breaking news
Auto and car collided
-
ఆటోను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మహిళలు దుర్మరణం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్గటూర్ మండలం కృష్ణారావుపేటలో వేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు ధర్మపురి మండలం కమలాపూర్ వాసులుగా గుర్తించారు. ఇదీ చదవండి: పాణం తీసిన బంగారు గొలుసు -
ఆటోను ఢీకొట్టిన కారు
∙ఇద్దరికి తీవ్రగాయాలు జనగామ : పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆటో ను కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళకు తీవ్రగాయాలవగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది.ఈ సంఘటన ఆదివారం రాత్రి జరి గింది. జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్ గ్రామానికి చెందిన తేజావత్ లక్ష్మి సంతోషిమాత ఆలయంలో పనిచేస్తోంది. సాయంత్రం అంబేద్కర్ నగర్కు వెళ్లిన లక్ష్మి ఆటోలో తిరిగి వస్తోంది. నెహ్రూ పార్కు వరకు రాగానే గిర్నిగడ్డలో నివాసముంటున్న భవన నిర్మాణ కార్మికుడు కనికె కుమార్ అదే ఆటోలో ఎక్కాడు. బ్రిడ్జి మధ్యలోకి వెళ్లగానే ఎదురుగా వచ్చిన కారు ఆటోను ఢీకొంది. దీంతో కుమార్ కాలు నుజ్జునుజ్జయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆటో వెనుక భాగంలో కూర్చున్న మహిళకు కాలు విరిగింది. ఆమెను 108లో ప్రభుత్వ ఏరి యా ఆస్పత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన కారు డ్రైవర్ పరారయ్యాడు. కాగా, కుమార్ బతుకు దెరువు కోసం ఆంధ్ర ప్రాంతం నుంచి జనగామకు వలస వచ్చాడు. -
కన్నీటి కథ
మృత్యువు ఎంత కర్కశమైనది! పచ్చగా చిగురించాల్సిన జీవితాన్ని చూస్తే ఎందుకంత కళ్లలో నిప్పులు పోసుకుంటుంది! భవిష్యత్ పై ఆశలు పెట్టుకుంటే, రేపటి గురించి ఎన్నో కలలు కంటే ఎంత నిర్దాక్షిణ్యంగా బతుకును తుంచేస్తుంది! అందుకేనేమో... ఉద్యోగంలో చేరడానికి తల్లి నగలు తాకట్టు పెట్టి ఇంటికి వస్తున్న ఆ యువకుడిని దార్లో పొంచి ఉండి మరీ క్రూరంగా కాటేసింది. భర్త కనుమరుగైతే, కూలి చేసి మరీ కొడుకును ప్రయోజకుడిని చేసి, అతడు రేపోమాపో ఉద్యోగంలో చేరతాడని ఆశపడ్డ కన్నతల్లిపై అశనిపాతంలా విరుచుకుపడింది. అదుపు తప్పిన కారు రూపంలో దూసుకువచ్చి ఆ కుర్రాడిని బలి తీసుకోవడమే కాదు.. ఆటో డ్రైవర్ను కూడా మింగేసి కడుపు నింపుకుంది. నక్కపల్లి : జాతీయ రహదారిపై గొడిచర్ల సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా మరోవ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. పాయకరావుపేట నుంచి నక్కపల్లి వైపు వెళ్తున్న ఆటోను రాజమండ్రి నుంచి విశాఖ వెళ్తున్న కారు అదుపుతప్పి గొడిచర్ల సమీపంలో ఢీ కొట్టింది. దాంతో ఆటో రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి బోల్తాపడింది. ఈ ఘటనలో నక్కపల్లి మండలం సీహెచ్ఎల్పురానికి చెందిన ఆటోడ్రైవర్ తంతటి చంటి(32), వేంపాడుకొత్తూరుకు చెందిన దాడి జనార్దన్(25) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హైవే పెట్రోలింగ్ సిబ్బంది తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. వీరితోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న మనబానవానిపాలెంకు చెందిన గొర్ల నాగేష్ గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. నగలు తాకట్టుపెట్టి వస్తూ... మృతుల్లో వేంపాడు కొత్తూరుకు చెంది న దాడి జనార్దన్ నిరుద్యోగి. ఇంకా వివాహం కాలేదు. తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు. ఇటీవలే హైదరాబాద్లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఎంపిక కావడంతో ఉద్యోగంలో చేరేందుకు డబ్బులు అవసరమయ్యాయి. పుస్తెల తాడు, ఇతర నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీసుకురావాలని తల్లి చెప్పడంతో పాయకరావుపేట స్టేట్బ్యాంకులో ఆభరణాలపై రూ. 19 వేలు తీసుకున్నాడు. ఆటోలో ఇంటికి బయలుదేరాడు. కొద్ది క్షణాల్లో ఇంటికి చేరి రెండు రోజుల్లో హైదరాబాద్ వెళ్లి ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలోనే మృత్యువు ఆటోప్రమాదం రూపంలో కబళించింది. ఇంటి పెద్ద దిక్కు లేకపోయినప్పటికీ కూలిపని చేసుకుంటూ కొడుకును చదివించానని, తీరా చేతికి అందివచ్చిన తర్వాత ఇలా అకాలమరణం చెందుతాడని ఊహించలేదంటూ జనార్దన్ తల్లి నాగలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తనకు తలకొరివి పెడతాడనుకుంటే తనే పెట్టాల్సిన దుస్థితి ఎదురైందని రోదిస్తోంది. ప్రమాదంలో మరణించిన సీహెచ్ఎల్పురం గ్రామానికి చెందిన తంతట చంటి ఆటోను బాడుగకు తీసుకుని నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ప్రమాదంలో ఇతను మరణించడంతో భార్య, పిల్లలు రోడ్డున పడ్డారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ రామకృష్ణ పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాద విషయం తెలిసిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, స్థానిక నాయకులు వెంకటేష్, బాబ్జిరాజు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.