దృష్టి దినోత్సవం సందర్భంగా మాక్సివిజన్ అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ప్రముఖ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి రెండు అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సినీనటి జీవిత రాజశేఖర్ ఆధ్వర్యంలో ‘వెలుగులోకి నడక’ పేరుతో కళ్లకు గంతలు కట్టుకుని నడిచే కార్యక్రమం, సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి నేతృత్వంలో మాక్సివిజన్ తరఫున పేద పిల్లలకు ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొంది.
నేత్ర పరిరక్షణ విషయంలో ప్రజలను చైతన్యం చేయడంలో మాక్సివిజన్ హాస్పిటల్ ముందంజలో ఉందని హాస్పిటల్ సీఈవో సందీప్ బెనర్జీ పేర్కొన్నారు.