కరాచీలో ఆత్మాహుతి దాడి: ఇద్దరు మృతి


పాకిస్థాన్ కరాచీ నగరంలో నజిమాబాద్ ప్రాంతంలో బుధవారం ఆత్మాహుతి జరిపిన దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు భద్రత అధికారి కూడా ఉన్నారని స్థానిక మీడియా బుధవారం ఇక్కడ వెల్లడించింది. ఈ రోజు ఉదయం కరాచీలోని రేంజర్ హెడ్ క్వార్టర్స్లో ప్రవేశించేందుకు యత్నించి ఓ వ్యక్తిని భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తి తనకుతాను పేల్చుకున్నాడు. ఆ ఘటనలో భద్రత అధికారి మరణించాడు. మరో భద్రత అధికారి తీవ్రంగా గాయపడ్డారు.






అలాగే ఆర్మీ చెక్ పోస్ట్పై గ్రానెడ్ దాడి చేశారు. ఆ వెనువెంటనే మరో రిమోట్ కంట్రోల్తో బాంబు పేల్చారు. బాంబులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఆ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని స్థానిక మీడియా వెల్లడించింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top