breaking news
cold-weather
-
సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయాలి
ఇస్లామాబాద్: ఫిబ్రవరి 8వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితి మరింత ముదురుతోంది. అతి శీతల వాతావరణ పరిస్థితులు, ఖైబర్ ఫంక్తున్వా వంటి ప్రావిన్సుల్లో భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఫిబ్రవరి 8వ తేదీన జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సెనేట్ తీర్మానం ఆమోదించింది. స్వతంత్ర సభ్యుడు దిలావర్ ఖాన్ చేసిన ప్రతిపాదనకు ఊహించని మద్దతు లభించింది. అయితే, పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) సెనేట్ తీర్మానాన్ని తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వు ద్వారా మాత్రమే ఎన్నికల షెడ్యూల్ మారుతుందని పేర్కొంది. -
చలికి తట్టుకోలేక వృద్ధుడి మృతి
దహేగా: ఆదిలాబాద్ జిల్లా దహేగా మండలం దర్గాపల్లిలో చలి తీవ్రతను తట్టుకోలేక వామర శంకర్(80) అనే వృద్ధుడు మృతి చెందాడు. శంకర్ ఆదివారం రాత్రి పొలం వద్దకు కావలికి వెళ్లి సోమవారం ఉదయం ఇంటికి వచ్చిన వెంటనే మృతి చెందాడు. ఆయనకు భార్య సమ్మక్క, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.