breaking news
child labours
-
బాల్యానికి రాబందులుగా కాదు... బంధువులుగా ఉందాం!
నింగిలోని చుక్కలతో ఏనుగును చిత్రించుకోవడం... చందమామలో చెవుల పిల్లిని ఊహించుకోవడం... తొడుక్కున్న బట్టలను మాపుకోవడం.. చెట్లు, పుట్టలెక్కడం.. గెంతడం... ఒకరినొకరు గేలిచేసుకోవడం.. ఏడిపించుకోవడం.. యథేచ్ఛగా ఆడుకోవడం... పితూరీలు, అలకలు, ఉరకలు, పరుగులు... ‘బాల్యం’ అని మనసులో గూగుల్ చేస్తే మెదిలే ఇమేజెస్ అవి! నిజంగా పిల్లలందరూ అంత లగ్జరీ అనుభవిస్తున్నారా అని అనుకునేలోపే ముంబైలో ధారావీ, హైదరాబాద్లో జవహర్ నగర్ లాంటి ప్రాతాలు స్ఫురణకు వస్తాయి! ధారావీ ఎక్కడో దూరం కాబట్టి రెండు రాష్ట్రాలకు సుపరిచితమైన జవహర్ నగర్ను సందర్శిద్దాం... ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా!‘పిల్లల చేతుల్లో ఉండాల్సింది పలక.. బలపం లేదంటే పెన్ను.. పుస్తకం అంతేకానీ పనిముట్లు కాదు’ అంటారు నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుంకట్టిన ఉద్యమనేత కైలాశ్ సత్యార్థి. కానీ జవహర్ నగర్లోని చాలామంది పిల్లల చేతుల్లో పుస్తకాలు కనిపించవు. పనిముట్లే కనిపిస్తాయి. అది నూరు బస్తీల ప్రాతం. దేశంలోని అన్ని ప్రాతాల నుంచి వచ్చిన వలసలతో మినీ ఇండియాను తలపిస్తుంది. వాళ్లలో చాలామందికి ఆధార్లాంటి గుర్తింపు పత్రాలేమీ ఉండవు. వాళ్లు ఏ లెక్కల్లోకీ రాక స్కూల్ అడ్మిషన్ నుంచి ప్రభుత్వ సంక్షేమ, ప్రయోజనాల దాకా ఏవీ వారికి అందట్లేదు. దాంతో చాలామంది పిల్లలు బాలకార్మికులై కనిపిస్తారు.. ఈ జవహర్నగర్కి ఆనుకునే ఉన్న 350 ఎకరాల డంపింగ్ యార్డ్లో చెత్త ఏరుకుంటూ.. భవన నిర్మాణ కార్మికులుగా.. అమ్మాయిలైతే ఇళ్లల్లో పనిచేస్తూ! ఇంకా సీజనల్ లేబర్గా కూడా! వసివాడని ఈ పిల్లలు గంజాయికి బానిసలై కూడా కనిపిస్తారు.మూడు లక్షల జనాభా...ఈ వంద బస్తీల్లో దాదాపు మూడు లక్షల జనాభా ఉంటుంది. సర్కారు బడులు పది మాత్రమే. అందులో ఎనిమిది ప్రైమరీ స్కూళ్లు, రెండు హైస్కూళ్లు. ఇది కా్రపా మండలం కిందకు వస్తుంది. ఈ మండలానికి కనీసం ఒక్క జూనియర్ కాలేజ్ కూడా లేదు. అందుకే స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా టెన్త్ అవగానే అబ్బాయిలైతే కూలీలుగా మారుతున్నారు. అమ్మాయిలకైతే పెళ్లి చేసి పంపించేస్తున్నారు. పద్నాలుగు నుంచి పద్దెనిమిదేళ్లలోపు అమ్మాయిలకు పెళ్లిళ్లయి పోతున్నాయి. ఇది హైదరాబాద్ నగరంలోని పరిస్థితి! ఇలా మన దేశమంతటా సుమారు పద్దెనిమిది లక్షల నుంచి ముప్పైమూడు లక్షల వరకు బలకార్మికులు ఉన్నారని యూనిసెఫ్ డేటా వెల్లడిస్తోంది. వీళ్లంతా వ్యవసాయరంగంలో, కుటుంబ వ్యాపారాల్లో పనిచేస్తున్నారని నివేదిక తెలుపుతోంది. అయిదు నుంచి పద్నాలుగేళ్లలోపు పిల్లలంతా ఏదో ఒక పనిచేస్తున్నారని కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. చట్టం ఏం చెబుతోంది?ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1986 ప్రకారం పద్నాలుగేళ్లలోపు పిల్లల చేత ఎలాంటి పనైనా చేయించడం నేరం. పద్నాలుగేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల పిల్లలకు పనివ్వొచ్చు. కానీ ప్రమాదకరమైన వృత్తులు.. పనులు.. పరిస్థితుల్లో ఆ పిల్లలను పెట్టకూడదు. ఈ చట్టానికి కొన్ని మినహాయింపులూ ఉన్నాయి. కుటుంబ వ్యాపారాలు, నిర్దిష్ట పరిస్థితుల్లో టీవీ, సినిమాలు వంటి వినోద రంగాల్లో పిల్లల పనిచేయవచ్చు.అమ్మాయిలే ఎక్కువ..ప్రపంచవ్యాప్త బాలకార్మికుల్లో ప్రతి పదిమందిలో ఒకరు మన దేశం నుంచే కనిపిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో బాలకార్మికుల(5–14 ఏళ్లలోపు) సంఖ్య కోటికి పైనే ఉంది. అంటే అప్పటి పిల్లల జనాభాలో ఇది 3.9 శాతం. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలే ఎక్కువగా పనిబాట పడుతున్నారని యూనిసెఫ్ సర్వే చెబుతోంది. ఇళ్లల్లో పని దగ్గర్నుంచి ఇంట్లో పెద్దవాళ్ల (అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు)ను చూసుకోవడం, తోబుట్టువులను సంభాళించడం వంటివన్నీ చేస్తున్నారన్నది నివేదికల మాట. మన దేశంలో బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాతాల్లో బాలకార్మికులు ఎక్కువ. ఇటుక బట్టీలు, తీవాచీ, వస్త్ర పరిశ్రమ, ఇళ్లు, హోటళ్లు.. టీ స్టాళ్లు లాంటి అసంఘటిత రంగాల్లో, వ్యవసాయం, మత్స్య పరిశ్రమల్లో బాలకార్మికులు ఎక్కువగా కనిపిస్తారు.బాలకార్మిక వ్యవస్థ వేళ్లూనడానికి కారణాలు అసమానత్వం, సరైన విద్యావకాశాలు, మంచి పని, సామాజిక భద్రత లేకపోవడం, సంప్రదాయ, సాంస్కృతిక చట్రాలు వంటివన్నీ బాలకార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయి. ఏ రూపాల్లో ఉన్నా 2025 కల్లా బాలకార్మిక వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించాలనే యునైటెడ్ నేషన్స్ లక్ష్యానికి మద్దతు తెలుపుతూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీఎస్) భారత ప్రభుత్వమూ సంతకం చేసింది. సంతకం చేయగానే సరిపోదు చిత్తశుద్ధితో ఆ బాధ్యతను నెరవేర్చాలి. పిల్లలందరినీ బడి బాట పట్టించి బాలకార్మికులు లేకుండా చేయడానికి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి అంటున్నారు బాలల హక్కుల కార్యకర్తలు. ∙రెస్క్యూ, రిహాబిలిటేషన్ వీక్గా ఉందిజవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్కి ఆనుకున్న బస్తీల్లో స్క్రాప్ షాప్స్ ఎక్కువ. అందుకే ఇక్కడ చెత్త సేకరణ ఎక్కువగా జరుగుతుంది. ఇవి కాకుండా కన్స్ట్రక్షన్ లేబర్, డొమెస్టిక్ హెల్ప్, సీజనల్ లేబర్కి కూడా వెళ్తుంటారు. ఈ ప్రాతంలో సరిపడా సర్కారు బడులు లేవు. ఉన్నవాటిల్లో చేరడానికి చాలామంది పిల్లలకు గుర్తింపు పత్రాలు లేవు. వాళ్లకు ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్మిషన్స్ దొరికినా ఫీజులు కట్టేంత స్థోమత ఉండదు. దాంతో పనిలోకి వెళ్తున్నారు. పద్నాలుగేళ్లు దాటిన పిల్లలు గనుక ఒక్కసారి పనిలోకి వెళితే మళ్లీ వాళ్లను చదువు వైపు మళ్లించడం చాలా కష్టం. ఇక్కడ వార్డ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు (డబ్ల్యూఎల్సీపీసీ) కూడా యాక్టివ్గా లేవు. దీనివల్ల బాలకార్మికుల రెస్క్యూ, రిహాబిలిటేషన్ చాలా వీక్గా ఉంది. – హిమబిందు, పిల్లల హక్కుల కార్యకర్త -
చదువు ఓకే.. పస్తులతో ఎలాగ?
గువాహటి: కరోనా వైరస్ వల్ల ప్రపంచమే కుదుపుకు లోనైంది. అందులో పేదవారి జీవితాలు మరింత అస్తవ్యస్తమయ్యాయి. సాధారణ సమయాల్లో ఏ పూటకి ఆ పూట అన్న విధంగా ఉండే కొన్ని జీవితాల్లో కరోనా శోకాన్నే తీసుకొచ్చింది. ఒక్కసారిగా పడ్డ కోవిడ్-19 పిడుగుతో పిడికెడు మెతుకులు దొరకని పరిస్థితి. ఈ సమయంలో తల్లిదండ్రుల కోసం పిల్లలు ముందుకొచ్చారు. పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థులు పనుల్లోకి దిగుతున్నారు. వీపుపై బ్యాగు మోయాల్సిన పసికూనలు సామాన్లు మోస్తూ శ్రమకు మించిన పని చేస్తున్నారు. విద్యార్థుల కోసం ఆన్లైన్ క్లాసులంటారా.. అవి ఫోన్లు, అందులో ఇంటర్నెట్ ఉన్నవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండే చదువులు. (పలకాబలపం వదిలి.. పలుగూపారా..) ఈ విషయం గురించి అస్సాంలోని గువాహటిలో హఫీజ్నగర్ బస్తీలో నివసించే పదహారేళ్ల జంషేర్ అలీ మాట్లాడుతూ "లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పాఠశాలలు ప్రారంభమవుతాయి. అప్పుడు తప్పకుండా తిరిగి పాఠశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తా. నాకు చదువును వదులుకోవాలని లేదు, కానీ రోజూ వారీ కూలీగా మారిన నేను పనిని కూడా వదిలిపెట్టలేను. ఎందుకంటే మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. పని కూడా చేయట్లేదు. నేను రోజూ కూలీకి వెళ్లడం వల్ల కనీసం రూ.200-300 సంపాదించగలుగుతున్నాను. ఈ డబ్బుతోనే సర్దుకుపోతున్నా. విద్య ఎంత అవసరమో నా కుటుంబానికి తిండి పెట్టడం అంతే అవసరం" అని చెప్పుకొచ్చాడు. "నేను కొన్ని ఇళ్లల్లో పనిమనిషిగా చేసేదాన్ని. కానీ కోవిడ్ వ్యాప్తి ప్రారంభం అవగానే నన్ను పనిలో నుంచి తీసేశారు. అసలే అనారోగ్యంతో ఉన్న నేను, నా కొడుక్కి ఒక్కపూట అయినా తిండి ఎలా పెట్టగలను?" అని అలీ తల్లి మొమినా ఖతున్ తెలిపారు. (బాల్యం బుగ్గిపాలు!) "ఆన్లైన్ క్లాసులు మాకు అందని ద్రాక్ష. అసలు ఫోన్లే లేని మేము వాటిని ఎలా వినియోగించుకుంటాం?", "మా తల్లి మాకోసం పని చేసేది. ఇప్పుడు ఆమె కోసం మేము పని చేస్తున్నాం" అంటున్నారు అలీ స్నేహితులు సమద్, సైఫుల్. వీళ్లే కాదు, ప్రస్తుతం ఎంతోమందిది ఇదే పరిస్థితి. హఫీజ్నగర్లోని ఏ బస్తీని కదిలించినా ఇలాంటి గాథలే కనిపిస్తాయి. ఇక్కడ నివసించే పిల్లల్లో మూడో వంతు ఆదాయం కోసం పనిబాట పడుతున్నారు. 14-17 ఏళ్లు ఉన్న పిల్లలు పరిశుభ్రత కార్మికులుగా, కూరగాయలు అమ్మేవారిగా, వారి సహాయకులుగా పని చేస్తూ నెలకు రూ.1000 నుంచి 3 వేలు సంపాదిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలోని ప్రతి 100 మంది పిల్లల్లో 14 మంది బాల కార్మికులుగా ఉన్నారు. కరోనా కాటు వల్ల ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. (పెళ్లి చేసుకో, పిల్లల్ని కను.. అప్పుడే) -
బాలకార్మికులకు బంధవిముక్తి
సాక్షి, (కరీంనగర్) : బాలకార్మికులను వ్యవస్థను నిర్మూలించేందుకు బడి బయట వెట్టిచాకిరీలో మగ్గుతున్న బాలబాలికలను గుర్తించి తిరిగి పాఠశాలలకు పంపించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం ఆపరేషన్ ముస్కాన్. ఐదేళ్లుగా ప్రభుత్వం ఏటా జూలైలో ఈ కార్యక్రమం చేపట్టి బాలకార్మికులను బంధ విముక్తులను చేస్తోంది. చిన్నారుల మోములో చిరునవ్వు పూయిస్తోంది. సోమవారం నుంచి జూలై 30 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ పోలీస్శాఖ, ఐసీడీసీఎస్ శాఖ ప్రణాళిక రూపొందించింది. రెండు శాఖలు సంయుక్తంగా వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న లేదా బడికి వెళ్లని బాల కార్మికులను, ఇతర ప్రాంతాల నుంచి తప్పిపోయి వచ్చి కార్మికులుగా మారిన బాలలను, భిక్షాటన చేసే వారిని, అనాథలుగా ఉన్న వారిని గుర్తించి వారిని వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పిస్తారు. తిరిగి బడిబాట పట్టెలా చర్యలు తీసుకుంటారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్.. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా లేకుండా చేసేందుకు 2015 నుంచి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. బాలకార్మికులను, బిక్షాటన, వెట్టిచాకిరీ చేస్తున్న వారిని గుర్తించి వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం, అనాథలను ఆనాథశ్రయాలకు పంపించడం, వారికి మెరుగైన విద్య అందించేందదుకు చర్యలు తీసుకునేందుకు ఈ రెండు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏటా జనవరి 1 నుంచి 30 రోజులు పాటు ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో మళ్లీ జులై 1 నుంచి 30 రోజులు ఆపరేషన్ ముస్కాన్ పేరిట బాల కార్మికుల వ్యవస్థ లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2015 నుంచి స్మైల్ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఐదుసార్లు నిర్వహించగా, ముస్కాన్ ఇప్పటి వరకు నాలుగుసార్లు నిర్వహించారు. ఐదో విడత సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. ఐదుసార్లు నిర్వహించిన స్మైల్, నాలుగుసార్లు నిర్వహించిన ముస్కాన్ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు 2,700 మంది బాలబాలికలను గుర్తించారు. వారిని బాల సంరక్షణ కమిటీ ఎదుట హాజరుపరిచి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు. పలు శాఖల సమన్వయం.. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల్లో పలు శాఖలను భాగస్వాములు చేస్తున్నారు. పోలీస్, స్త్రీ,శిశు సంక్షేమశాఖ, స్వచ్ఛంద సంస్థలు, కార్మికశాఖ, విద్య, వైద్యశాఖలు, రెవెన్యూ, చైల్డ్ హెల్ప్లైన్కు చెందిన సిబ్బందితోపాటు పలువురు సామాజిక కార్యకర్తలను కూడా భాగస్వాముల చేస్తూ బాల కార్మికుల వ్యవస్థను రూపుమాపేందుకు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. బడి బయటే బాల్యం బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇది మున్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. పలు కుటుం బాలు ఆర్థిక స్థోమత, ఇళ్లలో ఉం టున్న ఇబ్బందులు మూలంగా పిల్లలను తిరిగి పనికి పంపుతున్నారు. వారిని పట్టుకుని ఇంటికి పంపిస్తున్నా వారు మళ్లీ్ల పనికి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. దీనితో బాలకార్మికులు అలాగే ఉండిపోతున్నారు. బాలలు కార్మికులుగా మారడానికి కారణాలు తెలుసుకుని వాటిని నిర్మూలించినప్పుడే బాలకార్మికులు మళ్లీ కార్మికులు మారకుండా బడికి వెళ్లడానికి సిద్ధపడతారు. కొందరు అనాథగా ఉన్న వారు సంరక్షణ కేంద్రాల్లో కొంతకాలం ఉంటున్నారు. వివిధ పరిస్థితుల ప్రభావంతో మళ్లీ అక్కడి నుంచి బయటపడి కార్మికులుగా మారుతున్నారు. మంచి లక్ష్యంతో ముందుకు సాగుతున్నా అయా శాఖల సమన్వయంతోనూ ఇబ్బందులు వస్తున్నాయి. పలు శాఖల భాగస్వామ్యం ఉన్నా కూడా పోలీస్, ఐసీడీసీఎస్ శాఖలు మాత్రమే బాధ్యతాయుతంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికైనా అన్ని శాఖల అధికారులు స్పందించి 30 రోజులు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్లో భాగస్వాములై బాల కార్మికులు లేకుండా చేసేందుకు ముందుకు సాగాలని ప్రజలు కోరుతున్నారు. -
చేతిలో పార కళ్లల్లో స్కూలు
జూన్ 12 వరల్డ్ డే అగెనైస్ట్ చైల్డ్ లేబర్ మన చదువులు తగలెయ్య! మన ప్రభుత్వాలకు సంకల్పం లేదు. మన నేతలకు చిత్తశుద్ధి లేదు. మనకు ఈ లక్షణాలే ఉన్నట్లయితే, దేశంలోని బాలలందరూ బడిలోనే ఉండేవారు. చెమట చిందించాల్సిన అగత్యం లేకుండా శుభ్రంగా చదువుల ఒడిలోనే సేదదీరేవారు. ప్రపంచవ్యాప్తంగా 16.8 కోట్ల మంది బాలకార్మికులు బడులకు వెళ్లలేక పనుల్లో మగ్గిపోతున్నారు. వీళ్లల్లో చాలామంది వెట్టిచాకిరిలో కట్టుబానిసల్లా బతుకుతున్నారు. మన ‘మహాన్ భారత్’లో 5-14 ఏళ్ల లోపు బాలల జనాభా దాదాపు 25.3 కోట్లు. వీళ్లలో 1.26 కోట్ల మంది బడికి దూరమైన బాలకార్మికులే. పలకా బలపం పట్టుకోవాల్సిన చిట్టిచేతులు పలుగూ పారా పట్టుకుంటున్నాయి. అక్షరాలు దిద్దుకోవాల్సిన చేతులు మొరటు పనుల్లో నలిగి బొబ్బలెక్కుతున్నాయి. వాళ్లకు మాత్రం బడికి వెళ్లాలని ఉండదూ! తోటి చిన్నారులతో ఆటలాడుకోవాలని ఉండదూ! మనకు స్వాతంత్య్రం వచ్చి దాదాపు డెబ్బయ్యేళ్లవుతోంది. ‘గరీబీ హఠావో’ నినాదానికి నలభై ఐదేళ్లు నిండాయి. అయినా ‘బాల’భారతాన్ని దారిద్య్రం పట్టి పీడిస్తూనే ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఇన్నాళ్లూ మన ప్రభుత్వాలు చేసిందేమిటి? చదువు సంధ్యలతో సమాజంలో ఉన్నత స్థితికి ఎగబాకిన ‘భద్ర’లోకులు చేస్తున్నదేమిటి? ప్రపంచ జనాభా 700కోట్లు వెట్టి కార్మికులు 2.98 కోట్లుమన దేశ జనాభా దాదాపు 130 కోట్లు. వారిలో 25 కోట్లకు పైగా బాలలు ఉన్నారు. అయితే, వారిలో 1.26 కోట్ల మందికి పైగా బాలలకు బాల్యమే లేదు. బడిలో గడపాల్సిన ఈ చిన్నారులంతా బాల కార్మికులుగా వెళ్లదీస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) చొరవతో ఏటా జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినంగా ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయి. ఇదే తేదీకి కాస్త అటూ ఇటుగా మన దేశంలో బడిగంటలు మోగుతాయి. చాలామంది చిన్నారులు కొత్త యూనిఫామ్ దుస్తులు వేసుకుని, భుజాలకు బ్యాగులు తగిలించుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా స్కూళ్లకు వెళతారు. కళ్లెదుట బడి కనిపిస్తున్నా, బడిగంటలు చెవికి వినిపిస్తున్నా, లోలోపల బడికి వెళ్లాలనే కోరిక బలంగా ఉన్నా, చాలామంది చిన్నారులు ఆ మాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేకపోతున్నారు. తమ తోటి పిల్లలందరూ స్కూళ్లకు వెళుతుంటే, పలుగూ పారా చేతపట్టి పనుల్లోకి వెళుతున్నారు. చాలామంది పొలం పనులు, ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ వేన్నీళ్లకు చన్నీళ్లుగా తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఇంకొందరు బరువులెత్తే పనులు, చెత్తలు ఏరుకునే పనుల్లో మగ్గిపోతున్నారు. మరికొందరు బాణసంచా కర్మాగారాలు, గనులు, రసాయన కర్మాగారాలు వంటి చోట్ల ప్రమాదకరమైన పరిస్థితుల్లో చెమట చిందిస్తున్నారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు మినహా మిగిలిన అన్ని దేశాల్లోనూ బాలకార్మికులు ఉన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాల్లో అత్యధికంగా 7.77 కోట్ల మంది బాల కార్మికులు చదువులకు నోచుకోకుండా చాకిరిలో మగ్గిపోతున్నారు. పశ్చిమాసియా-ఉత్తరాఫ్రికా దేశాల్లో 90 లక్షల మంది, సహారా ఎడారికి దిగువన ఉన్న మిగిలిన ఆఫ్రికన్ దేశాల్లో 5.9 కోట్ల మంది, లాటిన్ అమెరికన్ దేశాల్లో 1.25 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మిథ్యగానే విద్యాహక్కు దేశంలోని 6-14 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలనే సంకల్పంతో మన ప్రభుత్వం 2009లో విద్యాహక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 6-14 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులందరికీ విద్య ప్రాథమిక హక్కు. ఈ చట్టాన్ని అమలులోకి తేవడం ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన దేశాల్లో భారత్ 135వ దేశంగా అవతరించింది. ఈ చట్టం అమలులోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా, ఇంకా కోటి మందికి పైగా చిన్నారులు బడులకు దూరంగా, బాలకార్మికులుగా వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో ఉండాల్సిన టీచర్ల కంటే 5.08 లక్షల మంది టీచర్లు తక్కువగా ఉన్నారు. విద్యాహక్కు మిథ్యగానే మిగిలిపోతోందనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. ప్రచారార్భాటాల కోసం వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాలు కాస్తంతైనా చిత్తశుద్ధితో విద్యాహక్కు చట్టం అమలుపై దృష్టిపెడితే ఈ దుస్థితి ఉండేది కాదు. బాలకార్మికులు పనిచేస్తున్న పరిశ్రమలు వజ్రాల పరిశ్రమ: తళుకులీనే వజ్రాల మెరుపుల వెనుక చిన్నారుల చెమట, నెత్తురు ఉన్నాయనే సంగతి ఎందరికి తెలుసు? భారత్లోను, పలు ఆఫ్రికన్ దేశాల్లోను వజ్రాల పరిశ్రమలో బాల కార్మికులు పని చేస్తున్నట్లు ఐఎల్ఓ దశాబ్దం కిందటే వెల్లడించింది. ఆ తర్వాత వజ్రాల పరిశ్రమలో బాల కార్మికులు పని చేస్తున్నది నిజమేనని దక్షిణ గుజరాత్ వజ్రాల పరిశ్రమ కార్మిక సంఘం అంగీకరించింది. అయితే, వారి సంఖ్య ఒక శాతం కంటే తక్కువేనని సన్నాయి నొక్కులు నొక్కింది. భారత్లోని వజ్రాల పరిశ్రమలో దాదాపు 15 లక్షల మంది కార్మికులు పని చేస్తుంటే, వారిలో 20 వేల మంది వరకు బాల కార్మికులు ఉన్నట్లు ఐఎల్ఓ అంచనా. బాణసంచా పరిశ్రమ: మనదేశంలో బాణసంచా పరిశ్రమ చాలావరకు తమిళనాడులోని శివకాశిలోనే కేంద్రీకృతమై ఉంది. శివకాశిలోని నాలుగైదు పెద్ద కంపెనీలు మినహా మిగిలిన చోట్ల చాలావరకు బాణసంచా కర్మాగారాల్లో కనీస భద్రతా సౌకర్యాలు సైతం ఉండవనేది బహిరంగ రహస్యం. బాణసంచా పరిశ్రమలో దాదాపు లక్ష మందికి పైగా బాల కార్మికులు పని చేస్తున్నారు. పట్టు పరిశ్రమ: కర్ణాటక, తమిళనాడులలో విస్తృతంగా ఉన్న పట్టు పరిశ్రమల్లో ఐదేళ్ల వయసు మొదలుకొని చాలామంది చిన్నారులు దాదాపు వెట్టిచాకిరిలో మగ్గిపోతున్నారు. పట్టు పరిశ్రమ యాజమాన్యాలు చిన్నారుల చేత రోజుకు పన్నెండు గంటల సేపు నిర్దాక్షిణ్యంగా పనిచేయించుకుంటూ రోజుకు రూ.10-15 మాత్రమే చెల్లిస్తున్నాయని ఒక జర్మన్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. పట్టు పరిశ్రమలో పదివేల మందికి పైగానే బాల కార్మికులు పని చేస్తున్నట్లు అంచనా. గనులు: గనులలో పద్దెనిమిదేళ్ల లోపు వారి చేత పనులు చేయించరాదని చట్టాలు చెబుతున్నా, మన దేశంలో పలుచోట్ల గనుల యాజమాన్యాలు అనధికారికంగా బాల కార్మికులను వాడుకుంటూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని బొగ్గు గనుల్లో బాల కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి చోట్ల కూడా వేల సంఖ్యలో బాల కార్మికులు గనుల్లో పని చేస్తున్నట్లు ‘బచ్పన్ బచావో’ వంటి స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కార్పెట్ల పరిశ్రమ: ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించిన కార్పెట్ల నేత పరిశ్రమల్లోనూ వేలాది మంది బాల కార్మికులు ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారు. వీరిలో చాలామంది వెట్టిచాకిరిలోనే మగ్గిపోతున్నారు. ఈ పరిశ్రమల యాజమాన్యాలు చిన్నారుల చేత అత్యంత కర్కశంగా బలవంతంగా పని చేయించుకుంటున్న ఉదంతాలు కొన్ని వెలుగులోకి వచ్చినా, ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ధాబాలు, రెస్టారెంట్లు: వ్యవసాయ పనులు, ఇళ్లల్లో పనుల తర్వాత బాల కార్మికులు అత్యధికంగా కనిపించేది ధాబాలు, రెస్టారెంట్లలోనే. దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మందికి పైగా బాల కార్మికులు ధాబాలు, రెస్టారెంట్లలో పని చేస్తున్నట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. చట్టాలు ఏమంటున్నాయి..? బాల కార్మిక చట్టం, కర్మాగారాల చట్టం, గనుల చట్టం, వెట్టిచాకిరి నిర్మూలన చట్టం వంటి చట్టాలు బాల కార్మికుల చేత పనులు చేయించుకోవడాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. మన రాజ్యాంగం కూడా బాలల హక్కులకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తోంది. చట్టాలను ఉల్లంఘించి బాల కార్మికులను పనుల్లో నియమించుకునే యజమానులకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. ఇలా కూడా చేయవచ్చు! సానుభూతి చూపే చూపుల కన్నా సాయం చేసే చేతులు మిన్న! మీ ఇంట్లో, మీ పక్కింట్లో, మీ కాలనీలో... చైల్డ్లేబర్ కనిపించారా? మనసుకు బాధగా ఉందా! ఏదైనా చేయాలని ఉందా? అయితే ఇలా చేసి చూడండి... మీ కాలనీలో మొక్కలు నాటడం నుంచి పరిసరాల పరిశుభ్రత వరకు... అందరూ కలిసి రకరకాల మంచి పనులు చేస్తారు. మీ కాలనీ వాసులంతా చైల్డ్లేబర్ను దత్తత తీసుకొని పని మానిపించి బడికి పంపించడం కూడా మంచి పనే. మీ పాకెట్ మనీ నుంచి తలా కొంత చైల్డ్లేబర్కు ఇస్తే ఆర్థికంగా వారికి వెన్నుదన్నుగా ఉంటుంది. చదువు సాఫీగా సాగుతుంది. మనం సహాయం చేసిన బాలకార్మికుడు మంచి చదువులు చదివి ప్రయోజకుడైతే మన కాలనీకి ఎంత మంచి పేరు! ఒక్కసారి ఆలోచించండి. చైల్డ్ లేబర్ ఓకేనా? సినిమాలో మద్యం తాగే దృశ్యం వస్తే... ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని - సిగరెట్ తాగితే ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికలు తెర మీద కనిపిస్తాయి. హోటల్లో టీ సప్లై చేస్తూనో... నల్లగా మసిబారిన దుస్తులతో మెకానిక్ షెడ్లో పని చేస్తూనో... ఇలాంటి పనులు చేస్తున్న పిల్లల దృశ్యాలు తరచుగా వెండితెర మీద కనిపిస్తుంటాయి. మరి ఇలాంటి దృశ్యాలు వెండితెర మీద కనిపించినప్పుడు... ‘పిల్లలతో పని చేయించుకోవడం నేరం’ అనే హెచ్చరిక మాత్రం వేయకూడదా! పొగతాగడం, మద్యపానం వల్ల వ్యక్తి ఆరోగ్యమే దెబ్బతినవచ్చు. కానీ ‘బాల కార్మిక వ్యవస్థ’ వల్ల దేశ ఆరోగ్యమే దెబ్బతింటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ‘పిల్లలతో పని చేయించుకోవడం నేరం’ అనే హెచ్చరిక తప్పనిసరి అనిపిస్తుంది. మన దేశ జనాభా దాదాపు 130 కోట్లు. వారిలో 25 కోట్లకు పైగా బాలలు ఉన్నారు. అయితే, వారిలో 1.26 కోట్ల మందికి పైగా బాలలకు బాల్యమే లేదు. బడిలో గడపాల్సిన ఈ చిన్నారులంతా బాల కార్మికులుగా వెళ్లదీస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) చొరవతో ఏటా జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినంగా ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయి. ఇదే తేదీకి కాస్త అటూ ఇటుగా మన దేశంలో బడిగంటలు మోగుతాయి. చాలామంది చిన్నారులు కొత్త యూనిఫామ్ దుస్తులు వేసుకుని, భుజాలకు బ్యాగులు తగిలించుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా స్కూళ్లకు వెళతారు. కళ్లెదుట బడి కనిపిస్తున్నా, బడిగంటలు చెవికి వినిపిస్తున్నా, లోలోపల బడికి వెళ్లాలనే కోరిక బలంగా ఉన్నా, చాలామంది చిన్నారులు ఆ మాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేకపోతున్నారు. తమ తోటి పిల్లలందరూ స్కూళ్లకు వెళుతుంటే, పలుగూ పారా చేతపట్టి పనుల్లోకి వెళుతున్నారు. చాలామంది పొలం పనులు, ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ వేన్నీళ్లకు చన్నీళ్లుగా తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఇంకొందరు బరువులెత్తే పనులు, చెత్తలు ఏరుకునే పనుల్లో మగ్గిపోతున్నారు. మరికొందరు బాణసంచా కర్మాగారాలు, గనులు, రసాయన కర్మాగారాలు వంటి చోట్ల ప్రమాదకరమైన పరిస్థితుల్లో చెమట చిందిస్తున్నారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు మినహా మిగిలిన అన్ని దేశాల్లోనూ బాలకార్మికులు ఉన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాల్లో అత్యధికంగా 7.77 కోట్ల మంది బాల కార్మికులు చదువులకు నోచుకోకుండా చాకిరిలో మగ్గిపోతున్నారు. పశ్చిమాసియా-ఉత్తరాఫ్రికా దేశాల్లో 90 లక్షల మంది, సహారా ఎడారికి దిగువన ఉన్న మిగిలిన ఆఫ్రికన్ దేశాల్లో 5.9 కోట్ల మంది, లాటిన్ అమెరికన్ దేశాల్లో 1.25 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మిథ్యగానే విద్యాహక్కు దేశంలోని 6-14 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలనే సంకల్పంతో మన ప్రభుత్వం 2009లో విద్యాహక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 6-14 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులందరికీ విద్య ప్రాథమిక హక్కు. ఈ చట్టాన్ని అమలులోకి తేవడం ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన దేశాల్లో భారత్ 135వ దేశంగా అవతరించింది. ఈ చట్టం అమలులోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా, ఇంకా కోటి మందికి పైగా చిన్నారులు బడులకు దూరంగా, బాలకార్మికులుగా వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో ఉండాల్సిన టీచర్ల కంటే 5.08 లక్షల మంది టీచర్లు తక్కువగా ఉన్నారు. విద్యాహక్కు మిథ్యగానే మిగిలిపోతోందనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. ప్రచారార్భాటాల కోసం వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాలు కాస్తంతైనా చిత్తశుద్ధితో విద్యాహక్కు చట్టం అమలుపై దృష్టిపెడితే ఈ దుస్థితి ఉండేది కాదు.బాలకార్మికులు పనిచేస్తున్న పరిశ్రమలు వజ్రాల పరిశ్రమ: తళుకులీనే వజ్రాల మెరుపుల వెనుక చిన్నారుల చెమట, నెత్తురు ఉన్నాయనే సంగతి ఎందరికి తెలుసు? భారత్లోను, పలు ఆఫ్రికన్ దేశాల్లోను వజ్రాల పరిశ్రమలో బాల కార్మికులు పని చేస్తున్నట్లు ఐఎల్ఓ దశాబ్దం కిందటే వెల్లడించింది. ఆ తర్వాత వజ్రాల పరిశ్రమలో బాల కార్మికులు పని చేస్తున్నది నిజమేనని దక్షిణ గుజరాత్ వజ్రాల పరిశ్రమ కార్మిక సంఘం అంగీకరించింది. అయితే, వారి సంఖ్య ఒక శాతం కంటే తక్కువేనని సన్నాయి నొక్కులు నొక్కింది. భారత్లోని వజ్రాల పరిశ్రమలో దాదాపు 15 లక్షల మంది కార్మికులు పని చేస్తుంటే, వారిలో 20 వేల మంది వరకు బాల కార్మికులు ఉన్నట్లు ఐఎల్ఓ అంచనా. బాణసంచా పరిశ్రమ: మనదేశంలో బాణసంచా పరిశ్రమ చాలావరకు తమిళనాడులోని శివకాశిలోనే కేంద్రీకృతమై ఉంది. శివకాశిలోని నాలుగైదు పెద్ద కంపెనీలు మినహా మిగిలిన చోట్ల చాలావరకు బాణసంచా కర్మాగారాల్లో కనీస భద్రతా సౌకర్యాలు సైతం ఉండవనేది బహిరంగ రహస్యం. బాణసంచా పరిశ్రమలో దాదాపు లక్ష మందికి పైగా బాల కార్మికులు పని చేస్తున్నారు. పట్టు పరిశ్రమ: కర్ణాటక, తమిళనాడులలో విస్తృతంగా ఉన్న పట్టు పరిశ్రమల్లో ఐదేళ్ల వయసు మొదలుకొని చాలామంది చిన్నారులు దాదాపు వెట్టిచాకిరిలో మగ్గిపోతున్నారు. పట్టు పరిశ్రమ యాజమాన్యాలు చిన్నారుల చేత రోజుకు పన్నెండు గంటల సేపు నిర్దాక్షిణ్యంగా పనిచేయించుకుంటూ రోజుకు రూ.10-15 మాత్రమే చెల్లిస్తున్నాయని ఒక జర్మన్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. పట్టు పరిశ్రమలో పదివేల మందికి పైగానే బాల కార్మికులు పని చేస్తున్నట్లు అంచనా. గనులు: గనులలో పద్దెనిమిదేళ్ల లోపు వారి చేత పనులు చేయించరాదని చట్టాలు చెబుతున్నా, మన దేశంలో పలుచోట్ల గనుల యాజమాన్యాలు అనధికారికంగా బాల కార్మికులను వాడుకుంటూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని బొగ్గు గనుల్లో బాల కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి చోట్ల కూడా వేల సంఖ్యలో బాల కార్మికులు గనుల్లో పని చేస్తున్నట్లు ‘బచ్పన్ బచావో’ వంటి స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కార్పెట్ల పరిశ్రమ: ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించిన కార్పెట్ల నేత పరిశ్రమల్లోనూ వేలాది మంది బాల కార్మికులు ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారు. వీరిలో చాలామంది వెట్టిచాకిరిలోనే మగ్గిపోతున్నారు. ఈ పరిశ్రమల యాజమాన్యాలు చిన్నారుల చేత అత్యంత కర్కశంగా బలవంతంగా పని చేయించుకుంటున్న ఉదంతాలు కొన్ని వెలుగులోకి వచ్చినా, ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ధాబాలు, రెస్టారెంట్లు: వ్యవసాయ పనులు, ఇళ్లల్లో పనుల తర్వాత బాల కార్మికులు అత్యధికంగా కనిపించేది ధాబాలు, రెస్టారెంట్లలోనే. దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మందికి పైగా బాల కార్మికులు ధాబాలు, రెస్టారెంట్లలో పని చేస్తున్నట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. చట్టాలు ఏమంటున్నాయి..? బాల కార్మిక చట్టం, కర్మాగారాల చట్టం, గనుల చట్టం, వెట్టిచాకిరి నిర్మూలన చట్టం వంటి చట్టాలు బాల కార్మికుల చేత పనులు చేయించుకోవడాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. మన రాజ్యాంగం కూడా బాలల హక్కులకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తోంది. చట్టాలను ఉల్లంఘించి బాల కార్మికులను పనుల్లో నియమించుకునే యజమానులకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. బాలకార్మిక వ్యవస్థకు కారణాలు * పేదరికం * తల్లిదండ్రుల నిరక్షరాస్యత, అవగాహన లేమి * లింగ వివక్ష * చిన్నారుల నిస్సహాయత * పెట్టుబడిదారుల దోపిడీ ధోరణి * ప్రభుత్వ వైఫల్యం బాల్యాన్ని దోచే దొంగలు కావద్దు! పసిపిల్లల విలువైన బాల్యన్ని దోచుకునే వారు క్రూరమైన దొంగలు. మీ ఇంట్లోనో, మీ షాప్లోనో... ఇంకా ఎక్కడైనా సరే పిల్లల్ని పనిలో పెట్టారంటే మీరు వారి బాల్యాన్ని దోచిన గజదొంగలైనట్లే. అందుకే ఆ తప్పు చేయవద్దు. వీలైతే వారి చదువుకు సహాయం చేసి మనసున్న మనిషి అనిపించుకోండి. వీళ్లకు ఫిర్యాదు చేయాలి ఎక్కడైనా మీకు బాల కార్మికులు తారసపడితే చూసీ చూడనట్లు వెళ్లిపోవద్దు. దయచేసి ఈ కింది చిరునామాలకు ఫిర్యాదు చేయండి. రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం టి. అంజయ్య భవన్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్రోడ్, హైదరాబాద్ ప్రాంతీయ కార్మిక కమిషనర్ ఏటీఐ క్యాంపస్, విద్యానగర్, హైదరాబాద్ ఇవి కాకుండా, మీ జిల్లా కేంద్రాల్లో ఉండే కార్మికశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. లేకుంటే, సమీపంలోని ‘సాక్షి’ కార్యాలయంలో సమాచారం ఇవ్వవచ్చు. పౌరులు కూడా తగిన తోడ్పాటునందిస్తే, బాల కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరింత అవకాశం ఉంటుంది. అధికారులకు ఇలా ఫిర్యాదు చేయవచ్చు... నమూనా పత్రం బాలయ్యకు చదువుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి వల్ల చదువుకోలేకపోతున్నాడు. కుటుంబానికి ఆసరా కోసం రోజూ కూలీ పని చేస్తున్నాడు. చదువుకోవాల్సిన వయసులో ఎండనక, వాననక కష్టపడుతున్నాడు. బాలయ్య ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అతడిని బడిలో చేర్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. -
103 మంది బాల కార్మికులకు విముక్తి
సుల్తానాబాద్(కరీంనగర్ జిల్లా): సుల్తానాబాద్ మండల పరిధిలో 103 మంది బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. ఒడిషాకి చెందిన వీరంతా సుల్తానాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్నారు. బాలలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. బాలలను దగ్గర్లోని సంక్షేమ కార్యాలయానికి తరలించనున్నట్లు ఐసీడీఎస్ అధికారిణి పర్వీన్ సుల్తానా తెలిపారు. -
కార్డన్ సెర్చ్లో 28 మంది రౌడీ షీటర్ల అరెస్ట్
హైదరాబాద్: ఫలక్ నుమ పీఎస్ పరిధిలోని వట్టేపల్లి బస్తీ, ఫాతిమానగర్లలో పోలీసులు మంగళవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వేకువజాము నుంచే పోలీసులు ఈ ప్రాంతాల్లో చాలా మంది ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. కొందరు అనుమానితులను ప్రశ్నించి అదుపులోనికి తీసుకున్నారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్యర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. 28 మంది రౌడీ షీటర్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా, ఈ కార్డన్ సెర్చ్ ద్వారా 24 మంది బాల కార్మికులకు విముక్తి లభించింది. 350 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
12మంది బాల కార్మికులకు విముక్తి
