రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | Youngster dies in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

May 29 2015 5:06 PM | Updated on Aug 30 2018 3:58 PM

ఎదురుగా వస్తున్న బస్సును తప్పించడానికి ప్రయత్నించే క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం సుజ్జాపూర్ చౌరస్తా వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఆదిలాబాద్ :  ఎదురుగా వస్తున్న బస్సును తప్పించడానికి ప్రయత్నించే క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం సుజ్జాపూర్ చౌరస్తా వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కడెం మండలం జామ్‌గూడకు చెందిన లక్ష్మణ్(20) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఖానాపూర్ నుంచి మెట్‌పల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. సుజ్జాపూర్ చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ద్విచక్రవాహనంపై ఉన్న మరో యువకునికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement