ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా వెంకయ్య | Venkaiah as a member of the Inter-State Council | Sakshi
Sakshi News home page

ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా వెంకయ్య

Dec 19 2015 3:24 AM | Updated on Aug 15 2018 6:34 PM

ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా వెంకయ్య - Sakshi

ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా వెంకయ్య

ప్రధాన మంత్రి చైర్మన్‌గా ఉండే ఇంటర్ స్టేట్ కౌన్సిల్‌లో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సభ్యుడిగా నియమితులయ్యారు.

స్టాండింగ్ కమిటీలో చంద్రబాబు

 సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి చైర్మన్‌గా ఉండే ఇంటర్ స్టేట్ కౌన్సిల్‌లో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సభ్యుడిగా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇంటర్ స్టేట్ కౌన్సిల్‌ను, దానికి సంబంధించిన స్టాండింగ్ కమిటీని నియమించారు. స్టాండింగ్ కమిటీకి హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వం వహించనున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, వెంకయ్య, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, గడ్కారీ రెండింటిలోనూ సభ్యులుగా ఉన్నారు. స్టాండింగ్ కమిటీలో ఏపీ సీఎం చంద్రబాబు నామినేట్ అయ్యారు. ఈ కమిటీలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్తాన్, త్రిపుర, యూపీ సీఎంలకూ చోటు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement