breaking news
CAB President
-
మరోసారి అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ
కోల్కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి బెంగాల్ క్రికెట్ సంఘం (CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. సోమవారం జరిగిన ‘క్యాబ్’ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో గంగూలీని ఏకగ్రీవంగా అధ్యక్ష పదవిని ఎన్నుకున్నారు. కాగా 2015–2019 మధ్య ఇదే పదవిలో ఉన్న ఉన్న సౌరవ్ (Sourav Ganguly)... ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ అవే బాధ్యతలు చేపట్టడం విశేషం. 2019–2022 మధ్య ‘దాదా’ బీసీసీఐ (BCCI) అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. ఇక ఈడెన్ గార్డెన్స్ను ఆధునీకరిస్తూ సామర్థ్యాన్ని లక్షకు పెంచడంతో పాటు ప్రతిష్టాత్మక మ్యాచ్లను నిర్వహించేలా తాను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా గంగూలీ వెల్లడించాడు. ఈ ఏడాది నవంబర్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే టెస్టుకు ఈడెన్ ఆతిథ్యం ఇవ్వనుంది. 9 ఎకరాల్లో.. వచ్చే టీ20 వరల్డ్ కప్ భారత్లో జరగనున్న నేపథ్యంలో కోల్కతాకు కీలక మ్యాచ్లు దక్కేలా బీసీసీఐతో మాట్లాడి తన ప్రయత్నం చేస్తానని కూడా అతను వెల్లడించాడు. ‘బెంగాల్ టీమ్ రంజీ ట్రోఫీలో రెండు సార్లు ఫైనల్లో ఆడింది. ఇప్పుడు టీమ్ మరింత బలంగా మార్చడమే నా మొదటి లక్ష్యం. ఇందులో మరో మాటకు తావు లేదు. క్రికెట్ తర్వాతే మిగతా అంశాలు వస్తాయి. 9 ఎకరాల్లో అత్యంత ఆధునిక అకాడమీని నిర్మిస్తాం. దీని కోసం ఇప్పటికే భూమిని తీసుకున్నాం. ప్లానింగ్ కూడా పూర్తయింది’ అని సౌరవ్ తన ప్రణాళికలు వివరించాడు. చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్ట్రాలు -
అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన సౌరవ్ గంగూలీ
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. 2015–2019 మధ్యకాలంలో తొలిసారి ఈ పదవిని నిర్వహించిన ఆయన.. ఇప్పుడు రెండోసారి క్యాబ్ బాస్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. తన అన్న స్నేహాశిష్ గంగూలీ స్థానాన్ని సౌరవ్ భర్తీ చేయనున్నారు. గంగూలీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ పదవి కొసం ఇతరులెవ్వరూ నామినేషన్లు వెయ్యలేదు. ఇతరులెవ్వరైనా నామినేషన్లు వేసి ఉంటే అధ్యక్ష ఎన్నిక సెప్టెంబర్ 22న జరిగేది.గంగూలీ ప్యానెల్లో నితీష్ రంజన్ దత్తా ఉపాధ్యక్షుడిగా, బబ్లు కోలే కార్యదర్శిగా, మదన్మోహన్ ఘోష్ సహాయ కార్యదర్శిగా, సంజయ్ దాస్ ట్రెజరర్గా ఉంటారు.రెండో సారి క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గంగూలీ మాట్లాడుతూ ఇలా అన్నాడు. చాలా ఆనందంగా ఉంది. మరోసారి క్యాబ్ కుటుంబంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. క్యాబ్ ఓ కుటుంబం లాంటిది. ఇక్కడ ఎలాంటి ప్రతిబంధకాలు లేవు. త్వరలో ఈడెన్ గార్డెన్స్లో జరగబోయే ఇండియా-సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్పై దృష్టి పెడతాను. అలాగే టీ20 వరల్డ్కప్, బెంగాల్ ప్రో టీ20 లీగ్ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తాను. మిగతా సభ్యుల సహకారంతో బెంగాల్ క్రికెట్ను ముందుకు తీసుకెళ్తాను.ఇదిలా ఉంటే, గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా మరోసారి ఎన్నికవుతారని టాక్ నడుస్తుంది. క్యాబ్ గంగూలీని తమ ప్రతినిధిగా ఏజీఎంకు నామినేట్ చేయడంతో ఈ ప్రచారం మొదలైంది. ఏజీఎంకు నామినేట్ కావడం వల్ల గంగూలీ బీసీసీఐ అధ్యక్ష రేసులో ఉంటాడు. గంగూలీ 2019-2022 మధ్యలో బీసీసీఐ బాస్గా వ్యవహరించాడు. తాజా మాజీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ దిగిపోవడంతో సెప్టెంబర్ 28న ఎన్నిక జరుగనుంది. ఈ పదవికి సెప్టెంబర్ 20, 21 తేదీల్లో నామినేషన్లు వేస్తారు. -
గంగూలీ సోదరుడికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోదరుడు, క్యాబ్ (బెంగాల్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. పూరీ బీచ్లో (ఒడిశా) అతను ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో స్నేహశిష్తో పాటు అతని భార్య అర్పిత గంగూలీ కూడా ఉన్నారు. స్నేహశిష్ దంపతులు సముద్ర నీటిలో మునిగిపోతుండగా కొందరు లోకల్ బోట్ డ్రైవర్లు, మత్స్యకారులు వారిని రక్షించారు. ప్రాణాపాయం నుండి బయటపడిన స్నేహశిష్ దంపతులు ప్రస్తుతం కోల్కతాకు చేరుకున్నారు. మాకిది పునర్జన్మ అని గంగూలీ భార్య అర్పిత అన్నారు. అదో భయానక ఘటన అని అమె గుర్తు చేసుకున్నారు. పూరి జగన్నాథుని కృప వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని తెలిపారు. -
షాకిచ్చిన గంగూలీ.. అన్న కోసం అధ్యక్ష పదవి త్యాగం
బీసీసీఐ తాజా మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్రికెట్ వర్గాలకు ఊహించని షాకిచ్చాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి మరోసారి ఆశించి భంగపడ్డ దాదా.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి, చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. నామినేషన్లకు చివరి రోజైన ఆదివారం కూడా నామినేషన్ వేయని దాదా.. సోదరుడు స్నేహాశిష్ గంగూలీ కోసం క్యాబ్ అధ్యక్ష పదవిని త్యాగం చేశాడు. గంగూలీ పోటీ నుంచి విరమించుకోవడం, పోటీలో ఎవరూ లేకపోవడంతో స్నేహాశిష్ గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నాడు. క్యాబ్ ఎన్నికల్లో 2015 నుంచి విపక్ష వర్గం నుంచి నామినేషన్లు దాఖలు చేయకపోవడం ఆనవాయితీగా వస్తుంది. నాటి నుంచి 2019 వరకు గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా సేవలందించాడు. ఆ తర్వాత దాదా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టడంతో మాజీ బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కుమారుడు అవిషేక్ దాల్మియా క్యాబ్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మరోవైపు క్యాబ్ ఉపాధ్యక్ష పదవి కోసం ఆమలేందు బిస్వాస్, సెక్రటరీ పదవి కోసం నరేష్ ఓఝా, జాయింట్ సెక్రటరీ పోస్టు కోసం దేబబ్రత దాస్, ట్రెజరర్గా ప్రబీర్ చక్రవర్తి నామినేషన్లు వేశారు. ఈ పదవులకు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవం కానున్నాయి. చదవండి: టీ20 ప్రపంచకప్లో టీమిండియా సరికొత్త చరిత్ర... -
దాదానే మళ్లీ దాదా.. !
కోల్కతా: క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి ఎన్నికయ్యారు. ఈ రేసులో గంగూలీ మాత్రమే ఉండటంతో అతని ఎంపిక లాంచనమైంది. దాంతో పాటు గంగూలీ ప్యానల్కు పోటీగా కూడా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో అతని ప్యానల్ ఏకగ్రీవంగా ఎంపికైంది. గతవారం గంగూలీ ప్యానల్ నామినేషన్లు దాఖలు చేయగా, గురువారం ఈ ప్యానల్ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు క్యాబ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ప్రకటించారు. రేపట్నుంచి గంగూలీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్యానల్ ఆఫీసు బ్యారర్లుగా బాధ్యతలను తీసుకోనుంది. 2015లో తొలిసారి గంగూలీ క్యాబ్ చీఫ్గా ఎన్నికయ్యాడు. ఆ మరుసటి ఏడాది జగన్మోహన్ దాల్మియా మరణంతో దాదా అధ్యక్షుడయ్యాడు. ఆఫీస్ బేరర్ల ఆరేళ్ల గరిష్ఠ పదవీకాల నిబంధన గంగూలీకి మరో పది నెలల్లోనే ముగియనుంది. దీంతో అతడు 2020 జూలైలో తప్పుకోవాల్సి ఉంటుంది. గంగూలీ ప్యానల్ ప్రెసిడెంట్: సౌరవ్ గంగూలీ; వైస్ ప్రెసిడెంట్: నరేశ్ ఓజా; సెక్రటరీ: అవిషేక్ దాల్మియా; జాయింట్ సెక్రటరీ: దేబాబ్రతా దాస్; ట్రెజర్: దేబాశిస్ గంగూలీ -
దాదా.. ఏందిది..?
ఎప్పుడో సాయంత్రం కురిసిన వాన...తుఫానో, కుండపోతనో కాదు, అదీ ఓ మోస్తరుగా పడిందంతే. ! కానీ వర్షం ఆగిపోయిన ఐదు గంటల తర్వాత కూడా ఈడెన్ గార్డెన్స్ను మ్యాచ్కు ‘క్యాబ్’ అధికారులు సిద్ధం చేయలేకపోయారు. దాల్మియా కన్ను మూసిన తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో టికెట్లపై ఆయన ఫోటోను కూడా ముద్రించి దీనికి విస్తృత ప్రచారం కల్పించారు. పైగా సౌరవ్ గంగూలీ అధ్యక్ష హోదాలో తొలిసారి మ్యాచ్ నిర్వహణలో భాగం అయ్యారు. కానీ మ్యాచ్ నిర్వహించడానికి కావాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని తెలుస్తోంది. మూడు సూపర్ సాపర్లు ఏకధాటిగా పని చేశాయి, కవర్లు కూడా చాలా ముందే తొలగించి ఇక ఆట జరగడమే ఆలస్యం అన్న బిల్డప్ ఇచ్చారు, కానీ చివరకు ఏదీ సాధ్యం కాలేదు. మా ‘క్రికెట్ మక్కా’ అంటూ భుజాలు చరచుకునే బీసీసీఐకి ఇక్కడి డ్రైనేజీ పరిస్థితి చెంపదెబ్బలాంటిది. దేశంలోని ప్రతిష్టాత్మక స్టేడియంలలో ఒకటిగా పేరున్నా... ఇప్పుడు ఈడెన్ అతి సాధారణ గ్రౌండ్ మాత్రమేనని తాజా పరిస్థితి చూపించింది. అన్ని వైపులనుంచి విమర్శలు రావడం ఒక రకంగా గంగూలీ ప్రతిష్టకు దెబ్బ. 2011 ప్రపంచకప్ సమయంలో స్టేడియం ఆధునీకరణ అంటూ కీలక మ్యాచ్ కోల్పోయిన కోల్కతా... డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి పెట్టకపోతే వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్ ఫైనల్ అవకాశం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.