-
12 మంది ఐఏఎస్లకు ఎక్సలెన్స్ అవార్డులు
పంద్రాగస్టు వేడుకల్లో పురస్కారాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 12 మంది ఐఏఎస్ అధికారులు, వారి బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం 2017 ఎక్సలెన్స్ అవార్డులను ప్రకటించింది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రభుత్వం అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేయనుంది. మూడు కేటగిరీల్లో ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. వినూత్న కార్యక్రమాల అమలు, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలు, పనితీరు కేటగిరీల్లో వ్యక్తిగత, గ్రూపు, సంస్థలుగా అవార్డులను నిర్ణయించింది. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శాలిని మిశ్రా ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వినూత్న కార్యక్రమాలు: 1. ఎ.దేవసేన–జనగాం కలెక్టర్ (ప్రభుత్వ పాఠశాలల బాలికలకు మార్షల్ ఆర్ట్స్, స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమాలు) 2.జ్యోతి బుద్ధ ప్రకాశ్–ఆదిలాబాద్ కలెక్టర్, ఐఏఎస్లు ఆర్వీ కర్ణన్, అనురాగ్ జయంతి (ఉట్నూర్ ఐటీడీఏలో స్టార్–30 కార్యక్రమం) 3. టి.చిరంజీవులు–హెచ్ఎండీఏ కమిషనర్, హెచ్ఎండీఏ (డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్) జనరల్: 1.డి.యోగితారాణా–నిజామాబాద్ కలెక్టర్ (మానవతా సదన్, హెచ్ఐవీ బాధిత పిల్లల పునరావాస ప్రాజెక్టు) 2. ఏ.మురళి–భూపాలపల్లి కలెక్టర్, డీఎంహెచ్వో అప్పయ్య, ములుగు–గోపాల్, చిట్యాల–రవి ప్రవీణ్రెడ్డి, ఏటూరునాగారం–అపర్ణ, మహదేవ్పూర్–వాసుదేవరెడ్డి (జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు విశ్వాసం కల్పించడం) 3. డాక్టర్ శరత్–జగిత్యాల కలెక్టర్, జిల్లా సివిల్ సప్లైస్ విభాగం (ధాన్యం సేకరణ) ప్రతిష్టాత్మక కార్యక్రమాలు: 1. మిషన్ భగీరథ: వెంకట్రామరెడ్డి–సిద్దిపేట కలెక్టర్, ఆర్డబ్ల్యూఎస్ విభాగం 2. మిషన్ కాకతీయ: రాజీవ్గాంధీ హన్మంతు–భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఇరిగేషన్ విభాగం 3. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్: జ్యోతి బుద్ధ ప్రకాశ్–ఆదిలాబాద్ కలెక్టర్, కె.కృష్ణారెడ్డి–జాయింట్ కలెక్టర్, సీహెచ్.సూర్యనారాయణ–ఆర్డీవో, ఆర్.అర వింద్కుమార్–సూపరింటెండెంట్ 4.హరితహారం: సురేంద్రమోహన్–సూర్యాపేట కలెక్టర్ 5. హరితహారం: ప్రస్థాన్ జె.పాటిల్–వరంగల్ రూరల్ కలెక్టర్ 6. ఆరోగ్యలక్ష్మి: గౌరవ్ ఉప్పల్–నల్లగొండ కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ విభాగం. -
కళాతపస్వికి సాక్షి జీవన సాఫల్య పురస్కారం
భారతీయ సంగీతానికి వెండితెరపై కె.విశ్వనాథ్ తొడిగిన బంగారు కంకణం..‘శంకరాభరణం’. పాశ్చాత్య సంగీతానికి ఆదరణ పెరుగుతున్న రోజుల్లో శంకరశాస్త్రి అనే ఒక పాత్రకు యాభై ఏళ్ల వ్యక్తిని హీరోగా పెట్టి.. భారతీయ సంగీత విలక్షణతను చాటే ఒక సినిమా తీయడం ఆ రోజుల్లో పెద్ద సాహసం. కానీ, దర్శకుడు కె. విశ్వనాథ్కు అది నమ్మకం. తన పట్ల, తను ప్రాణంగా ప్రేమించే సంగీతం పట్ల ఉన్న నమ్మకం. ఆ చిత్రం వెండితెరపై చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచ వేదికలపై ఊరేగించింది. అప్పటి వరకు కె.విశ్వనాథ్ అంటే ప్రేక్షకులకు అభిమానం. ‘శంకరాభరణం’ తర్వాత ఆ అభిమానం గౌరవంగా కూడా మారింది. ‘స్వాతిముత్యం’తో ఆస్కార్ ఎంట్రీ హీరోను బట్టి సినిమాకు వెళ్లే రోజుల్లో.. ఇది కె.విశ్వనాథ్ సినిమా అంటూ థియేటర్కు వెళ్లే ప్రేక్షకులను సంపాదించుకున్నారు ఆయన. ‘స్వాతిముత్యం’తో తెలుగు సినిమాకు ఆస్కార్ ఎంట్రీ తెచ్చిపెట్టిన ఘనత ఆయన సొంతం. పాటను తన సినిమాకు ఊపిరిగా భావించే ఈ విశ్వనాథుడు.. వేటూరి, సిరివెన్నెల వంటి గొప్ప సాహితీ శిఖరాలను సినిమా రంగానికి పరిచయం చేశారు. చూపులేని హీరో, మాటలు రాని హీరోయిన్తో వెండితెరపై ఈ కళాతపస్వి సృష్టించిన దృశ్యకావ్యం.. ‘సిరివెన్నెల’.. మరో అద్భుతం. ఎంత గొప్ప దర్శకుడో అంత గొప్ప నటుడు కథకు కావలసిన నటుల్ని ఎంచుకుని, ఏరుకుని కథే హీరోగా సినిమాలు చేసిన గొప్ప దర్శకులు కె.విశ్వనాథ్. కమలహాసన్ చేపలు పట్టే జాలరిగా కనిపించినా, చిరంజీవి చెప్పులు కుట్టే పాత్ర చేసినా.. అది ఆ దర్శకుని మీద ఉన్న నమ్మకం, గౌరవం తప్ప ఇంకోటి కాదు. స్టార్ హీరోలుగా తిరుగులేని ఇమేజ్ ఉన్నవాళ్లు కూడా కె.విశ్వనాథ్ డెరైక్షన్లో ఒక్క పాత్రయినా చేయకపోతే తమ జీవితానికి లోటుగా భావించే స్థాయికి ఎదిగిన గొప్ప దర్శకులు ఆయన. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు కాంబినేషన్లో ఎన్నో క్లాసిక్స్ అందించిన కె.విశ్వనాథ్.. హిందీ చిత్ర పరిశ్రమలో కూడా తన మార్కు చూపించారు. ‘శుభసంకల్పం’ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేసిన తర్వాత ఈ కళాతపస్వి ప్రేక్షకులకు మరింత దగ్గరైపోయారు. ఉన్నతమైన విలువలు ఉన్న పాత్రల్లో చాలా సహజంగా నటించి.. ఎన్నో చిత్రాల్లో పతాక సన్నివేశాలకు ప్రాణం పోశారు కె.విశ్వనాథ్. అవార్డులకే నిండుదనం కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఐదు చిత్రాలు జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. డెరైక్టర్గా, నటుడిగా మొత్తం నాలుగు నందులు అందుకున్న విశ్వనాథ్ను పది ఫిల్మ్ఫేర్ అవార్డులు వరించాయి. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. అదే ఏడాది భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో గౌరవించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూడా ఈ కళాతపస్విని డాక్టరేట్తో సత్కరించుకుంది. -
అద్భుత క్లైమాక్స్ ఉన్న మూవీ అది: దాసరి
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కు సాక్షి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు రావడంపై దర్శకుడు దాసరి నారాయణరావు హర్షం వ్యక్తంచేశారు. కె.విశ్వనాథ్ గారిని గౌరవించడమంటే మా దర్శకులందర్నీ గౌరవించడం అన్నారు. మాది యాబై ఏళ్ల అనుబంధమని, ఆరోగ్యకరమైన పోటీపడే మనస్తత్వంతో సినిమాలు తీసేవారిమని చెప్పారు. ఆయన సినిమాలు తాను చూసేవాడినని, తన సినిమాలు విశ్వనాథ్ గారు చూసి విమర్శలు చేసుకునేవాళ్లమని పేర్కొన్నారు. విశ్వనాథ్ గారు చేసిన సినిమాలలో అత్యద్భుత క్లైమాక్స్ ఉన్న మూవీ 'శంకరాభరణం' అని దాసరి నారాయణరావు అన్నారు. ఆ మూవీ తర్వాత ఆయన తన స్థాయికి తగ్గకుండా కేవలం కళ కోసమే తపిస్తూ ఆ తరహా చిత్రాలు చేశారని ప్రశంసించారు. ఈ విధంగా నిరంతం శ్రమించేవారిని సత్కరిస్తున్నందుకు సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతి గారిని కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణరావు అభినందించారు. దర్శకులను ఆయన హీరో చేశారు: సిరివెన్నెల 'సిరివెన్నెల'తో తనకు ఇండస్ట్రీలో జన్మినిచ్చారని సినీ గేయ రచయిత సీతారామశాస్త్రి, సినీదర్శకుడు కె.విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సృష్టిలో చూసేది భౌతికనేత్రం కాదు మనోనేత్రమని తాను పాటలు రాసిన తొలి సినిమాతోనే చెప్పించారని ప్రశంసించారు. -
డైరెక్టర్ విశ్వనాథ్ కు సాక్షి ఎక్సలెన్స్ అవార్డు
హైదరాబాద్: ప్రముఖ సినీదర్శకుడు కె.విశ్వనాథ్ గారికి సాక్షి ఎక్సలెన్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ప్రదానం చేశారు. సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతి, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేతుల మీదుగా కళాతపస్వి విశ్వనాథ్ అవార్డు అందుకున్నారు. సినీరంగంలో చేసిన అత్యుత్తమ సేవలను గుర్తించిన సాక్షి సంస్థ 2015 సంవత్సరానికిగానూ ఈ అవార్డును నేడు ఆయనకు ప్రధానంచేశారు. సాక్షి ఎక్సలెన్స్ అవార్డులో ఈరోజు మొట్టమొదటి అవార్డు అందుకున్న అమర జవాను ముస్తాక్ అహ్మద్ భార్య, ఓ చేతిలో బిడ్డతో వచ్చి అవార్డు తీసుకోవడం కన్నా తనకు మంచి సీన్స్ ఎక్కడ దొరుకుతాయని కె.విశ్వనాథ్ గారు అభిప్రాయపడ్డారు. వృత్తిగా చేయవలసిన బాధ్యతతో మూవీలు చేశామని పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి ఎంతో మంది తెలివైనవాళ్లున్నారని, వారికి తాను మెరుగులు దిద్దలేదని సొంతంగా వారే ఎదిగారని అన్నారు. ఇండస్ట్రీకి ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ తనను గుర్తుపెట్టుకుని మరీ గౌరవించిన సాక్షి సంస్థకు ధన్యావాదాలు తెలిపారు. -
మంచి పని చేస్తే ప్రతి ఒక్కరూ సహకరిస్తారు
హైదరాబాద్: మంచి పని చేస్తే ప్రతి ఒక్కరూ సహకరిస్తారని అనంతపురం జిల్లా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ మాంచూ ఫెర్రర్ అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఫెర్రర్ సాక్షి ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఫెర్రర్ మాట్లాడుతూ.. రాయలసీమ వంటి ఫ్యాక్షన్ ఏరియాలో సేవా సంస్ధ నిర్వహిస్తుండటం గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, రాజ్దీప్ సర్దేశాయ్, ఏబీకే ప్రసాద్, శాంతా సిన్హా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement