
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లకు పార్టీ ఇచ్చారు.

ముంబైలోని తమ నివాసం ఆంటీలియాలో ఆదివారం రాత్రి వారి కోసం విందు ఏర్పాటు చేశారు.

ప్యారిస్ ఒలింపిక్స్-2024 పతక విజేతలు షూటర్ మనూ భాకర్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ ఈవెనింగ్ పార్టీలో హైలైట్గా నిలిచారు.

ప్యారిస్ పారాలింపిక్స్-2024 పతక విజేతలు నవదీప్ సింగ్, మోనా అగర్వాల్ కూడా నీతా అంబానీ పార్టీకి హాజరయ్యారు

హాకీ లెజెండ్ శ్రీజేశ్ తన కుటుంబంతో సహా విచ్చేశాడు

సానియా మీర్జా, కరణం మల్లీశ్వరి, పుల్లెల గోపీచంద్, హర్భజన్సింగ్, దీపా మాలిక్ తదితరులు కూడా ఈ పార్టీలో తళుక్కుమన్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి












