breaking news
expired material
-
స్విగ్గీ ఇన్స్టామార్ట్కు ఎఫ్ఎస్ఎస్ఏఐ 9 నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారులకు కల్తీ, పాడై న ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్కు భారత ఆహార భద్రత, ప్రమాణా ల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఏకంగా తొమ్మిది నోటీసులు జారీ చేసింది. ఆహార భద్ర త, ప్రమాణాల చట్టం–2006 కింద నమోదైన ఈ ఉల్లంఘనలపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ను ఆదేశించింది. స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా కాలం చెల్లిన, పాడైన ఉత్ప త్తులు సరఫరా అవుతున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ’నాయిస్’ బ్రాండ్ గుడ్లను లైసెన్స్ పరిధిలో లేని కేటగిరీ కింద విక్రÆ ‡ుుస్తున్నారని, అనుమతులు పొందే వరకు వాటి విక్రయాలు నిలిపివేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. ‘హెల్తీఫై 100% వే ప్రొటీన్ 1 కేజీ’, ‘నాయిస్ హోమ్స్టైల్ మద్రాస్ మిక్చర్ విత్ పీనట్స్’ ఉత్పత్తులను గడువు తీరిన తర్వాత సర ఫరా చేశారు. ‘అక్షయకల్ప ఆర్గానిక్ ఎగ్’, ‘కక్కే దా పరాఠా’ ఉత్పత్తులు కుళ్లిపోయి, దుర్వాసన వస్తున్నా సంస్థ దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. పసిపిల్లల ఆహారం సైతం కలుషితమైందని, పాడైన ఉత్పత్తిని వెనక్కి ఇచ్చినా మళ్లీ అదే వస్తువును సరఫరా చేయడంపై నోటీసుల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్యాకింగ్ సరిగాలేని ఆహారంతో పాలు, గుడ్లను డెలివరీ చేస్తున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది.తప్పుడు లైసెన్సులు.. నివేదికకు ఆదేశంకొన్ని ఫుడ్ బిజినెస్ సంస్థలు తప్పుడు, చెల్లని లేదా ఉనికిలోనే లేని ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్లతో ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని ప్రాధికార సంస్థ ఆక్షేపించింది. రిజిస్ట్రేషన్లో ఉన్న పేర్లకు, విక్రయిస్తున్న పేర్లకు పొంతన లేదని తెలిపింది. ఆహార భద్రతపై ఫిర్యాదులు అందితే కేవలం డబ్బులు వాపసు ఇస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని స్పష్టం చేసింది. విక్రయదారుల పర్యవేక్షణ, నాణ్యత పరిశీలనలో సంస్థ విఫలమైందని పేర్కొంది. ఈ ఉల్లంఘనలపై ఆధారాలతో సహా పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని, నాణ్యతా ప్రమాణాలు, స్టాక్ నిర్వహణ, పరిశుభ్రతపై తీసుకుంటున్న చర్యల వివరాలు సమర్పించాలని స్విగ్గీ ఇన్స్టామార్ట్ను ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకునే నివారణ చర్యలు తెలపాలని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా నివేదిక ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. -
యూజ్బై, ఎక్స్పైరీ డేట్, బెస్ట్ బిఫోర్ మధ్య తేడా ఇదే..
కిరాణా దుకాణం, రిటైల్స్టోర్ వంటి సూపర్మార్కెట్లకు వెళ్లి ఏదైనా వస్తువు కొనుగోలు చేసేప్పుడు ప్రధానంగా దాని ఎక్స్పైరీ తేదీ గమనిస్తాం కదా. ఒక్కో ప్రోడక్ట్పై ఒక్కో విధంగా ఈ ఎక్స్పైరీ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు వివిధ కంపెనీలు తయారు చేసే ప్రతి ప్రోడక్ట్పై యూజ్బై, ఎక్స్పైరీ డేట్, బెస్ట్ బిఫోర్ వంటి లేబుళ్లతో తేదీని నిర్ణయించడం గమనిస్తుంటాం. అందులో ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. కంపెనీ లేబుల్పై ప్రచురించిన డేట్ ముగిసినా కొన్ని పదార్థాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవచ్చని కొందరు చెబుతున్నారు. అయితే అలాంటి లేబుల్ ఉన్న ఉత్పత్తులను గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం.ఇదీ చదవండి: ‘టాటా సుమో’.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..ఎక్స్పైరీ డేట్: ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ లేబుల్పై ఎక్స్పైరీ డేట్ ఉంటే అందులోని వస్తువులు, పదార్థాలు కచ్చితంగా ఆతేదీ లోపే వినియోగించాల్సి ఉంటుంది. తేదీ ముగిసిన వాటిని అసలు ఉపయోగించకూడదు.యూజ్బై: కొన్ని వస్తువులు, పదార్థాల ప్యాకేజీ లేబుల్పై యూజ్బై తేదీ ఉంటుంది. ఎక్స్పైరీ తేదీలాగే ఆలోపే అందులోని పదార్థాలను ఉపయోగించుకోవాలి.బెస్ట్బిఫోర్: ఈ లేబుల్ ఉత్పత్తికి సంబంధించిన అత్యుత్తమ నాణ్యత తేదీని సూచిస్తుంది. ఈ తేదీ నాణ్యత, భద్రతకు సంబంధించిందని గమనించాలి. ‘బెస్ట్ బిఫోర్’ తేదీ తర్వాత ప్యాకేజీలోని పదార్థాలు తాజాగా, రుచిగా ఉండకపోవచ్చు. పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే అత్యవసర సమయాల్లో వాటిని వినియోగించవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. బెస్ట్బిఫోర్ తేదీ ముగిసిన తర్వాత పదార్థాలు వాడకపోవడమే మంచిదని ఇంకొందరు చెబుతున్నారు. -
చంద్రన్న కానుకలో గడువుతీరిన సరుకులు
చిత్తూరు జిల్లా సత్యవేడులో సంక్రాంతికి చంద్రన్న కానుకగా ఇచ్చిన పదార్థాలు తిని అస్వస్థతకు గురైన ఘటనపై అధికారులు స్పందించారు. సంక్రాంతి కానుకగా అందించిన సరుకుల్లో గడువు తీరిన (ఎక్స్పైర్ అయిన) సరుకులు కూడా ఉన్నాయని, వాటినే వినియోగదారులకు సరఫరా చేశారని నిర్ధారించారు. అస్వస్థతకు గురైన బాధితులను తహసిల్దార్ సత్యనారాయణ నాయుడు, ఇతర సిబ్బంది పరామర్శించారు. ఈ సరుకులను సరఫరా చేసిన సంస్థపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


