breaking news
Economic difficulties
-
కెనడాలో భారతీయ విద్యార్థులకు ఆర్థిక కష్టాలు!
ఒట్టావా: కెనడాలో విద్యనభ్యసిస్తూ పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసే భారతీయ విద్యార్థులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ఇకపై ఒక వారమంతా కలిపి 24 గంటలపాటు మాత్రమే కాలేజీక్యాంపస్ బయట పనిచేసే అవకాశం కలి్పస్తామని కెనడా ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం. కోవిడ్ సంక్షోభకాలంలో చిరు ఉద్యోగాల్లో తీవ్రమైన కొరత నెలకొనడంతో ఉద్యోగసంక్షోభాన్ని నివారించేందుకు కెనడా ప్రభుత్వం విద్యార్థులపై ఉన్న ‘వారానికి 20 గంటల పని’పరిమితిని ఎత్తేసింది. దాంతో అక్కడి భారతీయ విద్యార్థులు ఎక్కువ గంటలపాటు పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసేవారు. దీంతో విద్యార్థుల అద్దె, సరుకులు, ఇతరత్రా ఖర్చుల భారం కాస్తంత తగ్గింది. వారానికి 20గంటల పని పరిమితికి ఇచి్చన సడలింపు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ముగిసింది. ఈ పరిమితికి మరో నాలుగు గంటలు జత చేసి ‘వారానికి 24 గంటల నిబంధన’ను తీసుకొస్తున్నారు. ఇది ఈ వారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో కెనడాలోని భారతీయ విద్యార్థులను ఆర్థిక కష్టాలు మళ్లీ చుట్టుముట్టనున్నాయి. 2022 ఏడాదిలో కెనడాకు 5.5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు రాగా అందులో 2.26 లక్షల మంది భారతీయులేకావడం గమనార్హం. విద్యార్థి వీసాల మీద ప్రస్తుతం కెనడాలో 3.2 లక్షల మంది భారతీయులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు(గిగ్ వర్కర్లు)గా పనిచేస్తూ కెనడా ఆర్థికవ్యవస్థ బలోపేతానికి తమ వంతు కృషిచేస్తున్నారు. ఆఫ్–క్యాంపస్ ఉద్యోగాలతో అక్కడి విదేశీ విద్యార్థుల చేతికొచ్చే చిన్న మొత్తాలు.. విద్యార్థుల నెలవారీ కనీస అవసరాలు తీర్చేవి. పనివేళల నిబంధనల ప్రకారం ఒకేసారి డ్యూటీలో గరిష్టంగా 8 గంటలే పనిచేయొచ్చు. ఈ లెక్కన కొత్త నిబంధన ప్రకారం భారతీయ విద్యార్థులకు వారంలో కేవలం మూడ్రోజులే పని దొరికే అవకాశం ఉంది. భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది మే నెల నుంచి కొత్త నిబంధనల ప్రకారం గంటకు 17.36 కెనడియన్ డాలర్ల కనీస వేతనం చెల్లిస్తున్నారు. గత ఏడాది ఈ వేతనం 16.65 కెనడియన్ డాలర్లుగా ఉండేది. దీంతో టొరంటో వంటి ఖరీదైన నగరాల్లో చదువుకుంటూ అక్కడే ఉండే మన విద్యార్థులకు ఆర్థిక ఇక్కట్లు పెరిగే ప్రమాదముంది. ‘‘ఇంత తక్కువ గంటల పనితో చేతికొచ్చేదెంత? నెలవారీ సామగ్రి కొనడం కూడా కష్టమే’’అని భారతీయ విద్యార్థి నీవా ఫతర్ఫేకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘యార్క్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో సరి్టఫికేట్ కోర్సు చేస్తున్నా. ఇప్పుడున్న ఖర్చులతో విడిగా అద్దెకుండటం చాలా కష్టం. అందుకే స్నేహితుల గదిలోకి మారా. అక్కడే సెనేకా కాలేజీలో బ్రాండ్ మేనేజ్మెంట్ చదువుకుంటా’అని నీవా చెప్పారు. ‘‘కనీస ఆదాయం ఉంటేనే విద్యార్థులు చదువుకోగలరు. ఎలాంటి వ్యవస్థలోనైనా సమానత్వం పాటించాలి’’అని బార్బరా షెలిఫర్ స్మారక క్లినిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, లాయర్ అయిన దీపా మాటో చెప్పారు. -
సంపద, పేదరికం మధ్య ‘భారతం’
భారతదేశంలో ఆర్థిక వ్యత్యాసాలు చాలా వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. రాత్రికి రాత్రే కుబేరులు అపరకుబేరుల్లా మారుతోంటే, పేదవాడు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నాడన్న నానుడి అక్షరసత్యంగా మారింది. ఒక శాతం జనాభా చేతిలో దేశంలోని 73 శాతం సంపద పోగుపడి ఉంది. 67 కోట్లమంది ప్రజల చేతిలో కేవలం ఒకే ఒక్క శాతం సంపద ఉన్నదంటే, దేశంలో ఆర్థిక అంతరాలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 2050 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో శక్తివంతమైన దేశంగా వృద్ధి చెందనుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నా... సంపన్న ఇండియా, పేదరిక భారత్ మధ్య గీత చెరగకపోవడం వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లోనే సోషలిజం, సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు ఊపిరిపోసుకుంటాయి. అసమానతల అంతానికి ప్రజాపోరాటాలు వెల్లువెత్తుతాయి. ‘‘రాబోయే ముప్ఫై సంవత్సరాల్లో అంటే 2050 నాటికి భారతదేశం ప్రపంచంలో రెండవ శక్తివంతమైన దేశంగా అభివృద్ధి చెందుతుంది. చైనా యథా వి«ధిగా మొదటి స్థానాన్ని నిలుపుకోగా, అమెరికాను వెనక్కినెట్టి భారత్ ఆ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది’’ అంటూ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్(పీడబ్లూ్ల్యసీ) సంస్థ తన నివేదికలో ప్రకటించింది. ఇది భారతదేశ ప్రగతిని సూచిస్తున్న ప్రకటన. కొనుగోలు శక్తి సూచిక ఆధారంగా ఈ రకమైన నిర్ధారణ చేసినట్టు ఆ సంస్థ తెలియజేసింది. ఇ–7 దేశాలైన బ్రెజిల్, చైనా, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, రష్యా, టర్కీ దేశాలు సరాసరి 3.5 శాతం వార్షిక ఆర్థికాభివృద్ధి జరు గుతూ, రాబోయే 30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడుతాయని, అందులో ఉన్న భారతదేశం మరింతగా మున్ముం దుకు వెళ్తుందని ఆ సంస్థ అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రపంచంలో ఆర్థికంగా ధనిక దేశాలనిపించుకుంటున్న జి–7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్,యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలు తమ వార్షిక ఆర్థికాభివృద్ధి 1.6 కి తగ్గిపోయి వెనుకబడిపోతాయని కూడా ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇ–7 దేశాలు ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 50 శాతాన్ని సొంతం చేసుకుంటాయి, అయితే జి–7 దేశాల వాటా 20 శాతానికి పడిపోతుంది. ఇటువంటి అంచ నాలు భారతదేశంలో ఉన్న మనందరికీ ఆశాజనకంగా కనిపిస్తాయి. కానీ భారతదేశంలో ఉన్న పరిస్థితులు మనకు మరో రకంగా దర్శనమిస్తున్నాయి. ఇటువంటి నివేదికను అందించిన పీడబ్ల్యూసీ సంస్థనే మరికొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ సంద ర్భంగా రాబోయే పరిస్థితులను వివరిస్తూ, ప్రపంచంలో శాస్త్ర, సాంకే తిక రంగాల్లో వస్తోన్న మార్పులు, పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, రోజురోజుకీ రెట్టింపవుతోన్న పేదరికం ఆందోళన కలిగిస్తున్నమాట వాస్తవం. అంతే కాకుండా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో భవిష్యత్లో రాబోతున్న పరిణామాలు ప్రపంచ స్థితిగతులను మార్చివేసే ప్రమాదమున్నదనడంలో కూడా అతిశయోక్తి లేదు. అన్నింటికన్నా ముందుగా ఆందోళన కలిగిస్తున్న విషయాలు ఆర్థిక అంతరాలు. భార తదేశంలో ఈ ఆర్థిక వ్యత్యాసాలు చాలా వేగంగా పెరుగుతూ వస్తు న్నాయి. రాత్రికి రాత్రే కుబేరులు అపరకుబేరుల్లా మారుతోంటే, పేద వాడు మరింత పేదరికంలోకి కూరుకు పోతున్నాడన్న నానుడి అక్షర సత్యంగా మారింది. 2004లో దేశంలో 12 మంది బిలియనీర్లు ఉంటే 2012కి వచ్చేసరికి 46 మంది అయ్యారు. 2017 నాటికి ఆ సంఖ్య 101కి చేరింది. కార్మికుల, ఉద్యోగుల జీతాల పెరుగుదల 2 శాతం ఉంటే, పెట్టుబడిదారుల ఆస్తుల పెరుగుదల ఆరురెట్లు అధికంగా ఉంది. 1991 నుంచి ఈ వ్యత్యాసాలు అత్యంత వేగంగా, అనూ హ్యంగా పెరుగుతూ వచ్చాయి. గత సంవత్సరం ప్రతిరెండు రోజుల కోసారి ఒక బిలియనీర్ పెరిగాడని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించడాన్ని బట్టి చూస్తే ధనిక, పేదల మధ్య నెలకొన్న ఆర్థిక అగాథాన్ని అంచనా వేసుకోవచ్చు. ఇంకా ఆశ్చర్య కరమైన విషయమేమిటంటే, భారత దేశంలో ఒక శాతం జనాభా చేతిలో దేశంలోని 73 శాతం సంపద పోగుపడి ఉంది. ఇదిలా ఉంటే, 67 కోట్ల జనాభా చేతిలో కేవలం ఒకే ఒక్క శాతం సంపద ఉన్నదంటే, దేశంలో ఆర్థిక అంతరాల స్థాయిని అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ రంగమైతే, తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒకవైపు వ్యవసాయం లాభదాయంగా లేదని రైతులే ఆత్మహత్యలు చేసుకుంటుంటే, రెండోవైపు వ్యవసాయంలో పెరుగుతోన్న యాంత్రీ కరణ వల్ల దాదాపు సగానికిపైగా వ్యవసాయ కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు. 1977–78లో జరిగిన 32వ నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం 89 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటే, 2017–18లో జరిగిన సర్వేలో అది 55 శాతానికి పడిపోయింది. ఇది 2050 నాటికి 25.7 శాతానికి పడిపోతుందనీ అంచనా. భవిష్యత్లో వ్యవసాయం ఇప్పుడున్న స్థితిలో ఉంటుందనే ఆశకూడా కనపడటం లేదు. కోట్లాదిమంది రైతుల స్థానంలో పదుల మంది వ్యవసాయ పెట్టు బడిదారులు అడుగుపెట్టే అవకాశం ఉంది. కార్పొరేట్ వ్యవసా యంలో మనుషుల జాడ కనిపించదు, పూర్తిగా యంత్రాలమయం అయిపోతుంది. ఇప్పటికే చాలా పంటల్లో మనుషుల ప్రమేయం తగ్గి పోయింది. కూలీలు ఎక్కువగా అవసరమయ్యే వరిపంట సాగులో అన్ని దశల్లో యంత్రాలు అడుగుపెట్టాయి. వ్యవసాయ సంక్షోభం ఇలాగే కొనసాగితే, చిన్న సన్నకారు రైతులు మాయం కావడం అనివార్యం. ఆ స్థానంలో కార్పొరేట్లు అడుగుపెడితే భూమి మీద పనిచేసే శ్రామికులు కంటికైనా కనిపించరు. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో రోజు రోజుకీ కార్మికుల సంఖ్య తగ్గిపోతున్నది. యాంత్రీకరణ స్థానంలో మరింత ఆధుని కమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో వంద మంది చేసే పనిని కేవలం ఒకరు, ఇద్దరితో చేయించుకోగలుగుతున్నారు. అత్యంత ఉన్నతమైన, నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం అవు తారు. దీనితో దేశంలో నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరనుంది. కంప్యూ టర్ రంగంలో వస్తున్న మార్పులు ముఖ్యంగా ఆటోమేషన్ రోబోల రూపకల్పన మరింతగా ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నది. సేవా రంగంలో వైద్యం, విద్యా రంగాల్లో కొన్ని అవకాశాలు కనిపిస్తున్న ప్పటికీ 2050 నాటికి వచ్చే మార్పులు కూడా ఉద్యోగావకాశాల మీద ప్రభావాన్ని కలిగిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాల విషయాన్ని వది లేస్తే, 2050 నాటికి దాదాపు 70 లక్షల మందికి ఉన్న ఉద్యోగాలు కనుమరుగవుతాయని ప్రహార్ గ్రూప్స్ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఉద్యోగాల కల్పన చూస్తే ఆ పరిస్థితి మనకు అర్థం అవుతుంది. 2011లో తొమ్మిదిలక్షల ఉద్యోగాల కల్పన జరిగితే, 2013లో అది 4.19 లక్షలకు పడిపోయింది. 2015లో 1.35 లక్షలకు ఉపాధికల్పన క్షీణించింది. లేబర్ బ్యూరో సమాచారం ప్రకారం దేశంలో ప్రతి రోజూ 550 మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఇటీవల వినపడుతున్న మరో మాట ‘ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్’ఇది భవిష్యత్లో మనుషుల మనుగడకు ప్రమాదకరంగా తయారు కాబోతున్నది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న ఆధునిక మైన మార్పులను ఆహ్వానించాల్సిందే. కానీ మనిషి మనుగడకే ప్రమాదం ఏర్పడితే దానిని మనం ఎట్లా చూడాలి? మొత్తం ఉత్పత్తి, సర్వీసు, ఇతర రంగాలన్నింటిలో వస్తోన్న మార్పుల వల్ల మనకు అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు కావాల్సి వస్తుంది. 2050 వరకు వంద కోట్ల మంది ఉద్యోగాలు చేయగలిగే వయస్సు వాళ్ళు ఉంటారు. అందులో 30 కోట్ల మందికి మాత్రమే ఉద్యోగాల కల్పన ఉంటుందని భావిస్తున్నారు. అంటే దాదాపు 70 కోట్ల మందికి ఉద్యో గాలు దొరకని దుర్భర పరిస్థితులు అత్యంత సమీపంలో ఉన్నాయి. జనాభాలో 60 శాతానికి పైగా ఎటువంటి ఉత్పత్తిలో పాల్గొనే అవ కాశం లేదు. ఇది చాలా తీవ్రమైన సమస్య. దీనిని పరిష్కరించడం అంత సులువు కాదు. కానీ దీనిని రాజ కీయ సమస్యగా చూస్తున్నారు. దీనికి పరిష్కారంగా వృద్ధాప్య పెన్షన్లు, చౌకధరలకు బియ్యం సప్లయ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా ఉండడానికి ఉచితంగా ఆహారం, విద్య, వైద్యం లాంటి అవకాశాలను కల్పిస్తారని అధ్యయ నాలు అంచనా వేస్తున్నాయి. అంటే క్రమంగా మనిషిని ఉత్పత్తి నుంచీ, శ్రమ నుంచీ బయటకులాగి నిర్వీర్యం చేయాలనీ, మొత్తంగా ఉత్పాదక రంగంనుంచి మనిషిని విడదీయాలని చూస్తున్నారు. ఇది మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. అయితే మరొక అభి ప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. దేశ సంపదలో, అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా ఉన్న 60 శాతం మంది జనాభా ప్రభు త్వాల మీద తిరుగుబాటు చేస్తారనే అభిప్రాయం కూడా ఉంది. ప్రపంచంలో ఇటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఒకనాడు అత్యంత ధనికదేశమైన రోమన్ సామ్రాజ్యం ప్రజల ఆకలి కేకలకు భస్మమైపోయిన చరిత్రను కొంత మంది ప్రస్తావిస్తున్నారు. ప్రజలందరికీ సమాన అవకాశాలూ, ప్రజాస్వామిక హక్కులే లక్ష్యంగా ఏర్పాటయ్యే పార్టీలూ, సంస్థలకు భవిష్యత్లో ప్రజల ఆదరణ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే సోషలిజం, సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు ఊపిరి పోసుకుంటాయి. అసమానతల అంతానికి ప్రజాపోరాటాలు వెల్లువెత్తుతాయి. ఆర్థిక సామాజిక అంత రాలూ, దోపిడీ, అవినీతి, వివక్షలతో కూడిన ఈ సమాజంలో మార్పు కోసం మూకుమ్మడిగా ప్రజలు తిరగబడే రోజొకటొస్తుంది. అక్కడ క్కడ విసిరివేయబడినట్టుగా ఉన్న ఉద్యమాలు ఒక్కుమ్మడిగా మారిన ప్పుడు వర్గసమాజం పునాదులు కదులుతాయి. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ప్రభుత్వ వసతి గృహాలకు అప్పుల తిప్పలు
సాక్షి, ఒంగోలు టూటౌన్: సంక్షేమంలో మళ్లీ ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు వరకు డైట్ చార్జిలు, పిల్లలకు రావాల్సిన కాస్మొటిక్ చార్జిలు విడుదల విషయంలో ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం అనంతరం వాటిని విడుదల చేసి కొంత ఊరట కలిగించింది. ఇక అప్పటి నుంచి మళ్లీ వసతి గృహాలకు డైట్ చార్జిలు మంజూరు కాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వసతి గృహాలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో వార్డెన్లు అప్పుల తిప్పలు ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి ఆర్థిక కష్టాలు పడుతూ కూడా ఎవరికి చెప్పుకోలేక ఎవరికి వారే మదనపడుతున్నారు. జిల్లాలో 89 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో బాలురకు 71 వసతి గృహాలు, బాలికలకు 18 వసతి గృహాలు ఉన్నాయి. ఈ వసతి గృహాల్లో దాదాపు 9,300 మంది వరకు పేద విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. వెనుకబడిన వసతి గృహాలు 76 ఉన్నాయి. వీటిలో బాలురకు 58, బాలికల కోసం 18 నిర్వహిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో మూడు వసతి గృహాలు, 14 గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు 17 ఆశ్రమ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. విడుదలకు నోచని డైట్ చార్జిలు.. ప్రతి నెల వసతి గృహాలకు డైట్చార్జీలు (మెస్ చార్జీలు) విడుదల చేయాల్సి ఉంది. ఆ నిధులు విడుదల చేస్తేనే దుకాణాలలో కొన్ని నిత్యవసర వస్తువులకు, కూరగాయలకు, చికెన్ బిల్లులు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. వీటన్నింటికి ఆయా సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు తమ సొంత పూచికత్తుపై అప్పులు తెస్తుంటారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే దుకాణాదారులకు చెల్లిస్తుంటారు. ఈ సారి సాంఘిక సంక్షేమ శాఖలో ఆరు నెలలుగా డైట్ చార్జిలు విడుదలకు నోచుకోలేదు. వార్డెన్లు కూడా నెలల తరబడి డైట్ చార్జిలు విడుదల కాకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల కోడ్ వస్తే మా పరిస్థితి ఏంటని కలవరపడుతున్నారు. వసతి గృహాల్లో పిల్లలకు నిబంధనల ప్రకారం అన్ని సమకూర్చాలని ఆదేశాలిస్తుంటారని వాపోతున్నారు. నిధులు మాత్రం సకాలంలో విడుదల కాక అప్పుల తెచ్చిన దుకాణాల వద్ద మాట పోతుందని కొందరు సంక్షేమ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన వసతి గృహాలకు జనవరి నుంచి మెస్ చార్జీలు రావాల్సి ఉంది. అదే విధంగా ఎస్టీ వసతి గృహాలకు సైతం బడ్డెట్ విడుదల కాక వార్డెన్లు మదనపడుతున్నారు. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీల భారం పడుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని వార్డెన్లు కొంత వాపోతున్నారు. సంక్షేమ అధికారులు బిల్లులను సకాలంలో బిల్లులను ట్రెజరీకి పంపిస్తున్నప్పటికీ అక్కడ బడ్జెట్ లేకపోవడమో లేక ఫ్రీజింగ్ పెట్టడమో చేయడం మూలంగా సంక్షేమంలో ఆర్థిక కష్టాలకు మూలమవుతోంది. ప్రభుత్వం మాత్రం సంక్షేమంపై ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదన్న విమర్శలు దళిత సంఘాల నుంచి వెల్లువెతుతున్నాయి. పేదల విద్యార్థుల సంక్షేమానికి విడుదల చేయాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకుండా కాలయాపన చేయడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నాయి. కనీసం వసతి గృహాల్లో విద్యార్థులకు నెలనెలా చేయాల్సిన వైద్య పరీక్షలు సైతం చేయకుండా వదిలేయడంపై దళిత సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అడ్డంకిగా మారనున్న ఎన్నికల కోడ్.. ఒక్క సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకే రూ. మూడు కోట్ల నుంచి నుంచి నాలుగు కోట్ల వరకు రావాల్సి ఉందని తెలుస్తోంది. అదే విధంగా కళాశాలలో చదువుకుంటున్న పిల్లలకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ కొంత అడ్జెట్మెంట్ కావాల్సి ఉన్నట్లు ఆ శాఖ అధికారులే ఒప్పుకుంటున్నారు. సంక్షేమ వసతి వసతి గృహాలకు విడుదల చేయాల్సిన డైట్ చార్జిలను ఎన్నికల కోడ్ రాక చేయక ముందే విడుదల చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బిల్లుల పెండింగ్ విషయంపై సాంఘిక సంక్షేమశాఖ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి తీసుకు రాగా వారం పది రోజులలో నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ట్రెజరీలో కదలని బిల్లులు.. జిల్లా ట్రెజరీలో ఏ ఒక్క బిల్లు కదలటంలేదు. గత రెండు నెలలకుపైగా ఏ బిల్లుకు మోక్షం లభించడంలేదు. ఒక్క జీతాలు బిల్లులు తప్పితే మిగతా బిల్లులన్నింటికీ ఒక్క పైసా విడుదల చేయని పరిస్థితి నెలకొంది. దీంతో ట్రెజరీకి బిల్లులు పెట్టే వివిధ వర్గాలు నిత్యం ఖజానా కార్యాలయం చుట్టు తిరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పైగా వివిధ రకాల బిల్లులకు మంజూరు చేయాల్సి ఉందని ఖజానా వర్గాలు చెబుతున్నాయి. అయితే ట్రెజరీకి సంబంధించిన సర్వర్ను పూర్తిగా రాష్ట్ర స్థాయిలోనే నిలుపుదల చేయడంతో జిల్లా ట్రెజరీలలో ఏమి చెప్పలేకపోతుండటం గమనార్హం. ఎన్నికల తాయిలాలకు నిధులు మళ్లింపు.. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తుండటంతో ఓట్ల కొనుగోలుకు తెర లేపిన సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధులన్నీ దారి మళ్లించేస్తున్నారు. ఇప్పటికే పసుపు–కుంకుమ పథకానికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. ఇంకా రైతుల ఓట్ల కోసం మరికొన్ని నిధులను మళ్లిస్తూ అన్ని జిల్లాలను ఆర్థిక కష్టాల్లోకి నెడుతుండటంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఎక్కం భూమయ్య (46) అనే రైతు అర్థిక ఇబ్బందులతో శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్టు ఏఎస్ఐ రజాక్ తెలిపారు. భూమయ్య తనకున్న ఎకరం పొలంలో సేద్యం చేస్తూ, గ్రామంలో చిన్న చిన్న పనులు చేసేవాడు. సాగు నీరు లేక పొలం ఎండి పోతోందని బాధపడేవాడు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.