేయులు ప్రవర్తనలో మార్పురాలేదు. ఇదిలాఉండగా గ్రామంలో దసరా వేడుకల్లో ఉత్సాహంగా గడిపిన సుజాత పండుగ రోజు భర్త మద్యం తాగిరావడం చూసి గొడవకు దిగింది. పరస్పరం దూషించుకున్నారు. మనస్తాపం చెందిన సుజాత సోమవారం ఉదయం తన ఇద్దరు పిల్లలను వెంటతీసుకుని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. అక్కడే తన పిల్లల చేత పురుగుమందు తాగించి తానూ తాగింది. దీంతో వారు అపస్మారకస్థితికి చేరుకున్నారు. ఇది గమనించిన స్థానికులు ముగ్గురిని ఆత్మకూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ప్రాణాపాయస్థితి కొట్టుమిట్టాడుతున్న సుజాత మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలువిడిచింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు కొంకనివానిపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఇరు కుటుంబసభ్యులు పంచాయితీ పెట్టారు. రూ.3లక్షల నష్టపరిహారం చెల్లించాలని సుజాత బంధువులు డిమాండ్ చేయగా ఆంజనేయులు కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో ఆత్మకూర్ పోలీస్స్టేషన్లో బాధిత బంధువులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ అబ్దుల్ రజాక్ తెలిపారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేయూ వైస్ చాన్స్లర్ రమేశ్పై సమగ్ర విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
చెట్టు మీదపడి కూలీ మృతి
నిజ బృందావన దర్శనం
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే
‘బలగం’తో మంచి గుర్తింపు
గిరిజన గురుకులాల దరఖాస్తుకు నేడు ఆఖరు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
మిద్దైపె నుంచి పడి యువకుడి మృతి
ఖాదర్లింగ స్వామి ఉరుసు ప్రారంభం
తప్పక చదవండి
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- Telangana: ప్రారంభమైన టెట్ పరీక్ష
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
Advertisement