కాళేశ్వరం వద్ద గోదావరిలో యువకుడు గల్లంతు | Youth missing in Godavari River | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం వద్ద గోదావరిలో యువకుడు గల్లంతు

Jul 27 2015 4:16 PM | Updated on Oct 30 2018 7:50 PM

కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం వద్ద సోమవారం గోదావరి నదిలో స్నానానికి దిగిన ఆవుల రమేశ్(25) అనే యువకుడు గల్లంతయ్యాడు.

కరీంనగర్ (మహదేవ్‌పూర్) : కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం వద్ద సోమవారం గోదావరి నదిలో స్నానానికి దిగిన ఆవుల రమేశ్(25) అనే యువకుడు గల్లంతయ్యాడు. వివరాల ప్రకారం..ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం బుధాకలాన్ గ్రామానికి చెందిన ఓ 25 మంది బృందం మూడు వాహనాలలో తొలి ఏకాదశి సందర్భంగా పుణ్యస్నానాలకు కాళేశ్వరం బయలుదేరారు.

వీరిలో ఆవుల రమేష్, మోహన్ , శ్రీకాంత్ అనే ముగ్గురు యువకులు స్నానానికి గోదావరి వద్దకు వెళ్లారు. కాగా రమేష్  స్నానానికి దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారి పడి గల్లంతయ్యాడు. రమేష్ కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement