-
రామోజీ.. నీ నీచపు రాతలు చూస్తే జాలేస్తోంది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో ప్రపంచంలోనే అతి పెద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరిస్తుంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా అధిపతులు ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వేడుకపై విషం చిమ్ముతూ శుక్రవారం ఈనాడు పత్రిక కథనం ప్రచురించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఈనాడు పేపర్ను చించివేసి, పత్రిక ప్రతులను కాల్చివేశారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ.. దళితుల భూములను ఆక్రమించి ఫిల్మ్ సిటీ కట్టుకున్న నీచుడు రామోజీరావని ధ్వజమెత్తారు. దుర్మార్గుడైన రామోజీరావు దళిత బంధువైన సీఎం వైఎస్ జగన్పై విషం చిమ్మటం గర్హనీయమన్నారు. రామోజీరావు ఈనాడు పేపర్ను చంద్రబాబుకు తాకట్టుపెట్టి, పత్రిక విలువలు మంటగలిపారన్నారు. ఆయన కులపోడు సీఎంగా లేడన్న కారణంతోనే రాష్ట్రంపై రామోజీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రామో‘ఛీ’.. నీ నీచపు రాతలపై జాలేస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్పై ఈనాడులో రాసిన చెత్త రాతలపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. రామోజీ వయసుకు తగినట్టు నడుచుకోవాలని హితవు పలికారు. అంబేడ్కర్ విగ్రహం స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిసినప్పటి నుంచే పచ్చ మీడియా ఏడుపే ఏడుపు అని అన్నారు. సీఎం జగన్ దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని చెప్పారు. దశాబ్దాలుగా దళితులను అణచివేసిన చంద్రబాబుకు రామోజీ ఒక బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. దళితులకు మేలు చేయటం అంటే రామోజీ, చంద్రబాబు, రాధాకృష్ణలకు నచ్చదని చెప్పారు. కాటికి కాలుచాచిన వయసులో కూడా రామోజీ విషం కక్కటం మానలేదని వ్యాఖ్యానించారు. దళితులు వారి ఇళ్లలో పాచి పనులు చేయటానికే బతకాలనేది రామోజీ, చంద్రబాబుల నైజమన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించేవారిలో దేశంలోనే సీఎం జగన్ ముందున్నారని చెప్పారు. ఈ విగ్రహం సీఎం జగన్కి బడుగు బలహీన వర్గాల మీద ఉన్న ప్రేమ, అభిమానాలను ప్రతిబింబిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ఇది తట్టుకోలేక రామోజీ, చంద్రబాబు ఏడుస్తున్నారన్నారు. -
పెత్తందారీ పోకడలూ అంటరానితనమే
ఎన్నటికీ మరణం లేని మహనీయుడు అంబేడ్కర్ను తలుచుకుంటూ తరతరాలుగా స్ఫూర్తి పొందుతున్నాం. అభివృద్ధి– అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేడ్కర్ భావజాలం. మనం అదే భావజాలంతో పని చేస్తుంటే రాష్ట్రంలో పెత్తందార్ల పార్టీలకు, పెత్తందార్ల నాయకులకు నచ్చట్లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా అగ్రవర్ణ పేదలకు మంచి చేయాలనే సామాజిక న్యాయ విప్లవం తెచ్చానని చెప్పేందుకు గర్విస్తున్నా – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: ‘అంటరానితనంపైతిరుగుబాటు, విప్లవం, స్వాతంత్య్ర పోరాటాలకు ఉమ్మడి రూపమే మన బాబా సాహెబ్ అంబేడ్కర్’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా అలాంటి పరిస్థితులు వేర్వేరు రూపాల్లో ఇవాల్టికీ ఉన్నాయని, పెత్తందారీ పోకడలతో అంటరానితనం, వివక్ష రూపం మార్చుకుని సంచరిస్తున్నాయని చెప్పారు. విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో దేశానికే తలమానికంగా నిర్మించిన రాజ్యాంగ రూపశిల్పి, భారత రత్న, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 206 అడుగుల ఎత్తైన ‘సామాజిక న్యాయ మహాశిల్పం’ విగ్రహాన్ని సీఎం జగన్ శుక్రవారం రాత్రి జాతికి అంకితం చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణతో మన విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్యాలవాడగా కనిపిస్తోందన్నారు. అంతకు ముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘సామాజిక సమతా సంకల్ప సభ’లో మాట్లాడుతూ కుల అహంకార వ్యవస్థల దుర్మార్గాలపై తన పోరాటానికి అంబేడ్కరే స్ఫూర్తి అని తెలిపారు. చరిత్ర గతిని మార్చిన సంఘ సంస్కర్త అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి మనం విన్నాం. ఇక మీదట స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ మహాశిల్పం) అంటే ఇండియాలోని విజయవాడ అని మార్మోగుతుంది. మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజిక న్యాయానికి ఈ విగ్రహం నిలువెత్తు నిదర్శనం. అంబేడ్కర్ జన్మించిన 133 ఏళ్ల తర్వాత, ఆయన మరణించిన 68 ఏళ్ల తర్వాత సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది వేల సంవత్సరాల భారత సామాజిక, ఆర్థిక, మహిళా చరిత్రలను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం. బాబా సాహెబ్ మన భావాల్లో జీవించే ఉంటారు. మన అడుగుల్లో, బతుకుల్లో, భావాల్లో ఎప్పటికీ కనిపిస్తుంటారు. పెత్తందారీతనం, అంటరానితనం, కుల అహంకార వ్యవస్థలు, అక్కచెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి అందిస్తూనే ఉంటారు ఆ మహా మనిషి. 75వ గణతంత్ర దినోత్సవానికి ముందు.. విజయవాడలో.. అది కూడా స్వాతంత్య్ర సమర చరిత్ర కలిగిన మన స్వరాజ్య మైదానంలో, 75వ రిపబ్లిక్ డేకి సరిగ్గా వారం ముందు మనం ఆవిష్కరిస్తున్న అంబేడ్కర్ మహా విగ్రహం స్ఫూర్తిదాయకం. అది చూసినప్పుడల్లా పేదలు, మహిళలు, మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, సమానత్వ ఉద్యమాలు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది. పుణె ఒప్పందం.. అండనిచ్చే మహాశక్తి ఆయన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా అంటరానితనం, ఆధిపత్య భావజాలంపై ఓ తిరుగుబాటుగా మనకు కనిపిస్తుంటారు. సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా మనందరికీ గుర్తుకొస్తారు. రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే మహా శక్తిగా మనందరికీ స్ఫూర్తిదాతగా నిలుస్తారు. గొంతు విప్పలేని దళిత వర్గాలు, అల్ప సంఖ్యాకులు, వాయిస్ లెస్ పీపుల్, అట్టడుగు వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్లు కల్పించాలని చరిత్ర గతిని మార్చిన పుణె ఒప్పందానికి కారకులు అంబేడ్కర్. ఈ రోజు దళిత జాతి నిలబడిందన్నా, అల్ప సంఖ్యాకులు నిలబడగలుగుతున్నారన్నా, రిజర్వేషన్లు కల్పించి ఒక్క తాటిపైకి తెచ్చే కార్యక్రమం జరిగిందంటే అంబేడ్కరే స్ఫూర్తి. ప్రతివాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం ధైర్యాన్ని, శక్తిని, అండను ఇస్తుంది. మహాశక్తిగా తోడుగా నిలబడుతుంది. ఆకాశమంతటి వ్యక్తిత్వం రూపం మార్చుకున్న అంటరానితనంపై 56 నెలలుగా మనం చేస్తున్న యుద్ధానికి నిదర్శనం సామాజిక న్యాయం. మనం చేస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా అంబేడ్కర్ విగ్రహం ఎప్పటికీ కనిపిస్తుంది. ఇది దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నా. 81 అడుగుల వేదిక మీద 125 అడుగుల మహా విగ్రహం.. మొత్తం 206 అడుగుల ఎత్తుతో ప్రతిష్టించిన ఆకాశమంతటి ఆ మహానుభావుడి వ్యక్తిత్వాన్ని అంతా గుర్తు చేసుకోవాలి. ప్రతి పిల్లాడూ, ప్రతి పాపా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలి. అభివృద్ధి – అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేడ్కర్ భావజాలం. ఇలాంటి భావజాలం పెత్తందార్లకు నచ్చదు. పెత్తందార్లంటే ఎవరో మీ అందరికీ ఈ పాటికి బాగా అర్థమై ఉంటుంది. ఆయన చదివింది ఇంగ్లీషు మీడియంలో.. ఈరోజు కూడా ఈ దురహంకారులు, ఈ పెత్తందార్లు తమ పత్రికలో రాశారు. అంబేడ్కర్ తెలుగు మీడియం మాత్రమే ఉండాలి అని అన్నారట. ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు మాత్రం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతారట. వీళ్లు అబద్ధాలు ఏ స్థాయిలో చెబుతున్నారో చూస్తుంటే బాధేస్తోంది. అంబేడ్కర్ చదువుకున్నది ఇంగ్లీషు మీడియంలో. ఆయన 4వ తరగతి పాసైనప్పుడు బంధుమిత్రులంతా పండగ చేసుకున్నారు. ఈనాడు చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ రాతలు రాస్తోందంటే పాత్రికేయం ఏ స్థాయికి పడిపోయిందో ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ పెత్తందార్ల పత్రిక, ఆ ఈనాడు పత్రిక ముసుగులో తాము పాటించే అంటరానితనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్ వేస్తోంది. ఇలాంటి దుర్మార్గులు, నీచులు మన దళితులు, బహుజనులకు వ్యతిరేకులు. అంటరానితనం.. మరో రూపంలోస్వాతంత్య్రం వర్థిన 77 ఏళ్ల తర్వాత కూడా అంటరానితనం, వివక్ష సమసిపోలేదు. పెత్తందార్ల పోకడలతో రూపం మార్చుకుంది. అంటరానితనం అంటే.. ఫలానా వ్యక్తుల్ని భౌతికంగా ముట్టుకోకూడదని దూరం పెట్టడం మాత్రమే కాదు. పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో, ఆ గవర్నమెంట్ బడిని పాడుపెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. డబ్బున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటిస్తూ పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీషు మీడియంలో చదవరాదని బరితెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. మనుషులు చనిపోతున్నాకరుణించని పాలకులు.. పేద కులాల వారు ఎప్పటికీ తమ పొలాల్లో పనివారుగానే ఉండిపోవాలట. తమ ఇళ్లల్లో పనివారుగా, తమకు సేవకులుగా ఉండిపోవాలట. తమ అవసరాలు తీర్చేవారిగానే మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదలు ఏ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో, ఎక్కడ వారికి ఉచితంగా వైద్యం అందుతుందో, అటువంటి ప్రభుత్వ ఆస్పత్రులను నీరుగార్చడం కూడా అంటరానితనమే. పేదలు బస్సు ఎక్కే ఆర్టీసీని కూడా ప్రైవేట్కు అమ్మేయాలనుకోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌర సేవ కావాలన్నా, పేదవాడికి ఏ పథకం కావాలన్నా లంచాలు ఇచ్చుకుంటూ, వివక్షకు లోనవుతూ, కార్యాలయాలు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగిన దుస్థితి కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. అవ్వాతాతలు పెన్షన్ కోసం, రైతన్నలు ఎరువుల కోసం పొద్దున్నే లేచి పొడవాటి లైన్లలో నిలబడాల్సి రావడం, మనుషులు చనిపోతున్నా పాలకుల గుండె కరగకపోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదల మీద పెత్తందారీ భావజాలంలో ఇవన్నీ కూడా భాగాలే. ఎస్సీల అసైన్డ్ భూముల్ని కాజేసి గజాల లెక్కన అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలని కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదల ఇళ్ల నిర్మాణానికి భూములిస్తే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని కోర్టులకు వెళ్లి కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు, మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేద వర్గాల పిల్లలకు ట్యాబ్లు ఇవ్వటానికి వీల్లేదని కుట్ర కథనాలు రాయడం, వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పెత్తందార్లకు ఏనాడైనా తోచిందా? దళితుల ఇళ్ల నిర్మాణాలకు చంద్రబాబు సెంటు భూమి అయినా ఇచ్చింది లేదు. అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించింది అంతకంటే లేదు. చంద్రబాబు రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఏ కోశానా, ఏనాడూ ప్రేమే లేదు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాల్లో ఆ సామాజిక వర్గాలు ఎలా బతకగలుగుతాయనే కనీస ఆలోచన చేయలేదు. బీసీలను తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్! అని బెదిరించిన వ్యక్తి చంద్రబాబు. పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఆ వ్యక్తికి మన మాదిరిగా పేద అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేయాలని ఎందుకు అనిపిస్తుంది? చదువుకొనే మన పేద పిల్లలకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విద్యా కానుక, ట్యాబ్లు, ఇంగ్లీషు మీడియం చదువులు, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, గవర్నమెంట్ బడుల్లో డిజిటలైజేషన్, ఐఎఫ్పీలు, నాడు–నేడుతో చదువులు మార్చాలని అలాంటి òపెత్తందారీ పార్టీలకు, నాయకులకు ఎందుకు అనిపిస్తుంది? మన అక్కచెల్లెమ్మలకు ఒక దిశా యాప్, అమ్మ ఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చి