-
‘మీకు ఓ భార్య, కూతురు ఉన్నారు కదా’
మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పెద్దలుగా చెలామణి అవుతోన్న వారి మీద లైంగిక వేదింపుల ఆరోపణలు రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి పనిచేయకూడదని ఇండస్ట్రీలో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇలా బహిష్కరించిన వారిలో అలోక్ నాథ్ కూడా ఉన్నారు. అయితే తాజాగా ఈయన అజయ్ దేవగణ్ ‘దే దే ప్యార్ దే’ చిత్రంలో నటించారు. ఈ రోజు చిత్ర ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ విషయం తెలిసింది. దీని గురించి అజయ్ దేవగణ్ని ప్రశ్నించగా.. ‘ఈ విషయం గురించి మాట్లాడ్డానికి ఇది సరైన వేదిక కాదు. కానీ అతని మీద ఆరోపణలు వచ్చే నాటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది’ అని తెలిపారు. అయితే అజయ్ సమాధానంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అజయ్ మీకు ఓ భార్య, కూతురు ఉన్నారు కదా. అలాంటప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మీ చిత్రంలో ఎలా ఉంచుతారు. ఇలాంటి వ్యక్తికి మద్దతిస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. అలోక్ నాథ్ సన్నివేశాలు తొలగించాలి.. లేదా వేరే వ్యక్తితో ఆ పాత్రలో నటింపజేయాలి.. లేదంటే ఈ సినిమాను థియేటర్లో కాదు కదా కనీసం టీవీలో కూడా చూడమంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతంలో ఆమిర్ ఖాన్తో పాటు మరికొందరు బాలీవుడ్ నటులు మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి నటించేది లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. @IndiaMeToo I'm not gonna watch #DeDePyaarDe until Alok Nath gets kicked from the movie...not even on tv. If @ajaydevgn is a responsible actor, he should be the one to do it. Sadly this industry does only show off abt respecting women. Fake people !! — Dr.Nitin Rathod (@SRKnitin_rathod) April 2, 2019 -
‘మీటూ’పై సినిమా.. జడ్జీ పాత్రలో అలోక్
బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాల్లో, బుల్లి తెర మీద సంస్కారవంతమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన అలోక్ నాథ్పై కూడాఆరోపణలు వచ్చాయి. రచయిత, నిర్మాత వింటా నందా అలోక్ నాథ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం.. ఆ తరువాత అలోక్ కోర్టులో ఫిర్యాదు చేయడం వంటివి తెలిసిందే. అయితే ఈ వివాదం ఓ కొలిక్కి రాకముందే అలోక్కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. అదేంటంటే మీటూ ఉద్యమం నేపథ్యంలో బాలీవుడ్లో తెరకెక్కిన మైనేభీ చిత్రంలో అలోక్ నాథ్ జడ్జీ పాత్రలో నటించారు. ఈ విషయం గురించి అలోక్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ‘మైనే భీ’ అనే సినిమా చిత్రీకరణ కొన్ని రోజుల ముందే పూర్తైంది. ఇందులో నేను జడ్జి పాత్రలో నటించాను. మీకేమన్నా సమస్య ఉందా? నేను ఈ సినిమా చేస్తున్నానని మీరు బాధపడుతున్నట్లున్నారు. పేద నిర్మాతలకు ఈ సినిమాలోని నా పాత్ర అండగా నిలుస్తుంది. విడుదల కానివ్వండి’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు అలోక్. నిసార్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోనాలి రౌత్, షావర్ అలీ, ఇమ్రాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. (చదవండి : వింటా నందాకు కోర్టులో ఎదురుదెబ్బ) -
వింటా నందాకు కోర్టులో ఎదురుదెబ్బ
సినిమాల్లో, టీవీ షోలలో సంస్కారవంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అలోక్నాథ్.. తనపై అత్యాచారం చేశాడంటూ ‘మీటూ ఉద్యమం’లో భాగంగా రచయిత, నిర్మాత వింటానందా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలోక్ ఈ ఆరోపణలను ఖండిచడమే కాకా వింటానందాపై పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే, వింటా ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అలోక్పై కేసు నమోదు చేశారు. కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు అలోక్కి శనివారం ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. (ప్రముఖ నటుడిపై రేప్ కేస్ నమోదు) కోర్టు ఏమన్నదంటే.. తనపై అఘాయిత్యం జరిగినప్పుడు స్వీయప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వింటానందా నాడు నోరు మెదపలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అలోక్ను ఈ కేసులో తప్పుగా ఇరికించారనే వాదనలను కొట్టిపారేయలేమని చెప్పింది. 19 ఏళ్లక్రితం తనపై అత్యాచారం జరిగిందనీ, అప్పడు అలోక్ పెద్ద నటుడు అయినందున భయపడి నోరుమెదపలేదనే నందా ఆరోపణల్లో పస లేదని కోర్టు తేల్చింది. ‘ఆమె చెప్పిన కథ నమ్మశక్యంగా లేదు. అలోక్ను నిందితుడిగా పేర్కొనడానికి వింటా దగ్గర సరైన ఆధారాలు లేవనిపిస్తోంది. సంఘటన వివరాలన్నీ చెప్తున్న బాధితురాలు దాడి జరిగిన తేదీ లేదా సంవత్సరం మాత్రం చెప్పడం లేదు. అత్యాచారం జరిగింది తన ఇంట్లోనే అని నందా చెప్తోంది. అటువంటప్పుడు ఘటనకు సంబంధించిన ఆధారాలు నాశనమయ్యే వీలేలేదు’ అని కోర్టు అభిప్రాయపడింది. నందా ఇంటివైపు అలోక్ వెళ్లొద్దనీ, ఈ కేసుతో సంబంధమున్న వారిని బెదిరించడం, లంచాలు ఇవ్వడం వంటివి చేయొద్దని కోర్టు ఆంక్షలు విధించింది. -
ప్రముఖ నటుడిపై రేప్ కేస్ నమోదు
‘మీటూ ఉద్యమం’లో భాగంగా సినిమాల్లో, టీవీ షోలలో సంస్కారవంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అలోక్ నాథ్.. తనపై అత్యాచారం చేశాడంటూ నిర్మాత వింటా నందా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ విషయం గురించి పెద్ద వివాదమే చేలరేగింది. అలోక్ నాథ్ ఈ ఆరోపణలను ఖండిచడమే కాకా వింటా నందాపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఇలాంటి సమయంలో అలోక్ నాథ్కి మరో భారీ షాక్ తగిలింది. నిర్మాత వింటా నందా ఫిర్యాదు మేరకు నటుడు అలోక్ నాథ్పై రేప్ కేస్ నమోదు చేశారు ముంబై పోలీసులు. ఓషివారాకు చెందిన పోలీసులు అలోక్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి మనోజ్ శర్మ వెల్లడించారు. అయితే అలోక్ నాథ్కు వ్యతిరేకంగా వింటా నందా మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ అతని భార్య గతంలో సెషన్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫిటిషన్ను కూడా కోర్టు కొట్టేసింది. వింటా నందా ఆరోపణల తర్వాత, పలువురు మహిళలు అలోక్ తమను కూడా లైంగికంగా వేధించాడంటూ ఆరోపించారు. దాంతో అలోక్ నాథ్ వింటా నందాపై పరువు నష్టం దావా కూడా వేశాడు. లిఖితపూర్వక క్షమాపణతోపాటు పరిహారంగా రూ.1 ఇవ్వాలని గతంలో అలోక్ డిమాండ్ చేశాడు. అలోక్ నాథ్పై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో సీఐఎన్టీఏఏ(సినీ, టీవీ ఆర్టిస్ట్ల సంఘం) అతన్ని అసోసియేషన్ నుంచి బహిష్కరించింది. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ పంపిన నోటీసుపై కూడా అలోక్ స్పందించలేదు. -
#మీటూ: ఆయన పరువు నష్టం విలువ రూపాయే!
ముంబై : మీటూ అంటూ లైంగిక వేధింపులపై మౌనాన్ని బద్దలు చేస్తున్న బాధితులపై పరువునష్టం దావాల పర్వం మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ తనపై లైంగిక ఆరోపణలు చేసిన రచయిత, నిర్మాత వింటా నందాపై పరువు నష్టం దావా వేసారు. ఆమె ఆరోపణలను ‘నేను కొట్టిపారేయనూ లేను, ఒప్పుకోనూ లేను. రేప్ జరిగే ఉండొచ్చు. అయితే వేరెవరో ఆ పని చేసి ఉండవచ్చు.’ అంటూ చిత్ర విచిత్ర సమాధానాలు చెప్పిన అలోక్ నాథ్.. డిఫమేషన్ దావాలో కూడా ఒక్క రూపాయి నష్టపరిహారం అడిగారు. తన పరువుకు భంగం కలిగిందని, దీనికి వింటా నందా రాతపూర్వక క్షమాపణలతో పాటు ఒక్క రూపాయి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ దావా వేశారు. దీంతో ఇదేం పరువు నష్టం దావా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అలోక్ తప్పతాగి గదిలోకి వచ్చాడు..) కాగా టీవీ తెర మీద ‘సంస్కారి’గా పేరున్న బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్.. నిజజీవితంలో సంస్కార హీనుడంటూ వింటా నందా బాంబు పేల్చిన విషయం తెలిసిందే.19 ఏళ్ల కిందట అలోక్ నాథ్ తనకు బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యం చేశాడని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ‘మీటూ’ ఉద్యమంలో మరింత అగ్గి రాజుకుంది. (చదవండి: ‘రేప్ జరిగి ఉండొచ్చు.. కానీ అది నేను చేయలేదు’) #AlokNath has filed a civil defamation suit against writer producer Vinta Nanda seeking a written apology and Rs 1 as compensation. Nanda had accused Alok Nath of rape #MeToo pic.twitter.com/hSMwfsRdp1 — ANI (@ANI) October 15, 2018
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement