
సాక్షి, విజయనగరం: జిల్లాలో చోరీ సంఘటన ఆలస్యంగా వెలుగ చూసింది. కొత్తవలస మండలం ఉత్తరాపల్లి శివారు గాంధీ నగరం వద్ద నివాసం ఉంటున్న రిటైర్డ్ కస్టమ్స్అధికారి మూనూరు సీతారాం ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు ఇరవై మూడు తులాల బంగారం ఆభరణాలు, 25 తులాల వెండి వస్తువులు, లక్షా యాభైవేలు రూపాయలు నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో ఉంది.