-
ఆ ఉద్యోగాలకు ముప్పే.. ఐబీఎం సీఈవో కీలక వ్యాఖ్యలు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్తో కొన్ని రకాల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణ (Arvind Krishna) అన్నారు. చాట్జీపీటీ (ChatGPT), గూగుల్ బార్డ్ (Google Bard) వంటి జెనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఉత్పాదకతను పెంచగలవని, అయితే "బ్యాక్ ఆఫీస్, వైట్ కాలర్" ఉద్యోగాలపై వాటి ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా పెరుగుదల క్షీణతను ప్రస్తావించారు. ఏఐ టెక్నాలజీలు మానవులకు నాణ్యమైన జీవనాన్ని అందించడంతో తోడ్పడగలవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టిఫీషియల్ సానుకూలతను ఉపయోగించుకోవడానికి ఐబీఎం కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఐబీఎం ఇటీవల వాట్సన్ఎక్స్ను అనే జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్ సూట్ను పరిచయం చేసింది. సాంకేతికతను సురక్షితంగా ఉపయోగించుకోవడంలో కంపెనీలకు సహాయం చేయడానికి దీన్ని రూపొందించారు. ఇంతకు ముందు మేనెలలో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ కంపెనీలో 30 శాతం ఉద్యోగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఆటోమేషన్ టెక్నాలజీతో భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఫలితంగా, వచ్చే ఐదేళ్లలో కంపెనీ 7,800 ఉద్యోగాలను తొలగిస్తుందని అంతా ఆందోళన చెందారు. తర్వాత తన వ్యాఖ్యలపై మరింత స్పష్టతనిస్తూ, కొత్త టెక్నాలజీ ఆఫీసు పనిని భర్తీ చేస్తుందని, ఐబీఎంలో కూడా ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. -
వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు IBM వార్నింగ్...
-
ప్రజా రవాణాకు ఎలక్ట్రిక్ వాహనాలు..
ప్రభుత్వాలతో చర్చిస్తున్నాం.. మహీంద్రా రేవా సీఈవో అరవింద్ హైదరాబాద్ మార్కెట్లో ఈ2ఓ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మహీంద్రా గ్రూప్కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం మహీంద్రా రేవా అమ్మకాలను గణనీయంగా పెంచుకునే దిశగా కసరత్తు చేస్తోంది. మహీంద్రా ఈ2ఓ కారును విక్రయిస్తున్న ఈ సంస్థ.. మ్యాక్సిమో, వెరిటో సెడాన్ మోడళ్లను సైతం ఎలక్ట్రిక్ వర్షన్లో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద అగ్రా కారిడార్లో మ్యాక్సిమో వాహనాలు పరుగెడుతున్నాయి. వాణిజ్యకార్యకలాపాలకోసం ఈ రెండు మోడళ్లను ఆవిష్కరించాల్సి ఉందని మహీంద్రా రేవా సీఈవో అరవింద్ మాథ్యూ చెప్పారు. మహీంద్రా ఈ2ఓ కారును హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా సేల్స్ హెడ్ జగన్ కురియన్తో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ఎలక్ట్రిక్ వాహనాలను అందించేందుకు ప్రభుత్వాలతో ప్రత్యేకించి ప్రజా రవాణా సంస్థలు, పర్యాటక శాఖలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. నిధులు ఖర్చు చేస్తేనే..: హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల విస్త్రృతి, తయారీకి భారత ప్రభుత్వం ఫేమ్ ప్రాజెక్టును చేపట్టింది. దీని కోసం ఏప్రిల్ 2015-మార్చి 2017 కాలానికి రూ.795 కోట్లు కేటాయించింది. దేశంలో అమ్ముడయ్యే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనానికి ద్విచక్ర వాహనం మొదలు బస్ల వరకు రూ.1,800 నుంచి రూ.66 లక్షల వరకు కేంద్రం భరిస్తుంది. అయితే ఫేమ్ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తేనే ఆశించిన ఫలితాలు నమోదు చేయవచ్చని అరవింద్ మాథ్యూ వెల్లడించారు. చార్జింగ్ స్టేషన్లు విరివిగా ఏర్పాటు కావాలన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
2024 ఎన్నికల్లో ఇది బెస్ట్ ఫోటో: ఆనంద్ మహీంద్రా ట్వీట్
రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్
‘బిగ్ బ్రదర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
సర్జరీలపై ట్రోలింగ్.. అర్థం చేసుకోకుండా తిడతారేంటి? మీ వల్ల..
ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక
ఫస్ట్టైమ్.. ఐటీని వెనక్కినెట్టిన బ్యాంకింగ్
భారత్లో ఐఫోన్ తయారీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వెబినార్
నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
హార్దిక్ అద్భుతమైన ప్లేయర్.. పాక్పై కచ్చితంగా చెలరేగతాడు: రైనా
తప్పక చదవండి
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement