breaking news
christian committes
-
పోప్ను అవమానించడం మా ఉద్దేశం కాదు
తిరువనంతపురం: పోప్–మోదీ భేటీపై సోషల్ మీడియాలో చేసిన కామెంట్ పట్ల కేరళ కాంగ్రెస్ క్రైస్తవ సమాజానికి క్షమాపణలు చెప్పింది. పోప్ను అవమానించడం తమ ఉద్దేశం కాదని స్పష్టత ఇచి్చంది. జీ7 సదస్సులో పోప్ ఫ్రాన్సిస్తో మోదీ భేటీపై కేరళ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్లో చేసిన పోస్టు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మోదీ–పోప్ ఫోటోను పోస్టు చేసిన కేరళ కాంగ్రెస్.. దానికి ‘‘చివరకు దేవున్ని కలిసే అవకాశం పోప్కు దక్కింది’’ అని క్యాప్షన్ రాసింది. ఆ పోస్టుపై బీజేపీతోపాటు ఇతర పారీ్టలు విమర్శలు గుప్పించాయి. దీంతో తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించిన కేరళ కాంగ్రెస్, క్రైస్తవులకు క్షమాపణలు చెప్పింది. -
సమాధుల భూమి కోసం ర్యాలీ
రాజమండ్రి సిటీ: క్రైస్తవుల సమాధుల నిర్మాణం కోసం భూమి కేటాయించాలని క్రైస్తవ సంఘాలు ర్యాలీకి దిగాయి. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో నగరంలోని పలు క్రైస్తవ సంఘాలు పాల్గొన్నాయి. సమాధుల నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే తమకు భూమి కేటాయించాలని మత పెద్దలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.