ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ ప్రకారమే... | Sakshi
Sakshi News home page

ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ ప్రకారమే...

Published Fri, Jan 30 2015 11:23 PM

ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ ప్రకారమే...

ముంబై: జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను కొన్ని హిందుత్వ సంస్థలు ప్రస్తుతించడం వెనుక ఆర్ఎస్ఎస్ హస్తముందని గాంధేయవాది, సామాజిక కార్యకర్త రామ్ పునియాని ఆరోపించారు. ఈ తతంగమంతా ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తోందన్నారు. ఈ అంశంపై నరేంద్ర మోదీ సర్కారు మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు.

'నాథూరాం గాడ్సేను హిందూ సంస్థలు ప్రస్తుతించడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ఇదంతా ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోంది. కాని ఇది ప్రమాదకరమైన ప్రయాణం' అని రామ్ పునియాని వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement