-
జుట్టు తక్కువ, పొట్ట ఎక్కువ.. నేను హీరో ఏంటి?
‘‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నువ్వే హీరో అని విజయ్ దేవరకొండ అన్నప్పుడు, నేను హీరో ఏంటి? అనుకున్నాను. ‘నాకు జుట్టు తక్కువ, పొట్ట ఎక్కువ’ అని విజయ్తో చెప్పాను. ‘ఏం ఫర్వాలేదు’ అన్నాడు’’ అని అన్నారు తరుణ్ భాస్కర్. ‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. వాణీ భోజన్, అనసూయ, అభినవ్ గోమటం ముఖ్యపాత్రల్లో షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. హీరో విజయ్ దేవరకొండ, వర్థన్ దేవరకొండ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్, చిత్రంలో కీలక పాత్ర చేసిన అభినవ్ గోమటం చెప్పిన విశేషాలు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ – ‘‘విజయ్ దేవరకొండ కోసం తమిళ దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఈ కథను వినిపించారు. విజయ్కి కథ చాలా నచ్చింది కానీ తనకు సెట్ కాదనిపించింది. ఈ కథ మిస్ అవ్వకూడదనుకున్నాడు. నన్ను కథ వినమన్నాడు. ఫ్రెండ్లీగా విన్నాను. ఆ తర్వాత నువ్వే హీరో అన్నాడు. నిర్మాతగా విజయ్ ఎక్కడ వరకూ ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడి వరకే ఉండేవాడు. ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ అంతా ముగిసిన తర్వాత ‘బరువు తగ్గాలి తరుణ్’ అని విజయ్ చెప్పాడు. ‘పెరగడం తప్ప తగ్గడం నాకు తెలియదు’ అన్నాను. ఆ తర్వాత మెల్లిగా తగ్గాను. – నేను హీరోగా చేయాలనుకున్నప్పుడు మా ఆవిడ నాతో మాట్లాడలేదు (నవ్వుతూ). చిన్న చిన్న పాత్రలు చేస్తునప్పుడు ఎంకరేజ్ చేసింది. కానీ హీరోగా చేయడం నచ్చలేదు. అయితే మా అమ్మ ప్రోత్సహించారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ‘ఫిదా’ సినిమాలో మా అమ్మకు నటించే అవకాశం వచ్చింది. ‘విధవరాలికి ఇవన్నీ ఎందుకు?’ అని కొందరు బంధువులు కామెంట్ చేశారు. ‘అమ్మా ఇది నీ లైఫ్. నువ్వు చేయాలనుకుంది చెయ్. పక్కనోళ్ల మాటలు పట్టించుకోకు’ అని ధైర్యం చెప్పాను. అవే మాటలు నాకు మళ్లీ గుర్తు చేసింది అమ్మ. కొడుకు హీరో అంటే ఏ అమ్మకైనా ఆనందమే కదా. – ప్రస్తుతం వెంకటేశ్గారి కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాను. ‘ఈ నగరానికి ఏమైంది’ కొనసాగింపుగా వెబ్ సిరీస్ చేస్తున్నాం. ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్లో నా పోర్షన్కి కథ సిద్ధం చేసుకున్నాను. సెల్ఫోన్ వల్ల ఇబ్బందులు అభినవ్ గోమటం మాట్లాడుతూ – ‘‘నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. సినిమాలంటే ఆసక్తితో థియేటర్ ఆర్టిస్ట్గా చేశాను. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం హిట్ కావడంతో పాటు నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తరుణ్ భాస్కర్తో నాకున్న ప్రయాణంతో ‘మీకు మాత్రమే చెప్తా’లో చేయమని అడిగినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. ఈ కాన్సెప్ట్ని షమ్మీర్ మొదట విజయ్కు చెప్పాడు. ‘అర్జున్ రెడ్డి’ విడుదల తర్వాత విజయ్ చేద్దామనుకున్న ప్రాజెక్ట్ ఇది. తరుణ్ భాస్కర్లో డైరెక్షన్ స్కిల్స్తో పాటు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని తెలియడంతో హీరోగా నటించాడు. మొబైల్ వాడకం వల్ల ఎలా ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని వినోదాత్మకంగా చెప్పాం.ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’, జయంత్ సి. పరాన్జీగారి సినిమాతో పాటు సుశాంత్ సినిమాలో నటిస్తున్నాను’’ అన్నారు. -
సర్పంచ్ ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం తుంబూరు సర్పంచ్ కర్లపూడి అనసూర్య(52) శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సత్తుపల్లి ఎస్సై నరేష్బాబు తెలిపిన వివరాలు.. తుంబూరు గ్రామానికి చెందిన కర్లపూడి రామారావు, అనసూర్య ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఆర్ధిక ఇబ్బందులు తోడర్యాయి. వీటిని తట్టుకోలేకపోయిన అనసూర్య, శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో పోసుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. పురుగు మందు తాగి విద్యార్థి... ఖమ్మంరూరల్: మండలంలోని ముత్తగూడెం శివారు గొల్లగూడెం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి పులకాని సాయి మహేష్రెడ్డి(17), పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సాయి మహేష్రెడ్డి, ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 13న ఇంటర్ ఫలితాలు వచ్చాయి. ఇతడు నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే, ఈ నెల 15న పురుగు మందు తాగాడు. ఆ తరువాత, తనకు తెలిసిన ఓ వ్యక్తికి ఫోన్ చేసి, తాను పురుగు మందు తాగినట్టు, పొన్నెకల్ ఊరి బయట ఉన్నట్టు చెప్పాడు. ఆ వ్యక్తి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. వారు వెళ్లి ఖమ్మం హాస్పిటల్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడే శుక్రవారం మృతిచెందాడు. తండ్రి ప్రతాప్రెడ్డి ఫిర్యాదుతో ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. -
డెంగ్యూతో మహిళ మృతి
డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఓ మహిళ మృతి చెందింది. కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలం కన్నాల గ్రామానికి చెందిన అనసూర్య(35) వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే డెంగ్యూ అని తేలింది. దీంతో అక్కడే ఉంటూ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. ఆమె భర్త సైతం డెంగ్యూ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
గూగుల్లో మళ్లీ లేఫ్స్.. ఎందుకో తెలుసా..
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
Advertisement