archana puran singh
-
సెల్ఫీ ఇస్తా.. ఫ్రీగా దోసె వేసిస్తావా?.. చెఫ్ ఆన్సర్కు ఆశ్చర్యపోయిన నటి
సెలబ్రిటీలు సోషల్ మీడియానే కాదు యూట్యూబ్నూ నమ్ముకుంటున్నారు. పర్సనల్ విషయాలను, ఫన్నీ సంఘటనలను, బాధాకర విషయాలను, కొత్త ప్రాజెక్టులను.. ఇలా ప్రతీది యూట్యూబ్ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అలా బుల్లితెర నటి అర్చన పూరన్ సింగ్ (Archana Puran Singh)కు సైతం యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ మధ్య ఆమె ఓ వీడియో వదిలింది. అందులో తన కుటుంబంతో కలిసి ముంబైలో తమకిష్టమైన దోస హోటల్స్ వద్దకు వెళ్దామంది.ఫ్యామిలీతో ఫుడ్ వ్లాగ్అర్చన భర్త పర్మీత్.. చిన్నతనంలో జుహు బీచ్లో దొరికే దోస తన ఫేవరెట్ అన్నాడు. అర్చన శివనగర్లోని ఓ హోటల్ పేరు చెప్పగా.. కుమారులు ఆర్యమన్, ఆయుష్మాన్ ఇద్దరూ మిథిబాయి కాలేజ్ దగ్గర దొరికే దోస అలాగే అమర్ జ్యూస్ సెంటర్లో దిరకే జ్యూస్ అద్భుతంగా ఉంటాయన్నారు. అలా మొదటగా మిథిబాయి కాలేజీ సమీపంలోని దోసల్ని కుటుంబమంతా ట్రై చేసింది. అక్కడ పనిచేసే చెఫ్ నేపాలీవాసి. దీంతో అర్చన.. మసాలా దోసలో ఎక్కువ కారం దట్టించకు.. నేను చెప్పింది చేయకపోతే నిన్ను నేపాల్ పంపించేస్తా అని సరదాగా వ్యాఖ్యానించింది. చివరగా భర్తకు ఇష్టమైన చోట..తర్వాత కుటుంబమంతా శివ్ నగర్కు వెళ్లి అక్కడ దోసను తిన్నారు. అనంతరం అమర్ జ్యూస్ సెంటర్లో ఫేమస్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తాగారు. చివరగా భర్తకు ఇష్టమైన దోస కోసం జుహు బీచ్కు వెళ్లారు. అక్కడ తనకు ఇష్టమైన హోటల్ను వెతకడానికి కాస్తంత సమయం పట్టింది. చివరకు అది ఎట్టకేలకు కనిపించడంతో పర్మీత్ ఎగిరి గంతేశాడు. వాళ్లు దోసను ఆస్వాదిస్తుంటే అక్కడున్న జనాలు అర్చనతో ఫోటో దిగేందుకు ఎగబడ్డారు. దీంతో ఆమెకు ఓ ఐడియా తట్టింది. నా సెల్ఫీ రూ.100 కూడా విలువ చేయదా?మాకు దోస వేసిచ్చినందుకు బదులుగా నీకు సెల్ఫీ ఇస్తాను అంది. ఆమె ఐడియా అతడికి ఏమాత్రం నచ్చలేదు. తనకు డబ్బులే కావాలన్నాడు. అందుకు షాకైన అర్చన.. నా సెల్ఫీ రూ.100 కూడా విలువ చేయదా? అని అడిగింది. ఆ హోటల్ వ్యక్తి.. సెల్ఫీ కావాలి, అలాగే డబ్బు కూడా కావాలన్నాడు. సరే, భయపడకులే.. నేను డబ్బివ్వకుండా ఎక్కడికీ పారిపోను అని చెప్పింది. ఇక అందరికీ ఈ చివరి స్టాల్లోని దోసెనే నచ్చింది.చదవండి: కోట్ల రూపాయల మోసం కేసులో తమన్నా-కాజల్? -
సెలబ్రిటీల జాబితాలో నటి పనిమనిషి!
ప్రముఖ బాలీవుడ్ నటి అర్చన పురాన సింగ్ ఇంటి పని మనిషి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న అర్చన ఇంట్లో తన భర్త, కుటుంబ సభ్యులతో సరదాగా గుడుపుతున్నారు. ఈ క్రమంలో తన ఇంటి పని మనిషి భాగ్యశ్రీ ఫన్నీ వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియోను అర్చన తన ఇన్స్టాగ్రామ్ శుక్రవారం షేర్ చేశారు. పని మనిషి భాగ్యశ్రీ పని చేస్తూ.. ఒక్కసారిగా గట్టిగా నవ్వడంతో.. ఎందుకు నవ్వావని అర్చన అడిగారు. వెంటనే భాగ్యశ్రీ టీవీలో వస్తున్న జోక్కి నవ్వాను అని చెప్పిన ఈ వీడియోకు ‘చాకచక్య సమాధానం..! భాగ్యశ్రీ రాక్స్’ అనే క్యాప్షన్తో షేర్ చేశారు.(సుసానే సోదరికి కరోనా నెగిటివ్.. కానీ!) View this post on Instagram Hazir jawaab! #bhagyashrirocks #lockdown2020 #madhislandlife A post shared by Archana Puran Singh (@archanapuransingh) on Apr 16, 2020 at 11:48pm PDT ఇక ‘‘ఎలాంటి పరిస్థితోనైనా భాగ్యశ్రీ ఎప్పుడూ సంతోషంగా ఉండటానికే ప్రయత్నిస్తుంది. దానికి కారణం ఏంటి అని ఎప్పుడూ అడిగినా.. మీ హ్యాపీ ఫ్యామిలీలో భాగమైనందు వల్లే తాను సంతోషంగా ఉన్నాను అని సమాధానం ఇస్తుంది’’ అంటూ అర్చన ఇన్స్టాలో రాసుకొచ్చారు. ఇక ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అవును ‘భాగ్యశ్రీ రాక్స్’ అని మరికొదంరు ‘ఇక అర్చన పని మనిషి ఇక సోషల్ మీడియా సెలబ్రిటీల జాబితాలో చేరిపోతుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. -
కపిల్ షో నుంచి సిద్ధూ ఔట్.. ఎందుకు?
ముంబై: తన కామెడీ నైట్ షో నుంచి కామెడీ గరు నవజ్యోత్సింగ్ సిద్దూ తప్పుకున్నాడంటూ వచ్చిన వార్తలపై కపిల్ శర్మ స్పందించాడు. సిద్ధూ స్థానంలో అర్చనా పురాణ్ సింగ్ షోలోకి రానుందని బాలీవుడ్ గుసగుసలు రావడంతో దీనిపై కపిల్ శర్మ స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. గతంలో మాదిరి పరిస్థితుల దృష్ట్యా కొద్దికాలం మాత్రమే కామెడీ నైట్షోకు దూరంగా ఉంటారని కపిల్ శర్మ తెలిపాడు. ప్రముఖ హిందీ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన షోనుంచి సిద్ధూ తప్పుకున్నాడని వచ్చిన వార్తల్లో నిజంలేదని, అది అసత్య వార్త అన్నారు. గతంలో సైరాత్ ఎపిసోడ్కు సిద్ధూ అందుబాటులో లేకపోతే జాకీచాన్తోపాటు, రవీనాజీలు షోలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇది పూర్తిగా నిరాధారమైన వార్త అని కపిల్శర్మ తెలిపారు. కపిల్శర్మ, నవజ్యోత్ సింగ్ సిద్ధూలు కలర్స్ ఛానల్లో షో ప్రారంభం నుంచి కలిసి పనిచేస్తున్నారు. అనంతరం ఇద్దరూ సోని ఛానల్కు మారిపోయారు. ఇప్పుడు తాజాగా సిద్ధూ స్థానంలో అర్చన సింగ్ అలరించలేదని, కపిల్ శర్మకు, సిద్ధూ మధ్య ఉన్న ర్యాపోను మెయింటన్ చేయలేకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే గత ఏడాది చివర్లో కూడా సిద్ధూ షోనుంచి తప్పుకున్నాడు. పంజాబ్ ఎన్నికల సమయంలో కొద్దిరోజుల పాటు కపిల్శర్మ షోలో పాల్గొనలేదు.