సౌదీ అరేబియాలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు పాకిస్థానీయులు మరణించారు.
ఇస్లామాబాద్: సౌదీ అరేబియాలో నిర్మాణంలో ఉన్న భవనం మంగళవారం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు పాకిస్థానీయులు మరణించారు. ఈ మేరకు పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. సౌదీలోని బురైద ప్రాంతంలో అల్ ఖాసిం యూనివర్శిటీ ప్రాంగణంలో భవనం నిర్మిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. అయితే మృతదేహాలను స్వదేశం తీసుకువచ్చేందుకు సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.