breaking news
german parliament
-
తదుపరి జర్మనీ చాన్స్లర్ మెర్జ్ !
బెర్లిన్: క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) నేత ఫ్రెడరిక్ మెర్జ్ తదుపరి జర్మనీ చాన్స్లర్గా అధికార పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. జర్మనీ పార్లమెంట్(బండేస్టాగ్)కు ఆదివారం జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్యూ) కూటమి ముందంజలో నిలిచింది. దీంతో తమ కూటమి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుందని సీడీయూ/సీఎస్యూ కూటమి ముఖ్యనేతలు ప్రకటించారు. జర్మనీ ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ ఏఆర్డీ, జెడ్డీఎఫ్ పబ్లిక్ టెలివిజన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం సీడీయూ,సీఎస్యూ కూటమికి 29 శాతం ఓట్లు పడ్డాయి. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్డీ) పార్టీకి 19.6 శాతం ఓట్లు పడ్డాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఇన్నాళ్లూ ఒలాఫ్ షోల్జ్ సారథ్యంలో అధికారంలో కొనసాగిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్డీపీ) కేవలం 16 శాతం ఓట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. దీంతో ఒలాఫ్ షోల్జ్ తన ఓటమిని అధికారికంగా అంగీకరించారు. ‘‘ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలొచ్చాక ప్రభుత్వ ఏర్పాటుకు ఏమాత్రం ఆలస్యం చేయబోం’’ అని ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆదివారం బెర్లిన్లో ఫ్రెడరిక్ మెర్జ్ వ్యాఖ్యానించారు. -
విశ్వాస పరీక్షలో షోల్జ్ ఓటమి
బెర్లిన్: జర్మనీ చాన్సెలర్ ఒలాఫ్ షోల్జ్ సోమవారం పార్లమెంట్లో విశ్వాస పరీక్షలో ఓటమి పాలయ్యారు. యూరప్లోనే అత్యధిక జనాభా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీలో ఫిబ్రవరిలోనే ముందస్తు ఎన్నికలకు ఈ పరిణామం దారి తీయనుంది. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నవంబర్ 6న కుప్పకూలింది. రాజ్యాంగం ప్రకారం సభలో విశ్వాస పరీక్ష చేపట్టాల్సి ఉంటుంది. మొత్తం 733 మంది సభ్యులుండే దిగువ సభ బుండెస్టాగ్లో సోమవారం షోల్జ్కు అనుకూలంగా 207 మంది ఓటేశారు. దీంతో, ఆయన సభ విశ్వాసం పొందలేకపోయినట్లు ప్రకటించారు. విశ్వాసంలో గెలవాలంటే మరో 367 ఓట్ల అవసరముంది. ఫిబ్రవరి 23వ తేదీన ఎన్నికలు జరపాలని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఉక్రెయిన్కు ఆయుధ, ఆర్థిక సాయమందించేందుకు సిద్ధమని ప్రకటిస్తున్న షోల్జ్ ‘సోషల్ డెమోక్రాట్’పార్టీకి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు తక్కువని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం యూనియన్ బ్లాక్ ముందంజలో ఉందంటున్నారు. -
ఎన్నికల్లో మెర్కెల్ హ్యాట్రిక్
బెర్లిన్: జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ నేతృత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్(సీడీయూ) హ్యాట్రిక్ సాధించింది. గడచిన రెండు దశాబ్దాల ఫలితాల కన్నా అధిక సీట్లు కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించింది. అయినప్పటికీ, అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీకి 4 సీట్లు తగ్గడం గమనార్హం. సోమవారం వెల్లడించిన అధికారిక ఫలితాల్లో సీడీయూ దాని భాగస్వామ్య క్ట్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్యూ)లు 41.7 శాతం ఓట్లతో భారీ విజయం నమోదు చేసుకున్నాయి. యూరో జోన్లో ప్రస్తుతం నెలకొన్న పెను ఆర్థిక సంక్షోభం నేపథ్యంలోనూ ప్రజలందరూ 59 ఏళ్ల మెర్కెల్ నాయకత్వానికే మద్దతు పలకడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.