breaking news
division one day league
-
నరసింహా 6/18
ఎ- డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్లో పీఎస్ యంగ్స్టర్స్ బౌలర్ నరసింహా (6/18) అద్భుతంగా రాణించాడు. దీంతో సోమవారం మణికుమార్ జట్టుతో జరిగిన మ్యాచ్లో యంగ్స్టర్స్ జట్టు 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్స్టర్స్ జట్టు 38.3 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. మణికుమార్ బౌలర్లలో సంజయ్ 3, భరత్ 4 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన మణికుమార్ జట్టు నరసింహ ధాటికి 30.3ఓవర్లలో 54 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఇతర మ్యాచ్ల వివరాలు భారతీయ సీసీ:64 (పవన్ 3/20, విజయ్ 3/19, రాము 3/1); కాకతీయ సీసీ: 66/3 (8.1 ఓవర్లలో) మహేశ్ సీసీ:104 (అశ్విన్ 41, అఫ్రోజ్ 3/21, మణికంఠ 4/27); రుషిరాజ్ సీసీ: 104/9 ( షేక్ దాదర్ 34; నరేశ్ 3/13). లాల్బహదూర్ పీజీ: 132 (దినేశ్ 38; మోయిజ్ 3/26); అజాద్ సీసీ: 134 /4 (హుస్సేన్ 32, బద్రి 54; దినేశ్ 3/37) భారతీయ సీసీ: 186/9 (పృథ్వీ రాజ 34, చంద్రశేఖర్ 75నాటౌట్; శ్రీకాంత్ 3/22); విజయపురి విల్లోమెన్: 187/1 (మురళి 90, షాకిర్ అహ్మద్ 88నాటౌట్) నవజీవన్ ఫ్రెండ్స్: 145 (ఆర్యన్ 32, గిరిబాబు 32; షహనాజ్ 3/36); ఆడమ్స్ ఎలెవన్: 143 (సచిన్ 64 నాటౌట్; గిరిబాబు 3/26) సదరన్ స్టార్: 124/7 (సత్య 34; రిత్విక్ 3/20); తిరుమల సీసీ: 125/2 (ధనుంజయ్ 53, రిత్విక్ 47నాటౌట్) రోషనారా: 176 ( అనిల్ 52నాటౌట్; అనిరుధ్ 4/35);టీమ్ కున్: 23/1 (7 ఓవర్లలో) సౌతెండ్ రేమండ్స: 117 (37.3ఓవర్లలో);మయూర్ సీసీ: 74 (27.5 ఓవర్లలో) ఎస్కే బ్లూస్ 179 ( ముస్తాక్ 41, దీపాంకర్ 31); విక్టరీ సీసీ: 180/3 (శ్రేయస్ 48, రోహిత్ సాగర్ 84) ఇంపీరియల్ సీసీ: 65 (అజ్మీర్3/13, వినయ్3/15); కిషోర్ సన్స:66 ( చిరాగ్ పటేల్ 32నాటౌట్) రోషనార: 230/5 (నయన్ 51, ఉదయ్ 32, శ్రీకాంత్ 89; జకారియా 3/39);విక్టోరియా సీసీ: 67 ( అక్బర్ 3/15; విజయ్ 4/9) డెక్కన్ కోల్ట్స్:258/9 (మణిదీప్ 73, నరేందర్39); గ్రీన్లాండ్స: 122 (అనుజ్ 40; రాజీవ్ 3/30) సట్టన్ సీసీ: 65 (విజయ్ 3/13, పవన్ 3/13, రుద్రశివ 3/13);సాత్విక్ యూనియన్: 66/1 (అగ్రజ్ 48నాటౌట్) యంగ్ సిటిజన్: 226/8 (హన్మంత్ 39; హర్ష్ 4/62); సఫిల్గూడ: 85 (సారుు 3/8, అంకిత్ రామ్ 4/21). -
షంషుద్దీన్ మెరుపులు
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్లో షంషుద్దీన్ (124; 13ఫోర్లు, 4 సిక్సర్లు), బౌలింగ్లో హిమాన్షు (6/49) చెలరేగడంతో ఎ- డివిజన్ వన్డే లీగ్లో నోబుల్ క్రికెట్ క్లబ్ అలవోక విజయాన్ని సాధించింది. కులీ కుతుబ్ షా మైదానంలో విజయానంద్ క్రికెట్ క్లబ్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో నోబుల్ క్రికెట్ క్లబ్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నోబుల్ క్రికెట్ క్లబ్ 44.4 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. షంషుద్దీన్ సెంచరీతో కదం తొక్కగా... హిమాన్షు చౌదరీ (54), లఖన్ (36) రాణించారు. విజయానంద్ బౌలర్లలో తేజ 3, విష్ణు 4 వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం విజయానంద్ క్రికెట్ క్లబ్ 47.2 ఓవర్లలో 282 పరుగులు చేసి ఓడిపోయింది. బాలాజీ రెడ్డి (109), అభిషేక్ సింగ్ (52), తరుణ్ సాయి (60) చివరి వరకు పోరాడారు. నోబుల్ బౌలర్లలో ఫహీముద్దీన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్ల వివరాలు న్యూస్టార్ : 120 (సిద్ధార్థ్ 46; నీల్ చక్రవర్తి 3/24, సాత్విక్ 2/29, మస్తాక్ అహ్మద్ 2/19); ఆల్సెయింట్స్ హైస్కూల్: 122/6 (శివ 67 నాటౌట్; జాన్ 3/27). సత్యసీసీ: 155/6 (రోహన్ 35, అక్షయ్ 31, ప్రజ్వల్ 30; శివ 2/21); లక్కీ ఎలెవన్: 156/3 (మహేశ్ 64 నాటౌట్; శ్రీహర్ష 2/20). నిజాం కాలేజ్కు రాజీవ్ టోర్నీ టైటిల్ రాజీవ్గాంధీ యువ క్రికెట్ టోర్నమెంట్లో నిజాం కాలేజ్ జట్టు విజేతగా నిలిచింది. ఆరోరా కాలేజ్ జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో నిజాం కాలేజ్ జట్టు ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నిజాం కాలేజ్ 20 ఓవర్లలో 110 పరుగులు చేసింది. 111 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆరోరా జట్టు 19.2 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్, తదితరులు పాల్గొన్నారు.