breaking news
bus ride
-
గుంజీలు తీయండి..ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందండి!
చిన్నప్పుడూ తప్పు చేస్తే గుంజీలు తీసే పనిష్మెంట్ ఇచ్చేవారు మాష్టార్లు. ఇది అందరికి అనుభవమే. ఐతే ఇక్కడొక దేశంలో మాత్రం ప్రజలు గుంజీలు తీసి.. ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందుతారు. ఇదేంటి అని అనుకుంటున్నారా!. ఔను అక్కడ సుమారు 20 గుంజీలు తీస్తే.. ఫ్రీగా బస్సులో తిరిగేయవచ్చు. యూరప్లోని రొమానియా అనే నగరంలో అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఇలాంటి మంచి ఆఫర్ని అందిస్తోంది. దీన్ని అక్కడి ప్రభుత్వం స్పోర్ట్స్ ఫెస్టివల్ అనే ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈ అద్భుతమైన ఆఫర్ని ప్రజలకు ఇస్తోంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దీన్ని ప్రవేశపెట్టిందట అక్కడి ప్రభుత్వం. ఈ ఉచిత టిక్కెట్ను అక్కడి ప్రజలు హెల్త్ టిక్కెట్గా పిలుస్తారు. అంతేకాదండోయ్ కేవలం రెండు నిమిషాల్లో 20 గుంజీలు తీస్తేనే ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందగలరు. అందుకు సంబంధించిన వీడియోని అలీనా బ్జోల్కినా అనే వినియోగదారుడు ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో... ఒక అమ్మాయి ఒక మిషన్ బూత్ ముందు నిలబడి 20 గంజీలు తీస్తుంది. అయిపోగానే టిక్కెట్ మిషన్ నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Алина Бжолка (@alinabzholkina) (చదవండి: అంతా ఈజీ కాదు దొంగతనం! ఎంత కూల్గా దొంగను బంధించాడు!) -
ఉబర్.. బస్ రైడ్ షేరింగ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : క్యాబ్ అగ్రిగేటర్గా ఉన్న ఉబర్ టెక్నాలజీస్ కొద్ది రోజుల్లో భారత్లో ఉబర్ ఎవ్రీథింగ్ పేరు తో నూతన సర్వీసులను ప్రారంభించనుంది. రైడ్ షేరింగ్ విభాగంలో బస్లు, మినీ వ్యాన్ల సేవలను పరిచయం చేయనుంది. క్యాబ్ షేరింగ్ మాదిరిగానే బస్లు, మినీ వ్యాన్లలో కస్టమర్లు ప్రయాణించొచ్చు. ఒక చోట నుంచి ఒకచోటుకు నిర్దేశిత మొత్తాన్ని కంపెనీ వసూలు చేస్తుంది. పైలట్ ప్రాజెక్టు కింద మొదలు పెట్టనున్న ఈ సేవలను బెంగళూరులోని ఉబర్ సాంకేతిక కేంద్రం పర్యవేక్షించనున్నట్టు తెలుస్తోంది.