breaking news
Bed Rest
-
ప్రెగ్నెంట్ అనగానే.. రెస్ట్..మస్ట్ కాదు..!?
ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణులకు రెస్ట్ మస్ట్ కాదంటున్నారు..అయితే చాలా మంది తెలియక అదే పనిగా రెస్ట్ తీసుకుంటున్నారని, తద్వారా నగరంలో 60.7 శాతం సీ–సెక్షన్లు జరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకుంటే తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, 98 శాతం మందికి అసలు బెడ్ రెస్ట్ అవసరం ఉండదని, పూర్తిగా రెస్ట్తోనే సీ సెక్షన్లు పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. నగరంలో సీ–సెక్షన్లు పెరుగుతున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ హెల్త్ సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో దీనిపై పలు సూచనలు.. అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి మొదటిసారి తల్లికాబోతోందని తెలియగానే విపరీతమైన ముద్దుచేస్తారు. చిన్నపనికూడా చేయనీయరు. అయితే అలాంటి పరిస్థితులు మానసికంగా, శారీరకంగా గర్భిణిపై ప్రభావం చూపిస్తాయని, ఇది సీ–సెక్షన్ల సంఖ్య పెరగడానికి దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు. సర్వే చెబుతోందేంటి? నగరంలోని ప్రసవాల్లో సుమారు 60.7 శాతం సీ–సెక్షన్లు ఉంటున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది. ఇది దేశంలోనే అత్యధిక రేటుగా పేర్కొంటోంది. గర్భనిర్ధారణ అయిన వెంటనే అధిక శాతం మంది వైద్యులు బెడ్ రెస్ట్ అవసరం అంటున్నారు. అయితే ప్రస్తుత జనరేషన్లో సుమారు 98 శాతం మంది గర్భిణులకు బెడ్ రెస్ట్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ బర్త్ కెనాల్ వీక్గా ఉన్నప్పుడు లేదా కుట్లు వేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే బెడ్ రెస్ట్ సూచిస్తారని, మిగతా సమయంలో అవసరం లేదని అంటున్నారు. ఫార్మేషన్లో తేడాలుంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా మిస్ క్యారీ అవుతుంది తప్ప, దినచర్య వల్ల ప్రమాదమనేది అపోహ మాత్రమే అంటున్నారు. గర్భిణులు నేను మెట్లు ఎక్కొచ్చా? నేల మీద కూర్చోవచ్చా? పనులు చేసుకోవచ్చా? అని ప్రశి్నస్తుంటారని, గర్భందాల్చడం జబ్బు కాదని, ఫిజియోలాజికల్ మార్పు మాత్రమేనని పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు జరగడానికి శారీరక వ్యాయామం ఒక కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. బెడ్ రెస్ట్తో కొత్త సమస్యలు.. గర్భిణులు తొమ్మిదో నెల వరకూ అన్ని పనులూ చేసుకోవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే బెడ్ రెస్ట్ అవసరపడుతుంది. సుమారు 98 శాతం మందికి బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. ఒక్కసారిగా పనులన్నీ పక్కన పెట్టి బెడ్ రెస్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. మూడు నెల్లలోపు పిండం సుమారు 80 గ్రాములు మాత్రమే ఉంటుంది. కవలలు, ఐవీఎఫ్, ఏఆర్ ఇతర సందర్భాల్లో మాత్రమే జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గర్భిణి ఒంటరితనం, స్ట్రెస్ ఫీలవకుండా చూసుకోవాలి. – పి.శృతిరెడ్డి, గైనకాలజిస్టు, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ (చదవండి: World Stroke Day 2025: లైఫ్స్టైల్ మార్పులే..స్ట్రోక్ కారకాలు..!) -
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. మూడు వారాలు విశ్రాంతి..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాలికి ఫ్రాక్చర్ అయినందు వల్ల మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించారని ఆమె తెలిపారు. అందుకే కొన్నిరోజులపాటు ఇంటికే పరిమితం కానున్నట్లు చెప్పారు. అయితే తన కార్యాలయం మాత్రం అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమాచారానికైనా, సాయానికైనా తన ఆఫీస్ను సంప్రదించవచ్చని కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks. My @OfficeOfKavitha shall be available for any assistance or communication. — Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023 అయితే ఎలా గాయపడ్డారనే విషయాన్ని మాత్రం కవిత వెల్లడించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవలే ఈడీ ఎదుట ఆమె విచారణకు హాజరయ్యారు. మొత్తం మూడు రోజుల పాటు ఆమెపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను కూడా కవిత అధికారులకు అప్పగించారు. తాను ఏ తప్పు చేయలేదని, అవసరమైతే న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు. చదవండి: ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తోంది.. మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ -
అబ్బే..పెద్ద గాయమేం కాదు!
‘‘అయ్యో ఆమిర్ఖాన్కు దెబ్బ తగిలిందా... బెడ్ రెస్ట్ తీసుకోవాలా? అసలు ఆమిర్ ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎన్ని రోజులు విశ్రాంతిలో ఉండాలి?’’ అని ఆమిర్ ఖాన్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన పడిపోయారు. ప్రస్తుతం ఆమిర్ ‘దంగల్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన మల్లయోధుడిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆమిర్ బరువు కూడా పెరిగారు. కాగా, లూధియానాలో మల్లయుద్ధానికి సంబంధించిన సీన్ తీస్తున్నప్పుడు ఆమిర్ భుజానికి గాయం అయ్యిందనే వార్త వచ్చింది. ఈ వార్త విని, ఆయన అభిమానులు కంగారుపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమిర్ గ్రహించకుండా ఉంటారా? ‘‘నాకు తగిలినది పెద్ద గాయమేం కాదు. కండరం పట్టేసింది. అంతే. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు. ఆ తర్వాత షూటింగ్లో పాల్గొంటాను’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారాయన. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి, ఆదివారం తీవ్రమైన నొప్పితో ఆమిర్ లూధియానా ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు పరిశీలించి, వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే, అదే రోజు ప్రయాణం చేయకూడదని చెప్పడంతో ఆదివారమంతా ఆమిర్ లూధియానాలోనే ఉన్నారు. సోమవారం ముంబయ్ ప్రయాణమయ్యారు. -
70 రోజులు.. 11 లక్షలు!
బెడ్ రెస్ట్ తీసుకుంటే చాలు దరఖాస్తులు ఆహ్వానించిన నాసా కష్టపడి పని చేస్తేనే కానీ డబ్బులు రాని ఈ రోజుల్లో నిద్రపోతే కూడా డబ్బులొస్తాయా? అవును! ప్రయోగశాలకు వచ్చి మంచంపై పడుకుంటే చాలు.. రోజుకు రూ. 10 వేల చొప్పున డబ్బులిచ్చేస్తామంటున్నారు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు! 70 రోజుల పాటు మంచంపై పడుకుంటే సరి.. రూ.11 లక్షలకు పైనే ముట్టజెపుతామని వారు ప్రకటించారు. ఇంతకూ డబ్బెందుకిస్తారు? ఈ వింత ప్రయోగాలేమిటి? ఎందుకు? అంటే... భూమి మీద రోదసి ఎఫెక్ట్ అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేమి వల్ల దీర్ఘకాలంలో వ్యోమగాముల ఆరోగ్యంపై దుష్ర్పభావాలు పడతాయి. కండరాలు, ఎముకలు కరిగిపోతాయి. గుండె పనితీరు మందగిస్తుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారాల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ప్రయోగాలు చేస్తున్నారు కూడా. అయితే, అన్ని పరీక్షలూ అంతరిక్షంలోనే చేయాలంటే కష్టం కాబట్టి.. ఇలా భూమ్మీదే రోదసి పరీక్షలకు రంగం సిద్ధం చేశారు. గురుత్వాకర్షణ లేమి ఎఫెక్ట్ కోసమని.. ఎల్లప్పుడూ తలను వెనక్కి వాల్చి.. కాళ్లు కొంచెం ఎత్తుగా చాపుకుని వెల్లకిలా పడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని రోజులూ మంచం మీదే! పరీక్షలకు ఎంపికైతే.. తల కిందికి వాల్చి, కాళ్లు పైకి ఉంచి వెల్లకిలా పడుకోవడం, చిన్నచిన్న పనులు చేసుకోవడంలో రెండు వారాలు శిక్షణ ఇస్తారు. తర్వాత పది వారాలు పూర్తిగా మంచంపై పడుకునే గడపాల్సి ఉంటుంది. ఈ సమయంలో పైకి లేచేదే ఉండదు. ఒకటీ, రెండూ అన్నీ మంచంపైనే! షవర్ హెడ్తో స్నానం చేయాలి. అప్పుడప్పుడూ చిన్నచిన్న కసరత్తులూ చేయాలి. ఇలా 70 రోజుల పాటు పడుకుని ఉంటే.. మెడ, దేహం, కండరాలు, ఎముకల్లో కలిగే మార్పులు, నొప్పి, గుండె ఆరోగ్యం వంటివి నిరంతరం పర్యవేక్షిస్తారు. పరీక్షలు అయిపోయాక 14 రోజుల్లో కోలుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు. కొంచెం కష్టమే కానీ.. ఇంత డబ్బు ఇస్తామంటే మేం రెడీ! అంటారా? కానీ కుదరదు లెండి. ఎందుకంటే ఈ పడక చాన్స్ అమెరికా పౌరులకు మాత్రమే!