ఆముదాలవలస: శ్రీకాకుళం జిల్లా నుంచి 12 మంది బాలకార్మికులను రైలులో గుజరాత్కు తరలిస్తుండగా ఐసీడీఎస్ అధికారులు బుధవారం వేకువజామున దాడిచేసి పట్టుకున్నారు. వివరాలు.. శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి 12 మంది బాలకార్మికులను తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసుల సాయంతో అధికారులు రైల్వేస్టేషన్ చేరుకున్నారు. పూరి- అహమ్మదాబాద్ ఎక్స్ప్రెస్ రైలులో బాలలను తరలిస్తుండగా దాడిచేసి వారిని పట్టుకున్నారు. పోలీసులను చూసిన ఏజెంట్లు పరారయ్యారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ చక్రధర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ కేవి రమణ ఇతర అధికారులు 12మంది బాల కార్మికులను విముక్తి చేసి వారిని బుధవారం ఉదయం శ్రీకాకుళం బాలసదన్కు తరలించారు. -
స్వస్థలాలకు మరో 86 మంది బాల కార్మికులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలనకు కృషి చేస్తామని లేబర్ కమిషనర్ ఆర్ వీ. చంద్రవదన్ తెలిపారు. పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తున్న మాఫియాను అడ్డుకోవడానికి నెలకు రెండుసార్లు కర్మాగారాల్లో తనీఖీలు నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో గాజు తయారీ పరిశ్రమల్లో పనిచేస్తూ పోలీసులకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో దొరికిన చిన్నారులను వారి స్వస్థలాలకు పంపిచారు. తాజాగా గురువారం 86 మంది బాలలను పాట్నా ఎక్స్ప్రెస్ ప్రత్యేక బోగీలో బీహార్ వెళ్లడానికి ఏర్పాటు చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలను బలవంతంగా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. -
స్వస్థలాలకు 82 మంది బాల కార్మికులు
హైదరాబాద్: పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో గాజు తయారీ పరిశ్రమల్లో పనిచేస్తూ పోలీసులకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో దొరికిన చిన్నారులను వారి స్వస్థలాలకు పంపే కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ప్రస్తుతం రామంతపూర్ డాన్బాస్కోలో ఆశ్రయం పొందుతున్న 271 మంది బాలకార్మికుల్లో మొదటివిడతగా 82 మందిని ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన పాట్నా ఎక్స్ప్రెస్లో ప్రత్యేక బోగీలో అధికారులు పంపించారు. వీరికి పర్యవేక్షకులుగా డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారి, ఆరుగురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు బాలల సంరక్షణాధికారులు వెళ్లారని జిల్లా బాలల సంరక్షణాధికారి ఇంతియాజ్ తెలిపారు. కాగా, చికెన్ఫాక్స్తో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న రెస్క్యూహోమ్లోని 12 మంది బాలకార్మికులు కోలుకున్నారు. వారందరినీ మంగళవారం డిశ్చార్జ్ చేసి పంపేశారు. వీరిని బుధవారం వారి స్వస్థలాలకు పంపనున్నారు. అదృశ్యమైన కొడుకు కోసం ఆరా! హైదరాబాద్: బాలకార్మికులకు విముక్తి కల్పించారని తెలుసుకున్న గుంటూరుకు చెందిన షేక్బాజీ దంపతులు తప్పిపోయిన తమ కుమారుడు షేక్ మహ్మద్ కోసం ఇక్కడికి వచ్చారు. పాట్నా రైలులో ప్రయాణిస్తున్న బాలల్ని, అధికారులను కలిసి తమ కుమారుడి ఆచూకీ కోసం ప్రయత్నించారు. తమ కుమారుడి ఆచూకీ తెలిస్తే 97030 39115 నంబరుకు సమాచారం అందించాలని వారు వేడుకున్నారు. -
స్వస్థలాలకు బాలకార్మికులు
హైదరాబాద్: గాజుల బట్టీల్లో ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య పనిచేస్తూ పోలీసుల కార్డన్సెర్చ్ ఆపరేషన్లో దొరికిన చిన్నారులను వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రామంతాపూర్లోని డాన్బాస్కో స్నేహసదన్తో పాటు, మరి కొన్ని చోట్ల ఆ బాలకార్మికులకు ప్రభుత్వం తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది. అయితే, ఆ చిన్నారుల్లో 14 మంది చికెన్ఫాక్స్, జ్వరం తదితర అనారోగ్య సమస్యలతో నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కమిటీ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీస్, కార్మిక, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన రామంతాపూర్లోని డాన్బాస్కో స్నేహ సదన్లో బాల కార్మికులను కలసి వారి యోగాక్షేమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాల కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు రైల్వే అధికారులను సంప్రదించగా రోజుకు ఒక ప్రత్యేక బోగీ కేటాయించేందుకు వారు అంగీకరించినట్లు తెలిపారు. మంగళవారం 75 మంది బాల కార్మికులను వారి స్వరాష్ట్రాలకు తరలించి తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్పారు. చిన్నారులతో వెట్టిచాకిరి చేయిస్తున్న మాఫియాపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటుందన్నారు.