చిరునవ్వులు చూడాలని పెత్తందారీ పార్టీలకు, నాయకులకు ఎందుకు అనిపిస్తుంది? మన రైతన్నలకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఆర్బీకే వ్యవస్థను తేవాలని వారికి ఎందుకు అనిపిస్తుంది? పేదలకు ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షల ఉచిత వైద్యం, ఆరోగ్య ఆసరా, 104, 108 సేవలు, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్్ట, వైద్య ఆరోగ్యశాఖలో 53 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ఆ పెత్తందారు చంద్రబాబుకు ఎందుకు అనిపిస్తుంది? గ్రామ స్థాయిలో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు తెచ్చి ప్రతి పేదవాడికీ అందుబాటులో ఉండాలని పెత్తందారు పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది? నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకే దక్కేలా ఏకంగా చట్టం చేయాలని పెత్తందార్లకు ఎందుకు అనిపిస్తుంది? విప్లవాత్మక వ్యవస్థలు పెత్తందారీ పార్టీలు, పెత్తందారీ నాయకులకు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల కోసం నవరత్నాల పాలన అందించాలని ఏ రోజైనా అనిపించిందా? కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి అవ్వాతాత వరకు అందరి పట్ల ప్రేమ, మమకారం చూపాలని పెత్తందారీ పార్టీ నాయకులకు ఏరోజైనా అనిపించిందా? మీ బిడ్డ 56 నెలల పాలనలో నేరుగా బటన్ నొక్కి రూ.2.47 లక్షల కోట్లు పారదర్శకంగా అందించాడు. లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి. ఇవాళ గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తున్నారు. 2 వేల జనాభాకు సచివాలయం. 50 ఇళ్లకు వలంటీర్ ఉన్నారు. ప్రతి పేదవాడు, రైతన్న, అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తూ ఇదీ అంబేడ్కర్ కలలుగన్న రాజ్యం అని ఆ చెల్లెమ్మలు, తమ్ముళ్లు దేశానికే చూపిస్తున్నారు. ఈ స్థాయిలో మరెక్కడైనా ఉందా? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు మేలు చేయడంలో దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 56 నెలల పాలనలో అడుగులు పడ్డాయి. మంత్రి మండలిలో ఏకంగా 4 ఉప ముఖ్యమంత్రి పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. మంత్రి మండలిలో 68 శాతం పదవులూ వారికే ఇచ్చాం. ఇది సామాజికపరంగా దేశ చరిత్రలో రికార్డు. శాసనసభ స్పీకర్గా బీసీ, శాసన మండలి చైర్మన్గా ఎస్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్గా మైనార్టీ అక్కకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డదే. రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల వారే. మన పార్టీకి మండలిలో 43 మంది సభ్యులుంటే వారిలో 29 మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే ఉన్నారు. 13 జెడ్పీ చైర్మన్లలో 9 పదవులు, 17 మున్సిపల్ కార్పొరేషన్లలో 12 మేయర్లు, 87 మున్సిపాలిటీలుంటే 84 మీ బిడ్డ గెలుచుకోగా వాటిలో ఏకంగా 58 మున్సిపాలిటీల్లో, 196 మార్కెట్ కమిటీల్లో 117 చైర్మన్లు, 137 కార్పొరేషన్లలో 79 చైర్మన్లు ఇలా అన్నింటా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకే అవకాశం కల్పించాం. మన ప్రభుత్వం అధికారంలోకి వర్థిన తర్వాత 56 నెలల కాలంలో 2.10 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే 80 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇలాంటి సామాజిక న్యాయం మనందరి ప్రభుత్వంలో కాకుండా మరెక్కడైనా చూశారా? ప్యూన్ రాకపోతే మంచినీళ్లూ పుట్టవు! చదువుకునేందుకు వీల్లేదని తరతరాలుగా అణచివేతకు గురైన వర్గంలో జన్మించినా, చదువుకొనేందుకు తమకు మాత్రమే హక్కుందని భావించిన వారికంటే గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేడ్కర్. ఆయన చదువుకుంటున్న రోజుల్లో దళితుడు కాబట్టి స్కూల్లో కుండలో నుంచి గ్లాసు ముంచుకొని నీళ్లు తాగేందుకు కూడా అనుమతించలేదు. ఆయన తెచ్చుకున్న గ్లాసులో ప్యూన్ పైనుంచి నీళ్లు పోసేవాడట. ఏ రోజైనా బడికి ప్యూన్ రాకపోతే ఆ రోజు తాగడానికి మంచినీళ్లు లేనట్లే అన్న మాటలు ఎంతో బాధ కలిగిస్తాయి. ప్రతి గ్రామంలో మార్పు మీ కష్టం తెలిసిన మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలోనూ మార్పు తీసుకొచ్చింది. రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా తీసుకోండి. ప్రతి గ్రామంలోనూ స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఇంటింటా చదువుల విప్లవం, మహిళా సాధికార విప్లవం, పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి. వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది. డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. పారిశ్రామిక మౌలిక సదుపాయాలతో ఎప్పుడూ చూడని అభివృద్ధి కనిపిస్తుంది. వైద్య, ఆరోగ్య రంగంలో ఎన్నడూ ఊహించని రీతిలో గ్రామ స్థాయిలో సాకారమైన మరో విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి. -
అందరివాడు అంబేడ్కర్
ఎస్సీ, ఎస్టీలతోపాటు బలహీన వర్గాలు అనే పదం అంబేడ్కర్ ఉపయోగించడంలో ఉద్దేశం వెనుకబడిన కులాల కోసమేనని గుర్తుంచుకోవాలి. కొంతమంది దురుద్దేశంతో అంబేడ్కర్పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ను ఎస్సీల కోసం మాత్రమే ఆలోచించిన నాయకుడిగా ముద్ర వేస్తున్నారు. ఇది కొన్ని దురదృష్టకరమైన సంఘటనలకు అవకాశం కల్పిస్తున్నది. వెనుకబడిన కులాలకు, బలహీన వర్గాలకు మంచి జరగాలని అంబేడ్కర్ నుంచి మొదలుకొని నేటి దళిత నాయకులు, కార్యకర్తల వరకు అందరూ మనసా వాచా కోరుకుంటున్నారు. అభివృద్ధిలో ఆమడ దూరానికి నెట్టివేసిన దళితులు, ఆదివాసీలూ, బడుగు బలహీన వర్గాలను సమైక్యంగా ముందుకు నడపాలన్నదే అంబేడ్కర్ ఆకాంక్ష. నిజానికి బీసీ వాడల్లో కూడా ఆయన విగ్రహాలను ప్రతిష్టించుకోవాలి. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ –46, బలహీన వర్గాల ప్రయోజనాలను, ప్రత్యేకించి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రభుత్వానికి సంపూర్ణమైన అధి కారాలను ఇచ్చింది. అందుకు ప్రభుత్వం ఎటువంటి చట్టాలనైనా చేయవచ్చునని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నది. పార్లమెంటు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్–15కు సవరణ చేసి బలహీన వర్గాలకు రక్షణ కల్పించాలి’’ అని మొట్టమొదటి రాజ్యాంగ సవరణపై బాబాసాహెబ్ అంబేడ్కర్ అత్యంత స్పష్టంగా మాట్లాడారు. సెప్టెంబర్ 16, 1921న అప్పటి జస్టిస్ పార్టీ ప్రభుత్వం మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు కల్పిస్తూ, 613 నంబర్ కమ్యూనల్ జీఓను విడుదల చేసింది. ఆ రిజర్వేషన్లు రాజ్యాంగం అమ లులోకి రావడానికి ముందూ, ఆ తర్వాతా అమలు జరిగాయి. కానీ జూన్ 7, 1950న చంపకం దొరై రాజన్ మద్రాసు హైకోర్టులో ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాం గంలోని ఆర్టికల్ 15 క్లాజు ప్రకారం, కులం పేరుతో వివక్ష చూపడం, అవకాశాలను నిరాకరించడం సరికాదని వాదించారు. మద్రాసు హైకోర్టు ఆమె వాదనను అంగీకరించింది. సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పుని సమర్థించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాజ్యాంగం స్ఫూర్తి నిజానికి అదికాదు. కానీ ఆర్టికల్ 15లో ఉన్న ఆ లొసుగును వాడుకొని రిజర్వేషన్లను కొట్టిపారేశారు. అప్పుడు కేంద్రంలో ప్రధాన మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ, న్యాయశాఖ మంత్రిగా అంబేడ్కర్ ఉన్నారు. అందుకే ఆర్టికల్ 15ను సవరించాలని అంబేడ్కర్ సూచిం చారు. దానికి అనుగుణంగానే ఆర్టికల్ను సవరిస్తూ పార్లమెంటులో నెహ్రూ తీర్మానం ప్రవేశపెట్టారు. దానిపై వివరణ ఇస్తూ, అంబేడ్కర్ పైవిధంగా వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం ప్రభుత్వానికి రిజర్వేషన్లు కొనసాగించే అధికారం ఉందని గట్టిగా వాదించారు. ఒకవేళ ఆ రాజ్యాంగ సవరణ లేకపోతే ఎస్సీ, ఎస్టీలతో సహా బీసీలకు, మహిళలకు ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎటువంటి రిజర్వేషన్ల అవకాశం ఉండేది కాదు. సామాజిక అసమాన తల నుంచి పాక్షిక విముక్తికి ఉద్దేశించిన ఈ సవరణకు పునాది ఆర్టికల్ 46. రాజ్యాంగంలోని నాలుగవ భాగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్–46 ఈ రోజు ఎన్నో సంస్కరణలకు పునాది అన్నది సుస్పష్టం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాంచల్ రాష్ట్రాలు అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పథకాల చట్టాలకు కూడా ఈ ఆర్టికల్ మాత్రమే ఆధారం. అంటే అంబేడ్కర్ దూరదృష్టితో ఈ ఆర్టికల్ను రాజ్యాంగంలో పొందుపరిచారు. ‘‘బలహీన వర్గాలు ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం విద్య, ఆర్థిక రంగాలలో ప్రత్యేక మైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత, వాటిని చాలా శ్రద్ధతో శీఘ్రగతిన అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది’’ అంటూ ఆర్టికల్ దిశానిర్దేశం చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలతో పాటు బల హీన వర్గాలు అనే పదం అంబేడ్కర్ ఉపయోగించడంలో ఉద్దేశం వెనుకబడిన కులాల కోసమేనని గుర్తుంచుకోవాలి. కొంత మంది దురుద్దేశంతో అంబేడ్కర్పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ను ఎస్సీల కోసం మాత్రమే ఆలోచించిన నాయకుడిగా ముద్ర వేస్తున్నారు. ఇది కొన్ని దురదృష్టకరమైన సంఘటనలకు అవ కాశం కల్పిస్తున్నది. అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసు కోవాలి. ఇప్పుడు మనం ఓబీసీ(ఇతర వెనుకబడిన వర్గాలు) అని పిలుస్తున్న వారి కోసం అమలులోకి వచ్చిన మండల్ కమిషన్ సిఫా రసులకు పునాది రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 అనేది మర్చిపోవద్దు. ఆయా వర్గాల స్థితిగతులను తెలుసుకోవడానికి జరిగే అధ్యయనానికి ఈ ఆర్టికల్ అవకాశం ఇచ్చింది. దీని ఆధారంగానే మొట్టమొదటి బీసీ కమిషన్ ఏర్పాటైంది. దాని పేరు కాలేకర్ కమిషన్. సామాజికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన కులాలను గుర్తించి, అధ్యయనం చేసి, వారి స్థితిగతులను ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పిం చింది. కానీ చాలా సంవత్సరాలు ప్రభుత్వాలు దానిపైన శ్రద్ధ పెట్ట లేదు. మళ్ళీ 1979లో జనతాపార్టీ ప్రభుత్వం బి.పి.మండల్ నాయ కత్వంలో వెనుకబడిన కులాల విద్య, సామాజిక విషయాల అధ్యయ నంపై కమిషన్ను నియమించింది. విద్య, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేస్తూ, 1980 డిసెం బర్లో మండల్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కానీ 1990 వరకు దానిపైన ఏ ప్రభుత్వాలు స్పందించలేదు. కేంద్రంలో వి.పి.సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1990 ఆగస్టు 7వ తేదీన మండల్ కమిషన్ నివేదికను ఆమోదించారు. దీని అమలు కోసం విధివిధానాలను రూపొందించా లని అప్పటి ఉప ప్రధాని దేవీలాల్కు బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన తాత్సారం చేయడంతో ఆ బాధ్యతలను రామ్విలాస్ పాశ్వాన్కు అప్పగించారు. ఆయన దీనిపై చాలా తీవ్రగతిన అధికారులతో సమన్వయం చేసి, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే పనిని సులభతరం చేశారు. అంతకుముందు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాం దీనిపై ఉద్యమం చేపట్టారు. ‘మండల్కో లాగ్వాకర్, నహీతో కుర్సీ ఖాళీ కరో’ అంటూ దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. ఈ రోజు దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లకు పునాది రాజ్యాంగంలోని 46, 340 ఆర్టికల్స్. అంతేకాకుండా, మండల్ కమిషన్ సిఫారసులను వ్యతిరేకిస్తూ ఆధిపత్య కులాలు ఆందోళన చేస్తే, దానిని అడ్డుకున్నదీ, మండల్ కమిషన్ సిఫారసులను అమలు జరపాలని ఉద్యమాలు నిర్వహిం చిందీ, దానికి నాయకత్వం వహించిందీ దళిత సంఘాలు, సంస్థలు, కవులు, రచయితలు. ఉత్తర భారతదేశంలో ఈ సందర్భంగా అనేక చోట్ల దళితులపైన దాడులు జరిగిన విషయం గతచరిత్రను తిరగేస్తే అర్థం అవుతుంది. ఇదే సందర్భంలో దళితులపై అనేక తప్పుడు కేసులు సైతం పెట్టారు. వెనుకబడిన కులాలకు, బలహీన వర్గాలకు మంచి జరగాలని అంబేడ్కర్ నుంచి మొదలుకొని నేటి దళిత నాయకులు, కార్యకర్తల వరకు అందరూ మనసా వాచా కోరుకుంటు న్నారు. అభివృద్ధిలో ఆమడ దూరానికి నెట్టివేయబడిన దళితులు, ఆది వాసీలూ, బడుగు బలహీన వర్గాలను సమైక్యంగా ముందుకు నడ పాలన్నదే అంబేడ్కర్ ఆకాంక్ష. కానీ వెనుకబడిన కులాలు మాత్రం గ్రామాల్లో కొన్ని పట్టణాల్లో దళితులపై దాడులు చేస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల అంబేడ్కర్ విగ్రహాలను పెట్టాలని దళితులు నిర్ణయిస్తే, వారిపై అమానుషంగా దాడులు చేస్తున్నారు. గత నెల దసరా రోజున తెలంగాణలోని సిరిసిల్ల రాజన్న జిల్లాలోని రామాజిపేటలో దళితులపైన బి.సి. కులాల దాడి ఇందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా గరగ పర్రులో అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్టించుకోవాలని దళితులు భావిస్తే, వారిని సామాజికంగా వెలివేశారు. ఇవి రెండు ఉదాహరణలుగా మాత్రమే ప్రస్తావిస్తున్నాను. ఇటువంటి ఘటనలే చాలా చోట్ల జరి గాయి, జరుగుతున్నాయి. రామాజిపేటలో ఇళ్ళపై దాడిచేసి మహిళ లను, పిల్లలను కొట్టడం, వాహనాలను, వస్తువులను ధ్వంసం చేయడం జరిగింది. పోలీసులు సమయానికి వెళ్ళకపోయి ఉంటే, కారంచేడును మించిన మారణకాండ జరిగేదని బాధితులు ఏడుస్తూ చెప్పడం కలవరపరుస్తున్నది. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మేలు చేశారనే ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలి. నిజానికి దేశ సమగ్రత, సమైక్యత కోసం ఆయన చేసిన కృషి ఎవ్వరూ మరువలేనిది. ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ)లోని విద్యావంతులు, సంఘాల పెద్దలు తమతమ సామాజిక వర్గాలలోని ప్రజలకు, ప్రత్యేకించి యువకులకు తమ ప్రయోజనాల కోసం పనిచేసిన వాళ్ళ గురించి చెప్పాలి. అంత కన్నా ముఖ్యంగా ప్రజల మధ్య కులాల విభేదాలు ఉన్నాయి. అవి విద్వేషాలుగా మారకూడదు. అసమానతల తొలగింపులో ప్రధాన అడ్డంకిని మరువకూడదు. బలహీనవర్గాల పక్షాన నిలిచి పోరాడిన అంబేడ్కర్ను విస్మరించడం, ఆయన భావజాలాన్ని అడ్డుకోవడం, విగ్రహాలను పెట్టనివ్వకపోవడం ఎంతమాత్రం విజ్ఞత అనిపించు కోదు. చరిత్రను తెలుసుకొని, భవిష్యత్తును నిర్మించుకోవడం వివేక వంతులు చేసే పని. ఇకనైనా కలిసికట్టుగా ప్రయత్నం మొదలవ్వాల్సిన సందర్భమిదే. నిజానికి బీసీల మది మదిలో అంబేడ్కర్ని నిలుపు కోవాలి. బీసీ వాడల్లో ఆయన విగ్రహాలను ప్రతిష్టించుకోవాలి. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
బాబా సాహెబ్ అంబేద్కర్ను స్మరించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ను స్మరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. దేశంలో ప్రజాస్వామిక విలువలకు పునాది వేస్తూ.. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్ అని ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేద్దామంటూ ప్రతిజ్ఞ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. -
అన్నీ ఉన్నవారికీ కావాలి కోటా!
రాజకీయ పలుకుబడి గల మరాఠాలు విద్యాసంస్థలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కోరడం విచిత్రం. గ్రామం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు శాసించేది వారే. విద్యా సామ్రాజ్యాల స్వాధీనం లేదా ఫీజులలో రాయితీలు వారు కోరడం లేదు! మరాఠాలు ఒకప్పటి యుద్ధ యోధులు, రైతులతో కూడిన వారు. అలా అని ఆ రెండు వర్గాలూ పూర్తిగా వేరు వేరుగా ఉండేవీ కావు. మహారాష్ట్ర అధికార వ్యవస్థలో కీలక స్థానం మాత్రం మొత్తంగా మరాఠాలదే. వారే తరచుగా ప్రభుత్వానికి నేతృత్వం వహించేవారు. జనాభాలో దాదాపు మూడోవంతు ఉంటారు. అయినా వారికి పలు సమస్యలున్నాయి, అందులో ఒకటి వారికి రిజర్వేషన్లు లేకపోవడం. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి డిమాండ్లనే చేస్తున్న జాట్లు, పటేళ్ల లాగే మరాఠాల తీరూ విడ్డూరమే. ఆగస్టు నుంచి అపూర్వమైన రీతిలో వారు తమ డిమాండ్లను వ్యక్తం చేయడం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 చోట్ల నినాదాలు, మైక్రోఫోన్లు లేకుండా ప్రదర్శనలను నిర్వహించారు. ఒక్క నినాదం కూడా వినరాలేదు. ఒక్క నేతైనా వేదిక మీద మైక్ అందుకున్నది లేదు. కోటాలు కావాలని, దళితులపై అత్యాచారాల చట్టం దుర్వినియోగాన్ని అరికట్టాలని, ఒక మరాఠీ బాధితురాలుగా ఉన్న సామూహిక అత్యాచారం కేసును ఫాస్ట్ట్రాక్పై తేల్చా లని ప్లకార్డులను ప్రదర్శించారు. పలు విధాలుగా ఈ ప్రదర్శనలు అపూర్వమైనవి. ఒకటి, వాటిలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కళ్లారా చూస్తేనే అది నమ్మగలం. లక్షలను రెండు అంకెల్లో చెబుతున్నట్టు మీడియా వారి సంఖ్యను తక్కువగా పేర్కొంది. రెండు, ఏ రాజకీయ నేతో లేదా ఏ రాజకీయ పార్టీనో సంఘటితపరచడం లేదా నేతృత్వం వహిస్తు న్నట్టు కానరాలేదు. మూడు, అధికారులతో సంఘర్ష ణకు దారి తీసిన ఘటన ఒక్కటీ జరగలేదు. ప్రదర్శకుల మధ్య సైతం అవాంఛనీయమైనది ఏదీ సంభవించ లేదు. నాయకులంతా అస్పష్టంగానే గోచరమయ్యారు. అంతా రాజకీయాలకు అతీతంగా ఒకే విధమైన ప్రయో జనాలు, ఉద్దేశం ఉన్నవారు. ప్రదర్శనల తేదీలు, వేళలు, స్థలాలు, మార్గాలు, ఏర్పాట్లు, వగైరా అన్నీ వాట్సాప్ గ్రూపుల ద్వారానే అందరికీ చేరాయి. భాగ స్వాములైన వారిలో ప్రతి ఒక్కరూ మరో 100 మందిని సమీ కరిస్తామని వాగ్దానం చేశారు. వేదికలనుంచి నల్ల దుస్తులు ధరించిన బాలికలు మరాఠాల డిమాండ్ల చదివి వినిపించారంతే. అవన్నీ ప్లకార్డులపై ఉన్నవే. అధికారులు తమ మధ్య చీలికలను సృష్టించడానికి యత్నిస్తారని నాయకత్వం తెరవెనుకనే ఉండిపోయింద నేది స్పష్టమే. అయితే, రాజకీయవేత్తలు వారిలో తప్పక ఉన్నారు. అవసరమైన డబ్బును, సీసాల్లోని మంచినీటిని వారే సమకూర్చారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారు తెరవెనుక ఒకరిని మించి మరొకరు ఈ ప్రదర్శన లకు సహాయం అందించాలని పోటీపడి ఉంటారు, ఎవరికి వారే పైచేయి సాధించాలని యత్నించి ఉంటారు. అందువల్ల లాభపడింది ప్రదర్శకులు మాత్రమే. కీలక సమస్యలపై రాజకీయాలను దూరంగా ఉంచే ధోరణి ఇంతకు ముందు కూడా మహారాష్ట్రలో ఉంది. దివంగత శరద్ జోషి ఈ విధంగానే అందరినీ షేత్కారీ సంఘటనలోకి సమీకరించి, నేతృత్వం వహిం చారు. ‘‘ఈ ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పడు మీరు మీ రాజకీయ పాదరక్షలను బయటే వదలి రండి’’ అంటూ రైతులనుద్దేశించి ప్రకటిస్తూ ఆయన తన సభలను ప్రారంభించేవారు. అయితే ఆయనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు, తాను పరిహసించిన పార్టీల మద్దతుతోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1980లలో దళితులు కూడా రిపబ్లికన్ పార్టీలోని చీలికలకు అతీతంగా ఏకమై, తమను అవమానాలకు గురిచేస్తున్న మరాఠాలకు వ్యతిరేకంగా సమరశీల పోరా టాన్ని నిర్వహించారు. మరఠ్వాడా విశ్వవిద్యాలయం పేరును బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంగా మార్పించారు. దళితులు తమపై అత్యాచారాల చట్టాన్ని ప్రయోగించకుండా చట్టాన్ని మార్చాలని నేడు మరా ఠాల కోరికల జాబితా కోరుతోంది. దీంతో ఒక సంక్ర మణం పూర్తయిందని అనుకోవచ్చు. రాజకీయ పలుకుబడి కలిగిన మరాఠాలు విద్యా సంస్థలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లును కోరడం అతి విచిత్రం. గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అధికారాన్ని శాసించేది వారే. పేరుకు ఒక వీపీ నాయక్ లేదా సుధాకర్ నాయక్ లేదంటే మనోహర్ జోషి లేదా దేవేంద్ర ఫడ్నవీస్ అప్పుడప్పుడూ ముఖ్య మంత్రి కావచ్చు. కాసులు కురిపించే విద్యాసంస్థలకు యజమానులు, నిర్వాహకులుగా ఉన్నవారు కూడా మరాఠాలకు చెందినవారే. కాలక్రమంలో మరాఠాల అధికారం పదును సరిగ్గా ఎప్పుడు తగ్గిందో చెప్పడం కష్టం. అధికార చట్రానికి, ప్రగతికి తమను దూరంగా ఉంచుతున్నారన్న భావన ఏర్పడింది. తమ కులానికే చెందిన పెద్దలు రాజకీయాలను వ్యాపారంగా నిర్వహిం చినా... మరాఠాల ఆర్థిక ప్రయోజనాల పట్ల వారు శ్రద్ధ వహిస్తున్నంతకాలం దాన్ని పట్టించుకోరు అన్నట్టుంది. విద్యా సామ్రాజ్యాలను స్వాధీనం చేసుకోవాలని లేదా ఫీజులలో రాయితీలు ఇవ్వాలని వారు కోరడం లేదు. అది ఆసక్తికరం అనడం ఈ విషయాన్ని తక్కువ చేసి చెప్పడమే అవుతుంది. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ మెయిల్ : mvijapurkar@gmail.com
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement