బీజేపీతో పొత్తుపై నితీశ్‌ క్లారిటీ | Nitish Kumar on joining hands with BJP | Sakshi
Sakshi News home page

బీజేపీతో పొత్తుపై నితీశ్‌ క్లారిటీ

Dec 3 2016 6:23 PM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీతో పొత్తుపై నితీశ్‌ క్లారిటీ - Sakshi

బీజేపీతో పొత్తుపై నితీశ్‌ క్లారిటీ

పెద్దనోట్లను రద్దును మొదటినుంచి బాహాటంగా సమర్థిస్తున్న ప్రతిపక్ష ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌.

పెద్దనోట్లను రద్దును మొదటినుంచి బాహాటంగా సమర్థిస్తున్న ప్రతిపక్ష ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. నితీశ్‌కుమార్‌ మాత్రం నోట్లరద్దును సమర్థించడమే కాదు.. దీనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత దోస్త్‌ అయిన బీజేపీతో నితీశ్‌కుమార్‌ మళ్లీ పొత్తు పెట్టుకోవచ్చునని, బిహార్‌లోని మహాకూటమి నుంచి దూరం జరిగి.. తిరిగి కమలదళంతో ఆయన జతకట్టవచ్చునని కథనాలు వస్తున్నాయి.

తాజాగా హిందూస్తాన్‌టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో సీనియర్‌ పాత్రికేయురాలు బర్ఖాదత్‌తో మాట్లాడుతూ నితీశ్‌ ఈ విషయంపై స్పందించారు. మళ్లీ ఘర్‌వాప్సీ ప్రసక్తే లేదని, బిహార్‌ మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో కొనసాగుతుందని చెప్పారు. ఈ విషయంలో ప్రజలను గందరగోళపరిచేందుకే వదంతులను వ్యాప్తిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తిరిగి బీజేపీలోకి తనను ఆహ్వానిస్తూ కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అదే సమయంలో మరోసారి పెద్దనోట్ల రద్దు సంస్కరణను నితీశ్‌ స్వాగతించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement